
మిథిలేశ్ మృతదేహం
జ్యోతినగర్(రామగుండం): ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎన్టీపీసీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఓ కంపెనీ ఆధ్వర్యంలో జార్కండ్కు చెందిన మిథిలేష్కుమార్(29) కొద్దిరోజులుగా పనులు చేస్తున్నాడు. శనివారం ఆర్ధరాత్రి సమయంలో భవనం పైనుండి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. శబ్దం రావడంతో గదిలో ఉంటున్న వచ్చి చూడగా మిథిలేశ్ గాయపడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment