
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించాలనుకున్న క్యాండిల్ ర్యాలీ వాయిదా పడింది. ఏఐసీసీ పిలుపు మేరకు రేపు(శుక్రవారం) ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.
మృతుల ఆత్మకు శాంతి కలిగిలా కొవ్వుతులతో ఈ ర్యాలీలో నివాళులర్పించనున్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.