
సంపత్ (ఫైల్)
సాక్షి, ముషీరాబాద్: భార్యతో గొడవపడి భర్త ఇంటినుంచి వెళ్లిపోయిన సంఘటన ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. అరుంధతినగర్కు సంపత్, సుమలత భార్యాభర్తలు. సంపత్ డ్రైవర్గా పనిచేస్తుండగా, సుమలత ఓ హోటల్లో క్యాషియర్గా పనిచేసేది. గత నెల 29న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్యను దూషించిన సంపత్ అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. బుధవారం సుమలత ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment