హత్య కేసులో ఏడుగురికి జీవితఖైదు | life imprisonment to seven people | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఏడుగురికి జీవితఖైదు

Published Mon, Feb 12 2018 7:45 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

life imprisonment to seven people - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమగోదావరి జిల్లా : ఏలూరులో 2012 జరిగిన ఓ హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ సోమవారం జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. ఏలూరుకు చెందిన బొట్ట గంగాధర్‌ని 2012  ఏలూరు నగరం కొత్తపేట చేపలతూము సెంటర్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో కేసు 6 ఏళ్లు నడిచిన తర్వాత తీర్పు వెలువడింది. 

 నేరం రుజువు కావడంతో కంచి మురళీకృష్ణ అలియాస్ చిన్నికృష్ణ, మీసాల దుర్గారావు, చిట్టి ప్రసాద్, మొహమ్మద్ జానీ బాషా, కత్తెర సతీష్, కేంగం గణేష్, రాంమోహన్ రావు అనే ఏడుగురికి సోమవారం మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి జి. గోపి  జీవిత ఖైదు  విధించారు. అలాగే రూ.1000 జరిమానా విధించారు.  ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగింది. మరో వర్గానికి చెందిన 14 మందికి ఇదివరకే జీవితఖైదు విధించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement