వృద్దురాలిని పీక్కుతిన్న వీధికుక్కలు | Stray Dogs Eaten Elderly Woman Alive In Srikakulam | Sakshi
Sakshi News home page

వృద్దురాలిని సజీవంగా పీక్కుతిన్న వీధికుక్కలు

Published Wed, Jan 30 2019 4:24 PM | Last Updated on Wed, Jan 30 2019 5:15 PM

Stray Dogs Eaten Elderly Woman Alive In Srikakulam - Sakshi

మృతిచెందిన అంపిల్లి రాముడమ్మ, (ఇన్‌సెట్‌)లో ఫైల్‌ ఫోటో

సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్దురాలిని వీధికుక్కలు సజీవంగా పీక్కుతిన్న ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో జరిగింది. వివరాల మేరకు.. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ(65) అనే వృద్దురాలు రాత్రి ఇంటి గడపలో నిద్రించింది.

అదే సమయానికి అటువైపు వచ్చిన వీధికుక్కల గుంపు ఇంటి గడపలో నిద్రిస్తున్న రాముడమ్మను బయటకు ఈడ్చుకుపోయాయి. అనంతరం విచక్షణా రహితంగా ఆమెపై దాడి చేసి పీక్కుతిన్నాయి. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement