సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ సర్టిఫికెట్లను తయారుచేస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు ఏకకాలంలో దాడి చేసి నిందితులైన బషీర్ అహ్మద్, వంశీకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.
వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ స్టాంపులు, 96 స్నాతకోత్సవ సర్టిఫికెట్లు , వివిధ యూనివర్సిటీల 70 విద్యా ధృవపత్రాలు, ఒక కంప్యూటర్, ప్రింటర్, హార్డ్ డిస్కులతో పాటు రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment