fighting
-
ఏయ్.. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?.. మంత్రి గారి మేనల్లుడు వీరంగం!
లక్నో : ఏయ్.. నాకే ఎదురు చెబుతావా? నేను ఎవరినో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అంటూ ఓ మంత్రి మేనల్లుడు వీధిలో వీరంగం సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడికి దిగాడు. ప్రస్తుతం ఆ ఘటన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు ఓ వీధిలో తన స్కార్పియోలో వెళుతున్నాడు. రద్దీగా ఉన్న వీధిలో స్కార్పియోకి ఎదురుగా ఓ రిక్షావాలా అడ్డొచ్చాడు. దీంతో అటు స్కార్పియో, ఇటు ఆటో ముందుకు కదల్లేని పరిస్థితి.ఆ సమయంలో అక్కడే పూలవ్యాపారం చేస్తున్న ఇద్దరు దంపతులు మంత్రి మేనల్లుడి స్కార్పియోను ముందుకు పోనివ్వాలని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న అతని సహాయకుడికి సూచించాడు. సహాయకుడు ముందు ఆటో పోనివ్వండి. ఆ తర్వాత స్కార్పియో ముందుకు కదులుతుందని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.స్కార్పియోలో డ్రైవింగ్ సీట్లో ఉన్న మంత్రి మేనల్లుడు పూల వ్యాపారుల్ని అసభ్యంగా దూషించాడు. కారు దిగి దాడికి దిగాడు. పూల వ్యాపారిని కిందకి నెట్టి పిడిగుద్దులు గుద్దాడు.ఘర్షణపై సమాచారం అందుకు పూల వ్యాపారి బంధువులు సైతం మంత్రి మేనల్లుడిని రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారింది. గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.UP BJP minister @isomendratomar’s nephew seen beating a poor flower vendor over a free bouquet. Ram Rajya! pic.twitter.com/UfWVjDtfmj— Manish RJ (@mrjethwani_) February 23, 2025 -
ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికుల బాహాబాహీ
న్యూఢిల్లీ:ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్రెస్ట్ కోసం కొట్టుకున్నారు. డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్రెస్ట్ విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్యుద్ధం జరిగింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటు కేటాయించారు. ఆదివారం(డిసెంబర్22) ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ కోసం తన పాత సీటు వద్దకు మళ్లీ వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్యుద్ధం స్టార్టయింది. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. అయితే ఈ గొడవ చివరకు సమసిపోయిందని, ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిర్ఇండియా అధికారులు తెలపడం గమనార్హం. -
Vijay Diwas: బంగ్లాదేశ్ ఆవిర్భవించిన రోజు.. భారత్కు ఎందుకు ప్రత్యేకం?
దేశమంతా ఈరోజు (డిసెంబరు 16) విజయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1971లో ఇదే రోజున భారత్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది. అలాగే తూర్పు పాకిస్తాన్ను అణచివేత నుండి విముక్తి చేసింది. ఈ రోజు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్కు కూడా ఎంతో ప్రత్యేకమైనది. పాక్పై యద్ధంలో గెలిచినందుకు గుర్తుగా భారత సాయుధ బలగాల త్యాగాలను ఈరోజు గుర్తుచేసుకుంటారు.నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో..1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో బెంగాలీ జాతీయవాద సమూహానికి భారత్ మద్దతుపలికింది. ఈ నేపధ్యంలో తూర్పు పాకిస్తాన్లో భారత్.. పాక్తో యుద్ధం చేసింది. అంతిమంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. 1970-71లలో పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ తన అణచివేత సైనిక పాలనతో తూర్పు పాకిస్తాన్లోని సామాన్యులను ఊచకోతకు గురిచేశారు. ఈ నేపధ్యంలో షేక్ ముజిబుర్ రెహమాన్ సామాన్యులను పోరాటం దిశగా ప్రేరేపించేందుకు ముక్తి బాహినీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ పోరాటానికి భారత్ నుంచి సహాయం కూడా కోరారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ప్రజలను పాక్ అరాచకాల నుంచి రక్షించేందుకు భారత సైన్యాన్ని పాక్తో యుద్ధానికి అనుమతించారు.అతిపెద్ద సైనిక లొంగుబాటుభారత సైన్యం 1971, డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం ఇచ్చింది. దీంతో 1971, డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరోమార్గంలేక అతను అందుకు తలొగ్గాడు. ఈ యుద్ధకాలంలో 93 వేలమంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
కొట్టుకున్న ప్రిన్సిపాల్ టీచర్
-
Israel Hezbollah War: పోరు ఆపం
బీరుట్: ఇజ్రాయెల్తో తమ పోరాటం కొన సాగుతుందని హెజ్ బొల్లా తాత్కాలిక చీఫ్ నయీం కస్సెమ్ స్పష్టం చేశారు. చీఫ్ హస్సన్ నస్రల్లాతో పాటు ఇతర టాప్ కమాండర్లను పోగొట్టుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. లెబనాన్లో భూతల దాడులు జరపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న పక్షంలో అందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోగొట్టుకున్న కమాండర్ల స్థానాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారమైంది. ‘మా పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయడం ఇజ్రాయెల్ వల్లకాదు. డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారు. కమాండర్ ఎవరైనా గాయపడితే వారితో భర్తీ చేస్తాం. 2006లో ఇజ్రాయెల్తో నెలపాటు పోరాడాం. ఈసారి అంతకంటే ఎక్కువ కాలమే పోరు సాగుతుందని అనుకుంటున్నాం’అని నయీం కస్సెమ్ పేర్కొన్నారు. -
పిఠాపురంలో కొత్త లొల్లి..
-
నడిరోడ్డుపై పడి పడి కొట్టుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు..
-
క్యాన్సర్తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
పెన్షన్ల పంపిణీ కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
-
వీడియో: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట..
రోమ్: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ITALIAN PARLIAMENT: A fight breaks when Five Star Movement deputy Leonardo Donno unfurls an Italian flag in protest against plans to grant more autonomy from Rome to regions that want it. Protestors argue that it undermines Italy's unity. pic.twitter.com/qf6bVFteC3— Mark Alan Pearce (@PearceAlan1962) June 13, 2024 కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మెట్రోలో మహిళలు
రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రోలో కూర్చునేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతుంటారు. సీటు కోసం వాదులాడుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం అనేది ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతుంటాయి.తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడటానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో.. మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయివుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది.అది కొట్టుకోవడం వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం మరింతగా పెరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట కూడా జరిగింది. కొద్దిసేపటి తరువాత మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో ఆ మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ సమయంలో ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు
-
ఒక చోట అత్తా అల్లుడు.. మరో చోట అన్నాదమ్ములు!
దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోరు ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల పోరులో సోదరుల మధ్య పోటీ నెలకొంది. చికిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో సోదరులు ఢీ కొడుతున్నారు. వీరు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంత్రాయ్ కుమారులు. వారిలో తమ్ముడు మనోరంజన్ ద్యన్ సామంతరాయ్కు బీజేపీ టిక్కెట్టు ఇవ్వగా, అన్న రవీంద్నాథ్ ద్యన్ సామంతరాయ్ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. చింతామణి కాంగ్రెస్ సీనియర్ నేత. చికిటి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్పై విజయం సాధించారు. జూనియర్ సామంతరాయ్ కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన అన్నయ్య తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) చికిటి అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద్ శ్రీరూప్ దేబ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఉషాదేవి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఉషాదేవి ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటు బీజేడీకి దక్కింది. మే 13న జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో అత్త, మేనల్లుడి మధ్య ఎన్నికల పోరు నెలకొంది. నబరంగ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కౌశల్య ప్రధాన్ను బీజేడీ తన అభ్యర్థిగా బరిలోకి దించగా, అదే నియోజకవర్గం నుంచి ఆమె మేనల్లుడు దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ పోరు అత్త, మేనల్లుడి మధ్య కాదని, రెండు పార్టీల మధ్య మాత్రమేనని, తమ కుటుంబంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని కౌసల్య మీడియాకు తెలిపారు. -
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
జాతరలో గజరాజుల కొట్లాట.. పలువురికి గాయాలు
కోలాహలంగా జాతర జరుగుతుందనుకున్న టైంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది. జనాలు ఉరుకులు పరుగులతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అందుకు కారణం.. రెండు గజరాజులు తలపడడమే!. కేరళ త్రిస్సూర్ జిల్లాలో తరక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు జాతరలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జాతర ముగింపు సమయంలో అమ్మవారిని ఉరేగిస్తున్న ఏనుగు.. ఒక్కసారిగా అలజడి సృష్టించింది. మావటి మీద మూడుసార్లు దాడికి యత్నించగా.. ఆయన స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ ఏనుగు అక్కడితో ఆగలేదు. అక్కడే ఉరేగింపు కోసం తీసు కొచ్చిన మరో ఏనుగుపై దాడికి దిగింది. ఈ క్రమంలో ఆ రెండు తలపడడంతో.. అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్లు కింద పడి గాయాలపాలయ్యారు. ఏనుగుల పోరాటంతో భయపడి.. ఉరుకులు పరుగులు పెట్టడంతో కిందపడి చాలా మందికి సైతం దెబ్బలు తగిలించుకున్నారు. అతికష్టం మీద మొదటి ఏనుగును మావటివాళ్లు నిలువరించగలిగారు. అయితే గాయపడ్డ ఏనుగు కిలోమీటర్ దూరం పరుగులు తీయగా.. అతికష్టం మీద మావటివాళ్లు దానిని పట్టుకోగలిగారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. An elephant which was brought for the arat ritual at #Mandarakadavu in connection with the #ArattupuzhaPooram in #Kerala's #Thrissur, attacked a fellow elephant. pic.twitter.com/6OXptgdjnl — Hate Detector 🔍 (@HateDetectors) March 23, 2024 -
ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..!
ధైర్యంగా ఉండమని చెప్పడం అందరూ చేసే పనే. ధైర్యాన్ని ప్రదర్శించడం కొందరు చేసేది. ప్రమాదంలోనూ ధైర్యాన్ని చూపడం అతి కొద్ది మందే చేస్తారు. ఆ అతి కొద్దిమందిలోనూ మేటిగా నిలుస్తున్నారు హైదరాబాద్లోని బేగంపేట వాసులైన ఈ తల్లీ కూతుళ్లు. ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులపైకి చిరుతపులుల్లా విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో బెదిరించినా ఆత్మస్థైర్యాన్ని బెదరనివ్వలేదు. ఇద్దరు దండుగులను తరిమి తరిమి కొట్టిన తల్లి అమిత మెహోత్. తల్లిని కాపాడుకునేందుకు దుండగులతో వీరోచితంగా పోరాడిన కూతురు బాబీ. దుండగులు ఎలా ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తారో, ఎలా దాడి చేస్తారో మనం ఊహించలేం. అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ధనాన్నే కాదు ప్రాణాలను సైతం కోల్పోయేవారెందరో. కానీ, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దుండగుల దుశ్చర్యను క్షణమాత్రంలోనే గుర్తించి, ఆ వెంటనే తమ స్థైర్యాన్ని చూపి నేడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు అమిత, బాబీ. స్త్రీలు సబలలు అని నిరూపించిన ఈ వనితలు నేడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ‘‘ఎప్పుడో ప్రాక్టీస్ చేసిన బాక్సింగ్తో పాటు 15 ఏళ్లుగా చేస్తున్న జిమ్ వ్యాయామాలు, వీటికి తోడు మార్షల్ ఆర్ట్స్పై అవగాహన.. ఇవన్నీ దుండగులు తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం బెదరక ధైర్యంగా నిలబడేలా చేశాయి. దోచుకోవడానికి వచ్చిన వారిని తరిమి కొట్టేలా చేశాయి’’ అని తెలిపింది నలభై ఆరేళ్ల అమిత. ఊహించని విధంగా ఆ తల్లీకూతుళ్ల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కొరియర్ బాయ్స్ వేషంలో.. ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక కొరియర్ బాయ్స్ మన ఇళ్ల ముందుకు వస్తుంటారు. వారి గురించి మనకేవిధంగానూ తెలియదు. అలాగని, కొరియర్ వారంతా ప్రమాదకారులే అని మనం చెప్పలేం. కానీ, ఒక్కోసారి సమస్య ఈ విధంగానూ మనల్ని పలకరించవచ్చు అని గ్రహించాలి అనడానికి గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ‘‘మా ఇంటి గుమ్మానికి, ప్రధాన గేటుకు 200 ఫీట్ల దూరం ఉంటుంది. కొరియర్బాయ్స్ ఎవరొచ్చినా గేటు బయటనే ఉండి పిలుస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాగ్తో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. నేను మొదటి అంతస్తులోనే ఉండి కొరియర్ వివరాలు అడిగాను. అమిత (నా పేరు), ఎన్కె జైన్ (నా భర్త) పేర్లు చెప్పి కొరియర్ వచ్చిందని చెప్పారు. అక్కడే ఉండాలని, వచ్చి తీసుకుంటామని చెప్పాను. నేను కిందికి వచ్చేసరికి గేటు లోపలి నుంచి గుమ్మం వద్దకు వచ్చేశారు. ఎదుర్కొని .. కనిపెట్టి.. బ్యాగ్లో నుంచి కొరియర్ పార్శిల్ తీస్తున్నట్లుగా తీసి ఒకరు తపంచా (నాటు తుపాకీ)తో నాపై ఎక్కుపెట్టాడు. మరొకరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి కిచెన్ లో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. నా అరుపులకు మొదటి అంతస్తులో ఉన్న కుమార్తె కూడా వచ్చింది. మాపై అటాక్ చేస్తుండగా మేం కూడా తిరిగి అటాక్చేశాం. ఇద్దరం కలిసి ఆ వ్యక్తి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి, తపంచాను లాగేసుకున్నాం. దీంతో అచేతనుడైన ఆ వ్యక్తి వెంట తెచ్చుకున్న తాళ్లతో మమ్మల్ని కట్టేసేందుకు ప్రయత్నించగా, ఎదురుతిరిగాం. దాదాపు 20 నిమిషాల సేపు ఘర్షణ జరిగింది. చివరకు ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని బలవంతంగా తోసుకుంటూ బయటకు వచ్చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మేము ఎంతగానో వెంబడించాం. ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకుని కిచెన్ లో ఉన్న మరో వ్యక్తి ఎక్కడ దొరికిపోతాడో అని ఆందోళనపడ్డాం. అతను కూడా పారిపోయేందుకు కత్తితో బెదిరిస్తూ బయటకు వచ్చాడు. మా అరుపులకు ఈ లోగా స్థానికులు రావడంతో అతన్ని పట్టుకోగలిగాం. తెలిసిన వారే అయ్యుంటారని మేం వారు ధరించిన హెల్మెట్, మాస్క్ను తీసేయడంతో వారెవరో కనిపెట్టగలిగాం. కిందటేడాది దీపావళి సమయంలో పది రోజులపాటు మా ఇంటి క్లీనింగ్ విషయంలో ఓ ఏజెన్సీని సంప్రదిస్తే, వారు పంపించిన వ్యక్తులే వీళ్లు. మా ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఏయే వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి, ఇంట్లో ఆడవాళ్లం మాత్రమే ఉండే సమయం చూసి, ఇలా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. మేం ఎదురు తిరగడంతో వచ్చిన పని గురించి కాకుండా మేము తమ ముఖాలను చూడకుండా కాపాడుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేశారు. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే.. గతంలో ఐదేళ్లు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను. రోజూ జిమ్కు వెళ్తుంటాను. మార్షల్ ఆర్ట్స్పై కూడా అవగాహన ఉంది. అవే నన్ను ధైర్యంగా ఉండేలా, సాహసం చూపేలా చేశాయి. ఎదురొచ్చిన విపత్తు నుంచి కాపాడేలా చేశాయి. ఒక తపంచా, రెండు కత్తులు, తాళ్ల సహాయంతో వారు మమ్ముల్ని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. వారి ప్రతి చర్యను తిప్పికొట్టగాలిగామంటే బాక్సింగ్, ఫిట్నెస్లే కారణమని కచ్చితంగా చెప్పగలను’’ అని తామ ఎదుర్కొన్న సంఘటనను వివరించారు అమిత. ఈ తల్లీకూతుళ్లు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత అమిత, ఆమె భర్త, స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రశంసలు.. సన్మానం.. అమిత, ఆమె కుమార్తె బాబీ ఇద్దరూ చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయం అని నార్త్జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బేగంపేట పైగా కాలనీలోని అమిత నివాసానికి నేరుగా వచ్చిన డీసీపీ అమితతో పాటు ఆమె కుమార్తెనూ ప్రశంసించి, శాలువాతో సత్కరించారు. మైనర్ బాలిక అయినా ఆమె చూపిన తెగువ ఎంతో అభినందనీయమన్నారు. ఆత్మరక్షణకై మెలకువలు అవసరం మహిళలు ఆత్మరక్షణ దిశగా మెలకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ఎదురైన అనుభవం లాగా ఎవరి జీవితాల్లోనూ రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వస్తే మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. – అమిత – కోట కృష్ణారావు, సాక్షి, హైదరాబాద్ -
కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు
కర్నూలు: కర్నూలులో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ‘బీసీ జయహో’ సభలో బీభత్సం సృష్టించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ కోసం మాచాని సోమనాథ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘బీసీ జయహో’ సభలో బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. -
జనసేన ఆఫీసు ముందే తనుకున్న జనసైనిక్స్..
-
డోన్.. టీడీపీ వికెట్ డౌన్
సాక్షి, నంద్యాల: డోన్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎవరికి వారు తాము సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అభ్యర్థిని ఓడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉన్న డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కొంత పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్ పోటీ చేసి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇన్చార్జిగా తప్పించి కేఈ ప్రభాకర్ను అధిష్టానం నియమించింది. కొంతకాలం తర్వాత ప్రభాకర్ను కూడా తప్పించి కేఈ వర్గానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఆయన నియామకాన్ని కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అతడికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. బీసీ ప్రోద్బలంతోనే గ్రూపు రాజకీయాలు నంద్యాల జిల్లా టీడీపీకి బీసీ జనార్దన్రెడ్డి పెద్ద దిక్కుగా మారారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో మిగిలిన నాయకులు బీసీ నిర్ణయాలకు అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. తమకు చెప్పకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా సుబ్బారెడ్డిని ప్రకటించడం వెనక బీసీ జనార్దన్రెడ్డి ప్రమేయం ఉన్నట్లు కేఈ, కోట్ల వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. బీసీ ప్రోద్బలంతోనే సుబ్బారెడ్డి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని మండిపడుతున్నాయి. నువ్వొస్తే మర్యాదగా ఉండదు గత ఆదివారం పత్తికొండలో జరిగిన ‘రా.. కదిలిరా’ సభకు బీసీ జనార్దన్రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డికి మినహా మిగిలిన నంద్యాల జిల్లా నాయకులకు ఆహ్వానం అందింది. ఒకవేళ ఆహ్వానం లేకున్నా సభకు వస్తే మర్యాద దక్కదని పత్తికొండ టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక ఇద్దరు నేతలు సభకు హాజరుకాలేదు. సభ ముగిశాక చంద్రబాబు అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంతృప్తితో ఉన్న నాయకులను పిలిచి మాట్లాడారు. కానీ, డోన్ పంచాయితీని మాత్రం ఆయన పట్టించుకోలేదు. ఇన్చార్జిగా ఉన్న సుబ్బారెడ్డికి సహకరించాలని అటు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి కానీ ఇటు కేఈ కుటుంబానికి కానీ చంద్రబాబు సూచించకపోవడంతో ఈ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే సహకరిస్తాం డోన్ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే తాము సహకరిస్తామని కేఈ కుటుంబం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో డోన్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. దాదాపు రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డోన్ బరిలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. ఎమ్మిగనూరు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి కోరినా చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ చేసేదేమీ లేక ఓడిపోయే డోన్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా భారీ ఖర్చు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లుగా టీడీపీ కార్యక్రమాలను ధర్మవరం సుబ్బారెడ్డి చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన తన అనుచరుల వద్దే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ తనకే టికెట్ ఇస్తామని చెప్పడంతోనే తాను ఖర్చు చేశానని, ఇప్పుడు టికెట్ విషయంలో మీన మీషాలు లెక్కిస్తుండడంతో ఏంచేయాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేయడం సుబ్బారెడ్డి వంతైంది. మరోవైపు చంద్రబాబు ఖాతాలో మరో వికెట్ పడిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం డిష్యుం! తన్నుకున్నారిలా..
