భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య | Women Suicide In Adilabad District | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

Published Sat, May 12 2018 6:37 AM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

Women Suicide In Adilabad District - Sakshi

దహెగాం(సిర్పూర్‌) : పెళ్లి అయి 15 సంవత్సరాలు అయినా సంతానం కావడం లేదని భర్త తో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెసరికుంట గ్రామంలో చోటు చేసుకుం ది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్‌ గ్రామానికి చెందిన దుర్గాదేవి(32), దహెగాం మండలం లక్కం కుమార్‌తో 2003లో వివాహామైంది. దుర్గాదేవికి సంతానం కలగకపోవడంతో భర్త మరో పెళ్లి చేసుకుంటానని వేధించేవాడు. దీంతో గురువారం ఇంట్లో పురుగుల మందు తాగి దుర్గాదేవి ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌ తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి తమ్ముడు మేకల లచ్చన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై దీకొండ రమేశ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement