భర్త వేధింపులు తాళలేక | Husband Has Been Forced To Leave The Harassment Death Women | Sakshi

భర్త వేధింపులు తాళలేక

Apr 18 2018 7:03 AM | Updated on Apr 18 2018 7:03 AM

Husband Has Been Forced To Leave The Harassment Death Women - Sakshi

ఆత్మహత్య  చేసుకున్న నాగలక్ష్మి

ఆస్పరి : మండల కేంద్రంలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణం పొందింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వివరాల మేరకు..మండల కేంద్రానికి చెందిన మహానందికి ఆదోని మండలం బసరకోడుకు చెందిన నాగలక్ష్మి(25)తో ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన ఆరు నెలల పాటు వీరి సంసారం సాఫీ జరిగింది. ఆతర్వాత అతడు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో పెద్ద మనుషులు సర్దిచెప్పి పంపారు. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైంది. ఈక్రమంలో గుడిసె పైకప్పునకు ఉన్న ఇనుప దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  మృతురాలి  తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు భర్త, అత్త చిట్టెమ్మ, మరిది రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement