MUSHEERABAD
-
కంటైనర్ బీభత్సం.. ఏకంగా పోలీసుల వాహనం పైకే !
-
పోలీసులు కౌన్సెలింగ్కు పిలిచారని..
బౌద్ధనగర్: పోలీసులు కౌన్సెలింగ్కు పిలవడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వారాసిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (32) ముషీరాబాద్ జీహెచ్హెంసీ సర్కిల్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కారి్మకుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య శృతి క్యాటరింగ్లో పని చేస్తుంది. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 13న ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 16న కౌన్సెలింగ్కు హాజరుకావాలని పోలీసులు శ్రీకాంత్కు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఆదివారం చున్నీతో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి తండ్రి స్థానికుల సహాయంతో కిందకు దించి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘త్వరలో ముషీరాబాద్ బీజేపీకి షాక్’
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఒకటి రెండు రోజుల్లో గట్టి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నిర్వహించిన చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ్యానర్లలో బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ విజయలక్ష్మి ఫొటో ప్రత్యక్షం కావడంతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశం బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సాక్షి ఆరా తీయగా అనేక విషయాలు తేటతెల్లమయ్యాయి. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, రాంనగర్ డివిజన్ అధ్యక్షురాలిగా, డెంటల్ డాక్టర్గా అందరికీ పరిచయమున్న డాక్టర్ విజయలక్ష్మి త్వరలోనే ఎమ్మెల్సీ కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఒకటి రెండు సార్లు సమావేశమై తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న కవిత హైదరాబాద్ రాగానే ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విజయలక్ష్మి పార్టీని వీడడానికి గల కారణాలపై ఆరా తీయగా.. రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శిగా బాధ్యతలు వీడి మూడు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ పట్టించుకోవడం లేదనే.. తనకు ఏదైనా బాధ్యత అప్పగించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పలుమార్లు కలిసినప్పటికీ ఫలితం లేకపోవడమే ఆమె అలకకు కారణంగా తెలిసింది. దీంతో పాటు ఆమె ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడి వద్ద బాదం పాలను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. దీనికి బీజేపీ నాయకుల నుంచి సహకారం అడిగినా స్పందన కరువైనట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు సైతం తనను పిలవడం లేదని, బతుకమ్మ సంబరాలు, బీజేపీ సంస్థాగత సమావేశాలకు సైతం ఆహ్వానం అందడంలేదని ఆమె ఆరోపిస్తున్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు అయిన తరువాత ముషీరాబాద్ బీజేపీలో ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, కన్వీనర్గా రమేష్రాం రెండవసారి ఎన్నికైన తరువాత ఈ పరిస్థితి మారదని భావించే తాను బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆమె సాక్షికి వివరించారు. తాను బీఆర్ఎస్లో చేరుతున్న విషయం బయటకు రావడంతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు పలువురు నాయకులు ఫోన్ చేసి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇస్తున్నారని, ఇప్పటి వరకు వారంతా ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నిస్తున్నారు. చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా? -
అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. కొట్టి చంపిన తండ్రి..
ముషీరాబాద్: వద్దని చెప్పినా ఫోన్ అదే పనిగా ఫోన్ మాట్లాడుతుందనే కోపంతో గొంతునులిమి చంపాడు ఆ కసాయి మారు తండ్రి. ఈ దారుణ ఘటన ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ జహంగీర్ యాదవ్ కథనం ప్రకారం....రహిమున్నీసా అలియాస్ సన్నూబేగం.. బెహ్రాన్ దేశంలో హౌస్కీపింగ్ పనిచేస్తోంది. బేగంపేటకు చెందిన అక్బర్తో మొదటి వివాహం జరగగా పదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో అతను మరణించాడు. అప్పటికే వారికి షేక్ ఆయాజ్, నౌసీన్ ఉన్నీసా, యాసీన్ ఉన్నీసా(17) అనే ముగ్గురు సంతానం కలిగారు. మొదటి భర్త అక్బర్ మృతి తర్వాత రహిమున్నీసా ముషీరాబాద్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ తౌఫిక్ను వివాహం చేసుకుంది. కాగా, ముగ్గురి పిల్లల్లో ఆయాజ్ షేక్ బేగంపేటలోని తన నాయన మ్మ దగ్గర నివసిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు మారు తండ్రితోనే ఉంటున్నారు. రెండవ కూమార్తె యాసీన్ ఉన్నీసా(17) నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పలు మార్లు తౌఫిక్ అలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. తాజాగా ఆదివారం తెల్లవారు జామున 3గంటల సమయంలోనూ యాసీన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన తౌఫిక్ ఆవేశంతో ఫోన్ లాక్కున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని నిలదీశాడు. చెప్పకపోవడంతో చెంపలమీద రెండు దెబ్బలు వేశాడు. దీంతో బెదిరిపోయిన యాసిన్ గట్టిగా ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు వింటారు ఏడవొద్దంటూ గట్టిగా గొంతు నులమడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తన సోదరి నౌసీన్ ఉన్నీసా హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే యాసీన్ మరణించినట్లు నిర్ధారించారు. దీంతో తౌఫిక్ ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి.. -
ముషీరాబాద్ పీఎస్ పరిధి బాకారం లో దారుణం
-
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ ఇవ్వాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ రేట్లు పెంచాలని, చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు రూ.5500 నుంచి 20 వేలకు పెంచాలని, కోర్సుల్లో చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఫీజుల బకాయిలు రూ.3300 కోట్లు చెల్లించాలని నవంబర్ 10న కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్వో కార్యాలయాల వరకు ర్యాలీలు జరపాలని 14 బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం బీసీ భవన్లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్షిప్లు 5 సంవత్సరాల క్రితం నిర్ణయించారని ఆంధ్రప్రదేశ్లో రూ. 20 వేలు స్కాలర్షిప్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కేవలం రూ.5500 మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలన్నారు. 2007లో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మొత్తం ఫీజులు మంజూరు చేస్తే ప్రభుత్వానికి అదనంగా 150 కోట్లు మాత్రమే భారం పడుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ దిక్కులేని శాఖగా మారిందని ఈ శాఖకు కమీషనర్, ఎండీ లేరన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేష్ పాల్గొన్నారు. -
విద్యార్థుల స్కాలర్ షిప్ రూ. 20 వేలకు పెంచాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్లను రూ.5,500 నుంచి రూ. 20 వేలకు పెంచాలని, ఫీజు బకాయిలు రూ. 3,300 కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 10న కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూ. 20 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంటే తెలంగాణలో కేవలం రూ. 5,500 మాత్రమే ఇస్తున్నారని ప్రస్తుత అవసరాలకు రూ. 20 వేలకు పెంచాలని కోరారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1,500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2 వేలకు పెంచాలన్నారు. బీసీలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బీసీ గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. -
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా!
సాక్షి, పటాన్చెరు(సంగారెడ్డి): అదృశ్యమైన యువకుడు హత్యకు గురైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ, తన ఇద్దరు కుమారులతో కలసి పటాన్చెరు మండలం పాటీ చౌరస్తా సమీపంలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రెండో కుమారుడు శివ కుమార్(18)కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 10వ తేదీన బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ కుటుంబసభ్యులు ఉండే ప్రదేశం పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును పటాన్చెరు పోలీస్స్టేషన్కు మార్చారు. ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? నాగర్కర్నూలు జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన శివకుమార్, అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. యువకుడి కుటుంబం పటాన్చెరు శివారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా, యువతి కుటుంబం ముషీరాబాద్ ప్రాంతంలో ఉంటోంది. వారి ప్రేమ యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన భారతితో శివకుమార్కు ఫోన్ చేయించారు. ముషీరాబాద్ రావడానికి డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో డబ్బులు ఆన్లైన్లో పంపారు. దీంతో అదే రోజు రాత్రి బయలుదేరాడు. వెళ్లే ముందు ముషీరాబాద్ వెళ్తున్నట్టు తన ఇంటి సమీపంలో ఉంటున్న సతీశ్కు ఫోన్ చేసి తెలిపాడు. శివకుమార్ యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి ఓ కాలువలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో శివకుమార్ స్వగ్రామం కోడేరులో విషాదచాయలు అలుముకున్నాయి. -
Hyderabad: మహిళ పట్ల ఆర్ఐ అసభ్య ప్రవర్తన..ఒంటరిగా రా ఇస్తాననడంతో
సాక్షి, హైదరాబాద్: మంజూరైన వితంతు పింఛన్ కార్డును ఇవ్వాలని ఆర్ఐని అడగగా జాప్యం చేస్తూ ఒంటరిగా రా ఇస్తానని చెప్పడంతో ఈ విషయాన్ని సదరు మహిళ బంధువులకు చెప్పడంతో వారొచ్చి ఆర్ఐని తహసీల్దార్ సమక్షంలోనే చితకబాదిన ఘటన కలకలం రేపింది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్లో ఉంటున్న మైనార్టీ మహిళ(28), వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. తనకు మంజూరైన కార్డు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆర్ఐ విజయ్నాయక్ను అడిగింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదని, రోజు ఇబ్బంది పెటొద్దు ప్రేమతో అడిగి తీసుకోవాలంటూ ఆర్ఐ నాలుగైదు రోజులుగా ఇదే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మరోసారి సదరు మహిళ ఫించన్ కార్డు కోసం కార్యాలయానికి వచ్చి విజయ్నాయక్ను కార్డు అడిగింది. మళ్లీ అతడు అదే సమాధానం ఇచ్చాడని కుటుంబ సభ్యులతో పాటు బస్తీ వాసులకు తెలిపింది. కాసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చిన వారు తహసీల్దార్ అయ్యప్ప సమక్షంలోనే విజయ్నాయక్పై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన తహసీల్దార్ను సైతం నెట్టివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను పోలీస్స్టేషన్కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఫించన్ మంజూరైంది ఇంకా కార్డు రాలేదని రాగానే ఇస్తానన్నాను.. తప్ప ఒంటరిగా రా అనలేదని ఆర్ఐ విజయ్నాయక్ చెప్పుకొచ్చారు. కార్డు ఇవ్వడం ఆలస్యమైనందుకే బంధువులు, స్థానికులతో వచ్చి తనపై దాడి చేశారని ఆర్ఐ పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఇరువురు గాంధీనగర్ పోలీస్ పరస్పర ఫిర్యాదు చేసినట్లు సీఐ మోహన్రావు తెలిపారు. -
ముషీరాబాద్ చేపల మార్కెట్ కాలనీలో కలుషిత నీటి సరఫరా
-
బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు బస్తీల వాసులకు కలుషిత జలాలు శాపంగా పరిణమిస్తున్నాయి. గతంలో భోలక్పూర్.. ఇటీవల మాదాపూర్ వడ్డెర బస్తీ.. మంగళవారం ముషీరాబాద్ చేపల మార్కెట్ ప్రాంతంలో కలుషిత జలాల కారణంగా పలువురు బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఆయా ప్రాంతాల్లో అతిసారం ప్రబలడం కలవరం సృష్టిస్తోంది. మరుగుదొడ్లు, అపరిశుభ్ర పరిసరాలు, గుంతల్లో నల్లా లేని కనెక్షన్లతో పాటు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పురాతన తాగునీటి పైప్లైన్లు ఏదో ఒకచోట తరచూ ఈ పరిస్థితికి కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాత నగరంతో పాటు ప్రధాన నగరంలో సుమారు రెండువేల కిలోమీటర్ల పరిధిలో పురాతన పైప్లైన్లు ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటి స్థానంలో తక్షణం డక్టైల్ ఐరన్ (డీఐ), మైల్డ్స్టీల్ (ఎంఎస్) పైప్లైన్లు ఏర్పాటు చేసి పైప్లైన్ లీకేజీల కారణంగా ఏర్పడుతున్న కలుషిత జలాల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పురాతన పైప్లైన్ల మార్పుతోనే పరిష్కారం.. ► మహానగరం పరిధిలో సుమారు 9 వేల కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇందులో పాతనగరం, ప్రధాన నగరం పరిధిలో సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో వివిధ సామర్థ్యాలున్న పురాతన పైప్ లైన్లున్నాయి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడడం, పక్కనే మురుగు నీటి పైప్లైన్లు, నాలాలుండడంతో తరచూ మురుగు నీరు లీకేజీ ఏర్పడిన తాగునీటి పైప్లైన్లలోకి చేరి శుద్ధి చేసిన తాగునీరు కలుషితమవుతోంది. ► ఈ నీటిని తాగిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వీటిని తక్షణం మార్చితేనే కలుషిత జలాల సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రధానంగా ముషీరాబాద్, చార్మినార్, బహదూర్పురా, సికింద్రాబాద్, కార్వాన్ తదితర నియోజకవర్గాల పరిధిలోనే పురాతన పైప్లైన్లు అత్యధికంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటిని మార్చేందుకు సుమారు రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవీ కారణమే.. ► పలు బస్తీల్లో ఇళ్ల ముందున్న కనెక్షన్లు గుంతల్లో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. వీటికి చాలా ప్రాంతాల్లో నల్లాలు లేవు. ఇవన్నీ మరుగుదొడ్లు, దుస్తులు, వంట పాత్రలు శుభ్రం చేసుకునే ప్రదేశాలకు ఆనుకొని ఉన్నాయి. దీంతో ఈ మురుగు నీరు నల్లా గుంతల్లోకి చేరుతోంది. ► మంచినీటి సరఫరా జరిగిన అనంతరం ఈ మురుగు నీరు ఆయా కనెక్షన్లలోకి రివర్స్ వెళుతోంది. తిరిగి తాగునీటి సరఫరా జరిగిన సమయంలో నల్లా నీటితో పాటు ఈ మురుగు నీరు వస్తోంది. ఈ నీటిని తాగిన వారు అస్వస్థతకు గురవుతున్నట్లు వడ్డెర బస్తీలో జలమండలి క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. ► మహానగరం పరిధిలోని సుమారు 1470 మురికి వాడలున్నాయి. పలు బస్తీల్లో కనెక్షన్లకు నల్లాలు లేని చోట జలమండలి జీఐ పైప్లైన్లతో తక్షణం నల్లా కనెక్షన్లను కొంత ఎత్తున.. పబ్లిక్ నల్లా తరహాలో ఏర్పాటు చేయాలి. దీంతో కలుషిత ముప్పు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. (క్లిక్: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) జలమండలి మేనేజర్, వర్క్ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ముషీరాబాద్ చేపల మార్కెట్లో కలుషిత జలాల కలకలం నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిశోర్ సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఈ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను అరికట్టేందుకు నూతన పైప్లైన్ వర్క్ మంజూరు చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు మొదలు పెట్టనందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.4.2 లక్షలతో కొత్త పైప్లైన్ను మంజూరు చేసినట్లు ఎండీ తెలిపారు. (చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల) -
ప్రభుత్వ కమ్యూనిటీ హాల్: ముక్కేసి..పెగ్గేయ్రా!
సాక్షి, ముషీరాబాద్: బాగ్లింగంపల్లిలోని ఓ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ పేకాట క్లబ్గా మారింది. మందుకు, విందుకు నిలయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన నలుగురు ఎస్ఐలు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేశారు. డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం వెనుకగల ఎల్ఐజీ క్వార్టర్స్లో ఇటీవల 75 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నైబర్హుడ్ కమ్యూనిటి హాల్ను ప్రారంభించింది. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి జన్మదినం సందర్భంగా స్నేహితులు, నాయకులు కొందరు విందును ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ రెండు గేట్లకు తాళం వేసి మందు, విందు, పేకాట ఆడుతూ జల్సాలు చేసుకంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీస్స్టేషన్ అడ్మిన్ ఎస్సై వెంకట్రమణ, నర్సింహారావు, శ్రీనివాస్రెడ్డి, కోటేష్ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ గోడలు దూకి పేకాట ఆడుతున్న వీడియోలను చిత్రీకరించారు. పోలీసులు వచి్చన విషయాన్ని గుర్తించిన పేకాట రాయుళ్ళు కొంతమంది గోడదూకి పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి డబ్బు స్వా«దీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కొంత మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి విడుదల చేయాలని కోరారు. అనంతరం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అధికార పారీ్టకి చెందిన నాయకులే జనావాసాల మధ్య ఉండే ఓ ప్రభుత్వ కమ్యూనిటి హాల్లో పేకాట ఆడటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీ-టిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
-
Photo Feature: కరోనా కాలం.. జర పైలం
ఇది ముషీరాబాద్లోని చేపల మార్కెట్. ఆదివారం ఇలా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. భౌతిక దూరం మాటే మరిచారనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి. ఆదివారం బయోడైవర్సిటీ చౌరస్తా ఇలా బోసిపోయి కనిపించింది. -
Photo Feature: అంతటా కరోనా.. ఏది దారిక
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కోసం జనం తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో టీకా తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు వయోవృద్ధులు ఇలా నిరీక్షిస్తూ కనిపించారు. ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వ్యాక్సినేషన్ కోసం జనం భారీగా తరలివచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వ్యక్తులు ఇలా పీపీఈ కిట్లు ధరించి మరీ వచ్చారు. ఆస్పత్రి వద్ద కరోనా అంటుకునే ప్రమాదం ఉందనే భావనతో పకడ్బందీ ఏర్పాట్లతో రావడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. -
60 కాస్త 10 అయ్యింది.. పట్టించుకోండి సారూ
సాక్షి ,హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని లోయర్ ట్యాంకు బండ్ గోశాల నుంచి ఏసీటీసీ కళాశాల మీదగా బీమామైదానం, ఇందిరా పార్కు రోడ్డు 60 అడుగుల వరకు ఉండేది. విశాలమైన ఈ రోడ్డుకు ఇరువైపులా గోశాల నుంచి ఇందిరా పార్కు రోడ్డు వరకు కార్లు, ద్విచక్ర వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. డెంటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర వ్యాపారులు ఆక్రమించారు. ఇష్టారాజ్యంగా మెకానిక్ షెడ్లను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు వచ్చే వాహనాలు, వాహన చోదకులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేసి సర్వీసింగ్ చేయడంతో 60 అడుగులు కాస్త 10 అడుగులకు కుంచించుకుపోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఇదేమని ఎవరైనా వాహనదారులు అడిగితే ఘర్షణలు, వాగ్వాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో మెకానిక్ షాపుల యజమానులు ఒకరిని మించి మరొకరు అక్రమంగా షెడ్లను నిర్మించి రోడ్లను ఆక్రమించారు. దీంతో పాదచారులు నడవడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు దారేదీ.. ► ఇదే మార్గంలో ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. ► ఇక్కడికి నిత్యం వందలాది మంది వైద్యం కోసం వస్తుంటారు. ► ఇటీవల కరోనా నేపథ్యంలో ఈ సెంటర్ను కరోనా వైద్యం కోసం కేటాయించారు. ► దీంతో కవాడిగూడ డివిజన్తో పాటు ఇతర డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షల కోసం, వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. ► వారి వాహనాలను పార్క్ చేయడానికి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురువుతున్నారు. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు.... అనేక సంవత్సరాలుగా రోడ్డును ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని విపరీతంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం అవుతున్న షెడ్ల యజమానులపై ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఫలితంగా రోజు రోజుకు కొత్త షెడ్లు ఈ మార్గంలో రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించి, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందిపడుతున్న రోడ్డు ఆక్రమణలను తొలగించాలని పలువురు వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు. ( చదవండి: సిబ్బంది మధ్య వార్.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు.. ) -
టెస్టులు సరే.. మరి భౌతిక దూరం ఏదీ?
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కరాళ నృత్యం చేస్తూ విజృంభిస్తుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు ప్రాణ భయంతో నిర్థారణ పరీక్షల కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకొనేందుకు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రోగులు వస్తుండడంతో పీహెచ్సీల వద్ద జనం రద్దీ పెరిగిపోతోంది. దీంతో పీహెచ్సీల వద్ద కనీస భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు, ఒకరిపై ఒకరు పడుతూ రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడుతున్నారు. వీరిని నివారించేందుకు ఆసుపత్రి సిబ్బంది సైతం చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు కనీస సౌకర్యాలు లేక టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ► ముషీరాబాద్ నియోజకవర్గంలో బైబిల్ హౌస్, డీబీఆర్ మిల్లు, గగన్మహల్లతో పాటు ముషీరాబాద్, భోలక్పూర్లలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో కరోనా టెస్టులతో పాటు వ్యాక్సిన్ను కూడా అందిస్తున్నారు. ► ముఖ్యంగా భోలక్పూర్, ముషీరాబాద్ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో పాటు ముషీరాబాద్ ప్రధాన రహదారిలో ఉండడంతో ఇక్కడ రద్దీ అధికంగా ఉంది. ► ముషీరాబాద్, భోలక్పూర్ కేంద్రాలకు రోజుకు సగటున సుమారు టెస్టులకు, వ్యాక్సిన్కు 300 మందికి పైగా హజరవుతున్నారు. ► టెస్టుల కోసం వచ్చే వారు మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తమ సీరియల్ నెంబర్ వచ్చే వరకు సుమారు గంట పాటు ఆవరణలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ► అలాగే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఆరగంట పాటు ఎటువంటి రియాక్షన్ లేదని నిర్థారణ అయ్యే వరకు అక్కడ వేచిచూడాల్సి ఉంటుంది. దీనితో ఆ ప్రాంగణం కిటకిటలాడుతోంది. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలి.... ► టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చే బాధితులు, వారికి సహయకులుగా వచ్చే వారు క్యూ లైన్, భౌతిక దూరం పాటించే విధంగా ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసులు టీం లను ఏర్పాటు చేసి రోగులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. ► దీనికి తోడు మహిళలకు టాయిలెట్ సౌకర్యం, టెస్టులు, వ్యాక్సిన్ అందించే ఆరోగ్య కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ( చదవండి: ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని.. చిన్నారిని ) -
మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో సేవలు గురువారం నుంచి ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్, అమీర్పేట్, మియాపూర్, ఎంజీబీఎస్ టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. ఇక కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, భరత్నగర్ మెట్రో స్టేషన్లు సైతం గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా ప్రస్తుతం మూడు మెట్రో మార్గాల్లో నిత్యం సుమారు 1.5 లక్షల మంది మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్న విషయం విదితమే. (చదవండి: త్వరలో సిటీలో డబుల్ డెక్కర్ సర్వీసులు) -
కార్పొరేటర్ మీద కోపం ఉండొచ్చు.. కానీ!
సాక్షి, హైదరాబాద్ : ముషీరాబాద్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. గతంలో గాంధీ నగర్లో భారీ మెజారిటీలతో పార్టీని గెలిపించారని, మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. గాంధీనగర్ డివిజన్ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అనేక అనుమానాల మధ్యలో రాష్ట్రంలో పాలన ప్రారంభించామన్నారు. కరెంట్ సమస్యను కేవలం ఆరు నెలల్లో పరిష్కారం అయ్యేలా చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీలో 67 వేల కోట్ల రూపాయలతో పనులు చేశామని, ఒక ఆలోచనతో పాలన ముందుకు సాగిస్తున్నామన్నారు. ‘ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తోంది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అందడం లేదు. 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్ ఎలా ఉందో ఆలోచించుకోవాలి. కానీ కొందరు ఇవాళ హిందూ- ముస్లీం అంటున్నారు. కొన్ని పార్టీల నేతలు హైదరాబాద్కు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారు. వరద సాయం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడిగితే లేఖ రాలేదని సమాధానం వచ్చింది. కానీ హోంశాఖ నుంచి పలు రాష్ట్రాలకు సాయం అందింది. పేద వర్గాలు ఆకలి కోసం ఇబ్బందులు పడొద్దని రేషన్ పెంచి ఇచ్చాం. బీజేపీ మాటలు నమ్మితే మనమే ఇబ్బందులు పడుతున్నాం. కార్పొరేటర్ మీద కోపం ఉండొచ్చు కానీ కేసీఆర్ను చూసి గెలిపించాలి. టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తుంది. బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. బీజేపీ నేతలు జై శ్రీరామ్ అని ఓటు అడుగుతున్నారు’ అని కవిత పేర్కొన్నారు. -
హైదరాబాద్లో భారీ వర్షాలు.. హైకోర్టు ఉద్యోగి మృతి
-
హైదరాబాద్లో భారీ వర్షాలు.. వ్యక్తి మృతి
హైదరాబాద్ : నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షాలతో ముషీరాబాద్లో ఓ వ్యక్తి మృతి చెందారు. వివరాల ప్రకారం భారీ వర్షాల కారణంగా ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి ఎదురుగా సికింద్రాబాద్ కోపరేటివ్ బ్యాంకు బుడగల అపార్ట్మెంట్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అయితే ఆ సమయంలో రాజ్కుమార్ (54) అనే వ్యక్తి సెల్లార్లోనే చిక్కుకొని ఉండటంతో ప్రాణాలు కోల్పోయారు. ఈయన హైదరాబాద్ హైకోర్టులో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాలికతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత నెల 20న కురిసిన భారీ వర్షానికి సరూర్నగర్ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న బాలాపూర్ మండలం అల్మాస్గూడకు చెందిన నవీన్కుమార్ (3) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సెప్టెంబర్ 17న జరిగిన మరో ప్రమాదంలో నేరెడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్లో నివాసముండే 12 ఏళ్ల సుమేధ సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోవడంతో ప్రాణాలు విడిచింది. (నీట మునిగిన హైదరాబాద్) -
'20 ఏళ్లుగా నన్ను మోస్తూనే ఉన్నారు'
సాక్షి, హైదరాబాద్ : ధరణికి గిరి భారమా.. గిరికి తరువు భారమా.. తరువుకు కాయ భారమా.. కని పెంచే తండ్రికి బిడ్డ భారమా.. అని కొత్తగా పాడుకోవాల్సి ఉంటుంది ఓ తండ్రి గురించి.. అమ్మ నవ మాసాలు మోసి కనీ.. పెంచీ.. కనిపించే ప్రత్యక్ష దైవమేతే.. నాన్న పిల్లల భారాన్ని మోసే అనురాగమూర్తి. వారి బురువూ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని అన్ని అవసరాలు తీర్చే ప్రేమైక స్ఫూర్తి. ఇదే కోవకు చెందినవారు రాంనగర్కు చెందిన బుజ్జి వెంకటేశ్వరరావు. ప్రత్యేక ప్రతిభావంతురాలైన కూతురును కంటిరెప్పలా చూసుకుంటున్నారు ఆయన. తల్లి సపర్యలు చేసినా తానూ బిడ్డకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోలియో బారినపడి నడవలేని అసహాయ స్థితిలో ఉన్న కుమార్తెకు తానే పాదాలై ముందుకు నడిపిస్తున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. రాంనగర్లోని బాప్టిస్ట్ చర్చి సమీపంలో నివసించే వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులు కూతురు తేజస్విని. ఈమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో కదల్లేని పరిస్థితి. ఆమెకు 24 ఏళ్లు. కాలు ఇంటి బయట పెట్టాలంటే మరొకరి సపోర్ట్ ఉండాల్సిందే. స్నానంతో పాటు ఇతర అవసరాలన్నీ తల్లి తీరుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు హయత్నగర్లోని తేజస్విని ఓ స్కూల్లో చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు రోజూ వదిలివచ్చేవారు. ప్రత్యేకంగా ఆటో కొనుగోలు అందులో తీసుకెళ్లి, ఇంటికి తీసుకొచ్చేవారు. రాంనగర్లో ఇంటర్ చదువుతుప్పుడు తరగతి గది మూడో అంతస్తులో ఉండటంతో తండ్రి వెంకటేశ్వరరావు కూతురును ఆటోలో గేట్ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి కూతురును భుజాలపై ఎత్తుకొని వెళ్లి మళ్లీ తీసుకొచ్చేవారు. రెండేళ్లపాటు ఆయన రోజూ ఇలాగే చేశారు. మారేడ్పల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాలో తేజస్విని మూడేళ్ల పాటు డిగ్రీ చదివినప్పుడు ఇదే విధంగా తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చేవారు. అనంతరం అదే కళాశాలలో ఆమె పీజీ (ఎంబీఏ) సీటు సంపాదించింది. ఆ రెండు సంవత్సరాలు కూడా తండ్రి అన్ని పనులూ మానుకొని కూతురికే అత్యధిక సమయం వెచ్చించారు. ఇలా 24 ఏళ్లుగా కూతురు సేవకే అంకితమయ్యారు తండ్రి వెంకటేశ్వరరరావు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అయినా అదేమీ పట్టించుకోలేదు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కూతురును తన భుజాలపై మోసుకుంటూ తరగతి గదిలో కూర్చొబెట్టిన వెంకటేశ్వరరావును కస్తూర్బా మహిళా కళాశాల వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యం ఆయనను సత్కరించడం విశేషం. నా పూర్వజన్మ సుకృతం.. ‘నన్ను 20 ఏళ్లుగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు నాన్న. నేను ఏదైనా ఉద్యోగం సంపాదిస్తా. నా కోసం సర్వం ధారపోసిన తండ్రి రుణం తీర్చుకుంటా. కొన్ని ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ దూరం కావడం, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉండడంతో వద్దనుకున్నాను. త్వరలో జరగబోయే కామర్స్ పీహెచ్డీ ఎంట్రన్స్ కోసం, గ్రూప్– 2కి ప్రిపేర్ అవుతున్నాను. వైకల్యంతో ఉన్నానని నేను ఏనాడూ బాధపడలేదు. ఇటువంటి తండ్రి దొరకడం నా పూర్వ జన్మసుకృతం’ అని చెబుతోంది తేజస్విని. -
లష్కర్ను వీడుతున్న కరోనా!
సాక్షి, సికింద్రాబాద్ : నిత్యం సందడిగా ఉండే సికింద్రాబాద్(లష్కర్) నగరం కరోనా పుణ్యమా.. అని 60 రోజులుగా మూగబోయింది. వ్యాపారాలు, కార్యాలయాలు మూతబడటం మాట అటుంచితే.. బయటకు వెళ్తే.. ఏమవుతుందోనన్న భయం మాత్రం ఈ ప్రాంత ప్రజలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంటాడింది. లష్కర్లో 26 మందికి కరోనా పాజిటివ్ రాగా, అందులో ముగ్గురు మృతి చెందారు. దీంతో లష్కర్ ప్రజలు పూర్తిగా భయాందోళనలకు గురయ్యారు. కరోనా దాడికి విలవిల్లాడిన లష్కర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరోనా దెబ్బకు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న 13 కాలనీలలో కరోనా తగ్గుముఖంలో ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తి వేస్తున్నారు. దీంతో నివాసాలకే పరిమితమైన కంటైన్మెంట్ ప్రాంతాల ప్రజలు కొంత మేరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. (తల్లికి కరోనా.. ఐసోలేషన్లోకి నటుడు) 13 కంటైన్మెంట్లు... సికింద్రాబాద్ నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్ల పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు 13 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని లాలాగూడ, మెట్టుగూడ, శ్రీనివాస్నగర్, షాబాద్గూడ, కౌసరి మసీదు, బౌద్ధనగర్ అను ఆరు కంటైన్మెంట్ జోన్లలో ఐదింటిని ఎత్తివేశారు. బేగంపేట్ సర్కిల్ పరిధిలోని జీరా, పాటిగడ్డ, ప్రకాశ్నగర్, రామస్వామి కాంపౌండ్, నల్లగుట్ట, ఈస్ట్ మారేడుపల్లి, పీజీ రోడ్ అను ఎనమిదికి ఎనమిది కంటైన్మెంట్ జోన్లన్నీంటిని ఎత్తేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 14 మందికి, బేగంపేట్ సర్కిల్ పరిధిలో 12 మందికి కరోనా వైరస్ సోకడంతో వారితో సన్నిహితంగా ఉన్న రెండు సర్కిళ్ల పరిధిలో సుమారు నాలుగు వందల మందికి అధికారులు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే చికిత్స పొందుతుండగా మిగతా వారంతా డిశ్ఛార్జ్ అయ్యారు. వైరస్ సోకిన వారిలో ముగ్గురు వ్యక్తులు మాత్రం మృతి చెందారు. (కనరో శ్రీవారి దర్శన భాగ్యము) మిగిలింది ఒక్కటే... సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలోని 9 మున్సిపల్ డివిజన్లలో మొత్తంగా ఒక్క కాలనీ మాత్రమే కంటైన్మెంట్ జోన్గా కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 13 కంటైన్మెంట్లను అధికారులు రెండ్రోజుల క్రితమే ఎత్తివేశారు. తాజాగా బౌద్ధనగర్లోని ఒకే ఇంటిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో అట్టి కాలనీని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ఏర్పాటు చేశారు. నిరంతరం పరీక్షలు... సికింద్రాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఉత్తర మండలం అధికారులు అన్నివిధాల చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయా ప్రాంతాల్లో మందులు పిచికారీ చేయడం, పరిశుభ్రంగా ఉంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేందుకు, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. (స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!) ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, యూపీహెచ్సీ సిబ్బంది సమన్వయంతో అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా వైరస్ మాత్రం వ్యాపిస్తూనే ఉంది. శనివారం బాగ్లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్లో 34 సంవత్సరాల మహిళకు కరోనా సోకింది. ఆదివారం భోలక్పూర్ డివిజన్లో నివాసముండే గర్భిణీ (21)కి కరోనా సోకింది. శనివారం వెన్నుపూస నొప్పి రావడంతో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలో వైద్యులు నమూనాను సేకరించి కరోనా పరీక్షలకు పంపడంతో ఆమెకు పాజిటివ్ తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె నివాసమున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఆమె ఉంటున్న ఇంటిలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఏఎంహెచ్ఓ డాక్టర్ హేమలత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ఇప్పటివరకు ముషీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. వీరిలో 10 మంది చికిత్స పొంది విజయవంతంగా కరోనాను జయించి ఇంటికి చేరుకున్నారు. -
షాహెద్.. మనసున్న మారాజు!
అతనిది ముషీరాబాద్ ఏక్మినార్ మసీదు ఎదుట ఓ చిన్న కూల్ డ్రింక్స్ దుకాణం. ముషీరాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి సామాజిక కార్యకర్తగా పరిచయం. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేయడం అతని వృత్తి అయితే సేవా కార్యక్రమాలు ప్రవృత్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ఏ సాయం కావాలన్నా తనకు తోచిన రీతిలో సహకరిస్తారు. ముషీరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలోనే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలు ఆకలితో చదువు మీద దష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముషీరాబాద్ ఏక్మినార్ మసీదు వద్ద ఉండే సామాజిక కార్యకర్త మహ్మద్ షాహెద్ చిన్నారుల ఆకలిని చల్లార్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గడచిన ఐదేళ్లుగా క్రమం తప్పకుండా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియంలకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులకు రోజూ స్నాక్స్ను అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. అరటిపండ్లు, మిక్చర్, జ్యూస్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం స్నాక్స్ అందిస్తున్నారు. రోజూ ఒక విద్యార్థికి రూ. 25 చొప్పున ఒక రోజు వంద మందికి రూ. 2,500 40 రోజుల మీద షుమారు లక్ష రూపాయల పరోక్ష సహాయాన్ని అందిస్తున్నారు. షాహెద్ సేవాభావాన్ని పోలీసు, విద్యా శాఖ అధికారులు, పలువురు రాజకీయ నాయకులు అభినందిస్తున్నారు. సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా నా సహయం కోరితే వారికి నాకు తోచిన సహాయం చేయడం నా బాద్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకో పోయినా కష్ట పడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయడం నేను సంతోషంగా భావిస్తాను. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు. నాకున్న దాంట్లో నేను ఎంత సహయం చేస్తున్నానో అదే ముఖ్యం.– షాహెద్, సామాజిక కార్యకర్త -
హైదరాబాద్ ముషీరాబాద్లో బాంబు కలకలం
-
సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..
ముషీరాబాద్: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్ డెవలప్మెంట్’సంస్థను లక్ష్మణ్తో కలిసి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు. మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. -
జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి
ముషీరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో జనశక్తి పక్షాన ప్రతినిధిగా పాల్గొన్న జనశక్తి మాజీ నేత కె.చంద్రన్న (75) గురువారం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల విద్యానగర్లోని ఆంధ్ర మహాసభ ఆస్పతిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. యాదాద్రి జిల్లా టంగుటూర్ గ్రామానికి చెందిన చంద్రన్న ఈసీఐఎల్ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలో విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టో), జనశక్తిల రాష్ట్రస్థాయి నేతగా ఎది గారు. బీడీ, సింగరేణి కార్మికుల అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాంనగర్లోని స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల న్యూడెమోక్రసీ తీవ్ర సంతాపం ప్రకటించింది. -
భార్యతో గొడవపడి.. భర్త అదృశ్యం
సాక్షి, ముషీరాబాద్: భార్యతో గొడవపడి భర్త ఇంటినుంచి వెళ్లిపోయిన సంఘటన ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. అరుంధతినగర్కు సంపత్, సుమలత భార్యాభర్తలు. సంపత్ డ్రైవర్గా పనిచేస్తుండగా, సుమలత ఓ హోటల్లో క్యాషియర్గా పనిచేసేది. గత నెల 29న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్యను దూషించిన సంపత్ అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. బుధవారం సుమలత ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మరో ఆర్టీసీ కార్మికుడి మృతి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో మరో గుండె ఆగింది. ముషిరాబాద్ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్(37) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన రమేష్ గత 17 రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాడు. రెండు రోజుల గుండెనొప్పి రావడంతో మలక్పేటలోని యశోదా ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరింది. ప్రభుత్వం చర్చలు జరపకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలని కార్మిక సంఘాల నేతలు ప్రజాప్రతినిధులను కోరనున్నారు. (చదవండి : గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి) -
హౌస్ ఫుల్!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ప్రధాన పార్టీల టికెట్ల పందేరం దాదాపు ముగిసింది. ఆదివారం ముషీరాబాద్కు తమ అభ్యర్థిగా ముఠా గోపాల్ను ప్రకటించి టీఆర్ఎస్ టికెట్ల పంపిణీకి తెర దించింది. సికింద్రాబాద్ సీటును కాంగ్రెస్ కాసాని జ్ఞానేశ్వర్కు కేటాయించడంతో ఆ పార్టీ అన్ని సీట్లు భర్తీ చేసినట్టయింది. అంబర్పేటకు టీజేఎస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ బీసీలు, ఓసీలకు సమ ప్రాధాన్యం ఇస్తే, కాంగ్రెస్ ఈ మారు ముస్లిం మైనారిటీలకు అధిక సీట్లు కేటాయించింది. టీఆర్ఎస్ రాజేంద్రనగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, నాంపల్లి స్థానాలను గౌడ సామాజిక వర్గానికి, సనత్నగర్, మలక్పేట యాదవులకు, మహేశ్వరం, మేడ్చల్, ఉప్పల్, యాకుత్పురా, చాంద్రాయణగుట్టలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెడ్ల స్థానాలను తగ్గించారు. కూకట్పల్లి, మల్కాజిగిరిని వెలమ, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి కమ్మ, బహూదూర్పురా, చార్మినార్ను ముస్లింలకు కేటాయించారు. ఖైరతాబాద్ను మున్నూరుకాపు, అంబర్పేట వంజరి, ముషీరాబాద్ బెస్త, గోషామహల్, కార్వాన్ను ఉత్తరాదికి చెందిన మార్వాడి, ఠాకూర్లకు కేటాయించారు. కూటమిలో మైనారిటీలకు.. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా కూటమిలో ఆరు స్థానాలకు మైనారిటీలకు, ఉప్పల్, కుత్బుల్లాపూర్, గోషామహల్ను గౌడ్లకు, ఎల్బీనగర్, మహేశ్వరం, జూబ్లీహిల్స్, మేడ్చల్ స్థానాలకు రెడ్లకు, ముషీరాబాద్ యాదవులకు, ఖైరతాబాద్ కంసాలి, యాకుత్పురా మేరు, రాజేంద్రనగర్ను వైశ్యులకు, మల్కాజిగిరిని బ్రాహ్మణులకు కేటాయించారు. సికింద్రాబాద్లో కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సైతం చంద్రాయణగుట్ట, బహదూర్పురాలో మైనార్టీలు, అంబర్పేట, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్లో రెడ్లు, మలక్పేటలో పద్మశాలి, ముషీరాబాద్లో మున్నూరు, నాంపల్లిలో యాదవ, శేరిలింగంపల్లిలో వైశ్య, కూకట్పల్లిలో వెలమ, మల్కాజిగిరి, ఉప్పల్లో బ్రాహ్మణ, చార్మినార్ ఎస్సీలకు కేటాయించి సామాజిక సమతూకం చేసే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే సోమవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో అభ్యర్థులంతా ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. -
కోదాడ, ముషీరాబాద్ అభ్యర్థులను ప్రకటించిన టీఅర్ఎస్
-
నాయినికి షాకిచ్చిన కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్ : ముషీరాబాద్ టికెట్ను తన అల్లుడికి కేటాయించాలని కోరిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి గులాబీ అధినేత కేసీఆర్ మొండిచేయి చూపారు. ఆ స్థానాన్ని టీఆర్ఎస్ నేత ముఠా గోపాల్కు కేటాయిస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అలాగే కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇటీవల టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మల్లయ్య యాదవ్కు కేటాయించారు. ముషీరాబాద్ స్థానాన్ని తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి కేటాయించాలని మంత్రి నాయిని మొదటి నుంచి పట్టుబట్టారు. అయితే, అక్కడ ముఠా గోపాల్ అయితేనే.. ప్రభావం చూపగలరని పార్టీ సర్వేలో వెల్లడైందని, అందుకే గోపాల్కు ఆ సీటు కేటాయించామని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. ఆ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ నుంచి అనిల్కుమార్ యాదవ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ముఠా గోపాల్కు ఆ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక కోదాడ సీటు గత శుక్రవారమే పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్కు ఖరారు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న కోదాడలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో బొల్లం మల్లయ్య యాదవ్కు ఆ స్థానాన్ని కేటాయించారు. బర్కత్ పురాలో సోమవారం ఉదయం జరిగే కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్ టిఆర్ఎస్ బిఫామ్ ను ముఠా గోపాల్ తీసుకోనున్నారు. నాయిని ఆశీర్వాదం తీసుకుని సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆధ్వర్యంలో కోదాడ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయన చేస్తారు. -
పబ్లిక్ మేనిఫెస్టో ముషీరాబాద్ నియోజకవర్గం
-
రచనల నుంచి రాజకీయాల్లోకి: బరిలో ప్రముఖ రచయిత్రి
సాక్షి, హైదరాబాద్ : అనతికాలంలోనే తెలుగు సాహిత్యంలో విశేషమైన పేరుప్రఖ్యాతులు సాధించుకున్న కవి, రచయిత్రి మెర్సీ మార్గరేట్. తాను ప్రచురించిన తొలి కవితా సంకలనం ‘మాటల మడుగు’తో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని గెలుపొందారు ఆమె. నిత్యం సాహిత్యంతో మమేకమవుతూ.. తన కవితల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తపిస్తున్న ఆమె మరో మార్పు దిశగా ముందడుగు వేశారు. తెలంగాణలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న వేళ.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు మెర్సీ మార్గరేట్. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. పుట్టిపెరిగింది ముషీరాబాద్లోనే.. ముషీరాబాద్లో పుట్టిపెరిగిన తనకు ఇక్కడి పరిస్థితులు, మురికివాడల్లో నివసిస్తున్న ఇక్కడి నిరుపేద ప్రజల జీవనస్థితిగతులు తెలుసునని మెర్సీ మార్గరేట్ అంటారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చివెళుతున్నా.. నియోజకవర్గంలో పరిస్థితులు మెరుగుపడటం లేదని, సిటీ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితులు దుర్భరంగా ఉండటం తనను కలిచి వేసిందని, ఇక్కడి ప్రజలకు ఏదైనా సేవ చేయాలని, ఇక్కడి పరిస్థితులు మార్చాలనే దృఢ సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ‘నగరంలో చాలామంది ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. ఓటు వేసేవారిలోనూ పలువురు ‘నోటా’ను ఎంచుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో నిస్వార్థంగా సేవ చేస్తారని నమ్మకం కలిగించే నాయకులు లేకపోవడమే ఇందుకు కారణం. చదువుకున్న విద్యావంతులు, సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే.. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు’ అని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అది రాజ్యాంగ నిర్దేశించిన సర్వోన్నతమైన బాధ్యత అని ఓటర్లకు పిలుపునిచ్చారు. సమాజం పట్ల నిబద్ధతతో నిత్యం సాహిత్యంతో మమేకమవుతున్న తాను.. రాజకీయాల్లో మార్పు కోసమే ఎన్నికల బరిలోకి దిగానని, ఓటు హక్కుపై చైతన్యం కలిగించడం, యువత, విద్యావంతులూ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం లక్ష్యంగా ఈ ముందడుగు వేశానని ఆమె తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు, వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషిచేసేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, ప్రజలు తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకముందని మెర్సీ మార్గరేట్ చెప్పారు. -
రోడ్డుపై దున్నపోతుల డిష్యూం..
హైదరాబాద్: రాజధానిలో ఏటా జరిగే సదర్ ఉత్సవాల కోసం హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్నపోతులు షహాన్షా, ధారాలు రోడ్డుపై చిన్నపాటి యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి. దున్నల మధ్య జరిగిన భీకర పోరు నగర వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. దున్నలను చూసేందుకు అక్కడికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ దున్నల పొట్లాటకు ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని సత్తర్భాగ్ వేదికైంది. అనంతరం ఓ దున్న ముషీరాబాద్ ప్రధాన రహదారిపై రాజా డీలక్స్ వరకు పరుగులు తీయడంతో దానిని పట్టుకునేందుకు నిర్వాహకులు చెమటోడ్చాల్సి వచ్చింది. ఘటనలో మహమూద్ అలీ కాన్వాయ్లోని వాహనాల అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. శుక్రవారం (9వ తేదీ) జరిగే సదర్ ఉత్సవాల కోసం 2 భారీ దున్నపోతులు షహాన్షా, ధారాలను ముషీరాబాద్కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ నగరానికి తీసుకువచ్చారు. ప్రదర్శన నిమిత్తం వీటిని గోల్కొండ చౌరస్తా సమీపంలోని సత్తార్బాగ్లో ఉంచారు. మహమూద్ అలీ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సత్తార్బాగ్కు చేరుకుని దున్నలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ధారా, షహాన్షాలను ఒకే చోటకి చేర్చి ప్రేక్షకులు సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఈ రెండు కలిస్తే కొట్లాడుకుంటాయనే విషయం వారికి తెలియదు. ఒక్కసారిగా రెండు దున్నపోతులు బరిలోకి దిగినట్లు కొమ్ములతో బలంగా ఢీకొట్టుకోవడం ప్రారంభించాయి. సమాచారం తెలుసుకున్న దున్నపోతుల నిర్వాహకులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దున్నపోతులు సత్తార్బాగ్ నుంచి రాజా డీలక్స్ వరకు పరుగులు తీశాయి. వాటి అరుపులు, దున్నపోతుల గాంభీర్యం చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వాటి నిర్వాహకులు రాజా డీలక్స్ చౌరస్తా సమీపంలో ఒక దున్నపోతును పట్టుకోగా మరో దున్నపోతును స్థానిక మసీదు వీధిలో పట్టుకున్నారు. -
సమాధానం చెప్పలేకపోతున్నా!
