రాష్ట్ర స్థాయి వాలీబాల్కు బొల్లేపల్లి విద్యార్థులు
Published
Tue, Sep 20 2016 10:43 PM
| Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
రాష్ట్ర స్థాయి వాలీబాల్కు బొల్లేపల్లి విద్యార్థులు
కట్టంగూర్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్–14 విభాగంలో మండలంలోని బొల్లేపల్లి ౖహె స్కూల్ విద్యార్థులు ఏ.నిఖిత, జి.విజయ, అండర్–17 విభాగంలో కె.శ్రావణి, వి.ఐశ్వర్య ఎంపికైనట్లు ఇన్చార్జి ఎంఈఓ పర్నె చంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 విభాగంలో ఎంపికైన విద్యార్థులు ఈనెల 25న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాల పీఈటీ సి.హెచ్ బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు నరేందర్రెడ్డి, విజయ్కుమార్, రవీందర్రెడ్డి, యాదయ్య, అన్నపూర్ణ, బాబురావులు, ధర్మాంగ్ అభినందించారు.