తూర్పుగోదావరి: కొత్త సంవత్సరం ఆరంభం రోజునే తునిలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటలకు దిగారు. యనమల బ్రదర్స్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. డిష్యుం డిష్యుం అంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు.. తన కళ్ల ముందే తెలుగు ‘తమ్ముళ్లు’ అరుపులు, కేకలతో.. ముష్టిఘాతాలతో ఫైటింగ్కు దిగినా.. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు సైలెంటుగా ఉండిపోవడం చూపరులను విస్మయపరచింది. తన వరకూ వస్తేనే కానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. ప్రజాదరణ కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా పార్టీలో గ్రూపులను కట్టడి చేయలేని దుస్థితిని తెలుగుదేశం అగ్ర నేతలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ఆది గురువుగా విమర్శలు ఎదుర్కొనే శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు దాదాపు అటువంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఆధిపత్యం కోసం.. ఇటు కాకినాడ మెట్ట ప్రాంతం, అటు కోనసీమలో గ్రూపులను పెంచి పోషిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, దివంగత నేతలు మెట్ల సత్యనారాయణరావు, బొడ్డు భాస్కర రామారావులను గ్రూపులుగా చేసి, ఉమ్మడి జిల్లాపై పెత్తనాన్ని చెలాయించిన చరిత్ర రామకృష్ణుడు సొంతమనే వారు ఆ పార్టీలో కోకొల్లలు. ఇన్నేళ్ల పాటు తాను పెంచి పోషించిన గ్రూపు రాజకీయాలు.. తీరా సొంత నియోజకవర్గం తునిలో భగ్గుమనేసరికి రామకృష్ణుడికి దిక్కుతోచడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. రగులుతున్న కృష్ణుడి వర్గం సొంత కుమార్తె దివ్యను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు.. మూడు దశాబ్దాలుగా తన వెంట నడిచిన వరుసకు సోదరుడైన యనమల కృష్ణుడిని బలవంతంగా టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి రామకృష్ణుడు తప్పించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దివ్యకు అప్పగించారు. ఆమెకు పార్టీలో ఎదురుండకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని వ్యూహాత్మకంగానే తప్పించారని ఆయన వర్గం కొంత కాలంగా రగిలిపోతోంది. దివ్యకు పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై కినుక వహించిన కృష్ణుడు.. కొంత కాలం అలకబూనారు. రాజకీయంగా పక్క చూపులు చూశారు. ఆ సమయంలో నియోజకవర్గ బాధ్యతలను రామకృష్ణుడి సొంత సోదరుని కుమారుడు రాజేష్ తన భుజాన వేసుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో కృష్ణుడు టీడీపీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. పార్టీపై పెత్తనం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అప్పటికే దివ్య కనుసన్నల్లో నియోజకవర్గ బాధ్యతలను కృష్ణుడు చూస్తున్నా.. టీడీపీ తొండంగి మండల బాధ్యతలు మాత్రం రాజేష్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కృష్ణుడి వర్గానికి ఇది అవమానంగానే అనిపించింది. దీంతో ఆ వర్గం సమయం కోసం వేచి చూస్తోంది. ముందస్తు వ్యూహమేనా..! రాజేష్ను ఎంత మాత్రం భరించలేని కృష్ణుడు నయాన భయాన ఆయనను పార్టీకి దూరం చేసేందుకు కొంతకాలం నుంచి ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తొలి ప్రయత్నంగా సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. రామకృష్ణుడు కళ్లెదుటే రచ్చరచ్చ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కృష్ణుడు తన అనుచరులతో రాజేష్పై దాడి చేయించారని టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తన్నుకున్నారిలా.. తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద సాయి వేదికలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఇందులో యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు వచ్చారు. వారు వరుస క్రమంలో వెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడి సొంత అన్న కుమారుడు రాజేష్ అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణుడిని, దివ్యను కలిసేందుకు క్యూతో ప్రమేయం లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదను కోసం వేచి ఉన్న కృష్ణుడి వర్గీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు. అందరూ క్యూలోనే రావాలంటూ అక్కడున్న వారిని అప్పటికే వారు కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో రాజేష్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిని కృష్ణుడి వర్గం లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా దాడులకు దిగింది. రాజేష్పై ఆయన సొంత చిన్నాన్న రామకృష్ణుడు, దివ్య సమక్షంలోనే పిడిగుద్దులతో ఈ దాడి జరిగింది. అయినప్పటికీ రామకృష్ణుడి అనుచరులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇరు వర్గాలకూ సర్ది చెప్పలేక, వారిని కట్టడి చేయలేక నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయారు. ఆయన సైలెంటుగా ఉండిపోవడానికి కృష్ణుడు దూరమైతే రాజకీయంగా ఇబ్బంది పడతామనే భయం తప్ప మరొకటి కారణం కాదని పలువురు అంటున్నారు. కుమార్తె దివ్య ఇన్చార్జిగా ఉన్న సొంత నియోజకవర్గం తునిలోనే కళ్లెదుటే ఇంత జరిగినా.. చివరకు ఇరువర్గాలను సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినట్టయ్యిందని అంటున్నారు. ఇన్నేళ్లూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన యనమల.. రక్త సంబంధీకులు, దాయాదుల పోరు, గ్రూపు రాజకీయాలు భగ్గుమనడంతో.. వాటి ప్రభావాన్ని స్వయంగా రుచి చూశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇవి చదవండి: దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్కు బ్రేక్..! -
పొలం వద్ద ఉన్న పారతో అన్నను తమ్ముడు దారుణంగా..
మహబూబాబాద్: బోరుబావి వివాదంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సూర్యబండా తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన భూక్యా సదన్లాల్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా సదన్లాల్ తనకున్న వ్యవసాయ భూమిని, బోరు మోటరును కుమారులు రవీందర్, రమేశ్కు ఇవ్వడంతో దానిని ఉమ్మడిగా వాడుకుంటున్నారు. కాగా కొంతకాలంగా బోరుబావి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయితీ నెలకొంది. ఈక్రమంలో ఆదివారం అన్నదమ్ముల మధ్య సయోధ్యకు పెద్దమనుషులు ప్రయత్నిస్తుండగా తమ్ముడు రమేశ్ పొలం వద్ద ఉన్న పారతో అన్న రవీందర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేర రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు!
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండడంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మొదట ఓ మహిళ సీటు కోసం రుమాలు వేసింది. ఆమెకంటే ముందు ఎక్కిన మరో మహిళ ఆ సీటులో కూర్చుంది. బస్సు నర్సంపేట రూట్లో వెళ్తుండగానే ఆ తరువాత ఎక్కిన మొదటి మహిళ నా సీటులో ఎలా కూర్చుంటావంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తరువాత మరో మహిళ వచ్చి మా సీట్లో కూర్చున్నావంటూ అడిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇవి చదవండి: ఇండ్లు.. రేషన్కార్డులకే ఎక్కువ! -
సలార్ కాటేరమ్మ కథ తెలుసా?
ఒక బల్లెంతో వెనుకనుంచి వచ్చే శత్రువుల్ని పొడిచి.. ముందున్న వాళ్లను కత్తులతో చీల్చేసి.. ఇంతలో ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అని డైలాగ్పడగానే.. అపరకాళిలా అవతారం కటౌట్లో ప్రభాస్ అబ్బో రోమాంఛితమైన ఆ సలార్ సీన్.. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.. విజిల్స్తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి తెలుసా? ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత. నమ్ముకున్నవాళ్లకు అండగా ఉంటూ.. దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారత దేశంలో.. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరీ అమ్మన్గా, కర్ణాటకలో కాటేరమ్మగా Kateramma ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటోంది. పార్వతిదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను.. కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్నిచోట్ల ఊరికి కాపలా దేవతగా.. మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు. జానపద కథ ప్రచారం.. కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి రోజూ రాత్రిళ్లు ఎటో వెళ్లిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళి రూపంలోకి మారిపోయి.. శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుందామె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. ఆమె అందులో పడిపోయి.. తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి, విధేయురాలైన భార్య.. పార్వతిదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే.. కాటేరీ దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. దళిత కమ్యూనిటీలో మరోలా.. అయితే తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని.. ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కుల దేవతగానూ కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటోంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు. ఇదీ చదవండి: సలార్ మూవీ రివ్యూ శక్తివంతమైన దేవతగా.. కాటేరమ్మ.. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఉగ్ర రూపంలోనే కాదు.. శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటోంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని.. ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా.. ఒక్కో చేతిలో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో రూపొందిస్తారు. మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు.. శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌతాఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటోంది. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా.. రక్త కాటేరమ్మగానూ కాటేరీ దేవి ఆరాధ్య దైవం. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడనాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ రిఫరెన్స్ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్తో Salaar Kateramma Scene ప్రేక్షకులకు రుచిచూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ -
దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం!
న్యూఢిల్లీ: భార్యాభర్తల గొడవలంటే ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ గొడవ దెబ్బకు బుధవారం ఏకంగా ఓ అంతర్జాతీయ విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది! మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానం ఈ ఘటనకు వేదికైంది. విమానం మ్యూనిచ్ నుంచి బయల్దేరిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్లాండ్. భార్య ఫిర్యాదుతో విమానాన్ని పైలట్ ఢిల్లీ మళ్లించి భర్తను పోలీసులకు అప్పగించారు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అతన్ని మరో విమానంలో బ్యాంకాక్ పంపడం కొసమెరుపు! ఇదీ చదవండి: నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ.. -
చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు..
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా సాగిన ప్రచారపర్వం చివరిరోజు ఒక్క ఘటనతో ఉద్రిక్తంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని వైఎస్సార్కాలనీలో మంగళవారం ఉదయం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి, పార్టీ నాయకులతో ప్రచారానికి వెళ్లాడు. అదే సమయానికి బీఆర్ఎస్ నాయకులు ప్రచార వాహనంతో వచ్చారు. పోటాపోటీగా పాటలు పెట్టవద్దన్న అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుల కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో వైఎస్సార్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. పలువురు స్థానికులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పురుషోత్తం వెంటనే అక్కడి చేరుకున్నారు. భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి తన ప్రచారం కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Video: సెల్ఫీల వివాదం.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు
సెల్ఫీల పిచ్చి ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరికి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ట్రెండ్గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫీ మోజుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ ఫోటోల పిచ్చి కొన్నిసార్లు శ్రుతిమించుతోంది. తాజాగా సెల్ఫీ కారణంగా వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా అమ్మాయిలు జుట్లుపట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులోని గాంధీ పార్క్లో కొంతమంది ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముందు తామే సెల్ఫీలు దిగాలని, తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని ఓ వర్గం అమ్మాయిలు చెప్పడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు ఫైటింగ్ చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? Gandhi Park, Guntur. Ladies Fighting...we are so developed. 😂😂😂 pic.twitter.com/fgqfWOef4k — Saran Bhuma (@telugodikeka) November 27, 2023 -
పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు!
యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని విన్నవారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక్కడి శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో కొట్టుకునేంత వరకూ వివాదం దారితీసింది. ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నయాబన్స్ రోడ్డు సమీపంలోని సంతోషి మాత దేవాలయం దగ్గర ఒక వివాహ వేడుకలో విందు జరిగింది. ఈ సందర్భంగా రసగుల్లా తినే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ శర్మ తెలిపారు. క్షతగాత్రులందరినీ వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. విందు ఏర్పాటు చేసిన గౌరీశంకర్ శర్మపై కేసు నమోదు చేశామని, ఈ వివాదంపై విచారణ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: హిమాచల్లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే.. -
ఆసక్తికరంగా ఛత్తీస్గఢ్ పోరు.. ఎవరి ధీమా వారిదే!
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008 అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది. ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది. 2013 ముఖ్యమంత్రిగా రమణ్సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం! 2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్గఢ్లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది. 2018 సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది. -
రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే!
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజస్థాన్లోని గంగానగర్కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట. వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్తో సింగ్ తలపడనున్నారు. తీతర్ సింగ్కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k — Rajan Gupta (@rajangupta066) November 2, 2023 -
లిఫ్ట్లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
Lb Stadium: రణరంగంలా కుస్తీ పోటీలు.. కుర్చీలతో కొట్టుకున్న పహిల్వాన్లు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కుస్తీ పోటీలో వివాదం చెలరేగింది. దీంతో కుస్తీ పోటీలు రణరంగంలా మారాయి. మోదీ కేసరి ఫైనల్ కాంపిటీషన్లో పహిల్వాన్ల గ్రూప్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జఫర్, పైల్వాన్, సాలం పైల్వాన్ గ్రూప్లు కుర్చీలతో కొట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. కుస్తీలో గెలిచింది మేమంటే.. మేమని వాగ్వాదానికి దిగారు. ఈ కొట్లాటలో పదిమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిని తరలించారు. ఇరువర్గాలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?! -
లైవ్ డిబేట్ లో కొట్లాట..
-
మైరావణుని ప్రాణాలు తుమ్మెద రూపంలో
లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. వానరసేన ధాటికి, రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరే హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుడిని సైతం జయించిన మేఘనాదుడు హతమైపోయారు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చుని, తన మేనమామ మైరావణుడిని తలచుకున్నాడు. మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పరిస్థితి తెలుసుకున్నాడు. ‘రావణా! విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా, దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామలక్ష్మణులిద్దరినీ బంధించి, రేపే వాళ్లను దుర్గకు బలి ఇస్తాను’ అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి, సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామలక్ష్మణులకు కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు. వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి, రామలక్ష్మణుల చుట్టూ రక్షణవలయంలా ఏర్పాటు చేసి, తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి, రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుడి వాలవలయం లోపలికి సూక్ష్మరూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడి వాల రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచీముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాతిముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే, వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు. మాయోపాయాలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు సురక్షితమే కదా! రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు పోయి రామలక్ష్మణులను చూసి వస్తాను’ అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి, అతడు లోపలకు పోయేందుకు మార్గం కల్పించాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామలక్ష్మణులను చిన్న విగ్రహాలుగా మార్చి, తన వస్త్రాల్లో దాచి పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు బయటకు వచ్చాడు. ‘రామలక్ష్మణులు గాఢనిద్రలో ఉన్నారు. జాగ్రత్త’ అని హనుమంతుడితో చెప్పి, అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్లిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి, తన సోదరి దుర్దండిని వారికి కాపలాగా పెట్టాడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు క్షేమమే కదా! ఒకసారి లోపలకు పోయి చూద్దాం’ అన్నాడు. ‘విభీషణా! ఇందాకే కదా వచ్చి వెళ్లావు. ఇంతలోనే మళ్లీ ఏమొచ్చింది’ అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. ‘హనుమా! ఇంతకుముందు నేను రాలేదు. ఇదేదో మైరావణుడి మాయ కావచ్చు. చూద్దాం పద’ అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణులు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. ‘హనుమా! మనం క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు’ అంటూ తనతో హనుమంతుడిని పాతాళ లంకకు తీసుకుపోయాడు. కావలిగా ఉన్న దుర్దండితో విభీషణుడు ‘భయపడకు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు’ అన్నాడు. ‘రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు. వారు ఇదే గదిలో ఉన్నారు’ అని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షసభటులు పరుగు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు. హనుమంతుడు భీకరాకారం దాల్చి, వారందరినీ దొరికిన వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళలంకలో రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీరవిహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునియలు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహీ తలపడ్డారు. హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిటి పోట్లతో ముక్కలు ముక్కలుగా చేసినా, మళ్లీ అతుక్కుని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా గమనించిన దుర్దండి ‘మహావీరా! కలవరపడకు. వీడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు’ అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి పిండి చేశాడు. బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా ఝుంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదనే పట్టి, తన కాలి కింద వేసి నలిపేశాడు. ఐదు తుమ్మెదలూ అంతమొందడంతోనే, మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద, వీపు మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకుని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు. ∙సాంఖ్యాయన (చదవండి: విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం ) -
కాంగ్రెస్ సభలో కుర్చీల కొట్లాట
సాక్షి, మహబూబాబాద్: మానుకోట కాంగ్రెస్ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. రాష్ట్ర పరిశీకురాలు మీనాక్షి నటరాజన్ ముందే కుర్చీల కోసం కొట్లాడుకున్నారు. అందరినీ సభావేదికపైకి పిలవా లని డిమాండ్ చేశారు. ఈ నెల 17న హైదరా బాద్లో జరిగే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ నిమిత్తం మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలోని ముఖ్యనాయకుల సమావేశం గురువారం మహబూబాబాద్లో జరిగింది. ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇల్లెందు నుంచి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్, బెల్లయ్యనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్చంద్రా రెడ్డిని పిలవాలని అనుకున్నారు. అయితే, అక్కడు న్న చిన్నాచితకా నాయకులు కూడా వేదికపైకి వచ్చి కూర్చోవడంతో కుర్చీలన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో ముందుగా పీసీసీ ఉపాధ్యక్షుడు విజయ రమణారావు మాట్లాడుతుండగా ‘అందరూ వేదిక పై ఉన్నారు. మా నేత మురళీనాయక్ను కూడా పిలవాలి, లేకపోతే అర్హత లేని వారిని కిందికి దింపాలి’అంటూ పలువురు కేకలు వేశారు. ఈ క్రమంలో మురళీ నాయక్, బలరాంనాయక్ వర్గాల కార్యక ర్తలు ఒకరినొకరు గల్లాలు పట్టుకుని తోసుకున్నారు. ఇరువర్గాల నినాదాలతో సభాస్థలి దద్దరిలింది. మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకొని విజ్ఞప్తి చేయ డంతో వేదికపై ఉన్న అందరూ కిందికి దిగారు. ఆ తర్వాత ఆమె ముఖ్యులతో మాట్లాడించారు. -
HYD: నేడు డబ్ల్యూడబ్ల్యూఈ పోరు
హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగే ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. 16 సార్లు ప్రపంచ చాంపియన్, రెజ్లింగ్ ఆల్టైమ్ గ్రేట్ జాన్ సినా ఇక్కడ బరిలోకి దిగనుండటమే అందుకు కారణం. అతని ఫైట్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎగబడటంతో చాలా ముందుగానే ‘బుక్ మై షో’లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. జాన్ సినా భారత్లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. 2017లో భారత్లో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరగ్గా.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫైట్ను తిలకించేందుకు వస్తున్నారు. ‘సూపర్ స్టార్ స్పెక్టకిల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫైట్లో జాన్ సినాతో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు. ఫిన్ బాలర్, రియా రిప్లీ, సేట్ రోలిన్స్ ఈ జాబితాలో ఉన్నారు. టీమ్ ఈవెంట్లో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ రోలిన్స్తో కలిసి జాన్ సినా.. గియోవానీ విన్సీ, లుడ్విగ్ కై సర్ద్ జోడీతో తలపడతారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణ కానుంది. రాత్రి 7.30నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైట్ను ‘సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస.. కుర్చీలతో పరస్పర దాడులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ కంటే ముందే నాయకులు బాహాబాహీకి దిగారు. ముస్తాబాద్ మండలం నుంచి ఉమేష్ రావు వర్గం కొంతమందిని జాయిన్ చేసుకునేందుకు తీసుకువచ్చింది. తాను మండలాధ్యక్షుడిగా ఉండగా తమకే తెలియకుండా ఎలా జాయిన్ చేసుకుంటారంటూ బాల్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ చీటి ఉమేశ్ రావు, సంగీతం శ్రీనివాస్ వర్గాల పేరిట రెండు వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ నాయకులు.. కుర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గందరగోళంగా మారింది. ఇదీ చదవండి: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా? -
కుక్కల గొడవ కాస్తా ఎంత దూరం వెళ్లిందో చూడండి
భోపాల్: ఇండోర్లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. Indore | Dog Fight | कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई। इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी। तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए। गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ — काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023 ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. -
త్రివర్ణ పతాక రెపరెపలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం స్వాతంత్ర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర పోరాట వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వతంత్ర పోరాటం గురించి, ఇన్నేళ్లలో సాధించిన ప్రగతి గురించి పలువురు ప్రసంగించారు. మిఠాయిలు పంచి పరస్పరం అభినందించుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండా ఎగురవేశారు. ముఖ్యమంత్రి జగన్ అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గృహనిర్మాణసంస్థ ప్రధాన కార్యాలయంలో.. విజయవాడలోని గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, సచివాలయాల విభాగం డైరెక్టర్ లక్ష్మీషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సచివాలయాల విభాగం అదనపు డైరెక్టర్లు ధ్యానచంద్ర, భావన వశిష్ట పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో.. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు, ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధలో.. విజయవాడలోని విద్యుత్ సౌధలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎన్.చక్రధర్బాబు, ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, జెన్కో విజిలెన్స్ ఆఫీసర్ పనసరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు అభివృద్ధి, సంక్షేమం: సీఎస్ జవహర్రెడ్డి రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి స్వాతంత్య్ర ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదల సంక్షేమానికి.. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవానికి సక్రమంగా అందించడంలో మనమంతా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యురిటీ అధికారి కె.కృష్ణమూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి, జీఏడీ డిప్యూటీ సెక్రటరి రామసుబ్బయ్య, పలువురు సచివాలయ అధికారులు, సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి అడుగుల జాతీయ పతాకం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని తమ కళాశాల వద్ద జాతీయ రహదారి వెంట ప్రదర్శించారు. – ఒంగోలు సాగరగర్భంలో.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రుషికొండ బీచ్లో లివిన్ అడ్వెంచర్స్ డైరెక్టర్ బలరామ్నాయుడు ఆధ్వర్యంలో స్కూబా డైవింగ్ వారు 60 అడుగుల సముద్రగర్భంలో జాతీయ జెండాను ఎగురవేశారు. – కొమ్మాది తిరుపతిలో వంద అడుగుల ఎత్తైన జాతీయ పతాకం జిల్లా కేంద్రం తిరుపతిలోని సామవాయి మార్గంలో వంద అడుగుల ఎత్తైన జాతీయజెండాను ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో శ్రీనివాససేతు వారధిని సెప్టెంబర్ 18న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్లో క్లీన్ ఇండియా–న్యూ ఇండియా సెల్ఫీ పాయింట్ విజయవాడ రైల్వే మినీ స్టేడియంలో డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన ‘క్లీన్ ఇండియా–న్యూ ఇండియా’ సెల్ఫీ పాయింట్ను ప్రారంభించారు. ఏడీఆర్ఎంలు డి.శ్రీనివాసరావు, ఎమ్.శ్రీకాంత్, సీనియర్ డీపీవో బాలమురళీధర్, సీనియర్ డీసీఎం వి.రాంబాబు, ఏసీఎం డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదిలో స్విమ్మర్ల జెండా వందనం కృష్ణాజిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద గ్రామానికి చెందిన కొందరు స్విమ్మర్లు కృష్ణానదిలో జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. రేమాల చంటి, వేములపల్లి ప్రసాద్, సనకా మురళి, తలశిల రఘుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.– నాగాయలంక -
మస్క్ & జుకర్బర్గ్ పోరుకి అంతా సిద్ధం.. వేదిక అక్కడే?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ & మార్క్ జుకర్బర్గ్ కేజ్ ఫైట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి చరమ దశ వచ్చిందా అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్లేస్ కూడా ఫిక్స్ చేసినట్లు టెస్లా సీఈఓ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ ఫైట్ మస్క్ అండ్ జుక్ ఫౌండేషన్ల ద్వారా నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది. దీనికి రోమ్ నగరం వేదిక కానున్నట్లు, ఇప్పటికే ఇటలీ ప్రధానితో, అక్కడి సాంస్కృతిక శాఖామంత్రితో మాట్లాడినట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం స్వచ్చంద సంస్థలకు వెళ్లనున్నట్లు ఇదివరకే తెలియజేసారు. మెటా అండ్ ఎక్స్ ద్వారా ఈ ఫైట్ లైవ్ చూడవచ్చని వెల్లడించారు. ఇప్పటికే జరగాల్సిన ఈ ఫైట్ మస్క్ ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అంతే కాకుండా ఈ పోరుకి తానూ ఎప్పుడూ సిద్దమే అన్నట్లు గతం నుంచి జుకర్బర్గ్ చెబుతూనే ఉన్నాడు. అయితే ఇప్పటికి కూడా ఈ ఫైట్ జరుగుతుందా? లేదా అనేదాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డేట్ కూడా ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..! ఈ కేజ్ ఫైట్ కోసం ఇప్పటికే ప్రపంచంలోని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పోరు జరిగితే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఎంతోమందిలో రోజురోజుకి ఎక్కువవుతోంది. బహుశా ఇది త్వరలోనే జరిగే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. The fight will be managed by my and Zuck’s foundations (not UFC). Livestream will be on this platform and Meta. Everything in camera frame will be ancient Rome, so nothing modern at all. I spoke to the PM of Italy and Minister of Culture. They have agreed on an epic location. — Elon Musk (@elonmusk) August 11, 2023 -
ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి.. ఇంతలో..
యాదాద్రి: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య గురువారం చోటుచేసుకున్న ఘర్షణలో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న చింతపల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థి అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న వింజమూరు గ్రామానికి చెందిన విద్యార్థి గురువారం సాయంత్రం పాఠశాల పక్కనే ఉన్న స్థలంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో సెకండియర్ విద్యార్థి కత్తితో ఫస్టియర్ విద్యార్థిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. -
ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్ - ఫైట్కి ముందే సర్జరీ అవసరం అంటూ..
Elon Musk Tweet: ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ మధ్య కేజ్ ఫైట్ జరగనున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇంతలో మస్క్ చేసిన ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా.. నేను రేపు నా మెడ, అప్పర్ బ్యాక్ ఎమ్ఆర్ఐ చేయించుకుంటున్నాను, బహుశా సర్జరీ అవసరం కావొచ్చు అంటూ ట్వీట్ చేసాడు. ఖచ్చితమైన డేట్ ఈ వారంలో తెలుస్తుందన్నాడు. ఇప్పటికే ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతే కాకుండా ఈ పోరాటానికి తానూ పూర్తిగా సిద్దమవుతున్నట్లు, అయితే వర్కవుట్ చేసే సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మస్క్ జుకర్బర్గ్తో "కేజ్ ఫైట్ కోసం సిద్ధంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు, దానికి "నాకు లొకేషన్ పంపండి" అని బదులిచ్చాడు. కాగా జుకర్బర్గ్ తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. ఇక వీరి కేజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. Exact date is still in flux. I’m getting an MRI of my neck & upper back tomorrow. May require surgery before the fight can happen. Will know this week. — Elon Musk (@elonmusk) August 7, 2023 -
‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో..
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ కేజ్ ఫైట్లో తలపడనున్నారని తెలిసిందే. అయితే ఈ ఫైట్ను తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. ఈ ఇద్దరు టెక్ టైటాన్లు గత నెలలో కేజ్ ఫైట్లో ఒకరినొకరు ఎదుర్కొనే సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆన్లైన్ షేక్ అవుతోంది. తరచూ వరి ఫైట్ గురించే చర్చ జరుగుతోంది. వారి ప్రత్యక్ష యుద్ధాన్ని వీక్షించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జుక్ Vs మస్క్ ఫైట్ ఎక్స్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని వెటరన్స్ సంక్షేమానికి వెచ్చిస్తాం’ ట్వీట్ చేశారు. పోరాటానికి తాను సిద్ధమవుతున్నానని, రోజంతా బరువులు ఎత్తుతున్నానని అంతకుముందు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తనకు వర్కవుట్ చేసేందుకు సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. ఈ సందర్భంగా వారి ఫైట్ గురించి ఓ యూజర్ ప్రస్తావించగా మస్క్ స్పందిస్తూ "ఇది ఒక నాగరిక యుద్ధం. మగాళ్లు యుద్ధాన్ని ఇష్టపడతారు" అని బదులిచ్చారు. 51 ఏళ్ల మస్క్, 39 ఏళ్ల జుకర్బర్గ్ మధ్య అన్ని విషయాల్లోనూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ మధ్య ట్విటర్కు పోటీగా మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రకటించినప్పుడు అది తారస్థాయికి చేరింది. జుకర్బర్గ్తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్లో తన అభిమానులకు చెప్పారు. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ వీడియోలను జుకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా "ఫైట్ లొకేషన్ పంపించు" అంటూ ప్రతిస్పందించారు ఎలాన్ మస్క్. కేజ్ ఫైట్పై ఇద్దరూ పరస్పర పోస్టులు పెడుతూ ఫాలోవర్లలో ఉత్తేజం నింపుతున్నారు. Zuck v Musk fight will be live-streamed on 𝕏. All proceeds will go to charity for veterans. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
ఫేస్బుక్ సీఈవోలో ఈ టాలెంట్ కూడా ఉందా? రింగులో దిగితే..
టెక్ రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న మెటా 'సీఈఓ మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) గురించి అందరికి తెలుసు. ఈయన కేవలం సాంకేతిక రంగంలో మాత్రమే కాకుండా యుద్ధ కలల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ బిలియనీర్ జాబితాలో ఒకరైన జుకర్బర్గ్ ఈ విజయాన్ని ఇన్స్టాగ్రామ్లో గర్వంగా పంచుకున్నారు. ఇందులో అతని కోచ్ డేవ్ కామరిల్లోతో కలిసి కొత్త బెల్ట్ ప్రమోషన్లను జరుపుకున్నారు. ఇందులో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించిన డేవ్కి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఒక గొప్ప కోచ్, మీ ట్రైనింగ్లో ఫైటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను, బ్లూ బెల్ట్ సాధించే స్థాయికి ఎదగటం చాలా గౌరవంగా భావిస్తున్నా అని ఫోటోలను పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!) జుకర్బర్గ్ చేసిన పోస్టుకి డేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఆసక్తికి ధన్యవాదాలు, ట్రైనింగ్ సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని గొప్పగా కొనియాడాడు. ఈ పోస్టుకి నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ అండ్ మార్క్ మధ్య కేజ్ ఫైట్ జరుగుతుందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
బైజూస్ ఆఫీస్లో జగడం.. ఘర్షణకు దిగిన మహిళా ఉద్యోగి.. వీడయో వైరల్
ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్మెంట్లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు. ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్మెంట్లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 -
బర్త్డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టూ జుట్టూ పట్టుకున్న యువతులు!
ఘనంగా బర్త్డే పార్టీ చేసుకుందామనుకున్న అమ్మాయిల బృందం ఒక హోటల్కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిలో ఆ యువతులు ఎలా గొడవ పడ్డానేది కనిపిస్తోంది. ఈ ఉదంతం అమెరికాలో చోటుచేసుకుంది. ఈ వీడియోను విక్టర్ క్రిస్టియన్ పేరుతో టిక్టాక్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎంతో ఫన్నీగా కనిపిస్తున్న ఈ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు తావిస్తోంది. కొంతమంది యువతులు భోజనం టేబుల్ వద్ద గొడవపడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్వైటీ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన బర్త్డే సందర్భంగా స్నేహితురాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే బిల్లు రూ. 3 లక్షలు($4,600) దాటడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఇంతలో ఒక యువతి ఈ భారీ బిల్లును సమానంగా పంచుకుని, ఎవరి పేమెంట్ వారు చేసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చింది. అయితే ఈ సూచన మిగిలిన స్నేహితురాళ్లకు ఏమాత్రం నచ్చలేదు. ఈ యువతుల వివాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన 28 ఏళ్ల విక్టర్ కూడా ఆ పార్టీలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే మా స్నేహం మునుపటిలా లేదు. అయితే త్వరలోనే ఇది సమసిపోతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీలో తాను స్ప్రైట్, కలామారి ఆర్డర్ చేశానని, వాటి ధర 25 డాలర్ల కన్నా తక్కువేనని, పార్టీలోని మిగిలినవారు ఖరీదైన ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారని తెలిపింది. తాను బిల్లు షేర్ చేసేందుకు ఇష్టపడలేదని, ఎందుకంటే తాను తక్కువ ఆహారపదార్థాలనే ఆర్డర్ చేశానని తెలిపింది. ఇతరుల బిల్లు నేనెందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. ఎవరు బర్త్డే పార్టీ ఇచ్చారో వారే బిల్లు చెల్లించాలని విక్టర్ డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ప్రాంక్ అని అంటున్నారు. కొందరు ఆహారం ఆర్డర్ చేసేముందే బ్లిలు గురించి ఆలోచించాలని అంటుండగా, మరికొందరు డైనింగ్ టేబుల్ను క్రీడల మైదానంగా చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి I went to a birthday dinner — and fought over splitting the $4.6K bill https://t.co/48P3UB3oAs pic.twitter.com/LPdjcBE55i — New York Post (@nypost) July 19, 2023 -
లోకల్ ట్రైన్లో మహిళల సిగపట్లు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు..!
కలకత్తా: ట్రైన్లలో ప్రయాణికుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. రైళ్లలో గొడవ పడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ముంబయి లోకల్ ట్రైన్లో మహిళల ఫైటింగ్ వార్త మరవక ముందే కలకత్తా లోకల్ ట్రైన్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు గుంపుగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కలకత్తా లోకల్ ట్రైన్లో మహిళలు వీరంగం సృష్టించారు. ఒకరినొకరు జట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. లోకల్ ట్రైన్ మహిళా కంపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనను ఓ యూజర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కేవలం మూడు రోజుల్లో 6 వేల వ్యూస్ వచ్చాయి. Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L — Ayushi (@Ayushihihaha) July 11, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రైన్లో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చూడొచ్చు అంటూ ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది.. కానీ ఇలాంటి ఘటనలు కూడా చూడాల్సి వస్తోందంటూ మరో యూజర్ స్పందించాడు. క్లినిక్ ప్లస్ యాడ్లా ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో వైరల్.. -
పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్న హిజ్రాలు
-
చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్లో హిజ్రాల రణరంగం
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. చదవండి: కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా.. -
US : తానా సభల్లో తన్నుకున్న లోకేశ్, జూ.ఎన్టీఆర్ వర్గాలు
పెన్సిల్వేనియా, అమెరికా : అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం లోకేష్ నాయకత్వంపై వ్యక్తమైన విమర్శలే కారణమని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా కొందరు తెలుగు తమ్ముళ్లు ‘జై ఎన్టీఆర్’అని నినదించడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు వర్గం దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. అ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంతవరకు టీడీపీకి మనుగడ లేదని, 2024లోనూ మరోసారి పరాజయం ఖాయమని కొందరు ఎన్నారైలు వాదించినట్లు సమాచారం. తనను తాను మూర్ఖుడిగా చెప్పుకునే లోకేష్ కు బదులుగా జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. దీంతో కలవరం చెందిన చంద్రబాబు వర్గం దాడులకు దిగినట్లు తెలిసింది. అమెరికాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన తానాకు ఈ ఘటన మాయని మచ్చలా మిగిలింది. ఘనంగా ప్రారంభం.. అంతలోనే వివాదం పెన్సిల్వేనియాలో తానా 23వ మహాసభలను ఘనంగా ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన అనంతరం తానాలోని కొందరు ప్రముఖులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. కర్రలు విసురుకుంటూ.. సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న తానాకు ఫిలడెల్ఫియాలో జరిగిన అనూహ్య ఘటన ఊహించని ఇబ్బంది తెచ్చింది. తొలి రోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత తానాలోని కొందరు ముఖ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవకు దిగారు. కొందరు తానా ముఖ్యులు ఆపడానికి ప్రయత్నించినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరికి స్థానిక సెక్యూరిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన అంశాలపై తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాల మధ్య వివాదం రేగడంతో ముష్టి యుద్ధానికి దిగాయి. వివాదం శృతి మించడంతో కొందరు అందుబాటులో ఉన్న కర్రలను విసిరారు. ప్రతిష్టాత్మక తానా సంస్థను రాజకీయ సంస్థగా మార్చిన ఘనత చంద్రబాబుదేననే విమర్శలున్నాయి. నిధుల సేకరణ కోసం తానాను ఆయన కామధేనువులా మార్చుకున్నారు. గొడవకు కారణం లోకేష్ సమర్థతేనా? తానాకు హాజరయిన కొందరు సభ్యుల్లో గొడవ ముదరడానికి ప్రధాన కారణం తెలుగుదేశం రాజకీయాలే అని తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం చంద్రబాబు, లోకేషేనని.. మళ్లీ 2024 ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం తప్పదని కొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంత కాలం బాగుపడే అవకాశం లేదని చెప్పుకున్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారని, అయితే తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకుంటోన్న లోకేష్ కు అంత సీన్ లేదని, లోకేష్ బదులు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే గానీ పార్టీ బాగుపడదని కొందరు వాదించినట్టు తెలిసింది. ఇటీవల చంద్రబాబు ఎక్కడికెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, పార్టీ పగ్గాలు జూనియర్ కు ఇస్తేనే.. బాగుంటుందని ఎక్కువ మంది వాదించారు. దీంతో చంద్రబాబు వర్గంలో కలవరం మొదలై, దాడులకు దిగే దుస్థితి వచ్చినట్టు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
ముష్టియుద్ధానికి సిద్ధమవుతున్న మస్క్, జుకర్బర్గ్.. ట్రైనింగ్ కూడా..
సాధారణంగా ధనవంతులైన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ 'ఎలన్ మస్క్' (Elon Musk), ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) నిజమైన పోరుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. I’m up for a cage match if he is lol — Elon Musk (@elonmusk) June 21, 2023 మాటలతో మొదలైన ఈ పోరు చేతల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. వీరు ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ వరకూ వెళ్లారని కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ప్రారంభంలో.. జుకర్బర్గ్ ఒకే అంటే కేజ్ ఫైట్ చేయడానికి తాను సిద్దమేనని మస్క్ ట్విటర్ పోస్ట్ చేసాడు. దీనికి రిప్లై ఇస్తూ జుకర్బర్గ్ 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అన్నట్లు సమాచారం. I did an impromptu training session with @elonmusk for a few hours yesterday. I'm extremely impressed with his strength, power, and skill, on the feet and on the ground. It was epic. It's really inspiring to see Elon and Mark doing martial arts, but I think the world is served… pic.twitter.com/cq00A9Xnmw — Lex Fridman (@lexfridman) June 27, 2023 అంతటితో ఆగకుండా మస్క్ 'వెగాస్ ఆక్టాగాన్' వచ్చేయ్ అక్కడ చూసుకుందాం.. అన్నాడట. అయితే ఇది కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం అనుకున్న నెటిజన్లకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే వీరిద్దరూ కూడా ఈ ఫైట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ తథ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) Here's a highlight video of Mark Zuckerberg and I training jiu jitsu. I look forward to training with @elonmusk as well. It's inspiring to see both Elon and Mark taking on the martial arts journey. See the full video here: https://t.co/G1ubUuxILK pic.twitter.com/WsLaRiFf1o — Lex Fridman (@lexfridman) June 25, 2023 నిజంగా వీరిద్దరి మధ్య పోరు జరుగుతుందా.. లేదా? అనేది ఖచ్చితంగా తెలియకపోయినా, ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలిసిన జుకర్బర్గ్ చేతిలో మస్క్ ఓటమి ఖాయమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. -
కిక్కిరిసిన మెట్రో.. ఏమైందో తెలియదు.. తన్నుకున్న యువకులు..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా సరిగా స్థలం దొరకని పరిస్థితి. ఇంతలోనే మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అదీ కాస్త ఘర్షణకు దారి తీసింది. కోపంతో ఇద్దరు యువకులు ఒకరిపై ఇంకొకరు రెచ్చిపోయారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు దూరంగా జరిగారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn — Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని కామెంట్లు పెట్టారు. ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసింది. ఇదీ చదవండి: వీడేం లవర్రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది.. -
గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా!
శాఫ్ 2023 చాంపియన్షిప్లో భాగంగా శనివారం భారత్, నేపాల్ మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొన్న పాక్తో మ్యాచ్ సమయంలోనూ గొడవ జరిగిన సంగతి తెలిసిందే. విషయంలోకి వెళితే.. ఆట 64వ నిమిషంలో ఇండియాకు చెందిన రాహుల్ బెకె, నేపాల్ మిడ్ ఫీల్డర్ బిమల్ గాత్రి మగర్లు హెడర్ షాట్ కోసం ప్రయత్నించారు. ఇద్దరు ఒకేసారి హెడర్కు ప్రయత్నించడంతో మగర్ను తాకి రాహుల్ నేలపై పడిపోయాడు. ఆ వెంటనే కోపంతో పైకి లేచిన రాహుల్ మగర్ను తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో గొడవ చిలికి చిలికి వానగాలిలా మారిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒక నేపాల్ ఆటగాడు భారత్ ఆటగాడిని కాలర్ పట్టి కింద పడేశాడు. ఇక కొట్టుకుంటారేమో అన్న తరుణంలో సునీల్ ఛెత్రి మగర్ను దూరంగా తీసుకుపోయాడు. ఈ క్రమంలో మగర్ ఛెత్రీవైపు చూస్తూ తప్పందా అతనిదే అంటూ అరిచాడు. సునీల్ మాత్రం 'ప్లీజ్ కామ్డౌన్' అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సునీల్ ఛెత్రీ సేన నేపాల్పై 2-0తేడాతో విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. స్వదేశంలో భారత్కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. మ్యాచ్లో 61వ నిమిషంలో సునీల్ ఛెత్రి భారత్కు తొలిగోల్ అందించగా.. నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో మరో గోల్ అందించాడు. ఆ తర్వాత భారత డిఫెండర్లు నేపాల్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. Crazy Fight among Players during India vs Nepal football match. This Aggressive Indian team is looking more dangerous. I'm liking it ❤️🔥❤️🔥pic.twitter.com/UjNnIKIm5t — Mukesh Chaudhary (@MukeshG0dara) June 24, 2023 Another fight, and now it's between India and Nepal🤣🤣#INDNEP #SAFFChampionship pic.twitter.com/ieGbQ1aV3F — BumbleBee 軸 (@itsMK_02) June 24, 2023 చదవండి: సెమీస్కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి -
రాత్రివేళలో రచ్చ..ఐఏఎస్,ఐపీఎస్ సస్పెండ్
రాజస్థాన్:రాజస్థాన్లో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఓ ఐఏఎస్,ఐపీఎస్ అధికారితో సహా ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారి కొత్త ప్రాంతానికి బదిలీ అయినందున ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వెళ్లే క్రమంలో రెస్టారెంట్లో వాష్రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అనంతరం ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ రిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. अजमेर में IAS और IPS अफसरों ने की होटल स्टाफ के साथ मा#रपीट! | Si News@BJP4India @Myogioffice @Narendramodi#Ajmer #HotelMakranaRaj #IAS #IPS #IPSSushilBishnoi #IASGiridhar #Suspended #SiNews pic.twitter.com/TKyqvRWeAJ — Since Independence (@Sinceindmedia) June 14, 2023 ఇదీ చదవండి:మణిపూర్లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి.. -
సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ.. 33 మంది అరెస్టు
గ్రేటర్ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసలు తెలిపిన కథనం మేరకు.. సెక్యూరిటీ గార్డులు యూనివర్సిటీ క్యాంపస్లోని మున్షీ ప్రేమ్చంద్ హాస్టల్లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. అదికాస్త తీవ్రమై ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుడంతో తాము ఘటన స్థలానికి చేరుకుని ఆయా వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో ప్రైవేటు గార్డులు, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులను స్వీకరించామని, దీనిపై సత్వరమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, క్యాంపస్ వెలుపల సెక్యూరిటీ గార్డు, విద్యార్థులు కర్రలు చేతపట్టుకుని ఘర్షణ పడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి) -
Karnataka: ఇంటి పెద్ద అత్తా? కోడలా?.. ఇంటింటా ‘గృహలక్ష్మి’ కలహాలు!
కర్నాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2000 మొత్తాన్ని ప్రతీనెలా ఇంటిలోని పెద్దకు ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే చాలా ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు పలు ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద వచ్చే మెత్తం ఎవరు తీసుకోవాలనే దానిపై చాలా కుటుంబాలు తమలో తాము గొడవలు పడుతున్నాయి. చాలా కుటుంబాలలో అత్తాకోడళ్లు కలిసి ఉండటం లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం అత్తలకే చెందాలని కొందరు అంటుండగా, కోడళ్లకే దక్కాలని మరికొందరు అంటున్నారు. అయితే సఖ్యతగా ఉన్న కొన్ని కుటుంబాలలోని అత్తాకోడళ్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటామని చెబుతున్నారు. దీని గురించి కర్నాటక శిశు, మహిళా శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం కింద అందించే మొత్తాన్ని పంచుకోవడంతో కుటుంబ సభ్యులదే అంతిమ నిర్ణయం అని అన్నారు. అయితే ఇంటిపెద్దగా అత్తకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆమె ఇవ్వాలనుకుంటే కోడలికి ఈ మొత్తాన్ని అందించవచ్చన్నారు. పీడబ్ల్యుడీ మంత్రి సతీష్ జార్కీహోలీ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం మొత్తం అత్తకే చెందాలని అన్నారు. ఆమెనే ఇంటిపెద్ద అని అన్నారు. ఈ విషయంలో అత్తాకోడళ్లు సయోధ్యతో మెలగాలని సూచించారు. -
విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు
-
Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు
ఇద్దరు మహిళలు గొడవ పడటానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న విషయాలతో మొదలైన వాటిని కూడా ఎంత దూరమైనా తీసుకువెళ్లగలరు. కుళాయి వద్ద, మెట్రో, రైలు, బస్సు వంటి చోట్ల సీట్ల విషయంలో ఆడవాళ్లు గొడవ పడటం సాధారణంగా చూస్తూనే ఉంటాం.. కానీ ఓ పాఠశాలలో ముగ్గురు మహిళా టీచర్లు ఓ రేంజ్లో కొట్టుకున్నారు. ఒకరినొకరు జుట్టు పట్టుకొని, చెప్పులతో వాయించుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిహార్లోని పాట్నా జిల్లాల్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. బిహ్తాలోని పాఠశాలలోని క్లాస్రూమ్లోని ఏదో విషయంలో మహిళా ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఒకరిని మరొకొరు కొట్టుకునేదాకా వెళ్లింది. ప్రధానోపాధ్యాయురాలిని కాంతి కుమారిగా గుర్తించగా.. మరో టీచర్ పేరు అనితా కుమారి. వీరిద్దరికి ముందుగా తరగది గది లోపల గొడవ ప్రారంభమైంది. ఈ ఘర్షణలో మరో ఉపాధ్యాయురాలు కూడా చేరింది. చదవండి: రేపు సీఎం కేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ.. విషయమిదే.. ఇద్దరు టీచర్లు కలిసి క్లాస్ రూమ్లో విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తరువాత బయటకు వచ్చి చేతిలో చెప్పులు పట్టుకుని ప్రిన్సిపాల్ వెంట పరుగెత్తీ మరి దాడి చేశారు. ముగ్గురూ పక్కనే ఉన్న పోలాల్లో పడిపోయినా.. గొడవ ఆపకుండా కొట్టుకున్నారు. కర్రలు, చెప్పులతో ఒకరినొకరు తన్నుకున్నారు. ఈ గొడవను ఆపేందుకు పలువురు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీనిని క్లాస్ రూమ్లోని విద్యార్థులు ఫోన్లో రికార్డ్ చేశారు. దీనికి పాఠశాల అధికారి నవేష్ కుమార్ స్పందించారు. ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ మధ్య వ్యక్తిగత వివాదం కారణంగా గొడవకు దారితీసిందని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలిందన్నారు. ఘర్షణలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులను వివరణ కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చదవండి: ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం -
Video: ఎయిర్పోర్టులో వీర లెవల్లో తన్నుకున్న ప్రయాణికులు..
రోడ్డు మీద, గల్లీలో, బస్సు, రైళ్లలో కొందరు వ్యక్తులు కొట్టుకోవడం చాలానే చూశాం. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్గా మారుతుంటాయి. మరి కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారో ఏమో గానీ ఏకంగా విమానాశ్రయంలో కొంతమంది ప్రయాణికులు గొడవపడ్డారు. ఒకరినొకరు వీర లెవల్లో తన్నుకున్నారు. ఇది ఎక్కడో కాదు.. సెక్యూరిటీ అధికంగా ఉండే అమెరికాలో జరిగింది. వివరాలు.. చికాగోలోని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సోమవారం భారీ పోరాటమే జరిగింది. విమానం దిగి వస్తుండగా మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. విమానాశ్రయంలో బ్యాగేజ్ క్లెయిమ్ ప్రాంతంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు చేయిచేసుకోవడంతో ఈ గొడవ ప్రారంభమైంది. టెర్మినట్ 3లో వద్ద జరిగిన ఈ ఘర్షణలో దాదాపు 12 మందికి పైగా పాల్గొన్నారు. చదవండి: రేయ్! మారండ్రా.. హెల్మట్ ధరించి మరీ రైడ్ చేస్తున్న కుక్క దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో కొంతమంది వ్యక్తులు బీభత్సంగా కొట్టుకోవడం, మహిళలు నేలపై పడుకొని ఒకరు జుట్టు ఒకరు లాక్కోవడం కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వీరిని బాక్సింగ్ విభాగంలో పోటీలకు పంపితే గోల్డ్ మెడల్ సాధించడం పక్కా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా తొలుత మహిళపై దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరిని 18 ఏళ్ల క్రిస్టోఫర్ హాంప్టన్, 20 ఏళ్ల టెంబ్రా హిక్స్గా గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన తర్వాత చికాగో ఎయిర్ పోర్టు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రయాణికులు భద్రత, సౌకర్యం తమకు అత్యంత ముఖ్యమని వెల్లడించాయి. చదవండి: 14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా.. Brawl at Chicago O’Hare airport this morning pic.twitter.com/fsH6n3yABd — Mr Bogus (@Mr_Bogus0007) May 23, 2023 -
గజరాజుల యుద్ధం మీరే చుడండి..!
-
అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య ఘర్షణ..వీడియో వైరల్..
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుసున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిది పతాక స్థాయికి చేరింది. ఇరు నేతల మద్ధతురాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అజ్మేర్లో డీసీసీ నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శి, రాజస్థాన్ కో-ఇంఛార్జ్ అమృత ధావన్ గురువారం అజ్మేర్ వెళ్లారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య సీట్ల అరేంజ్మెంట్ విషయంలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అజ్మేర్లో సచిన్ పైలట్ మద్దతుదారులు ఎక్కువ ఉండటంతో వారంతా తమ నేతకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలను శాంతింప చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అమృత ధావన్.. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్లిపోయారు. కాగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేత అయిన సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మాజీ సీఎం వసుందర రాజేతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని పైలట్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే ఐదురోజుల పాదయాత్ర కూడా చేసి నిరసన వ్యక్తం చేశారు. చదవండి: ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడం కత్తిమీద సామే -
నారా లోకేష్ పాదయాత్ర పొడవునా టీడీపీలో గొడవలే
-
వీళ్ళ క్రియేటివిటీ మాములుగా లేదుగా వైరల్ అవుతున్న వీడియో..
-
మామూలుగా తిట్టుకోవట్లే...
-
కోహ్లి- గంభీర్ గొడవ.. ఎలా మొదలైంది? పూర్తి వీడియో
-
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
వెయిట్రస్తో అనుచిత ప్రవర్తన.. ఒక్క పంచ్తో శివంగిలా విరుచుకుపడి..
ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఎటు నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలియదు. ఆపద కాలంలో మనల్ని ధైర్యంగా ఉంచడమే కాకుండా.. ప్రత్యర్థి, ఆగంతకుల బారి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ తోడ్పడుతుంది. అచ్చం ఇలాంటి కోవకే చెందిన ఓ ఘటన రెస్టారెంట్లో చోటుచేసుకుంది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు ఓ మహిళ వెయిట్రస్ దిమ్మతిరిగే పంచ్లతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో రెస్టారెంట్లోని టేబుల్ వద్ద ఇద్దరు వ్యక్తుల కూర్చొని ఉండగా.. వారి ముందు ఓ లేడీ వెయిట్రస్ నిల్చొని ఉంది. టేబుల్లో కొన్ని ఖాళీ బీర్ సీసాలు కూడా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు కస్టమర్లలో ఒక వ్యక్తి నిలబడి వెయిట్రస్ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. అంతటితో ఆగకుండా అతని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కడుపులో తన్ని కింద పడేసింది. ఇది చూసిన రెండో వ్యక్తి మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయినా బెదరని వెయిట్రస్ అతన్ని ధైర్యంగా ఎదుర్కొంది. సినిమాలో హీరోకు ఏమాత్రం తీసిపోకుండా అతనిపై శివంగిలా విరుచుకుపడింది. ఆమె పైకి కుర్చీ విసరగా.. యువతి తన కాలితో ఒక్క కిక్ ఇవ్వగానే ఎగిరి కిందపడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ రెస్టారెంట్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫేర్ చేయగా.. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా యువతి ధైర్య సాహసాలను చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ పోకిరీలతో పోరాడిన యువతిని ‘ఫిమేల్ బ్రూస్ లీ’ అంటూ కొనియాడుతున్నారు. Female Bruce Lee 💪💪 pic.twitter.com/Fg3Ben0IpQ — CCTV IDIOTS (@cctvidiots) April 15, 2023 -
పోలీస్టేషన్కు చెత్త పంచాయితీ..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టి..
చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్ పంప్ యజమాని మహేష్ పటేల్కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆ మహేష్ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. (చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత) -
నడిరోడ్డుపై కొట్టుకున్న రామ్చరణ్ లేడీ ఫ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో
సినిమా స్టార్స్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. నటీనటులను ఫాన్స్ తమ దేవుళ్లుగా భావిస్తుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు హడావిడీ చేస్తుంటారు ఇక టాలీవుడ్ విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువకులతోపాటు అమ్మాయిలు కూడా హీరోలంటే పడిచచ్చిపోతారు. గర్ల్ఫ్యాన్ పేరుతో సోషల్ మీడియా పేజ్లు తెరిచి అభిమానాన్ని చాటుకుంటారు. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. తాజాగా ఓ ఇద్దరు రామ్ చరణ్ మహిళా అభిమానులు ఘర్షణ పడ్డారు. గొడవ ఎందుకు మొదలైందో తెలియదు కానీ హీరో విషయంలోనే ఇలా కొట్టుకున్నట్లు తెలుస్తోంది. రామ్చరణ్ లేడీ ఫ్యాన్స్ వార్’ అనే క్యాప్షన్తో ట్విటర్లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన ఇద్దరు యువతులు నడిరోడ్డుపై అందరిముందే పిచ్చిపిచ్చిగా తనుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్లు పట్టుకొని చెంపదెబ్బలు కొట్టుకున్నారు. చుట్టూ మిగతా విద్యార్థులు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా రెచ్చిపోయి గొడవ పడ్డారు. విద్యార్థినిలు కొట్టుకుంటుంటే అక్కడున్న వారంతా నవ్వుతూ, అరుస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. చివరికి అబ్బాయిలు జోక్యం చేసుకొని ఈ గొడవను ఆపేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ యువతులు తెలుగులో మాట్లాడుకోవడం ద్వారా ఏపీలో ఎక్కడో జరిగిందని భావిస్తున్నారు. అంతేగాక అసలు ఇద్దరు యువతులు నిజంగానే రామ్చరణ్ విషయంలో గొడవపడ్డారనేదానిపై స్పష్టత లేదు. Ram charan lady fans fan war pic.twitter.com/Gqc4rZhOjE — KingJdeep (@KingJdeep) March 27, 2023 -
పావురాల కోసమే తన్నుకున్నారు!
