విద్యుదాఘాతంతో యువకుడి మృతి  | Man died by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి 

May 28 2018 2:17 PM | Updated on Sep 5 2018 4:17 PM

Man died by electric shock - Sakshi

వజ్జ రమేష్‌ (ఫైల్‌)

ఆళ్లపల్లి : మండలంలోని మర్కోడు పంచాయతీ కర్ణగూడానికి చెందిన వజ్జ రమేష్‌(30) ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొద్ది రోజుల క్రితం, కిరాణం షాపు ఏర్పాటు కోసం రేకుల షెడ్డును రమేష్‌ నిర్మించుకున్నాడు. షెడ్‌ లోపల  అమర్చిన కరెంట్‌ తీగలు, పైనున్న ఇనుప రేకులను తగిలేలా ఉన్నాయి, ఒక తీగ మధ్యలో కట్‌ అయింది. దీంతో, ఈ ప్రమాదం జరిగింది. రమేష్‌కు భార్య సత్యవతి, ఇద్దరు పిల్లులు నవదీపిక, నవ్యశ్రీ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement