‘చంద్రన్న బీమా’ నుంచి కాల్‌.. లక్ష పేరిట టోకరా! | Online Fraud in Anantapur In The Name OF Chandranna Bima | Sakshi
Sakshi News home page

‘చంద్రన్న బీమా’ నుంచి కాల్‌.. లక్ష పేరిట టోకరా!

Published Tue, May 7 2019 9:54 AM | Last Updated on Tue, May 7 2019 12:14 PM

Online Fraud in Anantapur In The Name OF Chandranna Bima - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రన్న బీమా పథకం పేరుతో ఓ యువకుడికి టోకరా ఇచ్చారు ఆన్ లైన్ కేటుగాళ్లు. అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానిపల్లికి చెందిన గురుప్రసాద్  అనే యువకుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘విజయవాడ చంద్రన్న బీమా వింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు లక్ష రూపాయల  విడుదలయ్యింది. మీ అకౌంట్ నెంబర్‌తో పాటు ఏటీఎం డిటైల్స్ అందించాలి’ అని మోసగాళ్లు కోరారు. చంద్రన్న బీమా డబ్బులు వస్తాయని ఆశపడిన ఆ యువకుడు.. ఏటీఎం డిటైల్స్ అందించారు. అంతే తన అకౌంట్‌లోని 40 రూపాయలు మాయమయ్యాయని వాపోతున్నాడు బాధితుడు. మోసపోయానని తెలుసుకున్న గురుప్రసాద్  పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement