నల్లగొండ: వేగంగా వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో లారీని ఢీకొట్టిన ఘటన జిల్లాలోని మోత్కూరు మండలం అనాజ్ పురం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ఆటోలో ఉన్న అంతమ్మ(57) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.