బాలికపై అకృత్యం; పబ్లిక్‌ టాయిలెట్‌లో.. | Maharashtra Nine Year Old Girl Body Found in Public Toilet | Sakshi
Sakshi News home page

బాలికపై అకృత్యం.. పబ్లిక్‌ టాయిలెట్‌లో శవం

Published Sat, Apr 6 2019 6:42 PM | Last Updated on Sat, Apr 6 2019 6:44 PM

Maharashtra Nine Year Old Girl Body Found in Public Toilet - Sakshi

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడు ఆమె శవాన్ని..

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడు ఆమె శవాన్ని పబ్లిక్‌ టాయిలెట్‌లో పడేసి అమానుషంగా ప్రవర్తించాడు. ముంబైలోని నెహ్రూ నగర్‌ విలే పార్లే రైల్వేస్టేషను సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషనుకు చేరుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

ఈ ఘటన గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ..‘ నెహ్రూ నగర్‌లోని చాల్‌కు చెందిన బాలిక గురువారం నుంచి కనపడకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు జుహు పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నెహ్రూ నగర్‌లోని ఓ పబ్లిక్‌ టాయిలెట్‌లో బాలిక శవం లభించడంతో అక్కడికి చేరుకున్నాం. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. బాలికపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. అతడిపై హత్యా, అత్యాచార, కిడ్నాప్‌ కేసులతో పాటుగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement