Published
Fri, Feb 10 2017 12:27 AM
| Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
అభయమిచ్చిన ఆదిలక్ష్మి
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మావుళ్లమ్మ ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ 53వ వార్షికోత్సవాలు మరో ఎనిమిది రోజుల్లో పరిసమాప్తం కానున్నాయి. ఈ దృష్ట్యా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. అభయమిచ్చే ఆదిలక్ష్మి రూపంలో ఒదిగిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొక్కులు తీర్చుకుని తరించారు.