సాక్షి,హైదరాబాద్: ‘యాడికి పోయినా పార్టీ కార్యకర్తలు, శ్రేయోభి లాషులు, బంధువులు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నరు. నువ్వుండగా ముషీరాబాద్ టికెట్ పెండింగ్ల ఎందుకున్నది? సీఎంకు నువ్వు బాగా దగ్గరటగద అని అడుగుతున్నరు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నా. చాలా బాధ అయితున్నది. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా అప్సెట్ అయిండు’అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి కోసం ముషీరాబాద్ టికెట్ ఆశించినా.. ఇప్పటివరకూ ప్రకటించకపోవడంపై ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. గురువారం చిక్కడపల్లిలోని ఓ జిమ్ ప్రారంభానికి అల్లుడి తో కలిసి వచ్చిన నాయిని.. ముషీరాబాద్ టికెట్ విషయంలో మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ 105 సీట్లు ప్రకటించి నెల రోజులైంది. అందులో ముషీరాబాద్ ఎందుకు ఆపారని చర్చ జరుగుతుంది. అమావాస్య తర్వాత ఆపిన 14 సీట్లు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అమావాస్య కూడా అయిపోయింది. ముషీరాబాద్ టికెట్ గురించి నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను’అని నాయిని పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడో మాటిచ్చారు ‘ముషీరాబాద్ గురించి ఆర్గనైజ్ చేసుకోమని సీఎం చాలా రోజుల క్రితమే నాకు చెప్పాడు. ఆయన మాట మీద విశ్వాసంతో.. అల్లుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ కార్యకర్తలను సమీకరించాడు. ఇప్పటికిప్పుడు శ్రీనివాస్ రెడ్డి పిలిస్తే 1000 మంది వచ్చే నెట్వర్క్ తయారైంది. అందుకే సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నాను’అని నాయిని తెలిపారు. కేసీఆర్ కూడా ‘నర్సన్నకు చెప్పు.. ఆయనతో మాట్లాడాకే ముషీరాబాద్ టికెట్ డిక్లేర్ చేస్తా. తొందరపడొద్దు’అని కేటీఆర్ ద్వారా చెప్పించారన్నారు. ఆ తర్వాత రెండుసార్లు కలిసినా.. కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పారన్నారు. ఈమధ్య పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తల్లోనూ తమ పేర్లు కనిపించడం లేదని వాపోయారు. ‘ఈరోజే కాదు.. నాలుగైదురోజుల తర్వాత పేర్లు ప్రకటించినా ఇబ్బందిలేదు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే సంతోషమే. లేకుంటే నేనే పోటీ చేస్తానని చెప్పాను. ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978 నుంచి ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నా. నా కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. మీరు రండి గెలిపిస్తామంటూ అహ్వానిస్తున్నారు’అని నాయిని పేర్కొన్నారు. అప్పుడు ఎల్బీ నగర్ నుంచి.. 2014లో నేను ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే ‘వద్దు నర్సన్నా నిను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్బీ నగర్ నుంచి పోటీచెయ్. సర్వేలో స్థానిక నాయకులకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి’అని కేసీఆర్ అన్నారని నాయిని గుర్తుచేశారు. దానికి సమయం 15 రోజులే ఉంది బాగా డబ్బున్న సుధీర్ రెడ్డి మీద కోట్లాడేంత డబ్బు నా దగ్గర లేదంటే ‘నీ తమ్ముడిని నేనున్నా రూ.10 కోట్లు ఇస్తా పోటీచెయ్’అన్నాడన్నారు. ఎల్బీ నగర్లో పోటీకి విముఖత చూపడంతో.. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లో చోటిచ్చాడని నాయిని చెప్పారు. ‘ఇప్పటికైనా కేసీఆర్ నాకు అనుకూ లంగానే నిర్ణయం తీసుకుంటారనే నమ్మక ముంది. మా ఇద్దరిలో (మామా అల్లుళ్లలో) ఎవరికి అవకాశం ఇచ్చినా.. భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. మంగళవారం కేటీఆర్ను కలిసి కూడా ఇదే విషయం చెప్పాను. సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను. మరో రెండేళ్లపాటు నా ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. దీన్ని ముషీరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వ్యక్తికి ఇచ్చి.. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది’అని ఆయన అన్నారు. అయితే, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. మామా అల్లుళ్లు కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాయిని -
బండారు దత్తాత్రేయ కుమారుడి మృతి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు వైష్ణవ్(21) హఠాన్మరణం చెందారు. ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్న వైష్ణవ్ బుధవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. రాత్రి, 10 గంటలకు భోజన సమయంలో వైష్ణవ్ హఠాత్తుగా కుర్చీలో నుంచి కిందకు కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ముషీరాబాద్లోని గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం దాదాపు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అర్థరాత్రి 12.15 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని దత్తాత్రేయ, ఆయన సతీమణికి వైష్ణవ్ మరణవార్తను కుటుంబ సభ్యులు తెలియనీయలేదు. ఉదయం 5 గంటలకు కుమారుడి మరణ వార్తను విన్న దత్తాత్రేయ కన్నీరు మున్నీరు అయ్యారు. కుమారుడు ఇక లేడని తెలుసుకున్న బండారు శోకసంద్రంలో మునిగిపోయారు. వైష్ణవ్ మృతదేహాన్ని తెల్లవారు జామునే దత్తాత్రేయ ఇంటికి తరలించారు. చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డిలు ఆసుపత్రికి చేరుకొని దత్తాత్రేయ కుటుంబాన్ని పరామర్శించారు . -
ఆస్పత్రిలో గర్భిణి మృతి: బంధువుల ఆందోళన
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన ముషీరాబాద్లో జరిగింది. స్థానిక సాగర్లాల్ ఆసుపత్రిలో రేవతి(26) ప్రసవం కోసం చేరింది. సకాలం లో వైద్యం అందించకపోవడంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతిచెందింది. కోపోద్రిక్తులైన ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. -
రెండేళ్ల బాలుడు అనుమానాస్పద మృతి
-
‘డాన్ శీను’మళ్లీ చిక్కాడు!
⇒కొన్నేళ్ల క్రితం చిరంజీవి ఇంట్లో చోరీకి యత్నం ⇒ఇప్పటి వరకు 21 కేసుల్లో నిందితుడు ⇒తాజాగా ముషీరాబాద్లో రెండో చోరీలు సిటీబ్యూరో: దాదాపు పదకొండేళ్ల క్రితం సినీ నటుడు చిరంజీవి ఇంట్లో చోరీకి యత్నించిన ఘరానా దొంగ కోన శ్రీను అలియాస్ డాన్ శ్రీను మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు ఇళ్లో్లల్లో దొంగనాలకు సంబంధించిన కేసుల్లో ఇతడిని అరెస్టు చేసినట్లు మధ్య మండల డీసీపీ డి.జోయల్ డెవిస్ సోమవారం వెల్లడించారు. ఇతడి నుంచి రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గెడ్డనపల్లికి చెందిన కోన శ్రీను 17 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. దిల్సుఖ్నగర్లోని పీ అండ్ టీ కాలనీలో ఎలక్ట్రీషియన్గా స్థిరపడిన ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చోరీల బాటపట్టాడు. మెగాస్టార్ ఇంటి గోడ దూకి... అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న డాన్ శ్రీనుకు కొన్ని కేసుల్లో న్యాయస్థానం దోషిగా నిర్థారించి జైలు శిక్ష కూడా విధించింది. 2006లో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని సినీ నటుడు చిరంజీవి ఇంట్లో గోడ దూకి లోపలకు ప్రవేశించగా, పెంపుడు కుక్కలు వెంటపడటంతో సెక్యూరిటీ గార్డులు పట్టుకోవడానికి యత్నించారు. దీంతో వారిపై దాడి చేసి పారిపోయేందుకు విఫలయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. గడిచిన 17 ఏళ్లల్లో సరూర్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, గోపాలపురం పోలీసుస్టేషన్ల పరిధిలో 21 నేరా లు చేశాడు. ఇళ్ళల్లో చోరీలతో పాటు వాహనచోరీలు సైతం చేసిన ఇతగాడికి కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలు చేయడం ఇతడి నైజం. చోరీ ‘లగేజీ’తో ఆటోలో.. డాన్ శ్రీను గత నెల 23న ముషీరాబాద్ ఠాణా పరిధిలోని భోలక్పూర్ పద్మశాలి కాలనీలో పంజా విసిరాడు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి దయానంద్ ఇంటిని టార్గెట్గా చేసుకున్న ఇతను పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. 40 అంగుళాల ఎల్ఈడీ టీవీతో పాటు ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, మూడున్నర కేజీల వెండి తదితరాలు ఎత్తుకెళ్లాడు. వీటిని సూట్కేసులు, బెడ్షీట్స్లో నేర్పుగా పార్శిల్ చేసుకున్న శ్రీను వాటిని తరలించడానికి ఆటో వినియోగించాడు. ఇల్లు ఖాళీ చేస్తున్నానంటూ ఆటో డ్రైవర్కు చెందిన శ్రీను రూ.800 కిరాయి చెల్లించి మరీ వాటిని పీ అండ్ టీ కాలనీలోని తన ఇంటికి చేర్చాడు. సొత్తు రికవరీ... అదే ఠాణా పరిధిలోని మరో ఇంట్లోనూ చేతివాటం చూపించిన శ్రీను అక్కడ నుంచి ఓ సెల్ఫోన్ చోరీ చేశాడు. దయానంద్ ఇంట్లో చోరీ కేసును ఇన్స్పెక్టర్ ఎస్.రామ్చంద్రారెడ్డి నేతృత్వంలో డీఐ డి.సంతోష్కుమార్, డీఎస్సై బాల్రాజ్ దర్యాప్తు చేశారు. సోమవారం ఉదయం డాన్ శ్రీనును పట్టుకున్న అధికారులు అతడి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. ఇతడి వద్ద మరో 13 సెల్ఫోన్లు రికవరీ అయినా.. వీటికి సంబంధించి ఎక్కడా కేసులు నమోదు కాలేదు. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెలవుల కోసం ఎక్కడికైనా వెళ్తున్నట్లైతే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ జోయల్ డెవిస్ కోరారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
ముషీరాబాద్: నోట్ల మార్పిడికి యత్నిస్తున్న వ్యక్తులను ముషీరాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్పల్లికి చెందిన బియ్యం వ్యాపారి లక్ష్మణస్వామి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.18లక్షలు సేకరించాడు. ఈ మొత్తాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా తనకు పరిచయస్తుడైన సాయికుమార్ అనే వ్యక్తి ఐదు శాతం కమీషన్ ఇప్పిస్తానని చెప్పడంతో అందుకు లక్ష్మణస్వామి అంగీకరించాడు. దీంతో సాయికుమార్ అజాం అనే వ్యక్తికి ఈ విషయం చెప్పగా, అతను తన స్నేహితులు సయ్యద్ అంజద్, మహ్మద్ నఫీజ్ ఖాన్, అబ్దుల్ విలాయత్తో కలిసి నగదు మార్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వారిని గాంధీనగర్ రమ్మని చెప్పడంతో మంగళవారం లక్ష్మణస్వామి తన స్నేహితుడు నాగేంద్రకుమార్రెడ్డితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ సాయికుమార్ను కలిసి బాకారంలోని ఇంటికి వచ్చి మొదటి అంతస్తులో కుర్చున్నారు. వారి వద్ద కొత్త నోట్లను కొట్టేయాలని పథకం పన్నిన అజాం అతని స్నేహితులు లక్ష్మణస్వామిని మరో ఇంటికి రమ్మని కబురుచేశారు. అక్కడ తెల్ల పేపర్లను కట్చేసి 25కట్టలుగా బ్యాగులో అమర్చారు. లక్ష్మణ స్వామి పాతనోట్లను చూయించాలని కోరగా వారిపై దాడి చేసి డబ్బులను లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారు. ఆ డబ్బును నలుగురు స్నేహితులు పంచుకోగా వారిలో ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రూ. 16లక్షలు రికవరీ చేశారు. రెండు లక్షలతో పరారైన ఆజాం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నకిలీ పోలీసుల ఆటకట్టు అమీర్పేట: రద్దయిన పాతనోట్లు మార్చి ఇస్తామంటూ నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షల దండుకున్న ఇద్దరు నకిలీ పోలీసులను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్కం ట్యాక్స్ అధికారుల అవతారం ఎత్తిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై వీరస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్ఆర్జిల్లా మైదుకూరుకు చెందిన సునీల్, వెంకటసుబ్బయ్య మోతీనగర్లో ఉంటూ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకుగాను వారు నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. ఐడీ కార్డులను కూడా తయారు చేసుకున్నారు. రద్దుచేసిన రూ.500 ,1000 పాత నోట్లను మార్చి ఇస్తామని ప్రచారం చేసుకోవడంతో మరధురానగర్కు చెందిన చంద్రశేఖర్ రూ.10 లక్షలు తీసుకుని వారి వద్దకు రాగా ఐడీ కార్డులు చూపి అతడిని బెదిరించి డబ్బులు తీసుకున్నారు. అంతలో ఇన్కం ట్యాక్స్ అధికారులుగా చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు అక్కడికి రాగా తామే పట్టుకున్నామని డబ్బులు తీసుకుని స్టేషన్ను వెళుతున్నట్లు చెప్పి నలుగురు కలిసి వెళ్లిపోయారు. దీంతో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సునీల్, వెంకట సుబ్బయ్యను అరెస్టు చేసి రూ. 9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
ముషీరాబాద్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
ముషీరాబాద్లో తగ్గని వరద ముంపు
-
భారీ వర్షాలకు కూలిన మసీద్ గోడ,పాత ఇల్లు
-
చిన్నారిని చిదిమేశారా..?
* నాలుగేళ్ల బాలికను దంపతులు చావగొట్టారు: స్థానికులు * కాదు... మెట్లపై నుంచి కింద పడి మరణించింది: దంపతులు * ముషీరాబాద్లో ఘటన హైదరాబాద్: నాలుగేళ్ల పసికందును విచక్షణారహితంగా కొట్టారు. కనికరం లేకుండా మోకాళ్లపై కూర్చోబెట్టి చీపురుతో బాదారు. చిత్రహింసలు భరించలేక చిన్నారి గుండెలవిసేలా ఏడుస్తుంటే... నోరెత్తితే కాలుస్తామంటూ అగ్గిపుల్ల గీసి భయపెట్టారు భార్యాభర్తలు. చివరకు వారి దాష్టీకానికి చిన్నారి బలైన ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మునీర్, లక్ష్మికి ఏడాది క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. ఈ నెల ఒకటిన మోహన్ నగర్లో ఓ ఇంటి మొదటి అంతస్తులో కిరాయికి దిగారు. వీరికి పల్లవి, వెంకట్ అనే భార్యా భర్తలు స్నేహితులు. వీరికి మానస(4) అనే కుమార్తెతో పాటు బాబు కూడా ఉన్నాడు. ఈ రెండు జంటలు ముషీరాబాద్లోని ఆయేషా ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నారు. ఈ పరిచయంతో గతంలో అనేక సార్లు మానసను మునీర్, లక్ష్మి తమ ఇంటికి తెచ్చుకుని కొన్నాళ్లు ఉంచుకుని పంపారు. అలాగే 15 రోజుల క్రితం పాపను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుకున్నారు. మానసకు ఇంట్లోనే మూత్రం, మల విసర్జన చేసే అలవాటు ఉంది. ఈ నెల 16న ఇంట్లోనే మల విసర్జన చేయడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురై వీపరీతంగా కొట్టారు. ఇదేమిటని స్థానిక మహిళలు ప్రశ్నించగా... తల్లి వద్దకు తీసుకెళుతున్నామని చిన్నారిని వెంటబెట్టుకెళ్లారు. 4 రోజుల తరువాత మంగళవారం ఇంటికి తిరిగొచ్చిన భార్యాభర్తలను పిల్ల ఏదని అడిగితే... ఆ రోజు మెట్ల మీద నుంచి కింద పడి తలకు గాయమైందని, చికిత్స పొందుతూ మరణించిందని తాపీగా సమాధానమిచ్చారు. దీంతో స్థానికులు మీరే బాలికను చంపే శారంటూ భర్తను చితక్కొట్టారు. ఈ మేరకు పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక తల్లి కూడా మెట్లపై నుంచి పడటం వల్లే తన కూతురు మరణించిందని చెబుతోంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రత్యేక హోదా కోసం ఆర్.కృష్ణయ్య పోరాటం
ముషీరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ బీసీ సంఘాల సమావేశం ఏపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఆత్మగౌరవ సభకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తెగించి పోరాటం చేస్తామని, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్, బీసీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్, అరుణ్ యాదవ్, కృష్ణ యాదవ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి వీడ్కోలు
ముషీరాబాద్/చిక్కడపల్లి: ప్రముఖ జర్నలిస్ట్, కవి, విప్లవ స్ఫూర్తి ప్రదాత యాదాటి కాశీపతి అంత్యక్రియలు కవులు, కళాకారులు, విప్లవ అభిమానుల అశ్రునయనాల మధ్య ఆదివారం బన్సీలాల్పేట శ్మశాన వాటికలో జరిగాయి. గత గురువారం తుది శ్వాస విడిచిన కాశీపతి భౌతిక కాయాన్ని నిమ్స్ ఆసుపత్రి మార్చురీలో భద్ర పరిచారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తెలు ప్రగతి, వెన్నెలలు నగరానికి చేరుకోవటంతో ఆదివారం ఉదయం కాశీపతి భౌతిక కాయాన్ని గాంధీనగర్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విప్లవాభిమానులు, వివిధ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు నివాళులు అర్పించారు. కాశీపతి జర్నలిస్ట్గా, విప్లవ భావాలతో సమాజాన్ని చైతన్యం చేసిన తీరును ఈ సందర్భంగా కొనియాడారు. భౌతిక కాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కాశీపతి అమర్ రహే అంటూ జోహార్లు అర్పించారు. ఆయనపై విప్లవ గీతాలను ఆలపించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఈడీ రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, మల్లెపల్లి లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావ్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్రావ్, వేములపల్లి వెంకటరామయ్య, పి. రంగారావ్, పి. ప్రసాద్, జేవీ చలపతిరావ్, కె. గోవర్థన్, ఎం. శ్రీనివాస్, సంధ్య, అనురాధ, నరేందర్, పస్క నర్సయ్య, రమ, ఝాన్సీ, జనశక్తి అమర్, అరుణోదయ విమల, గౌతమ్ ప్రసాద్, సత్య, ప్రముఖ కవి జూలూరి గౌరిశంకర్, పాశం యాదగిరి, చండ్ర పుల్లారెడ్డి సతీమణి రాధక్క, కొండేటి మోహన్రెడ్డి, అరుణోదయ రామారావ్, విమల, రాజేందర్ ప్రసాద్, వేణు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, ప్రముఖ జర్నలిస్ట్ పల్లె రవికుమార్, విరసం సభ్యులు రామకృష్ణ, రామ్మోహన్, నారాయణస్వామి, సుధాకిరణ్, రత్నమాల, భారత్ విద్యాసంస్థల ఎండీ సిహెచ్ వేణుగోపాల్రెడ్డి, రచయిత జనజ్వాల, బీసీ మహాజన ఫ్రంట్ నేత యు. సాంబశివరావ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కొలుకలూరి ఇనాక్, బైరాగి మోహన్, పరశురాం, సీపీఎం నాయకులు జి. రాములు, బి.బిక్షమయ్య, అనంతపురం నుంచి ప్రభాకర్రెడ్డి, వినాయక్రెడ్డి, వినయ్బాబు, చెరుకు సుధాకర్, ములగు ప్రసాద్, అంబిక, స్వర్ణ, పశ్య పద్మ తదితరులు నివాళులు అర్పించారు. అంతకంటే ముందు కాశీపతి భౌతికకాయం వద్ద అరుణోదయ రామారావ్ తదితరులు డప్పుకొట్టి పాటలు పాడుతూ ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం బౌతిక కాయాన్ని బన్సీలాల్ పేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశాన వాటికలో జరిగిన సంతాప సభకు న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వై. కొండయ్య అధ్యక్షత వహించగా పలువురు ప్రసంగించి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు. -
కేంద్రమంత్రిని ఆకర్షించిన రజాక్
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఉపాధ్యాయులకు సూచించారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మైనారిటీ విద్యార్థులతో శనివారం మాటామంతీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పినపుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. విద్యార్థులతో మాటామంతీ అంతకుముందు మంత్రి ప్రకాశ్ జవదేకర్ విద్యార్థులతో మాట్లాడారు. అబ్దుల్ అనే విద్యార్థి తాను వాలీబాల్ బాగా ఆడతానని అనగా.. స్పోర్ట్స్ చానల్స్ చూసి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. చాలా దూరం నుంచి వచ్చే విద్యార్థులు ఎవరని మంత్రి ప్రశ్నించగా జుబేదా, సమీరా తాము చాలా దూరం నుంచి నడిచి వస్తామని చెప్పారు. తాను కూడా చిన్నపుడు స్కూల్కు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంగ్లిష్ అంటే ఇష్టమన్న రజానాకు.. రోజూ రెండు ఇంగ్లిష్ పేపర్లు చదవాలని, ఇంగ్లిష్ టీవీ చానల్స్ చూడాలని సూచించారు. సంగీతమంటే ఇష్టమని చెప్పిన గౌసియా బేగంను పాడమని కోరగా.. ఆ విద్యార్థిని ‘దిల్ దియా హై.. ఏ వతన్ తేరే లియే’ పాట వినిపించింది. సయ్యద్ రజాక్ అనే విద్యార్థి కేంద్ర మంత్రి దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు. మల్కాజ్గిరి నుంచి స్కూల్కు రోజూ 7 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి వచ్చే రజాక్ను భవిష్యత్లో ఏం చేస్తావని ఆయన అడిగారు. ‘మా బస్తీలో చదువుకోలేని వారికి చదువు చెప్తానని... ప్రస్తుతం నా స్నేహితుడు షరీఫుద్దీన్కు చెబుతున్నా’నని అన్నాడు. రజాక్ను అభినందించిన మంత్రి.. ‘మళ్లీ వచ్చి నిన్ను కలుస్తా’నని విద్యార్థికి చెప్పారు. -
డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కాదని ఉద్యమంలోకి..
ముషీరాబాద్: యాధాటి కాశీపతి చదువు పూర్తి చేసిన తరువాత డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరడానికి ముందు విజయవాడలో ఉన్న చండ్రపుల్లారెడ్డిని కలిసి వెల్దామని నాయకులు పేర్కొన్నారు. అన్నా.. నాకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని చెప్పగా మనకు కావాల్సింది కలెక్టర్ కాదు... కామ్రేడ్ అని వారు చెప్పగా.. మరో మాట మాట్లాడకుండా వచ్చిన కారును పంపించి విప్లవ ఉద్యమానికి అంకితమయ్యారు కాశీపతి. ఆనంతపురానికి చెందిన కాశీపతి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ(జర్నలిజం) చేశారు. అంతేకాక గోల్డ్ మెడల్ను కూడా సాధించారు. తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో 1967 నుండి విప్లవ ఉద్యమంలో పని చేశారు. సీపీఐఎంఎల్ ఏర్పడక ముందు కో–ఆర్టినేషన్ కమిటీలో, చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో సీపీఐఎంఎల్లో చురుకైన పాత్ర పోషించారు. రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్లు బూటకపు ఎన్కౌంటర్లో పోలీసులు చంపినప్పుడు ఆయన ‘ఉయ్యాలో...జంపాలో’ అనే పాట రాసి తనలో గొప్ప కవి కూడా ఉన్నాడని నిరూపించారు. అంతే కాకుండా పీడీఎస్యూ సంస్థ గీతం ‘ బిగించిన పడికిలి –పీడీఎస్యూ చిహ్నం’ పాటను కూడా రాశారు. 1972లో గుంటూరులో జరిగిన విరసం మహాసభల్లో కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. భారత చైనా మిత్ర మండలి, ఎపీసీఎల్సీ వ్యవస్థాపకుల్లో కాశీపతి ఒకరు. వేలాది మందికి పండు ఒలిచిపెట్టినట్లుగా రాజకీయ అర్థశాస్త్రాన్ని బోధించడంలో ఆయనకు ఆయనే సాటి. చండ్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, రామనర్సయ్య తదితర ఎంతో మంది విప్లవ కారులతో పని చేసిన అనుభవం అయనది. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలల పాటు ముషీరాబాద్లో జైలు జీవితం గడిపారు. జైల్లో ఈయనతో పాటు ఉన్న వరవరరావు, ఇతర ముఖ్యనేతలేందరికో రాజకీయ తరగతులను బోధించారు. సీపీఐఎంఎల్ పార్టీ తరపున సిరిసిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు. శ్రీశ్రీ కవిత్వం ఎప్పుడూ కాశీపతి పెదాలపై ఆడుతూ ఉండేది. శ్రీశ్రీ చలసాని తరువాత చెప్పే పేరు కాశీపతి. తెలుగు సమాజానికి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ విప్లవ బుద్ధి జీవులను పరిచయం చేసిన వ్యక్తి కాశీపతి. 1978లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అక్కడే పాటలు పాడే ఓ గిరిజన యువతిని పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్యం క్షిణించిన తరువాత పార్కిన్స్సన్ వ్యాధితో బాధపడుతూనే ‘ మధ్యతరగతి మందుహాసం’ అనే పుస్తకాన్ని శ్రీశ్రీ సాహిత్యంపై విమర్శనాత్మకంగా రాయడం అయనేకే చెందింది. పార్టీ పత్రిక ‘విమోచన’కువర్కింగ్ ఎడిటర్గా 1977 నుంచి 1979 వరకు పని చేశారు. విప్లవ ఉద్యమం 1980 దశకంలో విప్లవ నాయకుడు సత్యనారాయణ సింగ్ ఉపాన్యాసం, దానిని తెలుగులో తర్జుమా చేసే కాశీపతి మాట, అరుణోదయ రామారావు పాటలు, సభలుసమావేశాల్లో ఉర్రూతలూగించాయి. పెదవుల మధ్య సిగరెట్ పెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉంటే లయబద్దంగా కదిలే సిగరెట్, తూటాల్లాంటి మాటలు అప్పటి పాతతరం విప్లవాభిమానులకు నేటికీ గుర్తుంటాయి. తరువాత కాలంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఆంధ్రప్రభ, వార్తలలో 20 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. కలర్ చిప్స్లో కొంత కాలం పని చేశారు. ఆనంతరం అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచారు. ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి రాసినట్లు కాశీపతి కూసేపతి అన్నాడంటే ఆయన ఉపన్యాసం, వాగ్దాటి ఎంత గంభీరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కూత నేర్పినవాడు, రాత నేర్పిన వాడు సీతాకోకచిలుకలాంటి వాడు, వేలాది మందిని కదిలించినవాడు కాశీపతి అంటూ అరుణోదయ కళాకారులు ఆయనకు కితాబునిచ్చారు. -
20 పాములకు విముక్తి
ముషీరాబాద్: నాగ పంచమి సందర్భంగా పాములను పట్టే వారి నుంచి అటవీ శాఖ సహకారంతో వివిధ ఎన్జీఓ సభ్యులు దాదాపు 20 తాచు పాములను అటవీశాఖకు అప్పగించారు. నగరంలోని హయత్నగర్, చింతలబస్తీ, కాచి గూడ, కామారెడ్డి, వరంగల్ తదితర ప్రాంతాలలో ఈ పాములను రక్షించారు. పాములను కొద్ది రోజుల ముందే పట్టుకుని కోరలు పీకి బంధిస్తారని ఎన్జీవో నిర్వాహకులు మహేష్ అగర్వాల్, అవినాష్ తెలిపారు. నాగ పంచమి రోజు పాములను బయటకు తీయడంతో ఇన్ని రోజులు దాహంతో ఉన్న పాములు పాలు పోయగానే వాటిని తాగుతాయని తెలిపారు. ఈ విధంగా పాములను హింసకు గురిచేస్తున్న వారిని గుర్తించి, వారి వద్ద నుంచి పాములను స్వాధీనం చేసుకుని మళ్లీ అడవుల్లోకి వదిలివేసినట్లు తెలిపారు. భక్తులకున్న విశ్వాసాన్ని ఇలా సొమ్ముచేసుకుంటారన్నారు. -
జనపథం - ముషీరబాద్
-
కుక్కలను కాల్చేశారు..
హైదరాబాద్ : పైశాచికానందం కోసం విశ్వాసానికి మారుపేరైన శునకాలను కర్కశంగా చంపుతున్నారు. ఇటీవల హైదరాబాద్లోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధి లో కొందరు యువకులు కుక్క పిల్లల్ని సజీవ దహనం చేసి.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని మరువకముందే మరో ఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఓ టెక్స్టైల్స్ కంపెనీలో ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. హైదరాబాద్కు చెందిన గోల్కొండ టెక్స్టైల్స్ యజమానులు బాబా, మహమ్మద్ అలీఖాన్ అన్నదమ్ములు. మహమ్మద్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ ... అతని స్నేహితులతో కలసి రెండు రోజుల కిందట వీధి కుక్కలను పట్టుకున్నాడు. టెక్స్టైల్స్ కంపెనీ గేటు వద్ద ఒక శునకాన్ని, కంపెనీ లోపల మరో మూడు శునకాలను గన్ తో కాల్చి చంపారు. కొన్నింటిని ఓ పెద్దమంట పెట్టి అందులో సజీవ దహనం చేసిన ఆనవాళ్లు కనిపిం చారుు. శునకాలను చంపుతూ వీడియోలు తీసి తర్వాత సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. శనివారం ఈ విషయం గుర్తించిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ.. జంతు ప్రేమికురాలు అమలకు సమాచారం ఇవ్వడంతో ఆమె డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న టెక్స్టైల్స్ కంపెనీ సిబ్బంది... శునకాలను చంపిన ప్రదేశాల్లో ఇసుక పోసి కప్పెట్టారు. కాగా, దాదాపు ఎనిమిది మంది కలసి శునకాలను చంపినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన డీఎస్పీ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి, చేవెళ్ల సీఐ ఉపేందర్, వికారాబాద్ సీఐ రవి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుక్కలను చంపినట్లు ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేవని, విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు. -
ముషీరాబాద్లో యువకుడి అదృశ్యం
హైదరాబాద్ : ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్లో నివాసముంటున్న జహంగీర్(28) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన జహంగీర్ ఆచూకీ ఇంత వరకూ తెలియరాలేదు. బంధువుల ఇళ్లు, తెలిసిన వాళ్ల ఇళ్ల దగ్గర వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు గురువారం ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాగే సంవత్సరం క్రితం కూడా జహంగీర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు వెతకడంతో వరంగల్లో అప్పుడు ఆచూకీ లభించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా'
మహిళలు 'మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నట్లే పురుషులు కూడా పురుష దినోత్సవం నిర్వహించుకునేలా చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆ రోజున తమ ఇబ్బందులు, కష్టాలను చర్చించుకునే అవకాశం దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 'మహిళా ఉపాధ్యాయ సదస్సు'లో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మగవాళ్లంతా చూసి గర్వం అనుకుంటున్నారని... కాలు మీద కాలు వేసుకునేది గర్వంతో కాదు, కాళ్లు నొప్పులతోనేనని సరదాగా చమత్కరించారు. -
కూచిపూడి కళాకారుడికి కుచ్చుటోపీ
- బంగారు నగలు ఎరగా వేసి రూ.7.5 లక్షలు కాజేసీన సైబర్ నేరగాళ్లు సాక్షి, సిటీబ్యూరో: ఆయనో కూచిపూడి నత్య కళాకారుడు. దేశదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి పేరు తెచ్చుకున్నారు. సొంతంగా వెబ్సైట్ ఏర్పాటుచేసుకుని అందులో తన ప్రదర్శన వివరాలు, సంప్రదింపుల కోసం ఫోన్ నంబర్లు ఉంచారు. అదే ఆ కళాకారుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. సైట్ లో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ చీటింగ్ ముఠా ఆయనపై వలపన్నింది. బంగారు నగలు అమ్ముతామంటూ ఎరవేసి, ఆపై కేసులంటూ భయపెట్టి, చివరికి పన్నుల పేరుతో రూ.7.5 లక్షల కాజేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రై మ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన సుధాకర్రెడ్డి కూచిపూడి నత్య కళాకారుడు. యువతిగా అలంకరించుకుని అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన పలు బహుమతులు, అవార్డులు సైతం పొందారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతో ఇంటర్నెట్లో సొంతంగా ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. అందులో తన కాంటాక్ట్ నెంబర్ కూడా పొందుపరిచారు. ఇదిలా ఉండగా సుధాకర్రెడ్డికి దాదాపు నెల రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. తాము లండన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన అవతలి వ్యక్తులు.. వెబ్సైట్లో ఫొటోలు, వీడియోలు చూశామంటూ పొగడ్తలతో ముంచెత్తారు. పుత్తడిబొమ్మలా ఉండి, అద్భుతంగా నత్యం చేస్తున్న మీతో యూకేలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని, అలంకరించుకోవడానికి కొన్ని నగలు పంపిస్తామని ఎరవేశారు. దీంతో కాస్త కంగుతిన్న సుధాకర్రెడ్డి... తాను పురుషుడినని, నగలు ఎందుకంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ మాట వినటంతోనే సర్దుకున్న అవతలి వ్యక్తులు... తాము కళాకారులకు పంపుతున్నామని, ఇందులో స్త్రీ, పురుష భేదం లేదంటూ సరిచేసుకున్నారు. యూకేలో ఈవెంట్ పేరుతో కొన్ని రోజుల పాటు ఫోన్లు, వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిగాయి. యూకేలో జరిగే ఈవెంట్లో తాము ఇచ్చిన నగలనే ధరించి నత్యం చేయాలంటూ నమ్మబలికారు. ఓ రోజు హఠాత్తుగా నగలతో పాటు ఆ బాక్సులో 35 వేల పౌండ్లు సైతం పెట్టి పంపించామంటూ సుధాకర్రెడ్డికి వర్తమానం పంపారు. ఇది జరిగిన మరుసటి రోజే కస్టమ్ అధికారిణి అంటూ ఓ యువతి ఫోన్ చేసింది. మీకు లండన్ నుంచి నగలతో పాటు కొన్ని పౌండ్లతో కూడిన పార్శిల్ వచ్చిందని చెప్పింది. పన్నుల పేరుతో అందినకాడికి... ఈ రకంగా విదేశాల నుంచి అక్రమంగా రావడం కస్టమ్స్ నిబంధనలకు విరుద్ధమని, ఈ నేపథ్యంలోనే మీపై కేసు నమోదు చేయనున్నామంటూ భయపెట్టింది. అలా కాకుండా ఉండాలంటూ దాదాపు రూ.కోటి విలువైన నగదు, పౌండ్లకు సంబంధించి రూ.4.5 లక్షల పన్ను కట్టాలంటూ ఓ బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పింది. ఆందోళనకు లోనైన సుధాకర్రెడ్డి ఆ మహిళ చెప్పినట్లు నగదు డిపాజిట్ చేశారు. ఆ తరవాత మళ్ళీ సంప్రదించిన యువతి ఎఫ్బీఐ, ఆర్బీఐ క్లియరెన్స్ల పేరుతో మరో రూ.3 లక్షల వరకు దఫదఫాలుగా డిపాజిట్ చేయించుకుంది. చివరకు సమాధానం సైతం లేకపోవడంతో తాను మోసపోయినని గుర్తించిన బాధితులు శుక్రవారం సైబర్ క్రై మ్ ఏసీపీ ఇస్మాయిల్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఉత్తరాదికి చెందిన నైజీరియన్ల పనిగా అధికారులు భావిస్తున్నారు. ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థినిని వేధిస్తున్న మెకానిక్ అరెస్ట్
ముషీరాబాద్ : ప్రేమపేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిని ముషీరాబాద్ పోలీసులు రిమాండ్కు పంపారు. ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోలక్పూర్ డివిజన్ ఇందిరానగర్లో నివసించే నంది సురేష్(21) స్కూటర్ మెకానిక్గా పని చేస్తున్నాడు. ఇంటి పక్కనే నివసించే విద్యార్థినిని ప్రేమించాలని నాలుగు నెలలుగా వెంటపడుతున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు నానమ్మకు తెలిపింది. ఆ యువకుడిని పిలిచి మందలించగా నానమ్మ దేవమ్మను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. దీంతో దేవమ్మ గురువారం ముషీరాబాద్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
పుస్తెల తాడు, గొలుసు అపహరణ
చిక్కడపల్లి (హైదరాబాద్) : చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన అనసూయ(53) మంగళవారం ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆమె రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని ఆరు తులాల పుస్తెల తాడు, గొలుసును తెంపుకుని పార్శీగుట్ట వైపు పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. -
ఇల్లు మారలేదని ఇల్లాలు ఆత్మహత్య
చిక్కడపల్లి (హైదరాబాద్) : ఇల్లు మారదామంటే భర్త ఒప్పుకోలేదనే మనస్తాపంతో నాలుగు నెలల పసిపాపతో సహా ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్లో మంగళవారం జరిగింది. ముషీరాబాద్లో నివాసం ఉంటున్న సాయికుమార్ భార్య శ్వేత(26) పుట్టింటి నుంచి సోమవారమే భర్త వద్దకు వచ్చింది. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉంటే ఒంటరిగా అనిపిస్తుందని వేరే ఇల్లు మారదామని భర్తను అడిగింది. అయితే అందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె నాలుగు నెలల పసిపాప ఐశ్వర్యపైనా, తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. సంఘటనా స్థలంలోనే తల్లీబిడ్డా చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యంత్రమా నిన్ను నడిపేదెవరూ?
హైదరాబాద్: ఒకరేమో లేక బాధపడితే.. మరొకరికి అజీర్తి చేసిందన్నట్లుంది జీహెచ్ఎంసీ ముషీరాబాద్ డివిజన్ అధికారుల తీరు. సిటీలో చాలా డివిజన్లకు సరైన యంత్రాలు లేక అభివృద్ధి పనుల నిర్మాణం, నిర్వహణలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు కేటాయించిన కొత్త రోలర్ ను ఉపయోగించుకోలేక.. కనీసం ఆ యంత్రానికి రక్షణ కల్పింలేకపోతున్నారు. సిటీలోని అత్యంత చెత్త డివిజన్లలో ఒకటైన ముషీరాబాద్ కు ప్రభుత్వం ఇటీవలే రూ. 3.4 లక్షల విలువ చేసే మినీ రోలర్ ను అందించింది. భోలక్ పూర్, కవాడిగూడ, ముషీరాబాద్, రాంనగర్ డివిజన్లలో రోడ్డు తాత్కాలిక మరమ్మతులు, రోడ్లపై మట్టి పోసి అణగదొక్కడం వంటి పనులు చేయాల్సిన ఈ యంత్రం.. ప్రస్తుతం కార్యాలయం ముందు నిరుపయోగంగా పడిఉంది. ఆరాతీయగా, ఈ యంత్రాన్ని నడపగలిగే సామర్ధ్యం అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగులకు లేదని, కొత్తగా రోలర్ ఆపరేటర్ ను నియమించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తెలిసింది. సరే, ఆపరేటర్ వచ్చినా, రాకున్నా కొత్త వాహనానికి కనీస రక్షణ ఏర్పాట్లు కూడా చేయకుండా అలా వదిలేశారు అధికారులు. దీంతో రోలర్ వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ తుప్పుపట్టే స్థితికి చేరుకుంది. ఇకనైనా రోలర్ కోసం చిన్న షెడ్డు లాంటిది ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా ఆపరేటర్ ను నియమించి రోడ్లపై గుంతలు పూడ్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎన్ఆర్ఐపై దాడి, ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
-
ఖాకీ దాష్టీకం...
-
యువజన కాంగ్రెస్లో ఎన్నికల రగడ
* సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రోజుకో వివాదం * గురువారం నల్లకుంటలో మాజీ ఎంపీ అంజన్ కుమారుడు, మరోవర్గం బాహాబాహీ * ఎన్ కన్వెన్షన్ ఘటనకు సంబంధించి విష్ణువర్ధన్రెడ్డి అరెస్ట్కు పోలీసుల యత్నం * అజ్ఞాతంలోకి వెళ్లి.. ముందస్తు బెయిల్కు యత్నం సాక్షి, హైదరాబాద్: యువజన కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికల వ్యవహారం రోజుకో కొత్త జగడానికి వేదికవుతోంది. యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అంశమే ఇటీవల కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఘర్షణకు దారితీయగా... గురువారం హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోకజవర్గంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు అంశంలో స్థానిక నాయకుడు విజయ్యాదవ్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడు అనిల్కుమార్ మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి. దీనిపై సమాచారం అందిన నల్లకుంట పోలీసులు.. అనిల్కుమార్ సహా మరికొందరిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో అంజన్కుమార్ యాదవ్తో పాటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో హడావుడి, హంగామా నెలకొంది. నేతలతో పాటు పోలీసులు కూడా ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి అక్కడే తాత్కాలికంగా రాజీ కుదిర్చారు. లోకాయుక్తలో కేసులు వెనక్కి తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. యువజన కాంగ్రెస్లో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ రెండు వేర్వేరు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరో మూడు నెలల్లో జరిగే యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేసే లక్ష్యంతో అనిల్కుమార్ తన అనుచరులతో సభ్యత్వ నమోదు చేపట్టారు. మరోవైపు వంశీచంద్రెడ్డి తనవైపు నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ వర్గీయులు విష్ణువర్ధన్రెడ్డి, అంజన్ అనిల్కుమార్యాదవ్ల వ్యతిరేక శిబిరాలను చేరదీసి సభ్యత్వ నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ వ్యతిరేకులను వంశీచంద్రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహంతో.. విష్ణువర్ధన్రెడ్డి ఆయనపైనే దాడికి పాల్పడ్డారని, నల్లకుంటలోనూ విజయ్, అనిల్ వర్గాల మధ్య ఘర్షణకు కారణమని యువజన కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వంశీచంద్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి మధ్య ఘర్షణలో తప్పు విష్ణుదేనని నిర్ధారించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విష్ణు... ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
తెలంగాణ వీరస్వామికి కన్నీటి వీడ్కోలు
ముషీరాబాద్: కాలేయ సంబంధిత వ్యాధితో సోమవారం మరణించిన తెలంగాణ వీరస్వామి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ వాదులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య పార్శిగుట్ట శ్మశానవాటికలో జరిగాయి. అంతకుముందు రాంనగ ర్ డివిజన్ హరినగర్లోని వీరస్వామి నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, గ్రేటర్ చైర్మన్ శ్రీధర్, టీజీవో నాయకులు ఎంబీ కృష్ణయాదవ్, ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం.నర్సయ్య, గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రాజ్కుమార్, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ కల్పనా యాదవ్, సీపీఎం నాయకులు శ్రీనివాస్, శ్రీనివాసరావు, న్యూ డెమోక్రసీ నాయకులు అరుణోదయ రామారావు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్సీపీ రాంనగర్ డివిజన్ కన్వీనర్ నర్సింగ్, దోమలగూడ డివిజన్ కన్వీనర్ శ్రీనివాస్, గాంధీనగర్ డివిజన్ కన్వీనర్ డికె.శ్రీనివాస్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. -
తల్లీ కూతుళ్ల బలవన్మరణం
ఘట్కేసర్/బచ్చన్నపేట : ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఓ తల్లి.. తన కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్కు అర కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథ నం ప్రకారం.. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్నగర్కు చెందిన స్వప్న(25)కు కూతురు శాన్వీ(3), కుమారుడు శ్యాం ఉన్నారు. వీరు హైదరాబాద్లోని ముషీరాబాద్లో నివసిస్తు న్నారు. సోమవారం స్వప్న తన కూతురితో కలిసి ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఇదిలాఉండగా సాయంత్రం ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర రైల్వే ట్రాక్పై తల్లీకూతురు విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహిళ శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి. ముఖం గుర్తించలేని స్థితిలో ఉంది. చిన్నారికి కూడా గాయాలు ఉన్నాయి. దీంతో తల్లీకూతుళ్లు గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామారావు తెలిపారు. -
అదృశ్యమైన తల్లీకూతురు ఆత్మహత్య
-
అదృశ్యమైన తల్లీకూతురు ఆత్మహత్య
హైదరాబాద్: ముషిరాబాద్ నుంచి అదృశ్యమైన తల్లీకూతురు స్వప్న, శాన్వి శవాలుగా దొరికారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ సమీపంలోని యమునం పేట వద్ద రైలు పట్టాలపై వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమార్తెతో కలిసి స్వప్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల కుమారుడి ఇంట్లోనే వదిలేసి 20 నెలల కుమార్తెతో కలిసి ఆమె ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. స్వప్న ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం స్పప్నకు వివాహమైంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని, ఎటువంటి గొడవలు పడేవారు కాదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
కాళ్లపారాణి ఆరకముందే..
ముషీరాబాద్ : అనుమానాస్పదస్థితిలో ఓ నవవధువు మృతిచెందింది. కాళ్లపారాణి ఆరకముందే కూతురు మృతి చెందడంతో తల్లిదండులు కన్నీరుమున్నీరయ్యారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, బంధువుల కథనం ప్రకారం... తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఆవుల శంకర్కు నార్కట్పల్లికి చెందిన లక్ష్మీప్రసన్న (21)తో 2014, మే 11న పెళ్లైంది. కట్నకానులకు కింద మొత్తం రూ.14.5 లక్షలు ముట్టజెప్పారు. శంకర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్. నవదంపతులు రాంనగర్ రామాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కాపురం పెట్టారు. ఆ ఇంట్లో పది రోజులు ఉన్నాక.. చుట్టుపక్కల వారు ఆ ఇంట్లో గతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇదే సమయంలో తమకు ఎప్పుడో ఏదో ఆందోళనగా ఉంటోందని, భయమేస్తోందని చెప్పిన భార్యాభర్త.. ఆ ఇంటిని ఖాళీ చేసి బర్కత్పురలో ఉంటున్న లక్ష్మీప్రసన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ పది రోజులుండి ఆదివారం మధ్యాహ్నం రాంనగర్లో గతంలో తాముండే ప్రాంతంలోనే మరో ఇంట్లో అద్దెకు దిగారు. రాత్రి పది గంటల వరకు సామగ్రి సర్దుకొని పడుకున్నారు. రాత్రి ఒంటి గంటకు, మళ్లీ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య మూత్ర విసర్జనకు లేవడంతో ఆమెను బాత్రూంకు తీసుకెళ్లాడు. అయితే కొద్దిసేపటికి లక్ష్మీప్రసన్న అపస్మారకస్థితికి జారుకోవడంతో భర్త వెంటనే అమ్మమ్మకు, మేనమామకు ఫోన్ చేసి సమీపంలోని ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిక్కడపల్లి ఏసీపీ అమర్కాంత్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీప్రసన్న మృతి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ముషీరాబాద్ పోలీసుస్టేషన్కు, గాంధీ మార్చురీకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీపీఐ నాయకుడి భార్యపై దాడి
హైదరాబాద్ : సీపీఐ రాష్ట్రా నాయకుడు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు, రచయిత కందిమళ్ల ప్రతాప్ రెడ్డి సతీమణి సావిత్రిపై నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. రాంనగర్ డివిజన్ రిసాల కుర్షిద్జాహిలోని తన నివాసంలో రాత్రి తొమ్మిది గంటల సమయంత ఆమె వంట చేస్తుండగా బయట కాలింగ్ బెల్ మోగింది. వచ్చి తలుపు తీసేసరికి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు తమ వెంట తెచ్చుకున్న చున్నీని సావిత్రి ముఖంపై కప్పారు. ఈ క్రమంలో తీవ్ర పెనుగులాట జరిగింది. సావిత్రి గట్టిగా కేకలు వేసి భర్తను పిలవటంతో ప్రతాప్ రెడ్డి బెడ్రూమ్ నుంచి వచ్చేసరికి దుండగులు బయటికి పరుగెత్తుకుంటూ తమ ద్విచక్రవాహనంపై పారిపోయారు. వీరు దొంగతనం కోసం వచ్చారా లేక హత్యాయత్నానికి ఒడిగట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముషీరాబాద్, చిక్కడపల్లి పీఎస్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. -
టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
-
ముషీరాబాద్లోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : ముషీరాబాద్లోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డిపోలో నిల్వ ఉంచిన కలప తగలబడుతోంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సమీపంలోని భవనాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి అయిదు గంటలు గడిచినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 2 కోట్ల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. దాంతో స్థానికులు టింబర్ డిపోను అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేసినా టింబర్ డిపో యజమాని మాత్రం పట్టించుకోలేదు. తరచు అగ్నిప్రమాదాలు జరగటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రాజధానిలో పసికందు కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని ఫరా మెటర్నిటీ ఆస్పత్రి నుంచి ఐదు రోజుల పసికందు అపహరణకు గురైంది. ఇదివరకే పసిపిల్లలను ఎత్తుకుపోయిన హసీనా, జరీనా అనే ఇద్దరు మహిళలే ఈ చిన్నారిని కూడా అపహరించినట్లుగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. భోలక్పూర్ పద్మశాలి కాలనీకి చెందిన షేక్ సిద్ధిక్ భార్య రెహనా బేగం ఈనెల 7న ఫరా మెటర్నిటీ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే, సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో బురఖాతో ఉన్న ఒక మహిళ రెహనా ఉన్న వార్డులోకి వచ్చి ఆమెను పలకరించింది. కొద్దిసేపు అక్కడక్కడే తచ్చాడి, రెహనా నిద్రలోకి జారుకున్న సమయంలో చిన్నారిని తీసుకుని పరారైంది. కొద్దిసేపటికి చిన్నారి లేకపోవడాన్ని గమనించిన రెహనా బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రి పక్కన నివసించే స్థానికురాలు ఒకరు.. ఓ మహిళ పాపను తీసుకువెళుతుండగా చూసినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా.. అనుమానితురాలి ఊహాచిత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే, భోలక్పూర్లో గత సంవత్సరం షకీల్ అనే వ్యక్తి కూతురును హసీనా, జరీనాలు కిడ్నాప్ చేసి తీసుకువెళుతూ పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసినా.. ఇరువర్గాలు రాజీకి వచ్చి లేఖ రాసివ్వడంతో వదిలేశారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన ఊహాచిత్రాన్ని చూసిన షకీల్.. అప్పట్లో తన కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించినవారిగా గుర్తుపట్టాడు. దాంతో పోలీసులు నల్లగుట్టలోని ఆ మహిళల ఇంటికి వెళ్లగా వారు అప్పటికే.. హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్లో ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది. పోలీసులు ఆ మహిళ భర్త, కుమారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కుటుంబం రేషన్కార్డులో ఉన్న మహిళలను చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా వారిని కిడ్నాపర్లుగా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ముషీరాబాద్ పోలీసులు సోమవారం రాత్రి ముంబైకి బయలుదేరినట్లు సమాచారం. కాగా.. పాప తల్లిదండ్రులు తమకు పుట్టిన ఐదో సంతానాన్ని తమ బంధువులకు ఇస్తామని చెప్పినట్లు తెలియడంతో.. ఆ దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పాప కిడ్నాప్ విషయంలో ఆసుపత్రి వైఫల్యం లేదని ఫరా ఆసుపత్రి యజమాని డాక్టర్ ఫరేన్ఖాన్ పేర్కొన్నారు.