అనంతపురం: పావురాల కోసం బుధవారం రాత్రి బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు...కొత్తూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ అదే గ్రామానికి చెందిన శివప్ప, హేమంత్, భూపతి బంధువులు. ఇరు కుటుంబాలలో పావురాలు పెంచుకుంటున్నారు. ఇటీవల పావురాలు తారుమారు కావడంతో రోజూ అడ్డపేర్లు పెట్టుకుని తిట్టుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో ఓ వర్గంలోని బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ, మరో వర్గంలోని భూపతికి గాయాలయ్యాయి. ఇరువురూ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ బీజేపీ నేత పంకజ్ దీక్షిత్ ఓ ప్రభుత్వ ఉద్యోగితో గొడవపడ్డాడు. బారాబంకీలో నిర్వహించిన కృషి మేళాలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అలోక్ సింగ్ బయట నుంచి క్యాబేజీ తెచ్చినందుకు ఆగ్రహించిన పంకజ్ సింగ్.. అతనితో ముష్టియుద్ధానికి దిగాడు. ఉద్యోగిపై దాడి చేసి కిందపడేశాడు. అనంతరం పలుమార్లు కొట్టాడు. చివరకు అక్కడున్నవారు కలుగజేసుకుని ఇద్దరినీ ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పంకజ్ దీక్షిత్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించాడు. వీళ్లు తీరుమార్చుకోకపోతే మళ్లీ ఇలాగే చేస్తానని హెచ్చరించాడు. #बाराबंकी बीजेपी नेता पंकज दीक्षित ने सरकारी कर्मचारी आलोक सिंह को जमकर पीटा, कृषि मेले में हुई इस शर्मनाक घटना का वीडियो सोशल मीडिया पर वायरल pic.twitter.com/uen9SCO5kT — ठाkur Ankit Singh (@ankit_singh08) February 28, 2023 చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్లో శిక్షణ.. -
కుక్కను హడలెత్తించిన కోడి.. ఎగిరి ఎగిరి దాడి..
-
ఆప్, బీజేపీ కౌన్సిలర్ల బాహాబాహీ
-
చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పన్నీర్ పెట్టలేదని రచ్చ రచ్చ..
లక్నో: పెళ్లి భోజనంలో మాంసాహారం పెట్టలేదనో లేదా చికెన్, మటన్ సరిపోను వడ్డించలేదనో జరిగిన గొడవల గురించి విన్నాం. కానీ ఉత్తర్ప్రదేశ్ భాగ్పత్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మాత్రం పన్నీర్ కోసం రచ్చ రచ్చ చేశారు. పెళ్లి కొడుకు కుటుంబం తమను పన్నీర్ వడ్డించలేదని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చొక్కాలు చిరిపోయేలా పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो.... यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV — Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023 ఈ ఘటనలో వెయిటర్పై విచక్షణా రహితంగా దాడి జరిగింది. దీంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్మారింది. పన్నీరు కోసం ఇంతలా కొట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. చదవండి: స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు మృతి -
ఫుట్పాత్పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్
స్కూల్లో అబ్బాయిలు అప్పుడప్పుడు స్నేహితులతో గొడపడుతుంటారు. మాటా పెరిగి ఒక్కోసారి పోట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. అమ్మాయిల మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అసలు ఎలాంటి గొడవల జోలికి వెళ్లరు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. అమ్మాయిలే ఫైటింగ్కు దిగుతున్నారు. ఒకరిపైఒకరు దాడి చేసుకుంటూ సినిమా రేంజ్లో పోట్లాటకు దిగుతున్నారు. కారణమేదైనా ఒక్కోసారి సీరియస్గా ఫైట్ చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. స్కూల్ డ్రెస్సులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఫుట్పాత్పైనే రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ ఫైటింగ్ చేస్తూ తోసేసుకుని కిందపడ్డారు. చుట్టుపక్కన ఉన్న వాళ్లు వీళ్లనే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అబ్బాయిలైతే అరుపులు, కేకలు వేస్తూ ఫైటింగ్ను ఎంకరేజ్ చేశారు. చివరకు అక్కుడున్న ఒకరు జోక్యం చేసుకుని పైటింగ్ను ఆపారు. Kalesh B/w KV girls Over unnecessary comments on Celebrity Crushpic.twitter.com/546XV3DeBK — Ghar Ke Kalesh (@gharkekalesh) January 29, 2023 ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. ఈ అమ్మాయిలు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించారని, పాప్కార్న్ తింటూ వీరి ఫైటింగ్ చూసి ఎంజాయ్ చేసినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లికూతురు.. వీడియో వైరల్.. -
మ్యాచ్ రిఫరీపై పంచ్ల వర్షం.. ఫుట్బాలర్పై 30 ఏళ్ల నిషేధం
క్రీడల్లో గొడవలు జరగడం సహజం. ఒక్కోసారి అది కొట్టుకునేంత స్థాయికి వెళుతుంది. మితిమీరినప్పుడు క్రమశిక్షణా చర్యల కింద ఆట నుంచి నిషేధించడం జరుగుతుంది. తాజాగా ఒక ఫ్రాన్స్ ఫుట్బాలర్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మ్యాచ్ సందర్భంగా రిఫరీకి పంచుల వర్షం కురిపించాడన్న కారణంతో అతనిపై 30 ఏళ్ల నిషేధం విధించారు మ్యాచ్ నిర్వాహకులు. 25 ఏళ్ల వయసున్న ఫుట్బాలర్ పేరు ప్రస్తావించడానికి నిర్వాహకులు ఇష్టపడలేదు. అయితే ఆ ఆటగాడు ఫ్రాన్స్లోని ఎంటెంటే స్పోర్టివ్ గాటినైస్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లోరిట్ ఫుట్బాల్ డ్రిస్టిక్ట్ ప్రెసిడెంట్ బెనోయిట్ లెయిన్ పేర్కొన్నారు. కాగా లోకల్ కప్లో భాగంగా జనవరి 8న జరిగిన మ్యాచ్లో ఇది చోటుచేసుకుందన్నారు. మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో రిఫరీపై పిడిగుద్దులు కురిపించడంతో.. అతను రెండురోజుల బెడ్పై నుంచి లేవలేకపోయాడని తెలిపారు. ఘటన జరిగిన రోజే ఆటగాడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించి 30 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు పేర్కొన్నాడు. విచారణ తర్వాత పోలీసులకు అప్పజెప్పామన్నాడు. అంతేకాదు ఆటగాడి చర్యతో సదరు టీమ్ను రెండు సీజన్ల పాటు టోర్నీల్లో పాల్గొనకుండా బ్యాన్ చేసినట్లు బెనోయిట్ వెల్లడించాడు. చదవండి: 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్కు వెళ్లడం మానేస్తామా' ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్కు మంత్రి పదవి -
భర్త ఆలస్యంగా వచ్చాడని..భార్య ఆత్మహత్య!
సాక్షి, బెంగళూరు: పక్కింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ఆలస్యంగా వచ్చిన భర్తతో గొడవపడిన భార్య అలిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లా సూరత్కల్లోని బాళ గ్రామం ఒట్టెకాయారుకు చెందిన హరీశ్, దివ్య (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పక్కింట్లో శుభకార్యం జరిగితే హరీశ్ ఒక్కడే వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆక్రోశం వ్యక్తం చేసిన దివ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. దివ్వ సూరత్కల్లోని ఒక మందుల షాపులో పని చేసేది. అన్యోన్యంగా కాపురం సాగుతుండగా, కూతురు ఇలా చేయడంపై అనుమానంతో ఆమె తల్లి గిరిజా పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్త హరీశ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తునారు. చదవండి: ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి -
Viral Video: పిల్లిని చుట్టుముట్టిన కుక్కలు.. కుక్కలకి ఝలక్ ఇచ్చిన పిల్లి
-
మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అకాల మరణం.. 18 ఏళ్లకే..!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC) భవిష్యత్ ఆశాకిరణం విక్టోరియా లీ అకాల మరణం చెందింది. హవాయ్లో పుట్టిన ఈ అప్కమింగ్ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించి, తన కుటుంబంతో పాటు యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 16 ఏళ్లకే సింగపూర్ బేస్డ్ ప్రమోటర్ వన్ ఛాంపియన్షిప్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుని అపజయమెరుగని ఫైటర్గా చలామణి అవుతున్న లీ.. హఠాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెల్లడం పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. View this post on Instagram A post shared by Angela Lee Pucci (@angelaleemma) లీ మరణ వార్తను ఆమె సోదరి ఏంజెలా లీ నిన్న (జనవవరి 8) సోషల్మీడియా వేదికగా వెల్లడించింది. విక్టోరియా ఎలా మరణించిందో ప్రస్తావించని ఏంజెలా.. డిసెంబర్ 26వ తేదీనే తన సోదరి మరణించినట్లు పేర్కొంది. విక్టోరియా మరణం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, గతంలోలా ఇక తామెప్పుడూ ఉండలేమని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఏంజెలా సోషల్మీడియా సందేశాన్ని పెట్టింది. View this post on Instagram A post shared by ONE Championship (@onechampionship) విక్టోరియా మృతి పట్ల ప్రముఖ UFC ఫైటర్లు కానర్ మెక్ గ్రెగర్, ఖబీబ్, జాన్ జోన్స్, బ్రాక్ లెస్నర్ సంతాపం తెలిపారు. కాగా, అతి చిన్న వయసులోనే విక్టోరియా మృతి చెందడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైటింగ్ రింగ్లో కనపడని గాయాలు తగిలి ఆమె మృతి చెంది ఉంటుందని కొందరంటుంటే, మరికొందరేమో విక్టోరియా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. -
అమ్మాయిల వీరంగం..ఫుల్లుగా తాగి మరో యువతిపై దాడి..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ ఇండోర్లో అమ్మాయిలు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగిన నలుగురు యువతులు మరో యువతిని చితకబాదారు. బెల్టుతో కొట్టారు. పబ్బు బయటే ఈ ఘటన జరిగింది. అక్కడున్న వారు చూస్తే ఉండిపోయారే తప్ప.. వాళ్లను ఆపే సాహయం చేయలేదు. నలుగురూ కలిసి దాడి చేయడంతో బాధిత యువతి ఏమీ చేయలేకపోయింది. గతేడాది నవంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. బాధిత యువతి తనపై దాడి చేసిన నలుగురు అమ్మాయిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లను అరెస్టు చేశారు. 4 girls brutally beating 1 girl with belts and kicks passer-by watching and enjoying #Fights #streetfights #fightingvideos #Girlsfight #India #gemsoffights pic.twitter.com/MVLec2CYai — TheFight1 (@InsanelyIfight3) December 29, 2022 చదవండి: రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి