విజయవాడ : బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం రాత్రి నగరంలో ఏర్పాటుచేసిన క్యాండిల్ ర్యాలీని సబ్–కలెక్టర్ డాక్టర్ సలోని సిదాన ప్రారంభించారు. సబ్–కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మహాత్మాగాంధీ రోడ్డు మీదుగా పోలీసు కమిషనరేట్ వరకు సాగింది. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా చైల్డ్లైన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. కృష్ణకుమారి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆంజనేయరెడ్డి, చైల్డ్లైన్ ప్రతినిధి అరవ రమేష్ పాల్గొన్నారు.
బాలల హక్కులపై క్యాండిల్ ర్యాలీ
Published Sat, Nov 19 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
Advertisement