Tank Bund
-
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
ట్యాంక్ బండ్ ఘటనలో ఒకరి మృతి
హైదరాబాద్, సాక్షి: హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గణపతి చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. రిపబ్లిక్ డే నాడు భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుని బోట్లు దగ్ధం కావడం తెలిసిందే. అయితే ప్రమాదంలో గణపతి తీవ్ర గాయాలతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం అతను కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. గణపతి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అని, దాదాపు 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరోవైపు కార్యక్రమానికి వెళ్లి కనిపించకుండా పోయిన అజయ్(21) కోసం హస్సేన్ సాగర్ ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సార్.. నా కొడుకు బతికున్నాడా.?
రాంగోపాల్పేట్: హుస్సేన్ సాగర్లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా హుస్సేన్సాగర్లో బోటు నుంచి బాణసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, కుషాయిగూడ నాగారానికి చెందిన సిల్వేరు అజయ్ (21) అనే బీటెక్ విద్యార్థి రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. ఉదయం నుంచి ఆ యువకుడి కోసం లేక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ మాత్రం దొరక లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉండగా..ప్రణీత్కుమార్, సునీల్ అదే ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా డిశ్చార్జ్ చేశారు. స్నేహితుడితో కలిసి వచ్చిన... కుషాయిగూడ నాగారానికి చెందిన ఆటో డ్రైవర్ జానకిరాం, నాగలక్ష్మి దంపతుల కుమారుడు అజయ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్తో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అజయ్ స్నేహితుడు రాఘవేంద్రకు టపాకాయల వ్యాపారి మణికంఠ డబ్బులు ఇచ్చేది ఉంది. ఆదివారం సాయంత్రం మణికంఠకు రాఘవేంద్ర ఫోన్ చేయగా తాను ట్యాంక్బండ్ దగ్గర ఉన్నానని, ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో మరో స్నేహితుడు సాయిసందీప్తో కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. ఆ తర్వాత మణికంఠకు ఫోన్ చేయగా బోటులో సాగర్ లోపల నుంచి ఒడ్డుకు వచ్చి వారికి డబ్బులు చెల్లించాడు. తాము బోటులో లోపలికి వస్తామని చెప్పడంతో అందరూ కలిసి బాణసంచా కాల్చే దగ్గరకు వెళ్లగా అదే సమయంలో అగి్నప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో బోటు సిబ్బందితో పాటు మరికొంత మంది బోటు సిబ్బంది అక్కడ ఉన్నారు. బాణసంచాను కచాప్లో ఉంచగా దానికి అనుసంధానంగా మెకనైజ్డ్ బోటు, మరో స్పీడ్ బోటు ఉన్నాయి. మెకనైజ్డ్ బోటుకు కూడా మంటలు అంటుకోవడంతో అందరూ అందులో నుంచి కిందకు నీళ్లలోకి దూకేశారు. అక్కడే ఉన్న బోటు సిబ్బంది నీళ్లలోకి దూకి కొందర్ని రక్షించగా..అజయ్ మాత్రం గల్లంతయ్యారు. అజయ్తో పాటు వచి్చన రాఘవేంద్ర, సాయి సందీప్లకు ఈత రావడంతో కొద్ది దూరం ఈదుకుంటూ రాగా అక్కడికి వచి్చన స్పీడ్ బోట్ సిబ్బంది వారిని రక్షించి బయటకు తీసుకు వచ్చారు. తెల్లవారు జామున గుర్తించిన స్నేహితులు గాయపడిన వారిని మొదట పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ తెల్లవారు జామున 2 గంటలకు రాఘవేంద్ర, సాయిసందీప్లు కలుసుకుని అజయ్ గురించి ఆరాతీశారు. అయితే అప్పుడు అజయ్కి ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ ఉంది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశారు. కుటుంబ సభ్యుల ఆందోళన.. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తెల్లవారు జామున హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని అజయ్ కోసం ఆరా తీశారు. తమ కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. కాగా అజయ్ కోసం లేక్ పోలీసులు, డీఆర్ఎఫ్లకు చెందిన 5 బృందాలు సోమవారం ఉదయం నుంచి హుస్సేన్ సాగర్లో గాలింపు చేపట్టాయి. ఉదయం నుంచి బోట్లు, గజ ఈత గాళ్ల సహాయంతో సాగర్ మొత్తం సాయంత్రం 6.30 గంటల వరకు గాలించినా యవకుడి ఆచూకీ మాత్రం కనిపించ లేదు. మంగళవారం మరో మారు గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా..సోమవారం అజయ్ కుటుంబ సభ్యులు ఇచి్చన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హన్మంతు తెలిపారు. లేటుగా వస్తానని చెప్పి.. రాత్రి 8.30కి ఫోన్ చేస్తే ట్యాంక్బండ్పై ఉన్నా..కొద్దిగా లేటుగా వస్తాను అని చివరి మాటలు చెప్పాడంటూ అజయ్ తల్లి నాగలక్ష్మి, తండ్రి జానకిరాం కన్నీరుమున్నీరుగా రోదించారు. -
అజయ్ కోసం హుస్సేన్ సాగర్లో గాలింపు
హైదరాబాద్, సాక్షి: ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అజయ్కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్ సాగర్లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఘటనపై కేసు నమోదుహుస్సేన్ సాగర్లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్ఛార్జి ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్సాగర్లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. -
‘మహా హారతి’లో అపశ్రుతి.. హుస్సేన్సాగర్లో బోట్లకు మంటలు (చిత్రాలు)
-
ట్యాంక్ బండ్ బోటులో మంటలు.. స్పాట్ లోనే ఏడుగురికి..
-
తెలంగాణ తల్లి సెంటిమెంట్ పండేనా?
తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణలో కొత్త సెంటిమెంట్ రాజుకునేందుకు కారణమవుతోందా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఇది నిజమే కావచ్చు అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన ఈ విగ్రహం చుట్టూనే రాజకీయాలన్నీ తిరుగుతూండటం ఇందుకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీలోని తెలుగు తల్లి విగ్రహానికి పోటీగా తెలంగాణ తల్లి పేరుతో విగ్రహాన్ని తయారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు. ఇందులో పలువురు ఉద్యమకారుల ప్రమేయం ఉన్నప్పటికీ మూల కారకుడు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు అని చెప్పక తప్పదు. అప్పట్లో వాడవాడల్లో సుమారు ఐదు వేల విగ్రహాలను ప్రతిష్టించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లోనూ ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడల్లా తొలుత ఆ విగ్రహానికి నివాళులు అర్పించే మొదలుపెట్టేవారు. ఇది ఒక సెంటిమెంట్ గా మారింది. అయితే ఏ కారణం వల్లో బీఆర్ఎస్ ఈ విగ్రహానికి అధికారిక ముద్ర వేయలేకపోయింది. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయం ఎదుట భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే సచివాలయం వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి రాగానే ఆ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు కూడా. ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, ఇన్నాళ్లు తెలంగాణ తల్లి విగ్రహన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తూ, తామే సచివాలయంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పి శంకుస్థాపన కూడా చేసేశారు. ఆ తర్వాత కొత్త డిజైన్తో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేశారు. వివాదం ఇక్కడే ఆరంభమైంది. ఈ విగ్రహాన్ని ఒక సెంటిమెంట్గా మార్చడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన తల్లి విగ్రహం ఆకుపచ్చ చీర ధరించి ఉంటుంది. అంతేకాక మెడలో ఒకటి, రెండు నగలతోనే చిత్రీకరించారు. ఈ విగ్రహంలో తల్లి చేతిని ప్రముఖంగా ప్రదర్శిస్తుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక గుర్తు అయిన చేతి గుర్తును పోలి ఉందని, ఇదంతా రాజకీయమని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విమర్శలు చేస్తున్నాయి. ఈ విగ్రహం కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కనుక, విగ్రహంలో చేతిని ప్రొజెక్టు చేయడంలో తప్పు ఏముందని ఇంకొందరి ప్రశ్న. ఇక విగ్రహ ముఖ కవళికలపై కూడా పలు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వస్తున్న కామెంట్లు సమర్థనీయం కాదు. విగ్రహం ముఖ కవళికలు రేవంత్ కుటుంబ సభ్యులను పోలి ఉన్నట్లు ఉన్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం ఉండదు. అయినా ఎవరి దృష్టి కోణంతో చూస్తే, వారి కోణంలోనే అలా అనిపిస్తుంటుంది. గతంలో ఎన్టీఆర్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాంక్బండ్ పై పలువురు తెలుగు తేజాల విగ్రహాలను ఏర్పాటు చేసి, దానిని ఒక టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ది చేశారు. అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విగ్రహాల ఏర్పాటు వృథా వ్యయం అని విమర్శించేది. ఆ విగ్రహాలు అచ్చం ఎన్టీఆర్. ముఖ కవళికలతో ఉన్నట్లుగా కొన్ని పత్రికలలో కార్టూన్లు కూడా వచ్చాయి. ఉమ్మడి ఏపీలో మూడు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ సాంస్కృతిక వేత్తలు, కవులు,కళాకారుల విగ్రహాలను ఎన్టీఆర్. ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాటిలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలను కూల్చివేసే యత్నం జరిగింది. కొన్ని విగ్రహాలకు నల్లరంగు పులిమారు. బంజారాహిల్స్ లో ఉన్న పెద్ద పార్కుకు కేబీఆర్ పార్క్ అని పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే, ఆయనను సమైక్యవాది అని భావించి కొందరు ఉద్యమకారులు దానిని కూడా ధ్వంసం చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను, అలాగే కాసు విగ్రహన్ని పునరుద్దరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో తయారు చేయించి ఈ ప్రాంతం అంతా వ్యాప్తి చేశారు. ఆ విగ్రహంలో తెలంగాణ తల్లి పింక్ రంగు చీర ధరించినట్లు కనిపిస్తుంది. అయితే అది బీఆర్ఎస్ రంగు పింక్ కాదని, మెరూన్ కలర్ అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. భరతమాత విగ్రహంలో ఉన్న చీర కలర్ కూడా మెరూనే అని వీరు అంటున్నారు. మెడలో నెక్ లెస్, తదితర మంచి ఆభరణాలు కనిపిస్తాయి. బతుకమ్మ ఉత్సవాలకు ప్రతీకగా దీనిని తయారు చేయించామని బీఆర్ఎస్ నేతల వాదన. తలకు కిరీటం కూడా ఉంటుంది. ఇది కూడా భరతమాతనే పోలి ఉంందని వీరి అభిప్రాయం.అయితే బీఆర్ఎస్ మహిళా నేత, కేసీఆర్ కుమార్తె కవిత ఒక సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహంలో తన పోలిక ఉందని చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎంకేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం వి తలతిక్క ఆలోచనలని, వాటివల్ల తెలంగాణ అస్తిత్వానికి గాయం అవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని సెంటిమెంట్ గా మార్చడానికి ఆయన ప్రయత్నించవచ్చు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నడిచింది అంతా సెంటిమెంట్ రాజకీయాలతోనే అన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అభివృద్ది మా హక్కు అని, తెలంగాణ రాష్ట్రం మా సెంటిమెంట్ అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రచారం చేసేవారు. కాగా కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి రేవంత్ సిద్దపడుతున్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించామని, కుడిచేతితో జాతికి అభయాన్ని ఇస్తోందని అన్నారు. ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ పంటలతో ఈ విగ్రహం తయారైందని అన్నారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా విగ్రహ రూపకల్పన జరిగిందని ఆయన వాదించారు. శాసనసభలో భావుకతను కూడా ప్రదర్శిస్తూ ప్రసంగించారు. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుతామని కూడా ప్రకటించడం విశేషం. సోనియాగాంధీ జన్మ దినం ఇదే రోజు కావడం గమనార్హం. బీఆర్ఎస్ ఇందుకు అంగీకరించదు. తెలంగాణ అవతరణ దినోత్సవ తేదీని మార్చడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బిజెపి ఆరోపించింది. దీనిని కాంగ్రెస్ విగ్రహంగా తయారు చేశారని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా విగ్రహాలను సెంటిమెంట్గా పరిగణిస్తుంటారు. అవి కూడా కాలాన్ని బట్టి, రాజకీయాలను బట్టి, మారిన ప్రభుత్వాలను బట్టి కూడా ఉండవచ్చు. టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను ఒకప్పుడు కూల్చే యత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటి జోలికి ఎవరూ వెళ్లలేదు. అంతవరకు మంచిదే. రష్యా లో కమ్యూనిస్టు ప్రభుత్వాల నేతలు లెనిన్, స్టాలిన్ వంటి వారి విగ్రహాలను కూడా తొలగించారు. మన దేశంలో విగ్రహాల చుట్టూ కూడా రాజకీయాలు సాగుతుంటాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం సెంటిమెంట్ గా మార్చుకుంటే, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సెంటిమెంట్ గా పరిగణిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం ఎలా సాగుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసింది కనుక, రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ స్థలాలలో ఈ విగ్రహాలను నెలకొల్పవచ్చు. కాని ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాలు అలాగే కొనసాగవచ్చు.. బీజేపీ అధికారంలోకి వస్తే వారు కొత్త విగ్రహం తయారు చేసి చేతిలో కమలం గుర్తు పెడతారేమోనని కొందరు చమత్కరిస్తున్నారు.ఏది ఏమైనా ప్రజలు ఈ విగ్రహాల సెంటిమెంట్ రాజకీయాలకు ప్రభావితం అవుతారా?లేక రాజకీయ పార్టీల పనితీరుకు ప్రభావితం అవుతారా?అంటే అది సందర్భాన్ని బట్టి, ఆయా నాయకుల చాకచక్యాన్ని బట్టి ఉంటుందేమో! -
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో
-
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. హరీశ్రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(డిసెంబర్6) ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులు భారీగా నిరసనకు హాజరవనున్నారు.ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను వారి ఇళ్ల వద్దే హౌస్ అరెస్టులు చేస్తున్నారు.పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కాగా, గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, హరీశ్రావు, పల్లారాజేశ్వర్రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కౌశిక్రెడ్డికి అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వగా హరీశ్రావు, పల్లారాజేశ్వర్రెడ్డిలను పోలీసులు సాయంత్రం విడుదల చేశారు. మాజీ మంత్రి హరీవ్రావు హౌస్ అరెస్టు..మాజీ మంత్రి హరీశ్రావును కోకాపటలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులపై హరీశ్రావు ఫైర్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించారు.ధర్నాకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్ ఎమ్మెల్సీ కవితన బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ధర్నాకు వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు. కవిత ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.తెలంగాణభవన్కు చేరుకున్న కేటీఆర్.. భారీగా పోలీసులుబీఆర్ఎస్ హైదారబాద్ నగర ఎమ్మెల్యేలను, నేతలను ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.మరోపక్క తెలంగాణభవన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు.తెలంగాణభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా తెలంగాణభవన్కు చేరుకుని ఇక్కడిక నుంచి ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు వెళ్లాల్సి ఉంది.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హౌస్ అరెస్ట్..బీఆర్ఎస్ నిరసనకు వెళుతున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను శుక్రవారం ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంపల్లిలోని దండెమూడి ఎంక్లేవ్లోని కేపీ వివేకానంద్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం హౌస్ అరెస్ట్ఏం తప్పు చేశామని హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మాధవరంప్రోటోకాల్ ప్రకారం అభివృధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచానా స్పందించరుబీఆర్ఎస్ కార్పొరేటర్టు, నాయకులను మాత్రం హౌస్ అరెస్టు చేస్తారుఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి తమ పనులకు వెళ్లకుండా.. అడ్డుకోవడం దారుణంముషీరాబాద్, అంబర్పేట ఎమ్మెల్యేల నిర్బంధం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్లను క్వార్టర్స్లోనే నిర్బంధించిన పోలీసులు ఇదీ చదవండి: కౌశిక్రెడ్డి అరెస్టు..10 గంటల హైడ్రామా -
గణనాథుల భారీ క్యూ.. ట్యాంక్ బండ్పై కొనసాగుతున్న నిమజ్జనం (ఫొటోలు)
-
గణనాథుడికి ఘన వీడ్కోలు
-
వినాయక విగ్రహాలతో నిండిపోయిన ట్యాంక్ బండ్.. ఫుల్ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో గణేష్ విగగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.ఇక, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్లో విగ్రహాలను తరలిస్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కాగా, సోమవారం అర్ధరాత్రి వరకు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి. నేడు రోజు కూడా నిమజ్జనాల ప్రక్రియకు మరింత సమయం పట్టనుంది. నిన్నటి నుంచి నిమజ్జనం కోసం గణపతి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. దీంతో, ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ.. పోలీసుల అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్లో ఒక వైపు రోడ్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. అలాగే, విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని మరో రోడ్లోకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇక, ట్యాంక్ బండ్పై నిమజ్జనం కోసం ఇంకా ఐదువేల వరకు విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: లంబో‘ధర’ లడ్డూ! -
గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. నగరంలో ఇవాళ జరిగిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి సీఎంగా నిలిచారు. ఇవాళ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అటు నుంచి నేరుగా ట్యాంక్బండ్ ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నెంబర్ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారాయన.క్లిక్ చేయండి: ఖైరతాబాద్ శోభాయాత్ర.. నెవర్ భిపోర్ -
ట్యాంక్బండ్పై సీఎం రేవంత్రెడ్డి.. గణేష్ నిమజ్జనం సమీక్ష (ఫొటోలు)
-
HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (ఫొటోలు)
-
#GaneshNimajjanam2024 : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
ట్రాఫిక్ వలయంలో సాగర్ పరిసర ప్రాంతాలు.. వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్, సాక్షి: గణేష్ నిమజ్జనం తో హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్ బండ్వైపు రావొద్దని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు నగర పోలీసులు సూచిస్తున్నారు.రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్బంక్కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి నుంచి నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడం, పైగా వాటిల్లో భారీ వాహనాలు ఉండడంతో.. నిమజ్జనానికి గంటల తరబడి టైం పడుతోంది. ఇక.. సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు లేరన్న మీడియా కథనాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాలను త్వరగతిన పంపించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈలోపు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. షెడ్డు తొలగింపు పనులు చేపట్టారు. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా? -
ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు -
హుస్సేన్సాగర్లో నిమజ్జనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
#Hyderabadసాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే, హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్సాగర్లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ట్యాంక్ బండ్లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం. ఈ సందర్భంగా అధికారుల చర్యలను హైకోర్టు సమర్థించింది. 2022లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాము. పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేం. కానీ, పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్లో నిమజ్జనం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చు అని ధర్మాసనం చెప్పింది. #Tankbundఇదిలా ఉండగా.. కోర్టులో పిటిషన్పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. No idol immersion on Tank bund ✅ pic.twitter.com/ZwQBdao8LQ— Sreekanth B+ ve (@sreekanth324) September 10, 2024 #RajaSingh Comments..ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం రేవంత్, జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపై వివరణ ఇవ్వాలి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్కు నిమజ్జనానికి విగ్రహాలు వస్తాయి. నిజంగా హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే ఈ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయిస్తారు. ఇప్పటికే ప్రజలు ఎన్నో సందేహాలతో ఉన్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ట్యాంక్ బండ్లో విగ్రహాలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారో జీహెచ్ఎంసీ కమిషనర్ బయటకు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. There seems to be some confusion regarding the immersion of Ganesh idols at Vinayaka Sagar (Tankbund). I kindly request Telangana CM @revanth_anumula garu and the @GHMCOnline Commissioner to provide clarity on this matter as a priority.Ensuring clear guidelines will help in… pic.twitter.com/JmWthMZyze— Raja Singh (@TigerRajaSingh) September 10, 2024ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే -
Tank Bund: ఘనంగా మూడో రోజు వినాయక నిమజ్జనాలు (ఫొటోలు)
-
హుస్సేన్సాగర్లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వినాయకచవితి నవ రాత్రుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై రేపు(మంగళవారం) విచారణ జరుగనుంది.కాగా, హుస్సేన్సాగర్లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై వాదనలను రేపు(మంగళవారం) వింటామని న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో రేపు వాదనలు జరుగనున్నాయి. -
వరికుచ్చులను మెచ్చుకున్న సీఎం
నిర్మల్: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో జిల్లా నుంచి ప్రదర్శనలో ఉన్న ధాన్యపు కుచ్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలువడమే కాకుండా.. సీఎం రేవంత్రెడ్డి స హా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీటిని ప్రదర్శించారు. జిల్లాకు చెందిన డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఆర్డీఏ, సెర్ప్ సిబ్బంది కలిసి వరికుచ్చులను ప్రత్యేకంగా తయారు చేశారు.చేనేత, ఇతర కళాకృతుల కంటే ఈసారి ధాన్యపుసిరిని కళ్లకు కట్టించే వరికుచ్చులు అందరినీ ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ, కమిషనర్ అనితా రామచంద్రన్, సంగీత దర్శకుడు కీరవాణి పరిశీలించారు. -
TG : ట్యాంక్బండ్పై ఘనంగా అవతరణ వేడుకలు (ఫొటోలు)
-
సర్వాంగ సుందరంగా ట్యాంక్బండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్పై పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సామాన్య ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అధికారిక గేయం ’జయ జయహే తెలంగాణ’ పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణసంచా పేలుస్తూ ఉత్సవ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులు పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిథులకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లతో, లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా.. శుక్రవారం పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలు కదులుతుండడంతో.. పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు రోడ్ల వెంట బారులు తీరాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచన చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్లో వెళ్లే వాహనాలు.. ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. నగరంలో నిన్న(గురువారం) ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం తర్వాత చాలాసేపు విగ్రహాల నిమజ్జనం జరగలేదు. సాయంత్రం నుంచి విగ్రహాలు ట్యాంక్బండ్ వైపు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఇవాళ రెండో రోజూ కూడా ట్యాంక్బండ్లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. లిబర్టీ మీదుగా హిమాయత్ నగర్, నారాయణగూడ, తిలక్నగర్.. కోరంటి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, లక్డీకాపూల్ వైపు భారీగానే ట్రాఫిక్ ఉంది. మరోవైపు ట్యాంక్బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్బండ్పై గణనాథులు బారులు తీశారు. మధ్యాహ్నాంలోగా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీస్ డాన్స్
హైదరాబాద్: భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ వెంబడి గణేశుడి నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిసేపు భారీగా వర్షం కురిసినా కూడా నిమజ్జనాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా ఈ సంబరాల్లో ఒక పోలీస్ అధికారి డాన్స్తో దుమ్ము రేపారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా విగ్నేశ్వరుడు తొమ్మిది రోజులపాటు మన మధ్య కొలువుతీరి ఘనంగా పూజలు అందుకున్నాడు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరుతున్న వేళ ట్యాంక్ బండ్ చేరుకున్న భక్తులంతా సంబరాల్లో మునిగితేలారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ నిమజ్జనం ఇకేరోజు రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 40000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. నిమజ్జనాలకు తరలివచ్చిన భక్తుల్లో పిల్ల, పెద్ద, యువత తేడా లేకుండా తీన్మార్ దరువుకు ధూందాం డాన్సులేశారు. ఇదే సంబరాల్లో ఓ పోలీసాయన కూడా తన్మయత్వంతో చిందులేశారు. ప్రొఫెషనల్ డాన్సర్లా ఈయన వేసిన స్టెప్పులకు చుట్టూ ఉన్నవారు కూడా నివ్వెరపోయి చూస్తుండిపోయారు. ఇంకేముంది మిగతా పోలీసులు కూడా కాసేపు సంబరాల్లో పాలుపంచుకుంటూ సరదాగా డాన్సులు చేశారు. ఈ వీడియో టీవీలో కనిపించిన కొద్దిసేపటికే మొబైల్ ఫోన్లలో చేరి వైరలయ్యింది. #Hyderabad police dance during Ganesh Shoba Yatra pic.twitter.com/rcWNY8wwbL — Naveena (@TheNaveena) September 28, 2023 ఇది కూడా చదవండి: నిమజ్జన వేళ.. స్టెప్పులేసిన సీపీ రంగనాథ్ -
ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం
-
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం సందడి
-
Ganesh Nimajjanam 2023 Photos: ఘనంగా వినాయక నిమజ్జనాలు.. భక్తుల సందడి (ఫోటోలు)
-
ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇసుకేస్తే రాలని జనం
సాక్షి, హైదరాబాద్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంగణం మారుమోగిపోతోంది.ఆదివారం మధ్యాహ్నం వరకే లక్షన్నర మంది భక్తుల దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తోంది ఖైరతాబాద్ మహా గణపతి నిర్వాహక కమిటీ. సెప్టెంబర్ 28వ తేదీన నగరంలో నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో జనం ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దాటాక.. జనం రావడం ఒక్కసారిగా పెరిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర లైన్లో నిల్చున్నారు భక్తులు. దీంతో.. వీఐపీ దర్శనాలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ సందడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు.. మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క.. నగరంలో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వందల కొద్దీ విగ్రహాలు ట్యాంక్బండ్ వైపు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్రోడ్, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు.. శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారు. -
ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్వాల్ భూదేవి నగర్లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెల్పిన షర్మిల... ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించాల్సిన అవసరం ఉందని, గద్దర్ సొంత ఊరు తూప్రాన్లో ఆయన పేరిట స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. గద్దర్ చేత కంటతడి పెట్టించిన కేసీఆర్, ఆయ న కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నా రు. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా గద్దర్కి కేసీఅర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఆయన విష యంలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకపోవడంతో.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే గద్దర్కి చాలా ప్రేమ అని, నాతో చాలాసార్లు వైఎస్సార్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారన్నారు. -
అతి భారీ వర్షాలు.. ట్యాంక్బండ్ వద్ద వరద ఉధృతి పరిశీలించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తగ్గిందన్నారు. మూసీ వరదను మానిటర్ చేస్తున్నాం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖ అధికారులతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావం కొంత తగ్గింది కుంభవృష్టిగా, ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, పలు కాలనీల్లో మాత్రం తాత్కాలికంగా వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడమేనని స్పష్టం చేశారు. వాళ్ల సెలవులు రద్దు హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించాం హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని . భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. చెరువులకు గండి పడే ప్రమాదం వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరిమీద జరిగి ఉండదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల బలిదానాలు బాగా కలిచి వేశాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో అమరుల ప్రాణ త్యాగాలకు వెలకట్టలేమని.. 600 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం సభావేదికపైకి చేరుకొని తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతోపాటు పలువురి అమరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటంలో హింస జరగకుండా తమ శక్తిమేర చూశామని చెప్పారు. తనపై జరిగిన దాడి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపై జరిగి ఉండదని.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని చెప్పుకొచ్చారు. చదవండి: అమరుల స్మారక చిహ్నం ప్రారంభం, ప్రత్యేకతలివే ‘నిరసనలతో ఢిల్లీ సర్కార్ దిగి వచ్చింది. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించాం. ఉద్యమంతోనే ఢిల్లీ నుంచి తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన వచ్చింది. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టే విధంగా దిగజారారు. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలున్నాయి. ఆ తరువాత 8 ఏళ్లకే ఇబ్బందులు మొదలయ్యాయి. టీఎన్జీవోలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తొలి, మలి ఉద్యమాల్లో విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. పోరాటంలో ఎప్పుడూ జయశంకర్ వెనకడగు వేయలే. ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాం. అమరజ్యోతి ఎల్లకాలం ఉండేలా నిర్మించుకున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. అందరి అంచనాలు తలకిందులు చేశాం. పంజాబ్ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. హైదరాబాద్కు ల్యాండ్మార్క్గా ట్యాంక్బండ్ తయారైంది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించారు. -
అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అమర వీరులకు నివాళిగా పోలీసులు గౌరవ వందనం చేశారు. 12 తుపాకులతో గన్ సెల్యూట్ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్, సీఎస్ శాంతాకుమారి, డీజీపీ అంజనీకుమార్ స్వీకరించారు. పిడికిలి ఎత్తి జై తెలంగాణ అంటూ నినదించిన సీఎం.. లోపల అమరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధా కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమరుల కుటుంబాలను సత్కరించిన సీఎం కేసీఆర్ అనంతరం సభావేదికపైకి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. అమరులకు నివాళిగా గేయాలను ఆలపించారు. సభలో 10 వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ సన్మానించారు. తరువాత లేజర్, 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించనున్నారు. చదవండి: మళ్లీ గెలిపిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తాం: సీఎం కేసీఆర్ అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. అమరుల స్థూపం ప్రత్యేకతలు ►హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్క్ వద్ద 3.29 ఎకరాల్లో అమర వీరుల స్మారక జ్యోతి నిర్మాణం ►రూ. . 177 కోట్లు, మొత్తం ఆరు ఫ్లోర్లతో నిర్మాణం ►26,800 చ.మీ. విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో స్మారక నిర్మాణం. ► ప్రజ్వలన దీపం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు, ►స్టెయిన్లెస్ స్టీల్తో అమరవీరుల స్థూపం తయారు. ►16 వందల టన్నుల స్టెయిన్ స్టీల్ వాడకం. ►మొదటి 2 బేస్మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు ►335 కార్లు 400 బైక్లకు పార్కింగ్ సదుపాయం. ►150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం ►మొదటి అంతస్తులో అమరుల ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్ ►రెండో అంతస్తులో 500 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ ►మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో అద్దాల పైకప్పు నిర్మాణం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్బండ్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్బాబు తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్కు అనుమతి లేదు. పంజగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు రోటరీ వైపు వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలను షాదాన్ కళాశాల నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలకు రోటరీ చౌరస్తా వైపునకు అనుమతి ఉండదు. బుద్ధ భవన్ నుంచి వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్వైపు వెళ్లడానికి నల్లకుంట చౌరస్తా నుంచి మళ్లిస్తారు. లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపునకు వెళ్లడానికి అనుమతి లేదు. రాణీగంజ్, కవాడిగూడల నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్బండ్ వైపు అనుమతించరు. బడా గణేష్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు, మింట్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ బడా గణేష్ వద్ద నుంచి రాజ్దూత్ లేన్ వైపు మళ్లింపు ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం దృష్ట్యా 22న ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీపార్క్ మూసి ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి ఎగువ ట్యాంక్బండ్ వైపు వచ్చే ట్రాఫిక్కు అనుమతి లేదు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ప్రత్యామ్న్యాయ మార్గాల్లో వెళ్లాలని సుధీర్బాబు సూచించారు. చదవండి: కాంగ్రెస్లో జోష్.. పొంగులేటి ఇంటికి రేవంత్రెడ్డి -
అమరుల త్యాగాలకు అద్భుత ప్రతిబింబం.. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ప్రత్యేకత
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ఒక మహోన్నతమైన కల గన్న గొప్ప స్వాప్నికులు వాళ్లు. ఆ కలను సాకారం చేసుకొనేందుకు వీరోచితమైన పోరాటాలు చేశారు. తెలంగాణ సాధన కోసం తెగించి కొట్లాడారు. త్యాగాల బాటలో నడిచారు. తెలంగాణ కోసం మరణానికి ఎదురెళ్లారు. తమ జీవిత కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని చూడలేకపోయినా ఆ అమరుల కల సాకారమైంది. అమరుల త్యాగాలకు సమున్నత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరుల స్మారకం ఈ నెల 22న ఆవిష్కరణకు సిద్ధమైంది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన వందలాది మంది అమర వీరులను స్ఫురణకు తెచ్చేలా స్మారక జ్యోతి వెలుగులు విరజిమ్ముతోంది. అపురూపమైన కళాఖండం... హుస్సేన్సాగర్ తీరాన లుంబిని పార్కును ఆనుకొని సుమారు 3.2 ఎకరాల స్థలంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే ఒక అపురూపమైన కళాఖండంగా నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో దీని నిర్మాణం చేపట్టారు. సాధారణంగా పాలు, వంటనూనెలు సరఫరా చేసే ట్యాంకర్ల కోసం 304 స్టెయిన్లెస్ స్టీల్ను వినియోగిస్తారు. కానీ దీని కోసం 316ఎల్ స్టీల్ను వినియోగించారు. దుబాయ్లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియంకు వినియోగించిన స్టీల్కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 85,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్మారకంలో ప్రతి ఫ్లోర్కు ఒక ప్రత్యేకత ఉంది. పైన ఉన్న జ్యోతి వరకు సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడ ఉన్న విశాలమైన ప్రాంగణంలో సేదదీరేందుకు అవకాశం ఉంది. త్వరలో ఒక రెస్టారెంట్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. త్యాగాలను స్మరించుకునేలా.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకొనేవిధంగా గ్రౌండ్ఫ్లోర్లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలు ఉంటాయి.వీటి ద్వారా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ ఘట్టాలను తెలుసుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో వివిధ ప్రాంతాలకు చెందిన అమరవీరులు సాగించిన పోరాటాల తీరుతెన్నులు, ఉద్యమం సాగిన తీరు, తదితర స్ఫూర్తిదాయకమైన తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే మ్యూజియంలోనే అక్కడక్కడా కియోస్క్లు, టచ్ స్క్రీన్లు ఉంటాయి. వీటి ద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర విశేషాలను తెలుసుకొనే అవకాశం ఉంది. చదవండి: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన టెర్రస్పై ‘దియా’... టెర్రస్ పైన అమరవీరులకు నివాళులర్పిస్తూ.. జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇదే తెలంగాణ స్మారకం ప్రత్యేకత. సచివాలయానికి ఎదురుగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందజేస్తూ ఏర్పాటు చేసిన ఈ జ్యోతి (దియా) విశేషంగా ఆకట్టుకుంటోంది. టెర్రస్ పైన కూర్చుని 180 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న పరిసరాలను వీక్షించవచ్చు. సెక్రెటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, ఐమాక్స్, బిర్లా మందిరం స్పష్టంగా కనిపిస్తాయి. రూ.179 కోట్లతో తెలంగాణ స్మారకం నిర్మించారు. సందర్శకులు అత్యవసర పరిస్థితుల్లో పైనుంచి నేరుగా కిందకు చేరుకొనేందుకు రెండు వైపులా మెట్లు ఏర్పాటు చేశారు. రెండు లిఫ్టులు,ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయి. అన్ని ఫ్లోర్లలో వాష్రూమ్లు ఏర్పాటు చేశారు. భవనానికి ప్రధాన ద్వారంతో పాటు మరో నాలుగు చోట్ల చిన్న చిన్న నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటు చేశారు. సాహిత్య సదస్సులు, కళాప్రదర్శనలు... పై అంతస్తులో 600 మంది కూర్చునేందుకు అనువైన కన్వెన్షన్ హాల్ను నిర్మించారు. రౌండ్టేబుల్ కాన్ఫరెన్సులు, సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఈ హాల్ ఎంతో అనుకూలంగా ఉంది. ఈ హాల్లో ఏర్పాటు చేసే కుర్చీలను సభా కార్యక్రమాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ల్యాండ్స్కేప్ల ఏర్పాటు... హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల స్మారకం చుట్టూ అందమైన ల్యాండ్స్కేప్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణంలో కూడా ఆకుపచ్చ ల్యాండ్స్కేప్ను ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగుతున్నారు. ట్రాఫిక్ ఐలాండ్స్లో, లుంబిని పార్కులోనూ పచ్చదనం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అరి్వంద్కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. -
Hyderabad: గాలివాన బీభత్సం.. ట్యాంక్ బండ్లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్సార్నగర్, ఖైరతాబాద్లో వాన భారీ ఎత్తున కురిసింది. బొమ్మల రామారం, తుర్కపల్లి లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం పడింది. ఎల్బీనగర్, హయత్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురు గాలుల కారణంగా సిటీలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం మరింత కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. (దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి) తప్పిన పెను ప్రమాదం ట్యాంక్ బండ్లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి భాగమతి టూరిస్ట్ బోటు ట్యాంక్ బండ్లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బోటులో 40 మంది పర్యాటకులున్నారు. అయితే, అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 40 మంది టూరిస్టులతో బుద్ధ విగ్రహం వద్దకు బోటు బయల్దేరింది. బుద్ధ విగ్రహం చేరుకునే సమయంలో భారీగా ఈదురు గాలుల వీచాయి. దీంతో అదుపు తప్పిన బోటు, కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని ముందే గుర్తించి టూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా బోట్ను బోట్స్ క్లబ్ వద్ద ఒడ్డుకు చేర్చారు. పర్యాటకులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. నిమ్మకాయంత సైజులో రాళ్లు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడటంతో భారీ ఎత్తున పంట నష్టం సంభవించిందని రైతులు వాపోయారు. తొగుట మండలం గుడికందుల, గోవర్ధనగిరిలో నిమ్మకాయంత సైజులో రాళ్లు పడ్డాయని స్థానికులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, బీబీ నగర్ లో ఉరుములు, మెరుపులతో కుడిన భారీ వర్షం కురిసింది. (Telangana: డిగ్రీ చదువుతూనే 10 వేలు సంపాదన.. ఎలా అంటే..!) -
హైదరాబాద్ లో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు
-
హైదరాబాద్: అట్టహాసంగా అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
అంబేద్కర్ విశ్వ మానవుడు: సీఎం కేసీఆర్
అంబేద్కర్ విగ్రహావిష్కరణ లైవ్ అప్డేట్స్ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగం.. ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవం అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు అంబేద్కర్ పేరిట శాశ్వతమైన అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం ఏటా అంబేద్కర్ జయంతి రోజు అవార్డుల ప్రదానం ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అంబేద్కర్ విశ్వ మానవుడు అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీయమైనది అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలి అంబేద్కర్ మాటలు ఆచరించాలి ఎవడో డిమాండ్ చేస్తే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు ఈ విగ్రహ ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉంది సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం దళితుల ఆర్థికవృద్ధికి దళితబంధు పథకం తీసుకొచ్చాం ► గౌరవ అతిథి ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగిస్తూ.. మీ అందరి తరపున తెలంగాణ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతులు చెబుతున్నా. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. దేశప్రజలందరూ సంతోషంగా ఉండాలని అంబేద్కర్ ఆకాంక్షించారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజంలో మార్పు కోసం ఆయన అహర్నిశలు తపించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారు. ► దళిత బంధు విజయగాథ పాటల సీడీని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్లు. ► అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. చారిత్రాత్మకం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని భారీగా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలు అవుతున్న దళిత బంధు పథకం.. ఒక విప్లవాత్మక మార్పును దోహదం చేస్తుంది. :: మంత్రి కొప్పుల ఈశ్వర్ ► రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు, విగ్రహావిష్కరణకు గౌరవ అతిథిగా హాజరైన ప్రకాష్ అంబేద్కర్కు కేసీఆర్ శాలువా, పుష్ఫ గుచ్ఛంతో సత్కరించారు. అంబేద్కర్ తనయుడు యశ్వంత్(భయ్యా సాహెబ్)కి తనయుడైన ప్రకాష్(బాలాసాహెబ్ అంబేద్కర్).. రచయిత, న్యాయవాదిగానే కాకుండా రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు కూడా. ► అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మృతి వనం సందర్శన అనంతరం.. సభా వేదికపైకి చేరుకున్న కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్. ► స్మృతి వనం నుంచి బయటకు వచ్చి సభా ప్రాంగణంలోని ప్రజలకు అభివాదం చేసిన ప్రకాష్ అంబేద్కర్, కేసీఆర్. ► అంబేద్కర్ మహా కాంస్య విగ్రహం కోసం 11.80 ఎకరాల విస్తీర్ణం జాగా, రూ. 146 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ పీఠం 50 అడుగులు పార్లమెంట్ భవనం ఆకారంలో ఏర్పాటు చేయగా.. బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులతో ఏర్పాటు చేశారు. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్. ► అంబేద్కర్ స్మృతి వనంలోని స్క్రీన్పై అంబేద్కర్ విగ్రహ ఏర్పాటునకు సంబంధించిన క్లిప్స్ను వీక్షించారు విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాశ్ అంబేద్కర్. ► అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కలియదిరిగారు. వెంట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలంతా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ, లైబ్రరీ తదితరాలను వీక్షించారాయన. ► పూలు జల్లి అంబేద్కర్కు నివాళి అర్పించారు అక్కడ హాజరైన ప్రముఖులంతా. ► హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ జరిగింది. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా బౌద్ధ గురువులను సన్మానించారు. ► అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ► విగ్రహావిష్కరణ ఫలకం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, మంత్రులు, దళిత సంఘాల ప్రముఖులు. ► అంబేద్కర్ మహావిగ్రహంపై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ► అంబేద్కర్ స్మృతి వనానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, ఇతరులు.. విగ్రహ విశేషాలను ప్రకాష్ అంబేద్కర్కు వివరించిన సీఎం కేసీఆర్. ► ట్యాంక్బండ్కు చేరుకున్న సీఎం కేసీఆర్, కార్యక్రమ ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్. ప్రాంగణం వద్ద ఘన స్వాగతం. ► జనసంద్రంగా మారిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రాంగణం. కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ► ప్రగతి భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బయల్దేరిన సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. ► ట్యాంక్ బండ్ విగ్రహావిష్కరణ వేదిక వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ► దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని(125 అడుగులు) తెలంగాణ హైదరాబాద్లో ఆవిష్కరించనున్నారు. ట్యాంక్ బండ్ మీద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగనుంది. రాజ్యాంగ నిర్మాతకు గౌరవ సూచీగా ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహాన్ని టూరిస్ట్ స్పాట్గానే కాకుండా నాలెడ్జ్ సెంటర్గానూ ప్రమోట్ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇదీ చదవండి: రాజ్యాంగ నిర్మాతకు నిలువెత్తు గౌరవం -
కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సర్కార్కు వ్యతిరేకంగా, తెలంగాణ మహిళలకు సంఘీభావంగా దీక్షకు దిగిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా.. ట్యాంక్ బండ్పై బుధవారం ఆమె మౌన దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించారు. అంతకు ముందు.. రాణి రుద్రమ దేవి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించి దీక్షకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. ఆమె కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల్లో నెంబర్ వన్. మహిళలను ఎత్తుకుపోవడంలో నెంబర్ వన్. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్కి మహిళల భద్రత పట్ల చిత్త శుద్ది లేదు. కేసీఆర్ దృష్టిలో మహిళలు ఓట్లు వేసే యంత్రాలు. మహిళ భద్రతకు చిన్న దొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడు. ఎక్కడుంది భరోసా యాప్?. నేను ఫోన్ లో చెక్ చేశా.. ఎక్కడ కనపడలేదు యాప్. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర,పెద్ద దొర. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుంది తెలియదు. .. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారామె. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కు లేదు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు. ‘ఆడపిల్లల పై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతా’.. అని చెప్పిన కేసీఅర్ ఎంత మంది గుడ్లు పీకారు. స్వయంగా మంత్రుల బంధువులు రేపులు చేసినా దిక్కు లేదు. కేసీఆర్కి ఆడవాళ్లు అంటే వివక్ష. కేసీఆర్కి ఆడవాళ్లు అంటే కక్ష. దళిత మహిళలపై దాడులు చేస్తున్నారు. లాకప్ డెత్ లు చేస్తున్నారు. తెలంగాణలో ఓకే ఒక్క మహిళకు రక్షణ ఉంది. ఆమె కల్వకుంట్ల కవిత. మిగతా మహిళలంటే కేసీఆర్కి లెక్కే లేదు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ మీదనే అసభ్య పదజాలం వాడుతున్నారు. గవర్నర్కే గౌరవం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ. స్వయంగా నేనే ఫిర్యాదు చేసినా దిక్కు లేదు. సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారు నన్ను. ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం. గవర్నర్, సాధారణ మహిళలకు, మహిళా నేతలకే కాదు.. ఐఏఎస్ మహిళా అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు. పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారు. ఇది దిక్కుమాలిన పాలన. కేసీఆర్ బిడ్డకు తప్పితే ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటూ లేదు. ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టి.. అదే మహిళలకు దక్కిన గౌరవం అని ప్రచారం చేసుకున్నారు. కవిత సిగ్గులేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. స్కాంలో చిక్కి.. మహిళల గౌరవాన్ని దెబ్బ తీశారు. రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా చేస్తారట!. అసలు రాష్ట్రంలో 33 శాతం ఎక్కడ అమలు అవుతుంది. ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదు. రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. మహిళా మంత్రులకు దిక్కు లేదు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలను చేశారు. అసలు మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదు. కేసీఆర్ది నియంత పాలన.. మహిళల పట్ల సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా మౌన దీక్షఅని ప్రకటించారామె. -
చాలా రోజుల తర్వాత ట్యాంక్బండ్పై సండే– ఫన్డే మొదలు (ఫొటోలు)
-
సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ..
సాక్షి, సిటీబ్యూరో: ఫార్ములా– ఈ ప్రిక్స్కు వేళయింది. దేశంలోనే తొలిసారిగా నగరం వేదికగా జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు రేసర్లు సమరోత్సాహాంతో సన్నద్ధమవుతున్నారు. వీరంతా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.వివిధ దేశాల్లో నిర్వహించిన ఫార్ములా పోటీల్లో అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించిన 22 మంది రేసర్లు పాల్గొంటారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రేసర్లు గతంలో నిర్వహించిన పోటీలపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రేసింగ్ డ్రైవర్లు జీన్ ఎరిక్ వర్జిన్, ఆండ్రే లాట్టర్లు తమ అనుభవాలను వివరించారు. పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆసక్తికరంగా ఉందన్నారు. పోటీల్లో పాల్గొనడానికి ముందు ఒత్తిడిని తగ్గించుకొనేందుకు తాను మైకేల్ జాక్సన్ పాటలు వింటానని ఆండ్రే చెప్పారు. రేసింగ్ డ్రైవర్లపై తప్పనిసరిగా మానసిక ఒత్తిడి ఉంటుందని, దానిని అధిగమించేందుకు వివిధ రకాల పద్ధతులను పాటిస్తామన్నారు. వీలైనంత వరకు చుట్టూ ఉండే వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా ఉంచుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి ఇబ్బందులను అధిగమించేందుకు సైకాలజిస్టులను కూడా సంప్రదిస్తామని చెప్పారు. కాగా.. ఫార్ములా– ఈ పోటీల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెక్లెస్రోడ్డులోని 2.8 కి.మీ ట్రాక్ను సిద్ధం చేశారు. 20 వేల మందికి పైగా సందర్శకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. 11 ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలకు చెందిన సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కార్లు, 22 మంది రేసింగ్ డ్రైవర్లు పోటీల్లో పాల్గోనున్న సంగతి తెలిసిందే. -
HYD: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ జరుగనుంది. 227 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్కి FIA లైన్ క్లియర్ చేసింది. దీంతో, ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ బుధవారం ఈవెంట్స్ టికెట్స్ను లాంచ్ చేశారు. కాగా, ఈ రేసింగ్ కోసం నేటి నుంచి బుక్మై షోలో టికెట్స్ను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. 2023 హైదరాబాద్ E-prix పేరుతో ఈవెంట్ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. ఇక, అందుబాటులో 22,500 టికెట్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. -
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ పార్టీ విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెప్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి.. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. ►వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ►ఇళ్లు, అపార్ట్మెంట్స్లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. ►యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ►నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్రోడ్, కేబీఆర్ పార్క్రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. చదవండి: New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో .. ►ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గలలో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్పేట్, మైండ్స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్పాస్లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
హైదరాబాద్: ట్యాంక్ బండ్పై ఫార్ములా కారు రేసింగ్..
-
పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై షర్మిల దీక్ష
-
IRL: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ హుస్సేన్ సాగర్ ఒడ్డున మళ్లీ సందడి చేయనుంది. శనివారం, ఆదివారం ఎన్టీఆర్ మార్గ్లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణ ఉండనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు వర్తించనున్నాయి. గత నెలలో జరిగిన పోటీలు.. అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్రోడ్ మూసివేస్తారు. బుద్ధభవన్, నల్లగుట్ల జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్, ఐమాక్స్ వైపు వాహనాలకు నో ఎంట్రీ అమలు కానుంది అనుమతులు.. ► విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు వెళ్లే ట్రాఫిక్ను షాదాన్ కాలేజ్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. ► బుద్ధభవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్బండ్ వైపు అనుమతిస్తారు. ► రసూల్పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ► ఇక్బాల్మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తారు. ► ట్యాంక్బండ్/తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్మి నార్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. ► బీఆర్కేఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్మినార్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వైపు అనుమతిస్తారు. ► ఖైరతాబాద్ బడాగణేశ్ వీధి నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను రాజ్దూత్ వైపు అనుమతిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్రోడ్, లుంబినీ పార్క్లు ఈ నెల 9 నుంచి ఈ నెల 11 వరకు మూసి ఉంటాయి. శని, ఆదివారాల్లో హుస్సేన్ సాగర్ తీరం నెక్లెస్ రోడ్డులోని 2.7 కిలోమీటర్ల ట్రాక్పై రేసింగ్ కార్లు దూసుకెళ్లనున్నాయి. శనివారం 2 క్వాలిఫయింగ్ సెషన్లు, ఒక స్ప్రింట్ రేసు జరగనుంది. అలాగే ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. గత నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్లో ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రౌండ్ జరిగింది. ఆ సమయంలో.. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ను అర్ధంతరంగా నిలిపివేశారు. -
HYD: ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్ బంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలోని ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. అంతేకాదు.. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్బండ్పై సందర్శక ప్రాంతాలను మూసేయనున్నారు. ట్యాంక్బండ్పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ నెల 18(శుక్రవారం) నుంచి బంద్ చేయనున్నారు. ఈ మూసివేత 20వ తేదీ వరకు ఉంటుంది. తిరిగి 21వ తేదీ నుంచి వాటిని తెరుస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను 16వ తేదీ రాత్రి పది గంటల నుంచి 20వ తేదీ రాత్రి పది గంటల వరకు అమలు చేస్తామని ఇది వరకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు.. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఖైతరాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం రూట్, ట్యాంక్బండ్ పరిసరాలలో వెళ్లవద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ వాహనదారులకు సూచించారు. అనసవసరంగా ఆ రూట్లలో వెళ్లి ట్రాఫిక్లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు. -
నెక్లెస్రోడ్డులో పోటీలు: ఫార్ములా–ఈ కార్లు వచ్చేశాయ్.. దేశంలోనే ఫస్ట్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీల్లో దూసుకెళ్లబోయే కార్లను నగర ప్రజలకు పరిచయం చేసే చర్యల్లో భాగంగా ‘జెన్–2’ రకానికి చెందిన రెండు ఎలక్ట్రిక్ కార్లను ఆదివారం ట్యాంక్బండ్, దుర్గం చెరువు వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు. దేశంలో ఫార్ములా–ఈ పోటీలను నిర్వహించడం తొలిసారి కానుండటంతో హైదరాబాద్తోపాటు ముంబై ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లోనూ ఈ కార్లను కొన్ని వారాలపాటు ప్రదర్శించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫార్ములా వన్ కార్ల తరహాలోనే నేలను తాకినట్లుగా ఉండే ఆకృతి, ఓపెన్ కాక్పిట్, సింగిల్ సీట్గల ఈ కార్లు ‘ఈవీ టెక్నాలజీ’ (ఎలక్ట్రికల్ వెహికల్ సాంకేతికత) ఆధారంగా పనిచేస్తాయి. హైదరాబాద్లో జరిగే పోటీలో జెన్–3 రకం ఈవీ కార్లను తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. జెన్–2 ఈవీ కార్లు సున్నా నుంచి 62 కి.మీ. వేగాన్ని కేవలం 3 సెకన్లలో అందుకుంటే జెన్–3 రకం ఈవీ కార్లు సున్నా నుంచి 100 కి.మీ. వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయి. జెన్–2 ఈవీ కార్లు గరిష్టంగా 280 కి.మీ. వేగాన్ని అందుకుంటే జెన్–3 ఈవీ కార్లు గరిష్టంగా 300 కి.మీ. వేగంతో దూసుకెళ్తాయి. ఫార్ములా వన్ రేసుల్లాగా వీటికి ప్రత్యేక ట్రాక్లు నిర్మించాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ రోడ్లపైనే పరుగులు తీయగలగడం ఈవీ కార్ల ప్రత్యేకత. హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో ఉన్న 2.8 కి.మీ. మార్గం ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీలకు అనుకూలంగా ఉండటం వల్లే భాగ్యనగరాన్ని నిర్వాహకులు ఇందుకు ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జూలై మధ్య ప్రపంచవ్యాప్తంగా 12 నగరాల్లో జరగనున్న 18 ఫార్ములా–ఈ ప్రిక్స్ రేసుల్లో నాలుగో రేసు హైదరాబాద్లో జరగనుంది. -
ఫార్ములా ఈ కార్లు వచ్చేశాయ్.. వీటికో ప్రత్యేకత కూడా ఉందండోయ్!
హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీల్లో దూసుకెళ్లబోయే కార్లను నగర ప్రజలకు పరిచయం చేసే చర్యల్లో భాగంగా ‘జెన్–2’ రకానికి చెందిన రెండు ఎలక్ట్రిక్ కార్లను ఆదివారం ట్యాంక్బండ్, దుర్గం చెరువు వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు. దేశంలో ఫార్ములా–ఈ పోటీలను నిర్వహించడం తొలిసారి కానుండటంతో హైదరాబాద్తోపాటు ముంబై ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లోనూ ఈ కార్లను కొన్ని వారాలపాటు ప్రదర్శించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫార్ములా వన్ కార్ల తరహాలోనే నేలను తాకినట్లుగా ఉండే ఆకృతి, ఓపెన్ కాక్పిట్, సింగిల్ సీట్గల ఈ కార్లు ‘ఈవీ టెక్నాలజీ’ (ఎలక్ట్రికల్ వెహికల్ సాంకేతికత) ఆధారంగా పనిచేస్తాయి. హైదరాబాద్లో జరిగే పోటీలో జెన్–3 రకం ఈవీ కార్లను తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. జెన్–2 ఈవీ కార్లు సున్నా నుంచి 62 కి.మీ. వేగాన్ని కేవలం 3 సెకన్లలో అందుకుంటే జెన్–3 రకం ఈవీ కార్లు సున్నా నుంచి 100 కి.మీ. వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయి. జెన్–2 ఈవీ కార్లు గరిష్టంగా 280 కి.మీ. వేగాన్ని అందుకుంటే జెన్–3 ఈవీ కార్లు గరిష్టంగా 300 కి.మీ. వేగంతో దూసుకెళ్తాయి. ఫార్ములా వన్ రేసుల్లాగా వీటికి ప్రత్యేక ట్రాక్లు నిర్మించాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ రోడ్లపైనే పరుగులు తీయగలగడం ఈవీ కార్ల ప్రత్యేకత. హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో ఉన్న 2.8 కి.మీ. మార్గం ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీలకు అనుకూలంగా ఉండటం వల్లే భాగ్యనగరాన్ని నిర్వాహకులు ఇందుకు ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జూలై మధ్య ప్రపంచవ్యాప్తంగా 12 నగరాల్లో జరగనున్న 18 ఫార్ములా–ఈ ప్రిక్స్ రేసుల్లో నాలుగో రేసు హైదరాబాద్లో జరగనుంది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం పూర్తి
-
కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపే.. నిమజ్జన రూట్మ్యాప్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఇంకొద్ది క్షణాల్లో ఉద్విగ్న ఘట్టానికి తెర లేవనుంది. మహా యజ్ఞానికి ముహూర్తం పడనుంది. గణేష్ సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపు కదలనున్నాయి. దాదాపు 24,132 మంది పోలీసులు, 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజాము లోపు నిమజ్జనాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. నిమజ్జన ఊరేగింపులు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శుక్రవారం నుంచి 24 గంటల పాటు నగరంలో మద్యం విక్రయాలు నిషేధించారు. ►శాంతి భద్రతలు, టాస్క్ఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, ఏపీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీసు ఫోర్స్ బందోబస్తులో ఉంటాయి. 120 బృందాలను షీ–టీమ్స్ రంగంలోకి దింపింది. ►బాలాపూర్– హుస్సేన్సాగర్ మధ్య 18.9 కి.మీ మేర ప్రధాన శోభాయాత్ర మార్గం ఉంది. ఇది 11 పోలీసుస్టేషన్ల పరిధిల మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 261 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 739 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ►పాతబస్తీలోని సర్దార్ మహల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ ఔట్పోస్ట్ వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఆ చుట్టుపక్కల కలిపి 53 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 2.5 కి.మీ మేర జరిగే ఈ ఊరేగింపుపై నిఘా ఉంచడానికి అదనంగా మరో 24 కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ►ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్సాగర్లోనే మూడు కమిషనరేట్లలో అనేక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాని చుట్టూ అందుబాటులో ఉన్న 66 సీసీ కెమెరాలకు తోడు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో 27 ఏర్పాటు చేస్తున్నారు. 500 మీటర్ల పరిధిలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్తో పని చేసే 10 మెగా పిక్సల్ కెమెరాలు ట్యాంక్బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ.. ఎంఎంటీఎస్.. మెట్రో సేవలు హుస్సేన్సాగర్ వద్ద నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 565 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శనివారం తెల్లవారు జాము వరకు బస్సులు నడుస్తాయి. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. ఇబ్బందులు రానీయొద్దు: మేయర్ నిమజ్జనం సందర్భంగా కొలనుల వద్ద తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండాలని, వ్యర్థాలు పోగవకుండా పారిశుద్ధ్యం సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు నగర మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెకిలి చేష్టలు వద్దు శోభా యాత్రలో అమ్మాయిలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలకు అరదండాలు తప్పవు. వాటర్ ప్యాకెట్లు చింపి మహిళల మీద చల్లడం, పేపరు ముక్కలను వేయటం, పూలు చల్లడం వంటివి చేస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దు. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు, వీడియోలు తీయటం చేయకూడదు. పోకిరీల వెకిలి చేష్టలను సీసీ కెమెరాలలో రికార్డ్ చేసి, ఆధారాలతో సహా న్యాయస్థానంలో హాజరుపరుస్తాం. – రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్కే సలీమా 196 తాగునీటి శిబిరాలు భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి 196 నీటి క్యాంపులను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న ప్రధాన మార్గాలు, ట్యాంక్ బండ్ పరిసరాలు, నిమజ్జన కొలనుల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తంగా 30.72 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. వినాయకుడికో కోడ్! నిమజ్జన ఊరేగింపుల పర్యవేక్షణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 9 వేల విగ్రహాలను చేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్న గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ గణేష్ నిమజ్జనం సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. గురువారం ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఆయన ప్రారంభించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20, 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 7, 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 43 సహా 13 కిలోమీటర్ల ఎల్టీ కేబుల్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100/1912/ 7901530966/ 790153086లను సంప్రదించాలి. డ్రోన్లతో డేగకన్ను గణేష్ నిమజ్జనానికి సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే 35 చెరువుల వద్ద తొలిసారిగా డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్ 100 లేదా 94906 17444ను సంప్రదించాలి. -
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
► ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ►తుది దశకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ గణపతి ►ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు ఖైరతాబాద్ గణేషుడు.. ► ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా గణేషుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్కు చేరుకున్నాడు. అశేష భక్తజన సమూహంలో గణనాథుడు నాలుగో నెంబర్ క్రైన్ వరకు తరలివెళ్తున్నాడు. ►ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చివరిసారిగా భక్తజనం భారీగా తరలివచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేయనున్నారు. ►హుస్సేన్ సాగర్ వద్ద ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వడివడిగా యాత్ర సాగించనున్నారు. మరి కొద్ది సేపటిలో టాంక్ బండ్ వద్దకు బడా గణేష్ విగ్రహం రానుంది. ► గత ఏడాది కన్నా ఈ ఏడాది నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తను దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తీసివేసే పని మొదలు పెడతామన్నారు. ► ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ►ఖైరతాబాద్ గణేష్ను మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేకత ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భారీ జనసమూహం మధ్య ఖైరతాబాద్ వినాయకుడి శోభ యాత్ర #KhairatabadGanesh pic.twitter.com/h31teOJMeW — Latha (@LathaReddy704) September 9, 2022 ►సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. 10వేలమంది పోలీసులు, 10వేలమంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ నిమజ్జనాలు జరుగుతాయనిచ రాత్రి ఎక్కువగా వర్షం కురవడంతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆలస్యం అయిందన్నారు. ► ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న మంత్రి తలసాని. ►బడా గణేషుడిని టస్కర్ మీదికి ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో గణేషుడిని విగ్రహాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రక్రియ మొదలైంది. వంద టన్నులు బరువు మోయగల బరువున్న లారీ, క్రేన్ సహాయంతో నిమర్జన శోభాయాత్ర ఏర్పాట్లు చేశారు. సాక్షి, హైదరాబాద్: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు. ► గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది. ►మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్ మోడల్ మెకానికల్ ట్రయిలర్ ఓల్వో ఇంజిన్ సామర్థ్యం. డీఎస్–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది. ►ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. ►మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు. క్రేన్ నంబర్ 4 వద్దకు.. ఎన్టీఆర్ మార్గ్లో క్రేన్ నంబర్–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలకల్లా చేరుకోగానే వెల్డింగ్ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. రూట్ మ్యాప్ ఇలా.. ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్ థియేటర్ ముందు నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ మార్గ్లో క్రేన్ నం– 4 వద్దకు చేరుకుంటుంది. -
ట్యాంక్ బండ్ పై రేపు వాహన రాకపోకలు బంద్
-
సరదాగా సండే (ఫొటోలు)
-
సరదాగా.. సండేఫన్డే
కవాడిగూడ: నగర వాసుల ఆహ్లాదం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన ‘సండే..ఫండే’ సందర్శకులతో హుషారుగా సాగింది. సండే ఫండేను గతంలో ప్రారంభించినప్పటికీ కరోనా నేపథ్యంలో నిలిపి వేశారు. 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్బండ్పై సండేఫండేను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్బండ్ను విద్యుత్ కాంతులు, జాతీయ జెండాలతో అలంకరించారు. నగర వాసులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. చిన్నారులకు ఇష్టమైన తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. యువత జాతీయ జెండాలతో దేశభక్తి చాటుతూ సెలీ్ఫలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొదటి సండే వర్షం ప్రభావం వల్ల సండేఫండేకు అధిక సందర్శకులు హజరు కాలేకపోయారు. సండేఫండే సందర్శంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. (చదవండి: జనాభాను మించి ఆధార్! ) -
ట్యాంక్ బండ్ పై మళ్లీ సన్డే ఫన్డే సంబరాలు (ఫోటోలు)
-
హుస్సేన్ సాగర్లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి
-
వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే: కేటీఆర్
కవాడిగూడ: వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని, అందుకే అల్లూరి సీతారామరాజు జయంతిని తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీతారామరాజు 125వ జయంతిని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సోమవారం ట్యాంక్బండ్పై అధికారికంగా నిర్వహించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, నవీన్లు ట్యాంక్బండ్పై ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జల్ జమీన్ జంగల్ కోసం కొము రం భీమ్ పోరాడారని, అల్లూరి కూడా బ్రిటిష్ పాలకులతో పోరాడి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. క్షత్రియుల కోసం కేసీఆర్ మూడు ఎకరాల భూమిని కేటాయించారని, త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసుకోవాలని, దానికి అల్లూరి పే రు పెట్టడమే సముచితమని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ సీఎం అయిన తరువాతే వైతాళికులను గౌరవించుకోవ డం మొదలైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు వర్మ, శ్యామలరాజు, మైనర్ రాజు, రామరాజు, వరదరాజులు, ఆఫ్గన్ రామరాజు, జోనల్ కమిషనర్ శ్రీనివా స్రెడ్డి, ముషీరాబాద్ సర్కిల్ 15 ఏఎంహెచ్వో మైత్రేయి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నాయకులు బీఎన్ రెడ్డి, తలసాని సాయికిరణ్, ముఠా జైసింహతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి అభిమానులు పాల్గొన్నారు. -
జూన్ 2న నీరా కేఫ్ ప్రారంభం
కడ్తాల్: హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ను జూన్ 2న దీనిని ప్రారంభిస్తామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్లో నీరా పైలెట్ ప్రాజెక్టు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో తయారు చేస్తున్న నీరా, దాని అనుబంధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గీత వృత్తిని పరిరక్షించేందుకు 4 కోట్ల ఈత, తాటి మొక్కలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో నీరా కేఫ్లను విస్తరిస్తామన్నారు. కల్లు గీత కార్మికులకు మరింత ఉపాధి కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ముద్విన్ సహా యాద్రాద్రి భువనగిరి జిల్లా నందనం, సర్వేలు, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో నీరా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రియల్ ఎస్టేట్ వెం చర్ల పేరుతో తాటి, ఈత వనాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
Hyderabad: మద్యం మత్తులో ఏకంగా ఇన్స్పెక్టర్ను ఢీకొట్టాడు..
-
మోదీ రాక.. ట్విట్టర్లో టీఆర్ఎస్, బీజేపీ కాక
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శనివారం ట్విట్టర్ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ నడిచింది. తొలు త టీఆర్ఎస్ మద్దతుదారులు విమర్శలు మొదలుపెట్టగా ప్రతిగా బీజేపీ తరఫున ప్రతి విమర్శలను కొనసాగించారు. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్తో టీఆర్ఎస్ నేతలు.. షేమ్ ఆన్ యూ కేసీఆర్ హ్యాష్ట్యాగ్తో బీజేపీ నేతలు వేడి పుట్టించారు. తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి: టీఆర్ఎస్ రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని, నిధుల విడుదలలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని పలువురు టీఆర్ఎస్ నేతలు ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. 20 వేలకు పైగా ట్వీట్లతో ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వట్లేదని నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మంత్రులు కేంద్రానికి పంపిన లేఖలపై ఎందుకు స్పందించట్లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని మంత్రి నిరంజన్రెడ్డి ట్వీట్ చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. అద్భుతమైన కార్యక్రమాలతో పురోగమిస్తున్న రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తోందని ఎంపీ రంజిత్రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రంపై కేంద్రవివక్షను ఎండగట్టేలా వివిధ అంశాలతో ట్యాంక్బండ్పై భారీ ఫ్లెక్సీని పలువురు యువకులు ప్రదర్శించారు. ఎదుర్కోలేక ముఖం చాటేశారా?: బీజేపీ టీఆర్ఎస్ ట్వీట్లకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ని ముఖాముఖి ఎదుర్కోలేక కేసీఆర్ ముఖం చాటేశారా?.. జ్వరం, స్వల్ప అస్వస్థత అంటూ ప్రధాని ప్రొటోకాల్ను కాదంటారా అని నేతలు ప్రశ్నిం చారు. కుంటిసాకులతో ప్రధానికి స్వాగతం పలకకపోవడం రాష్ట్రానికే అవమానం, నిజాంలాగా అహంకారంతో వ్యవహరిస్తే ఎలాగని నిలదీశారు. షేమ్ ఆన్ యూ కేసీఆర్ హాష్ ట్యాగ్తో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ తీరుపై వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు. -
Hyderabad: అండగా ఉంటారనుకుంటే.. అందకుండా పోయారు..
సాక్షి, హైదరాబాద్: ఎదిగి వచ్చిన కుమారులు అండగా ఉంటారనుకున్న ఆ కుటుంబాలకు శోకమే మిగిలింది. చెట్టంత తనయులను విగతజీవులుగా చూసి భోరుమంటూ విలపించాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్బల మైదాన్ చౌరస్తాలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అరుణ్ కుమార్ కుమారుడు అఖిల్ కుమార్ (26) బీటెక్ పూర్తి చేసి అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఓల్డ్గాస్మండికి కాలే జ్ఞానేశ్వర్ కుమారుడు రోహిత్ (26) ఈవెంట్స్ నిర్వహిస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. చదవండి: నర్సు ఆత్మహత్య.. ఆమె చాటింగ్ పరిశీలిస్తే..! అఖిల్, రోహిత్లు చిన్ననాటి స్నేహితులు. రోహిత్కు ఈవెంట్ ఉండటంతో శనివారం రాత్రి ఇద్దరు కలిసి సామగ్రి కోసం ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. నెక్లెస్రోడ్లోని పీవీ ఘాట్ మీదుగా ఇంటికి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి 1.10 గంటల ప్రాంతంలో వీరి వాహనం నెక్లెస్ రోడ్ నుంచి కర్బల మైదాన్ చౌరస్తాకు వచ్చింది. అదే సమయంలో ట్యాంక్బండ్ నుంచి ప్యారడైజ్ వైపు వెళుతున్న గుర్తు తెలియని డీసీఎం వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం కొద్ది దూరంలో ఎగిరిపడిపోయింది. తీవ్ర గాయాలపాలైన అఖిల్, రోహిత్లను అంబులెన్స్లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అఖిల్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. అఖిల్ తండ్రి అరుణ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. చదవండి: ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం. -
హైదరాబాద్తో ప్రేమలో పడకుండా ఉండగలమా... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ ఐటీ, ఇండస్ట్రియల్ శాఖమంత్రి కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. సాయంత్రం వేళ హుస్సేన్సాగర తీరంలో అస్తమిస్తున్న సూర్యుడు... అరుణ కాంతిని సంతరించుకుంటున్న ఆకాశం.. బిజీ లైఫ్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రజల జీవితాన్ని ఓ నెటిజన్ తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోకు ‘ఎవరైనా హైదరాబాద్తో ప్రేమలో పడకుండా ఎలా ఉండగలరు? అంటూ క్యాప్షన్ జోడించి మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్కి స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే లవ్ ఎమోజీతో లవ్ హైదరాబాద్ అంటూ బదులిచ్చారు. కేటీఆర్ రిప్లైతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్గా మారింది. వందల కొద్ది రీట్వీట్లు, వేల కొద్ది కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ❤️ Hyd https://t.co/W6b0vZCDqT — KTR (@KTRTRS) December 30, 2021 హైదరాబాద్ అన్నా ఇక్కడి కల్చర్ అన్నా మంత్రి కేటీఆర్కు ప్రత్యేకమైన అభిమానం. ట్యాంక్బండ్పై సెల్ఫీ కోసం లవ్ హైదరాబాద్ హోర్డింగ్ పెట్టడం, ఆదివారం సాయంత్రం ట్యాంక్మీద సండ్ఫండే కార్యక్రమాలు రావడం వెనుక మంత్రి కేటీఆర్ ఎంతో చొరవ చూపించారు. ఇదే ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సుల అంశాన్ని గుర్తు చేయగా కేటీఆర్ వేగంగా స్పందించిన విషయం అందరికీ తెలిసింది. కేటీఆర్ స్పందనతో ఆర్టీసీ సైతం డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. -
ట్యాంక్బండ్పై ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఓ డ్రైవర్ నిద్రమత్తు చిన్నారిని చిదిమేసింది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గుండెకోత మిగిల్చింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులు, డ్రైవర్ కూడా క్షతగాత్రులయ్యారు. బుధవారం తెల్లవారుజామున ట్యాంక్బండ్పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్రావు కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన దుస్సా శివకుమార్ (40) నగరంలోని నిర్మాణ సంస్థలో మేనేజర్ కాగా ఈయన భార్య సమత (36) సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాయదుర్గంలో నివసిస్తున్న వీరికి చిన్నారి సిరి (రెండేళ్లు పూర్తి) ఉంది. రైలులో కుటుంబంతో సహా బెల్లంపల్లి వెళ్లడానికి శివకుమార్ బుధవారం తెల్లవారుజామున క్యాబ్ (టీఎస్ 08 యూజీ 1939) బుక్ చేసుకున్నారు. రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వస్తున్న వీరి క్యాబ్కు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కౌశిక్ డ్రైవర్గా ఉన్నారు. ఈ వాహనం తెల్లవారుజాము 4.30 గంటకు ట్యాంక్బండ్పైకి చేరుకుంది. అదే సమయంలో ఈ వాహనానికి వ్యతిరేక దిశలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఎంహెచ్ 34 బీజీ 2877) వస్తోంది. ఈ బస్సు తన ముందు ఉన్న కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కుడి వైపునకు వచ్చింది. ఫలితంగా బస్సు ముందు కుడివైపు భాగంలో కారు ముందు కుడివైపు భాగం బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ కౌశిక్, వెనుక సీటులో కూర్చున్న శివకుమార్, సమతలకు తీవ్ర గాయాలు కాగా.. చిన్నారి సిరి అక్కడికక్కడే కన్ను మూసింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి, క్షతగాత్రులపై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అది డబుల్ లైన్ రోడ్... రహదారికి మధ్యలో అనేక రకాలైన గీతలు కనిపిస్తుంటాయి. ఒక్కో గీతకు ఒక్కో అంశానికి సూచికగా నిబంధనలు చెప్తుంటాయి. రోడ్డు మధ్యలో రెండు గీతలు పక్కపక్కనే ఉంటే దాన్ని డబుల్ లైన్ అంటారు. అలాంటి రహదారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్ టేకింగ్ చేయకూడదని అర్థం. ఒక గీత ఉండే దాన్ని సింగిల్ లైన్ అంటారు. దీనిపై ఓవర్ టేకింగ్ నిషిద్ధం. దూరందూరంగా ఉండే గీతలతో కూడిన బ్రోకెన్ లైన్ ఉన్న మార్గంలో మాత్రమే ఎదుటి వా హనాల పరిస్థితిని బట్టి ఓవర్ టేక్ చెయ్యాలి. ట్యాంక్బండ్ డబుల్ లైన్ రోడ్. అయినప్పటికీ బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడం, నిద్రమత్తు ఈ ప్రమాదాలకు కారణమయ్యాయి. గత నెలలోనే రెండో పుట్టినరోజు శివకుమార్కు ఛాతి, తల భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. సమతకు రెండు చేతులూ విరిగిపోగా, తల, తుంటి భాగాల్లోనూ గాయాలయ్యాయి. కౌశిక్ ఎడమ చేయి విరగ్గా..ముఖం మీదా గాయాలయ్యాయి. శివకుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. శివకుమార్ బావ జగదీష్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు. శివకుమార్, సమతలకు వివాహమైన పదేళ్లకు సిరి జన్మించింది. గత నెల 15నే చిన్నారి రెండో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే ఇంతటి విషాదం చోటు చేసుకోవడంతో వారి బంధుమిత్రులు దుఖసాగరంలో మునిగిపోయారు. చదవండి: 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే.. -
ఈ ఆదివారం ట్యాంక్బండ్పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే!
సాక్షి, లక్డీకాపూల్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే ప్రమాదముందనే సంకేతాలతో చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన వైద్యశాఖ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ట్యాంక్బండ్పై ఈ నెల 5న జరిగే సండే– ఫన్డేను రద్దు చేస్తున్నట్లు బుధవారం మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు. చదవండి: నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణం -
ట్యాంక్బండ్పై సందర్శకుల హడావిడీ, సందడిగా చార్మినార్
-
ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ..
World Biggest Cricket Bat Unveiled In Hyderabad: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బ్యాట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై శనివారం ఆవిష్కరించబడింది. పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బ్యాట్ పొడవు 56.1 అడుగులు కాగా, బరువు 9 టన్నులుగా ఉంది. పాప్లర్ ఉడ్తో తయారు చేసిన ఈ బ్యాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకు విషెస్ చెబుతూ.. ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్ను ట్యాంక్ బండ్పై ఉంచారు. ఈ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, తెలంగాణ పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్ను ఆవిష్కరించిన అజారుద్దీన్,జయేశ్ రంజన్
-
ఆహ్లాద తీరం..
-
కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ 106వ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి బాపూజీ అని దత్తాత్రేయ కొనియాడారు. అలాంటి వ్యక్తితో కలసి పనిచేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను, గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు తెలిపే రీతిలో అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్య క్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం పాల్గొన్నారు. స్పీకర్ నివాళి స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుక శాసనసభ భవనంలోని ఆడిటోరియం హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు. -
నేడు ట్యాంక్బండ్పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్బండ్పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్ డే’ మళ్లీ షురూ
-
ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్ డే’ మళ్లీ షురూ
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్డే’ సందడి మళ్లీ షురూ కానుంది. గణేష్ విగ్రహ నిమజ్జనం కారణంగా గత వారం నిలిపివేసిన సండే ఫండే కార్యక్రమం ఈ ఆదివారం (సెప్టెంబరు 26) తిరిగి మొదలు కానుంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ ఈవెంట్ మరింత రంగులమయం అవనుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 26, ఆదివారం సాయంత్రం 5 నుంmr రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్ సందర్శకులకు బాణాసంచా ప్రదర్శనతోపాటు తెలంగాణ సాంప్రదాయ జానపద కళల ప్రదర్శన కనులవిందు కానుంది. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ బ్యాండ్, ఉత్తమ తెలుగు పాటలను అందించే ఆర్కెస్ట్రా ఉంటాయి. దీంతోపాటు ఒగ్గు డోలు, గుస్సాడి, బోనాలు కోలాటం వంటి జానపద కళల ప్రదర్శనల భారీ సందడి ఉండనుంది. అంతేకాదు తినుబండారాలు, చేనేత వస్త్రాలు, హస్తకళ స్టాల్లు, ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణీ కూడా ఉంది. కాగా ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు అనుమతి ఉండదు. అయితే కోవిడ్-19 ప్రోటోకాల్ను కచ్చితంగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణలు తెలంగాణా పోలీస్ బ్యాండ్ ఆర్కెస్ట్రా - తెలుగు పాటలు ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు కోలాటం బాణాసంచా వెలుగులు తినుబండారాలు చేనేత, హస్తకళల ప్రదర్శన ఉచిత మొక్కలు పంపిణీ.. ఇంకా ఎన్నో #TankBund Sunday-Funday is back on sept 26th from 5-10 pm Attractions : 1. TS Police Band 2. Orchestra - Telugu songs 3. Oggu Dolu, Gussadi & Bonalu Kolatam 4. Fireworks 5. Eateries 6. Handlooms & handicraft 7. Free saplings by @HMDA_Gov & many more @KTRTRSghmc pic.twitter.com/ikGfZ9EbsE — Arvind Kumar (@arvindkumar_ias) September 23, 2021 -
Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే
సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. ‘కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. మహాగణపతి క్రేన్ నంబర్–4 ► ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనం క్రేన్ నంబర్–4 వద్ద జరిగేలా ఏర్పాట్లు చేశారు. ► 2.5 కి.మీ. మేర సాగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ప్రక్రియ మొత్తం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ► బెంగళూరు నుంచి ప్రత్యేక భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. ► ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ► 11 గంటల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెం.4 వద్దకు చేరుకోగానే 12 గంటల నుంచి 1 గంట మధ్య నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఇలా... మహాగణపతి మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సెన్షేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా మీదుగా టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. బాలాపూర్ గణేష్ ఎటు వైపు నుంచి? బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు 17 కి.మీ. గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలోని ఫలక్నుమా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. శనివారం రాత్రి వరకు కొంత పూర్తయ్యే అవకాశం ఉందని..రాత్రి సమయంలో ట్రయల్ రన్ వేసి..సజావుగా సాగితే బాలాపూర్ గణేష్తో పాటు 15 అడుగులకు మించిన మూడు నాలుగు విగ్రహాలను కూడా ఇదే బ్రిడ్జి మీదుగా అనుమతిస్తామని సీపీ తెలిపారు. ట్రయల్ రన్లో విఫలమైతే కందికల్ గేట్ నుంచి లాల్దర్వాజా మీదుగా సాగర్ వైపు మళ్లిస్తామని చెప్పారు. ► కేశవగిరి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు విగ్రహాలు పాత చాంద్రాయణగుట్ట పీఎస్– చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్– నల్లవాగు–కందికల్గేట్ ఫ్లైఓవర్– ఓపీ ఛత్రినాక– లాల్దర్వాజాగుడి–నాగుల్చింత–చార్మినార్–మదీనా–అఫ్జల్గంజ్– ఎస్బజార్–ఎంజేమార్కెట్– అబిడ్స్–బషీర్బాగ్–లిబర్టీ–అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, (నెక్లెస్ రోడ్) లేదా ఎగువ ట్యాంక్బండ్ వెళ్తాయి. ► సికింద్రాబాద్ మీదుగా వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఆర్పీ రోడ్ నుంచి ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్– కవాడిగూడ– ముషీరాబాద్ క్రాస్ రోడ్– ఆర్టీసీ క్రాస్రోడ్– నారాయణగూడ క్రాస్ రోడ్– హిమాయత్నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీలో ప్రధాన మార్గంలో కలవాలి. ► చిలకలగూడ క్రాస్రోడ్ నుంచి వచ్చే వాహనాలు గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్లో కలవాలి. ► ఉప్పల్ నుంచి వాహనాలు రామంతాపూర్– 6 నంబర్ జంక్షన్ అంబర్పేట– శివంరోడ్– ఎన్సీసీ– దుర్గాభాయి దేశ్ముఖ్ ఆసుపత్రి– హింది మహావిద్యాలయ్ క్రాస్రోడ్– ఫీవర్ ఆసుపత్రి– బర్కత్పుర క్రాస్ రోడ్– నారాయణగూడ క్రాస్రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే మార్గంలో కలవాలి. ► దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్ సదన్– సైదాబాద్– చంచల్గూడ నుంచి ముసారాంబాగ్ మీదుగా అంబర్పేట మార్గంలో కలవాలి. ► తార్నాక నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ దూరవిద్యా కేంద్ర రోడ్ నుంచి అడిక్మెట్ నుంచి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి మార్గంలో కలవాలి. ► టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు మాసబ్ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్– నిరంకారీ భవన్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లాలి. ► ఎర్రగడ్డ నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్నగర్– అమీర్పేట–పంజగుట్ట–వీవీ విగ్రహం నుంచి మెహదీపట్నం మీదుగా నిరంకారీ భవన్ వైపు మళ్లాలి. ► టపాచబుత్ర, ఆసిఫ్నగర్ మీదుగా వచ్చే వాహనాలు సీతారాంబాగ్– బోయిగూడ కమాన్– వౌల్గా హోటల్– గోషామహల్ బారాదరి– అలాస్కా మీదుగా ఎంజే మార్కెట్ ప్రధాన మార్గంలో కలవాలి. ఇక్కడ్నుంచి అబిడ్స్ మీదుగా బషీరాబాగ్–లిబర్టీ– అంబేద్కర్ విగ్రహం– ఎన్టీఆర్ మార్గ్– పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా ఎగువ ట్యాంక్బండ్కు చేరుకోవాలి ► సుమారు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్త్ను ఏర్పాటు చేశారు. హోంగార్డ్లు, స్పెషల్ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు ఉన్నారు. ► సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, జంక్షన్లలో వజ్ర వాహనాలను, గ్యాస్ ఎస్కార్ట్, వాటర్ వెహికిల్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. 19 సైబర్ ట్యాచ్ టీమ్, బాంబ్ డిస్పోజ్ టీమ్ను ఏర్పాటు చేశారు. 24 స్నిపర్ డాగ్స్ కూడా బందోబస్త్లో పాల్గొంటున్నాయి. ► రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, సాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే పోలీసులు వద్ద ఉన్న 2,700 వైర్లెస్ సెట్స్తో పాటు అదనంగా 475 సెట్లను అందించారు. ► హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇరిగేషన్, మెట్రో, ట్రాన్స్పోర్ట్ విభాగాలలతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ► సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి కనుగుణంగా చెరువులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ► హుస్సేన్సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం. సోమవారం ఉదయం లోపే పూర్తి.. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అవసరమైన మేర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయి. మూడు కమిషనరేట్లతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి విగ్రహాలు తరలివస్తాయి. సుమా రు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నాం. సోమ వారం ఉదయం 5:30 వరకు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ కోవిడ్ నిబంధనలు పాటించాలి వినాయక నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తులు, నిర్వాహకులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. నిమజ్జనానికి వచ్చే మార్గాలలో ఎలాంటి వాహనాలు, నిర్మాణ సామగ్రి వంటివి నిలిపి ట్రాఫిక్ జామ్లకు గురిచేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు సహకరించాలి. – మహేశ్ ఎం. భగవత్, సీపీ, రాచకొండ వదంతుల్ని ఫార్వర్డ్ చేయొద్దు భక్తులు తమ పిల్లల్ని, వెంట తెచ్చుకునే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు. వాట్సాప్ గ్రూప్లకు అనవసర మెసేజ్లను ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ 94906 17444 వాట్సాప్లో గానీ ఫిర్యాదు చేయాలి. మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 94936 22395 నంబరులో ఫిర్యాదు చేయాలి. – స్టీఫెన్ రవీంద్ర, సీపీ, సైబరాబాద్ -
నేడే ‘గణ’ వేడుక
సాక్షి, హైదరాబాద్: సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. చదవండి: గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే ఉత్సవాలు వైవిధ్యభరితమైన హైదరాబాద్ మహానగర చరిత్రకు ఒక సమున్నతమైన ఆధ్యాత్మిక ఆవిష్కరణ. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు అడుగడుగునా కొలువుదీరిన విభిన్న మూర్తుల గణనాథుడి ఉత్సవంతో నగరం సరికొత్త కాంతులను సంతరించుకుంటుంది. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందో త్సాహాలతో కొలిచి మొక్కారు. ‘ కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వ యంతో సకల ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి మొదలయ్యే నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంది. ►వివిధప్రాంతాల నుంచి హుస్సేన్సాగర్కు శోభాయాత్ర మార్గాలు: 320 కి.మీ. ►ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేసేందుకు యాక్షన్ టీమ్స్ : 162 ►గణేశ్ యాక్షన్ టీమ్స్ సిబ్బంది : 8,116 ►నిమజ్జనం జరిగే ప్రాంతాలు : 33 చెరువులు, 25 కొలనులు. ►విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉన్న క్రేన్లు: 316 ►ట్యాంక్బండ్ పరిసరాల్లో క్రేన్లు: 40 ►అంచనా వ్యర్థాలు: 3,910 మెట్రిక్ టన్నులు ►చెత్తను తరలించేందుకు పెద్ద వాహనాలు: 44, మినీ టిప్పర్లు: 39, జేసీబీలు:21 ►ఫైర్ వాహనాలు : 38 ►బారికేడింగ్స్ : 12 కి.మీ. ►వాటర్ప్రూఫ్ టెంట్లు : 15 ►తాగునీటి పంపిణీ శిబిరాలు: 101 ►అందుబాటులో వాటర్ప్యాకెట్లు: 30 లక్షలు ►హుస్సేన్సాగర్ వద్ద ట్రాన్స్ఫార్మర్లు: 48 ►అన్ని నిమజ్జనప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు: 101 ►తాత్కాలిక వీధి దీపాలు: 41,284 ►ట్యాంక్బండ్ పరిసరాల్లో ఎల్ఈడీ లైట్లు: 2600 ►హుస్సేన్సాగర్ వద్ద బోట్లు : 9 ►ట్యాంక్బండ్ వద్ద స్విమ్మర్లు: 32 ►పంపిణీకి అందుబాటులో మాస్కులు: 5 లక్షలు ►శోభాయాత్ర మార్గంలో, చెరువుల వద్ద శానిటైజర్లు ►విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది: 19000 ►ట్యాంక్బండ్పై అంబులెన్సులు: 2 పోలీస్ కంట్రోల్రూమ్స్: 2 ►ఆయా ప్రాంతాల్లో వాచ్ టవర్లు ►ఎన్టీఆర్ మార్గ్లో వాటర్బోర్డు, టీఎస్ఎస్ పీడీసీఎల్, జీహెచ్ఎంసీల కంట్రోల్రూమ్స్. ►సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తికనుగుణంగా చెరు వులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ►హుస్సేన్సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక వ్యాక్సినేషన్ శిబిరం శనివారం రాత్రి హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహ నిమజ్జనం హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహ మూద్అలీలతోపాటు డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్లో ఏరియల్వ్యూ ద్వారా పరిశీలిస్తారు. వాటర్ బోర్డు మంచి నీటిసరఫరా గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు.అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో ►నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల (సోమవారం తెల్లవారు జాము)వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ►నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్ హుస్సేన్సాగర్కు చేరుకునేం దుకు వీలుగా ఆర్టీసీ 565 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు వరకు, మెహదీపట్నం, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ వరకు ఈ బస్సులు నడుస్తాయి. ►ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమ వారం ఉదయం 4 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా 8 ఎంఎం టీఎస్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణమ ధ్య రైల్వే చర్యలు చేపట్టింది. లింగంపల్లి– సికింద్రాబాద్, నాంపల్లి– లింగపల్లి, ఫలక్నుమా– సికింద్రాబాద్, నాంపల్లి– ఫలక్నుమా రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. -
గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆదివారం గణేష్ నిమజ్జనం దృష్టా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనుంది. రేపు అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అంతేగాక ఈ అర్థరాత్రి నుంచి అంతరాష్ట్ర వాహనాల ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అదే విధంగా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లేవారు ప్రత్యేక మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లు మరోవైపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి పోలీసులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై ఎలాంటి సమస్య తలెత్తకుండా భారీ క్రేన్స్తో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్బండ్పై 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లను ఉంచారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చదవండి: Ganesh Idol Immersion: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ మహాగణపతి నిమ్మజనం 2.5 కిలోమీటర్ల పొడవునా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర సాగనుంది. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ మహాగణపతి నిమ్మజనం జరగనుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. చదవండి: రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ 20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి ట్రాఫిక్ అదనపు సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. నిమజ్జనం సాఫీగా జరిగేందుకు ట్రాఫిక్ విభాగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. క్రేన్లు క్విక్ రిలీజ్ పద్దతిలో విగ్రహాలు నిమజ్జనం చేస్తాయని, దీని వల్ల విగ్రహాల నిమజ్జనం తొందరగా అవుతుందన్నారు. ప్రతిచోట సైన్ బోర్డ్లు ఏర్పాటు చేశామని, ఫ్లై ఓవర్ నిర్మాణాల వల్ల కొన్ని చోట్ల శోభాయాత్ర దారి మళ్లింపు చేస్తున్నామని తెలిపారు. ఫలక్నుమా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వల్ల ప్రత్యామ్నయ దారిలో శోభాయాత్ర దారి మళ్లించామని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పెద్ద విగ్రహాల వెంట 8 మంది భక్తులు, చిన్న విగ్రహాల వెంట నలుగురు మాత్రమే రావాలని కోరారు. 20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి చేసేలా ప్రతి ఒక్క మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు. -
HYD : ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు
-
5వ రోజు గణేష్ నిమజ్జనం
-
హైదరాబాద్లో అర్థరాత్రి యువకులు హంగామా
-
ట్యాంక్ బండ్పై సండే - ఫండే కార్యక్రమం... ఆకట్టుకున్న లేజర్ షో
-
ట్యాంక్బండ్లో 3వ రోజు గణేష్ నిమజ్జనం
-
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్
-
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవతి సందర్భంగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా అధికారులు ట్యాంక్ బండ్పై ట్రయల్ నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఖాళీ డ్రమ్ పెట్టి ఎక్స్పరిమెంట్ చేశారు.. అలానే థర్మకోల్ పెట్టి మరోకటి చేశారు. (చదవండి: ‘ట్యాంక్బండ్ ఎలా ఉందండి.. సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది’) ఇది కొత్త ప్రోగ్రాం అన్నారు సీపీ అంజనీ కుమార్. నిమజ్జనం కోసం 3 ఏళ్ల క్రితం ఆటోమేటిక్గా రిలీజ్ చేసే యంత్రాలు ఉపయోగించారని తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ , పీవీఆర్ మార్గ్లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. -
ట్యాంక్బండ్పై సండే సందడి
సాక్షి, కవాడిగూడ: ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం సందడి నెలకొంది. సాయంత్రం వేళ ట్యాంక్బండ్పై సందర్శకులకు అనుమతివ్వడంతో హుస్సేన్సాగర్ అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులు సైకిలింగ్ చేస్తూ మురిసిపోయారు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి కుటుంబసభ్యులతో డిప్యూటీ మేయర్ ఆటవిడుపులో డిప్యూటీ మేయర్... జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్బండ్కు కుటుంబ సమేతంగా ఇలా రావడం పిక్నిక్ వచ్చినట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ సంతోషాన్ని వ్యక్త పరిచారు. చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ ప్రభాకర్రెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ట్యాంక్ బండ్: ఆదివారం.. ఆనంద విహారం
-
‘ట్యాంక్బండ్ ఎలా ఉందండి.. సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్యాంక్బండ్ను కేవలం సందర్శకులకు మాత్రమే కేటాయించారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తొలి రోజైన ఆదివారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పోలీసులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన సందర్శకులతోనూ ఆయన ముచ్చటించారు. ట్యాంక్బండ్ వద్ద కొత్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఆదివారం నెలకొన్న వాతావరణం నేపథ్యంలో సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది. గడిచిన ఏడేళ్ల కాలంలో నగరంలో సుందరీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధి, విస్తరణకు సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులు అమలయ్యాయి. హైదరాబాద్కు ట్యాంక్బండ్ ఒక ల్యాండ్మార్క్ లాంటిది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కచ్చితంగా దీన్ని సందర్శిస్తారు. ప్రపంచలో ప్రసిద్ధిగాంచిన నగరాలైన చికాగో, న్యూయార్క్, పారిస్ల్లో వాటర్ ఫ్రంట్ ఏరియాలన్నీ కేవలం సందర్శకుల కోసమే ఉంటాయి. ఈ రోజు నుంచి ట్యాంక్బండ్ వద్దా ఈ విధానం అమలుకావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్బండ్ వద్దకు విహారానికి రండి. మీ భద్రత కోసం పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న ఏర్పాట్లను మరింత పెంచుతున్నాం’ అని అంజనీకుమార్ పేర్కొన్నారు. కొత్వాల్తో పాటు మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ తదితర అధికారులూ ఉన్నారు. ఆ సమయంలో ట్యాంక్బండ్పై ఉన్న సందర్శకులతోనూ అంజనీకుమార్ మాట్లాడారు. ఇలా ఉన్న ట్యాంక్బండ్ను చూసి ఎలా ఫీల్ అవుతున్నారంటూ కొత్వాల్ అడగ్గా... పాండిచ్చేరిలా ఉందంటూ ఓ సందర్శకురాలు సమాధానమిచ్చారు. -
కొత్తకొత్తగా.. ట్యాంక్బండ్.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: అటు హుస్సేన్ సాగర్ అలల హొయలు.. ఇటు చల్లని మలయమారుత వీచికలు.. తథాగతుడి నిర్మల వదనం.. ఆకాశంలో అలా అలా సాగిపోయే మబ్బుల అందం.. వెరసీ భాగ్యనగర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితమైంది. సందర్శకుల సర్గధామమైన ట్యాంక్బండ్ ఇందుకు వేదికగా నిలిచింది. నగర వాసుల అపురూప అనుభవాలకు ఆలవాలమైంది. ట్యాంక్బండ్పై సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధింపులో భాగంగా తొలి ఆదివారం సందర్శకులు ఆహ్లాదభరితంగా గడిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో అన్ని వర్గాల ప్రజలు ట్యాంక్బండ్పై ఆనందంగా విహరించారు. విద్యుత్ కాంతుల ధగధగల్లో హుస్సేన్సాగర్, బుద్ధ విగ్రహం అందాలను వీక్షించారు. సందర్శకుల సౌకర్యార్థం పోలీసులు ట్యాంక్బండ్ ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Glad Hyderabadis welcomed a new look & traffic free tank bund initiative that was piloted today 😊 pic.twitter.com/nsc40hK4P8 — KTR (@KTRTRS) August 29, 2021 Peaceful. ☮️ The Cool breezy air. Tankbund ki Dad tho saradaga ala walk ki ravadam jarigindi. ❤️ Wonderful decision anna @KTRTRS 🥳❤️ pic.twitter.com/54qXP1my5D — Prêē™️ (@AmIPreetham_) August 29, 2021 -
హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ట్రాఫిక్ ఆంక్షలు
-
‘కట్ట’లతోనే మమ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ట్యాంక్బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పం చేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించ తలపెట్టిన మినీ ట్యాంక్బండ్ పనులు ఎక్కడివక్క డే ఆగిపోయాయి. పనులు మొదలుపెట్టి నాలుగేళ్లయినా.. డబ్బులొచ్చే కట్టపనులు మాత్రమే చేసిన కాంట్రాక్టర్లు మిగతా సుందరీకరణ పనులు చేయకుండా చేతులెత్తేశారు. పనుల పూర్తిని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేక..నిధుల విడుదల్లేక ఆహ్లాదం పంచాల్సిన ట్యాంక్లు కళావిహీనంగా మారాయి. సగం మాత్రమే పూర్తి... చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్బండ్లను మంజూరు చేశారు. ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మినీ ట్యాంక్బండ్లను రూ.571.53 కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.290 కోట్ల మేర పనులే పూర్తయ్యాయి. 50చోట్ల మాత్రమే పూర్తిస్థాయి ట్యాంక్బండ్ల నిర్మాణం పూర్తవగా చాలా చోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మట్టిపనితో కూడిన కట్ట నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ పనులు మాత్రమే చేశారు. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగించి, బిల్లులు తీసుకొని మమ అనిపించారు. ఇవి మినహా బతుకమ్మ ఘాట్లు, వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్ల పనులు చేయనేలేదు. చాలాచోట్ల కట్టలపై రోడ్డు నిర్మాణాలు జరుగక ట్యాంక్బండ్ దగ్గరకు సైతం వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల పట్టణాల నుంచి మురుగు ట్యాంక్బండ్ల్లోకే వచ్చి చేరుతూ కంపుకొడుతున్నాయి. నిర్మాణ నిబంధనలు ఇవి.. మినీ ట్యాంక్ బండ్ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్లతో నిర్మించి రోడ్డు వేయాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. నిధుల్లేక నీరసం... ట్యాంక్బండ్ల పనులు నత్తనడకకు నిధుల లేమి సైతం సమస్యగా మారింది. మిషన్ కాకతీయ సమయంలోనే ఈ పనులూ చేపట్టారు. చెరువుల పను లు చేసిన కాంట్రాక్టర్లే చాలా చోట్ల మినీ ట్యాంక్బండ్ పనులు చేపట్టారు. చెరువులు, మినీ ట్యాంక్బండ్లకు కలిపి మొత్తంగా రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో మినీ ట్యాంక్బండ్లకు సంబంధించి రూ.100 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఓ వైపు చెరువుల బిల్లు లు రాక, మినీ ట్యాంక్బండ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను పూర్తిగా నిలిపివేశారు. మహబూబాబాద్లోని నిజాం చెరువుకు రూ.5.50 కోట్లు కేటాయించారు. రెండున్నరేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా నేటికి 30 శాతమే పూర్తయ్యాయి. కట్ట పనులు, పంట కాల్వ, మత్తడి పనులు పూర్తి కాగా.. పార్క్, వాకింగ్ ట్రాక్, బ్రిడి ఇతర పనులు చేయాలి. కాంట్రాక్టర్కు రూ.2 కోట్లు చెల్లించారు. గడువులు దాటుతున్నా పనులు సాగడం లేదు. చెరువు నుంచి గోపాలపురం వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేసి ఏడాదిన్నరయినా పనులు పూర్తి కాలేదు. మరమ్మతులు లేక తెగిపోయిన నిజాం చెరువుకట్ట భైంసాలోని సుద్ధవాగు(గడ్డెన్నవాగు) ప్రాజెక్టులోనే ఓ వైపు మినీ ట్యాంక్బండ్ పేరిట పనులను చేపట్టారు. 2017, మార్చి 9న శంకుస్థాపన చేశారు. రూ.3.64 కోట్లతో పనులు చేపట్టగా, రూ.2.42 కోట్ల పనులు పూర్తయినట్లు చూపారు. ప్రాజెక్టు పక్కనే లోతైన గుంతలతో ఉన్న ప్రాంతాన్ని మొరంతో నింపారు. నీళ్లున్నవైపు బతుకమ్మ ఘాట్ నిర్మించారు. చుట్టూ రెయిలింగ్ వేసి, పార్క్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. అసలు ఆ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. మధ్యలో సీసీ పేవ్మెంట్ వేసి వదిలేశారు. భైంసా పట్టణంలోని మినీ ట్యాంక్బండ్ -
‘ట్యాంక్బండ్పై విహారం’ రేపటి నుంచే.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్ ఈ ఆదివారం సాయంత్రం నుంచే పెడ్రస్టియన్ జోన్గా మారుస్తున్నారు. ఆ రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దీనిపైకి కేవలం సందర్శకుల్ని మాత్రమే అనుమతిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం జారీ చేశారు. ఆ సమయంలో ట్యాంక్బండ్ మీదుగా ప్రయాణించాల్సిన వాహనాలకు మళ్లింపులు విధించారు. గతంలో పేర్కొన్న వాటికి అదనంగా మరికొన్ని పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సాధారణ వాహన చోదకులు ఆ సమయంలో ట్యాంక్బండ్ మార్గంలో రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: హుస్సేన్సాగర్ని డంపింగ్ సాగర్గా మార్చారు.. ► లిబర్టీ వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ మీదుగా మళ్లిస్తారు. ►తెలుగుతల్లి వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, హిమాయత్నగర్ మీదుగా పంపిస్తారు. ► కర్బాలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు ప్రయాణించే వాహనాలు సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్బండ్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. ► ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు పాత సెక్రటేరియేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే సందర్శకుల కోసం ట్యాంక్బండ్పై అంబేడ్కర్ విగ్రహం నుంచి లేపాక్షి వరకు, డాక్టర్ కార్స్ వద్ద, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో, ఆంధ్రా సెక్రటేరియేట్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ► కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వారికి ట్యాంక్బండ్పై సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు, బుద్ధభవన్ వెనుక ఉన్న నెక్లెస్ రోడ్లో, ఎనీ్టఆర్ గ్రౌండ్స్లో పార్కింగ్ కల్పించారు. -
‘గణేష్ ఉత్సవాలను బాగా జరుపుకోవాలి’
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల నిర్వాహణపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల నుంచి కరోనా వలన గణేష్ ఉత్సవాలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అన్నారు. అయితే, ఈసారి దేవుని ఆశీస్సులతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నాం... గణేష్ ఉత్సవాలను కూడా ఇలానే జాగ్రత్తగా నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన కోసం.. ప్రత్యేకంగా క్రేన్స్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి ట్యాంక్ బండ్ నిండుకుండలాగా ఉందని అన్నారు. కాగా, విగ్రహల ఎత్తు గురించి ప్రభుత్వం ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వారు గణేష్ విగ్రహల ఏర్పాటుకి అనుమతి ఇస్తారని అన్నారు. చదవండి: Hyderabad: రెండు కేజీ బంగారు నగల బ్యాగు మిస్సింగ్ -
సండే.. ట్యాంక్బండ్ మీదే!
సాక్షి, సిటీబ్యూరో: ఆదివారాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్బండ్ వాహనాలకు నో ఎంట్రీ జోన్గా మారనుంది. ఆ సమయాల్లో కేవలం సందర్శకుల్ని మాత్రమే అనుమతించేలా ట్రాఫిక్ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. అశోక్ చంద్రశేఖర్ అనే నెటిజన్ ఈ ప్రతిపాదనలను కేటీఆర్కు మంగళవారం ట్వీట్ చేశారు. ‘మంచి సలహా’ అంటూ సానుకూలంగా స్పందించిన ఆయన..నగర పోలీసు కమిషనర్కు రీ–ట్వీట్ చేశారు. ఆయన నుంచి ఆదేశాలు అందుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తూ, ఈ సూచనల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై బుధవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించి, నిర్ణయం తీసుకోనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్కుమార్ తెలిపారు. విహార కేంద్రాల్లో కీలక ప్రాంతం.. నగరంలోని విహార ప్రాంతాల్లో ట్యాంక్బండ్ కీలకమైంది. ఇక్కడకు అనునిత్యం నగరానికి చెందిన వాళ్ల కుటుంబాలే కాకుండా పర్యాటకులూ పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. లిబర్టీ వైపు ఉన్న అంబేడ్కర్ విగ్రహం జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు ఉన్న వైశ్రాయ్ చౌరస్తా వరకు 2.6 కిలోమీటర్ల పొడవుతో ట్యాంక్బండ్ విస్తరించి ఉంటుంది. ఆద్యంతం పూర్తిస్థాయిలో సరాసరిన, ఎలాంటి టర్నింగ్స్ లేకుండా ఉండే రహదారి ఇది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రభుత్వం ఇటీవల కొత్త హంగుల్ని ఏర్పాటు చేసింది. దీంతో వారాంతాల్లో వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు... జంట నగరాలను కలిపే కీలక రహదారుల్లో ట్యాంక్బంక్ కూడా ఒకటి కావడంతో ఈ మార్గం అనునిత్యం రద్దీగా ఉంటుంది. ఒకప్పుడు దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పని దినాలతో పోలిస్తే ఆదివారం 25 శాతం ట్రాఫిక్ మాత్రమే ఉండేది. అయితే ఇటీవల కాలంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆ రోజునా ట్రాఫిక్ రద్దీ గరిష్టంగా 75 శాతానికి చేరుతోంది. ఫలితంగా కుటుంబాలతో ట్యాంక్బండ్ మీదికి విహారానికి వచ్చే వారికి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అశోక్ చంద్రశేఖర్ తన ట్వీట్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ రెండే ప్రధాన సమస్యలు... వాస్తవానికి చార్మినార్ మాదిరిగా ట్యాంక్బండ్ను కూడా పాదచారుల జోన్గా మార్చాలని ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్నాళ్లుగా యోచిస్తున్నారు. అయితే అక్కడ మాదిరిగా అన్ని రోజులూ కాకుండా కేవలం ఆది వారాల్లోనే దీన్ని అమలు చేయాలని భావించారు. తాజాగా ఇదే విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేయడంతో చర్యలు వేగవంతమయ్యాయి. ట్యాంక్బండ్ను ఆదివారం సాయంత్రం వాహనాలకు నో ఎంట్రీ జోన్గా మార్చడానికి రెండు ప్రధాన సవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సందర్శకుల వాహనాలను ఎక్కడ వరకు అనుమతించాలి? వీరికి పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చే యాలి? అనే సవాళ్ల పైనే దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. ఏళ్లుగా నిమజ్జనం రోజు అమలు... ప్రతి ఏడాదీ వినాయక నిమజ్జనంతో పాటు అవసరాన్ని బట్టి ఆ మరుసటి రోజు హుస్సేన్సాగర్ చట్టుపక్కల ప్రాంతాల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. అప్పట్లో ట్రాఫిక్ మళ్లింపులు చేసే ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టారు. రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్బండ్ నుంచి, రాణిగంజ్ వైపు వెళ్లే మార్గాలను పీవీ మార్గ్ మీదుగా పంపాలని యోచిస్తున్నారు. ఆయా మార్గాల్లో అధ్యయనం చేస్తున్న ట్రాఫిక్ విభాగం బృందాలు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, చక్కదిద్దాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఖరారైన తర్వాత దీని అమలుపై నోటిఫికేషన్ జారీ చేస్తామని, విస్తృత ప్రచారం కల్పిస్తామని ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Dalit Bandhu: హుజురాబాద్కు మరో రూ.500 కోట్ల నిధులు -
ట్యాంక్బండ్పై చూస్తుండగానే కాలిపోయిన కారు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్ మీదుగా వెళుతున్న ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ట్యాంక్బండ్పై వెళ్తున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు, పాదచారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు వెనక ప్రయాణిస్తున్న వారు దానిలో నుంచి మంటలు రావడం గమనించి.. కారులో ప్రయాణిస్తున్న వారికి ఈ విషయం చెప్పారు. దాంతో వారు కారును ఆపి వెంటనే కిందకి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన హైదరాబాద్ ట్యాంక్బండ్ బోట్స్ క్లబ్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే ఆర్పీ రోడ్లో నివాసముండే టి విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి. శుక్రవారం మధ్యాహ్నం విజయ్ కుమార్ అతని భార్యతో కలిసి ఓపెల్ కోర్స కారు నెంబర్ ఏపీ 10 క్యు 2888లో సచివాలయం సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ట్యాంక్బండ్ మీదుగా వెళ్తుండగా హోటల్ మారియట్ దాటి సెయిలింగ్ క్లబ్ వద్దకు రాగానే కారు వెనక నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతడి కారు వెనక ప్రయాణం చేస్తున్న వారు దీని గురించి విజయ్ కుమార్కు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన విజయ్ కుమార్, అతడి భార్య వెంటనే కారు దిగి పోయారు. కారు మంటల్లో కాలి పోతుందని ఫైర్ స్టేషన్కు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదని విజయ్ కుమార్ అన్నారు. ఈ ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో జరిగింది. ఈ సరిహద్దు తమది కాదంటే తమది కాదంటూ పోలీసులు చెప్పడంతో షాక్కు గురైన విజయ్ కుమార్ చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది. చదవండి: ట్యాంక్బండ్పై పల్టీ కొట్టిన కారు.. -
హైదరాబాద్: కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
-
హ్యాట్సాఫ్ ట్యాంక్బండ్ శివా..
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు యత్నించే వారి ప్రాణాలను రక్షిస్తూ.. గుర్తుతెలియని మృతదేహాలను బయటికి తెస్తున్న ‘ట్యాంక్బండ్ శివ’ సేవలు అభినందనీయమని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. శివకు వచ్చిన విరాళాలతో పేదలకు సేవ చేసేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం, దానికి తన పేరు పెట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి సోనూసూద్ అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిస్వార్థంగా సమాజానికి సేవలు అందించేందుకు ట్యాంక్బండ్ శివ లాంటి వ్యక్తులు ముందుకు రావాలని సూచించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సేవాభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. పేదలకు శివ తనవంతు సహాయం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. శివకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. అనంతరం ట్యాంక్బండ్ శివ మాట్లాడుతూ.. దాతలు ఇచ్చిన విరాళాలతో పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే అంబులెన్స్ను కొన్నానని చెప్పారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సినీ నటుడు సోనూ సూద్ను ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారు. దీనికి సోనూసూద్ అంబులెన్స్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. అంబులెన్స్ను స్వయంగా సోనూసూద్ వచ్చి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో విరాళాలు అందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జైసింహ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా దుర్గామాత నిమజ్జనం
-
ట్యాంక్బండ్ వద్ద కారు ప్రమాదం
-
ట్యాంక్బండ్పై పల్టీ కొట్టిన కారు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్పై ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. అతి వేగంగా వస్తున్న నిసాన్ కారు ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు రాగానే పల్టీ కొట్టడంతో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచుకుంది. కారులో ఉన్న వారంత స్వల్ప గాయాలతో భయటపడ్డారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసలు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు. కారు ప్రమాదంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాహనాల నడిపే చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని ప్రాథమిక సమాచారం. (హైదరాబాద్లో భారీ వర్షాలు.. హైకోర్టు ఉద్యోగి మృతి) -
ట్యాంక్బండ్పై చితకబాదిన ట్రాన్స్జెండర్స్
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని ట్రాన్స్జెండర్స్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని ట్యాంక్బండ్పై ఓ వ్యక్తి ట్రాన్స్ జెండర్స్తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గుంపుగా వచ్చిన వారు ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలోనే వారి నుంచి తప్పించుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటపడ్డాడు. కొంతదూరం తరిమినప్పటికీ మళ్లీ వారి చేతికిచిక్కలేదు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ వీడియాలో వైరల్గా మారింది. ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియరాలేదు. -
నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు గంగమ్మ ఒడికి గణనాథుడు తరలనున్నాడు. దీంతో ఊరేగింపు, నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఘట్టం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అదనపు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల బైండోవర్, వారిపై నిఘా ఉంటుంది. ఏటా నిమజ్జన కార్యక్రమం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సాగుతోంది. దీంతో ఈ ఏడాది మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీల సహకారంతో మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాములోపు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. విగ్రహాల తరలింపునకు వాహనాలు లభించని వారికి పోలీసులే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు హ్యాండ్ హెల్డ్ కెమెరాలను వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు సాయుధ బలగాలూ మోహరించనున్నాయి. విధుల్లో ఉండే సిబ్బందికి షిఫ్ట్ విధానం అమలు చేస్తూ వారికి అవసరమైన ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో మాస్క్లు, శానిటైజర్లు, ఫేస్షీల్డ్స్ అందిస్తున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీసు అధికారులు ఇతర విభాగాలతో పాటు శాంతి, మైత్రి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారు. ఏర్పాట్ల వివరాలివి నిమజ్జనం జరిగే ప్రదేశాలు: ట్యాంక్బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్పేట చెరువు, సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్, సఫిల్గూడ/మల్కాజ్గిరి చెరువులు, హస్మత్పేట చెరువు. హుస్సేన్సాగర్కు వచ్చేవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు శివారులోని మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని విగ్రహాలు. ఊరేగింపుల్లో డీజేలు నిషేధం: నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఇలాంటి తీవ్రమైన శబ్దం వచ్చే వాటివల్ల పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థకు నష్టం ఉంటుంది. మద్యం విక్రయాలు బంద్: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. -
‘భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం కోసం పోలీసు శాఖ పకడ్భంది ఏర్పాట్లు చేసిందన్నారు. గత వారం నుంచి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటి వరకు 30 వేల విగ్రహాలను నిమజ్జనం అయ్యాయని తెలిపారు. మంగళవారం రాత్రి వరకు ఐదు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తున్న 165 విగ్రహాలు, మూడు నుంచి ఐదు ఫీట్ల వరకు ఉన్న 1239, మూడు ఫీట్ల కంటే తక్కువ ఉన్న 1842 విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయని, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. మొత్తం 21 క్రేన్లను ట్యాంక్బండ్పై ఏర్పాటు చేశామని చెప్పారు. 1500పైగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ట్యాంక్బండ్పై ఇతర వాహనాలకు అనుమతి లేదని, పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశామని చెప్పారు. -
హుస్సేన్సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం సందడి
-
ట్యాంక్బండ్లో 5వ రోజు గణేష్ నిమజ్జనం
-
ట్యాంక్బండ్లో 3వ రోజు గణేష్ నిమజ్జనం
-
నీరా స్టాల్తోపాటు తెలంగాణ వంటకాల ఫుడ్కోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన నీరాస్టాల్తోపాటు తెలంగాణ వంటకాలతో ఒక ఫుడ్కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద ఉన్న స్థలాన్ని సోమవారం ఆయన ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్కుమార్, టూరిజం ఎండీ మనోహర్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుల వృత్తులను కాపాడేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. అందులో భాగంగా గౌడ కులవృత్తిని ఆదుకోవడానికి నీరాను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. -
చాలామంది పోలీసులకు గాయాలు అయ్యాయి..
-
చాలామంది పోలీసులు గాయపడ్డారు..
సాక్షి, హైదరాబాద్: చలో ట్యాంక్బండ్కు అనుమతి లేదని..అయినా వినకుండా పెద్దసంఖ్యలో కార్మికులు ట్యాంక్బండ్ వైపు చొచ్చుకు వచ్చారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ మధ్యాహ్నం సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో చాలామంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ దాడిలో అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీ రత్నం, సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ శేఖర్, కానిస్టేబుల్ రాజు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పెద్దసంఖ్యలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు.’ అని తెలిపారు. -
ఛలో ట్యాంక్ బండ్కు పోలీసుల నో పర్మిషన్..!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలు మగ్దూం భవన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పినా కూడా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాంక్బండ్పై సభకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ కమిషనర్ను కోరితే.. నిరాకరించారని వారు వెల్లడించారు. ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్టులపై ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు చర్చించారు. కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, కె.నారాయణ, తమ్మినేని వీరభద్రం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఛలో-ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి కోరినా పోలీసులు ఇవ్వడం లేదు. ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం. ఏదేమైనా శనివారం మధ్యహ్నం చలో ట్యాంక్ బండ్ జరిపి తీరుతామని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రికి సోయి రావటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి విడిపోకుండా.. విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు టీఎస్ ఆర్టీసీకి లేదని ఆయన చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండా.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే హక్కు కేసీఆర్కు లేదని వెల్లడించారు. కార్మికులకు మద్దతుగా సామూహిక నిరసన దీక్షలకు దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. -
సద్దుల బతుకమ్మ వేడుకలు..
-
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’ అంటూ ఆడపడుచులు బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల వర్షం బతుకమ్మ వేడుకలకు ఇబ్బందిగా మారింది. అయినా మహిళలు వర్షాన్ని లెక్కచేయకుండా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ప్రభుత్వ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆడేందుకు నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. సద్దుల బతుకమ్మ వేడుకలు.. సిద్ధిపేట జిల్లా కోమటిచెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మంత్రి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులతో కలిసి ఆయన బతుకమ్మ, దాండియా ఆడారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. -
‘ట్యాంక్బండ్ వద్ద తొలి నీరా స్టాల్’
ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్బండ్ పరిసరాల్లో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. సాక్షి, హైదరాబాద్ : త్వరలో రాష్ట్ర రాజధానిలో నీరా స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్బండ్ పరిసరాల్లో త్వరలో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఏర్పాటు చేసేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం బేగంపేట పర్యాటక భవన్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. నీరా పానీయాన్ని జనానికి చేరువ చేస్తామని గతంలో ప్రభుత్వాలు పేర్కొన్నా.. మాట నిలబెట్టుకోలేదని, గీత కార్మికుల సంక్షేమ చర్యల్లో భాగంగా నీరా విక్రయించే స్టాళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. ఆరోగ్య ప్రదాయిని అయిన నీరా వల్ల సాధారణ ప్రజలకు మేలు కలగటమే కాకుండా, దాన్ని విక్రయించే స్టాళ్ల ఏర్పాటుతో గీత కార్మికులకు ఉపాధి మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ స్టాళ్ల బాధ్యతను గౌడ కులస్తులకే అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు గౌడ కులస్తుల పక్షాన కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఔషధ గుణాలు నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి చెప్పారు. కంబోడియా, ఆఫ్రికాలోని పలు దేశాలు, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంకలో దీని ఉత్పత్తి ఎక్కువగా ఉందని, ఇప్పుడిప్పుడే అమెరికాలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేరళ, మహారాష్ట్రల్లో నీరా విక్రయాలున్నాయని, తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టాల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. అన్ని కులాల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నామని, హైదరాబాద్లో ఆయా కులాలకు సంక్షేమ భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ట్యాంక్బండ్లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
-
ట్యాంక్ బండ్ : గణేష్ నిమజ్జనాల కోలాహలం
-
భారీగా పడిపోయిన ప్రభుత్వ ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్ వచ్చిందంటే చాలు... ట్యాంక్బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడతాయి. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. నగరవాసులే కాకుండా సిటీకి వచ్చే పర్యాటకులూ ఈ ప్రాంతాలను చూడకుండా వెళ్లరు. అయితే రెండు నెలలుగా ఈ వినోద కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఆదివారం కేవలం 5వేల మంది సందర్శకులు మాత్రమే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ)కి ఆదాయం తగ్గిపోయింది. దీనికి కారణం ఆయా వినోద కేంద్రాల్లోని ఎంటర్టైన్మెంట్ హౌస్ల టెండర్లు రద్దు చేయడమే. పిల్లలకు వినోదాన్నిచ్చే ఆయా ప్రాంతాల్లోని బోటింగ్, ట్రైన్, మచాన్ ట్రీ, హంటెడ్ హౌస్, క్యాంటీన్లు, టవర్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని సిటీజనులు కోరుతున్నారు. లేని పక్షంలో సందర్శకులు తగ్గడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్కుమార్ దృష్టిసారించి తగిన పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదాయం ఢమాల్... హుస్సేన్సాగర్, దాని చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధి కోసం 2000 డిసెంబర్ 12న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏలో ప్రత్యేక విభాగమైన బీపీపీఏ 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీని కింద లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, పీవీ జ్ఞాన్ భూమి తదితర ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలను వారానికి లక్ష మంది వరకు సందర్శిస్తుంటారు. వారాంతాల్లో అయితే తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ నుంచి ఆయా ప్రాంతాల్లోని వినోద కేంద్రాలు, క్యాంటీన్స్ బంద్ కావడంతో సందర్శకులు సంఖ్య గణనీయంగా తగ్గింది. జూన్, జూలైలో సందర్శకుల సంఖ్య వారానికి 15వేలు కూడా దాటలేదని ఆ విభాగ సిబ్బందే పేర్కొంటున్నారు. కొంతమంది అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో పార్కుల ఆదాయం భారీగా తగ్గిందని వాపోతున్నారు. ‘జూన్ నుంచి టెండర్లు రద్దు చేయడంతో ప్రతి నెలా అద్దె రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రావట్లేదు. లుంబినీ పార్క్ నుంచి రూ.20 లక్షలు, ఎన్టీఆర్ గార్డెన్లో రూ.50 లక్షలు, నెక్లెస్ రోడ్లో రూ.10 లక్షలు, పీపుల్స్ ప్లాజాలో రూ.15 లక్షల వరకు వచ్చే ఆదాయం పోతోంది. సాధారణంగా కొత్త టెండర్లు వచ్చే వరకు పాత వాటిని కొనసాగిస్తుంటారు. కానీ బీపీపీఏ అధికారులు మాత్రం టెండర్లను రద్దు చేశారు. ఫలితంగా ఆయా సంస్థల నుంచి వచ్చే అద్దెతో పాటు సందర్శకులు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింద’ని ఓ యజమాని పేర్కొన్నాడు. రోడ్డున పడిన కూలీలు... వినోద కేంద్రాలు, ఆట వస్తువుల వెండర్ నిర్వాహకులు 30 మంది వరకు ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు లేకపోవడంతో వెండర్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా వెండర్లలో సుమారు 300 మంది పని చేస్తుంటారు. కార్యకలాపాలు లేకపోవడంతో క్యాంటీన్, టవర్, టాయ్ ట్రెయిన్ తదితర రద్దు చేశారు. దీంతో వాటిల్లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. దినసరి కూలీ లేక ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే అర్ధంతరంగా రద్దు చేసిన టెండర్ల స్థానంలో కొత్త వాటిని ఆహ్వనించినా ఆశించిన ఫలితం ఉండకపోవడంతో ఆయా విభాగాధికారులు తల పట్టుకుంటున్నారు. పిల్లలను ఆపేదెలా? మా అన్నయ్య పిల్లలతో కలిసి ఎన్టీఆర్ గార్డెన్కు వచ్చాం. అయితే గతంలో వారు వచ్చినప్పుడున్న ట్రైన్, హంటెడ్ హౌస్ లేకపోవడంతో వారిని ఆపలేకపోయాం. అందులోకి వెళ్తామంటూ ఏడ్వడంతో వారిని బుజ్జగించేందుకు చాలా సమయమే పట్టింది. తర్వాత ఐస్క్రీమ్ కావాలని మారాం చేయడగా.. అక్కడ క్యాంటీన్కు వెళ్లి చూస్తే మూసేసి ఉంది. ఎన్టీఆర్ గార్డెన్లో ఏమీ అందుబాటులో లేకపోవడంతో పిల్లలతో వచ్చిన కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. – శ్రీనివాస్, రామచంద్రపురం -
ఏమిటా స్పీడు... చలాన్ పడుద్ది
హైదరాబాద్ : డ్రైవింగ్... రద్దీ రోడ్లపై నెమ్మదిగా వెళ్లినా, ఖాళీగా కనిపిస్తే చాలు దూసుకుపోతాం. మనలో అనేక మందికి ఇది అలవాటే. ఇక ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లాంటి మార్గాల్లో వేగానికి పరిమితే ఉండదు. సాధారణ స్పీడ్ దాటినా మీటర్ రీడింగ్ కూడా చాలా మంది చూసుకోరు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదిగో ఇలాంటి వారి కోసమే పోలీసులు కొత్త యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మీ స్పీడ్ను పరిశీలించి హెచ్చరిస్తాయి. ‘నో యువర్ స్పీడ్’, ‘యువర్స్ స్పీడ్’యంత్రాలను ఓఆర్ఆర్పై ఏర్పాటు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్రావు ‘సాక్షి’కి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తమ పరిధిలో ఉన్న 62 కి.మీ. ఔటర్లో ఒక్కో రోజు ఒక్కో చోట వీటిని వినియోగించనున్నారు. యువర్స్ స్పీడ్ పనిచేస్తుంది ఇలా.. ఈ యంత్రాన్ని నిర్ణీత ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇది ఎదురుగా వచ్చే వాహనాలను 300–400 మీటర్ల దూరం నుంచే అధ్యయనం చేస్తుంది. రాడార్ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం వాహన వేగాన్ని అధ్యయనం చేసి అనుసంధానించి ఉండే బోర్డు మీద వేగాన్ని (యువర్ స్పీడ్ అంటూ..) అంకెల్లో సూచిస్తుంది. వాహనం సాధారణ వేగంతో ఉంటే గ్రీన్ సిగ్నల్ను, మితిమీరితే రెడ్ సిగ్నల్ను చూపిస్తూ ‘డేంజర్’అని హెచ్చరిస్తూ డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళితే అక్కడ ఉండే స్పీడ్ లేజర్ గన్ కెమెరా దీన్ని గుర్తించి ఈ–చలాన్ రూపంలో వాహనదారుడికి జరిమానా విధిస్తుంది. ట్యాంక్బండ్పై ట్రయల్.. ఈ స్పీడ్ డిటెక్టింగ్ టెక్నాలజీని ఇన్స్పెక్టర్ ఎం.నర్సింగ్రావు నేతృత్వంలోని బృందం గత నెలలో ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసి అధ్యయనం చేసింది. ఈ స్పీడ్ డిటెక్టర్లు జర్మనీ టెక్నాలజీతో తయారై రాడార్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. ప్రయోగాత్మక పరిశీలనలో అనేక మంది వాహనచోదకులు ‘యువర్ స్పీడ్’చూసుకొని వేగం తగ్గించారని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు వీటిని అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలు గుర్తించాక కీలక ప్రాంతాల్లో పెట్టాలని యోచిస్తున్నారు. స్పీడ్ లిమిట్ లోపల వెళ్తే ఇలా ‘గ్రీన్’ రీడింగ్ చూపిస్తుంది.., స్పీడ్ లిమిట్ దాటి వెళ్తే ఇలా ‘రెడ్’ రీడింగ్ చూపిస్తుంది.. ప్రాథమికంగా రెండు యంత్రాలు... రోడ్డు ప్రమాద నిరోధం, ప్రాణనష్టం తగ్గించడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్పై రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. – దివ్యచరణ్ రావు, ట్రాఫిక్ డీసీపీ, రాచకొండ -
ట్యాంక్బండ్ : ఘనంగా సద్దుల బతుకమ్మ
-
వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా!
సాక్షి, హైదరాబాద్: ‘మా బంగారు బతుకమ్మ.. పో యిరావమ్మా’, ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’, అని పాడుతూ.. బుధవారం సాయంత్రం సద్దుల బతుకమ్మకు తెలంగాణ ఆడపడుచులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్లో ట్యాంక్బండ్ పైనున్న బతుకమ్మ ఘాట్, లలితకళా తోరణం, రవీంద్రభారతిలతోపాటు నగరంలోని వివిధ చెరువు గట్ల వద్ద బుధవారం బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఆ«ధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆడపచుడుల ఆటపాటలు, టపాసుల వెలుగుల మధ్య బతుకమ్మ నిమజ్జన సంబరం అంబరాన్నంటింది. దీనికితోడు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం నుంచి కుండపోత వర్షం కారణంగా ప్రారంభంలో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారు తప్ప.. ఇతర ప్రాంతాలవారు పెద్దగా కనిపించలేదు. కానీ..వర్షం తెరిపిచ్చిన తర్వాత (రాత్రి 7.45 అనంతరం) ఒక్కొక్కరుగా వేలాది మంది బతుకమ్మ ఘాట్ చేరుకున్నారు. ట్యాంక్బండ్ పండుగశోభ సంతరించుకుంది. బ్రహ్మకుమారీలు కుల్దీప్ సిస్టర్స్, సంతోష్ దీదీ సిస్టర్స్ బతుకమ్మలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శోభాయమానంగా సాంస్కృతిక యాత్ర బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ఆడపడుచులు, 850 మంది కళాకారుల ప్రదర్శనలు, వారిని చూసేందుకు వచ్చిన ఆశేష జనంతో ట్యాంక్బండ్ కిటకిటలాడింది. అంబేద్కర్ విగ్రహం వద్ద సాంస్కృతిక యాత్ర (కల్చరల్ కార్నివాల్)ను సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలు జెండా ఊపి ప్రారంభించారు. చిందు, యక్షగాన, బైండ్ల, ఒగ్గు, డప్పులు, కొమ్ము కొయ్య, లంబాడీ, గుస్సాడీ, చిరుతల భజన, డోళ్లు మ్రోగిస్తూ కళాకారులు బతుకమ్మలతో కలిసి ముందుకుసాగారు. మహారాష్ట్ర కళాకారులు నిర్వహించిన ‘డోల్ తాషా’నృత్యం యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగే పండుగల్లో బతుకమ్మ పండుగ తెలంగాణకు ఓ బ్రాండ్గా మారిందని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ మంది ఒకచోట చేరి నిర్వహించుకునే ఏకైక పండుగ ఇదేనన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా.. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాలన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద బాణసంచా వెలుగుల మధ్య అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు లేజర్ షోతో బతుకమ్మ కథ మారియట్ హోటల్ సమీపంలో హుస్సేన్సాగర్ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకొంది. బతుకమ్మ కథను లేజర్ షో ద్వారా ప్రజలకు వివరించారు. పబ్బుల్లో లాగా డ్యాన్స్ఫ్లోర్ ఏర్పాటు చేసి బతుకమ్మ బొమ్మలు, కథలు వివరించారు. 75 మంది మహిళా విదేశీ కళాకారులు బతుకమ్మ చేపట్టి బతుకమ్మ ఆటపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనను చూసేందుకు జనం ఎగబడటంతో.. వారిని అదుపు చేసేందుకు పోలీసులకు తిప్పలు తప్పలేదు. హుస్సేన్ సాగర్ నీటిలో ఫాటింగ్ బతుకమ్మలను పది చిన్న పడవ (పుట్టి)ల్లో ఉంచారు. అయితే.. వర్షం కారణంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించిన పారామోటరింగ్, బెలూన్ కార్యక్రమాలు వాయిదా వేశారు. మొత్తం అయిదు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలు గురువారానికి వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అకాల వర్షం కారణంగా ‘ఆకాశంలో బతుకమ్మ’కార్యక్రమాన్ని రద్దు చేసిట్లు అధికారులు చెప్పారు. -
సద్దులకు సిద్ధం
-
సాగర అలల్లో.. పూల పడవల్లో..
-
రూ. 16.86 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకమైన గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ. 16.86 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 23న జరిగే నిమజ్జనానికి 35 ప్రాంతాల్లో 117 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని, మరో 96 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో రోడ్డు రీకార్పెటింగ్, మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను సెప్టెంబర్ 10లోగా పూర్తి చేసేందుకు రూ. 10.52 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయా మార్గాల్లో 34,926 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా గణేష్ యాక్షన్ టీమ్లను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్అండ్బి ఆధ్వర్యంలో 12 కిలోమీటర్ల మేర, ప్రధానంగా హుస్సేన్సాగర్ చుట్టూ రెండంచెల బారికేడింగ్, నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్సాగర్ వద్ద ఎస్పీడీసీఎల్ ద్వారా 48 ట్రాన్స్ఫార్మర్లు, సరూర్నగర్ చెరువు వద్ద ఐదు ట్రాన్స్ఫార్మర్లతో సహా అన్ని ప్రాంతాల్లో వెరసి 101 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.వీటితో పాటు మంచినీటి సరఫరా, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయని, ఉత్సవాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి సహకరించాలని గణేష్ ఉత్సవ సమితి సభ్యులను కోరారు. విస్తృత బందోబస్తు: సీపీ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గణేష్ ఉత్సవాల సమయంలోనే మొహర్రం పండుగ కూడా ఉన్నందున వేడుకలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని కోరారు. శోభాయాత్ర మార్గంలో మెట్రో రైలు స్టేషన్లు, ఎస్సార్డీపీ పనులు జరుగుతున్నందున విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అందజేయాలని, ప్రతి విగ్రహం వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అనిల్కుమార్, ట్రాఫిక్ డీసీపీలు చౌహాన్, బాబురావు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, ముషారఫ్ అలీ, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు సురేష్, జియాఉద్దీన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి సహకారం: గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఇబ్బందులు లేకుండా జరిగేందుకు సహకరిస్తామని గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది. ఉత్సవ సమితి అధ్యక్ష , కార్యదర్శులు వెంకట్రెడ్డి, భగవంతరావులతో పాటు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి, పలు నియోజకవర్గాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. నిమజ్జన సందర్భంగా క్రేన్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు నగరంలో నిమజ్జనం జరిగే వివిధ ప్రాంతాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేయాలని, తగినన్ని మొబైల్ టాయ్లెట్లు, దారిపొడవునా విద్యుత్దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ధూల్పేట వద్ద ఎంట్రీ,ఎగ్జిట్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. శోభాయాత్ర మా ర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్ల లోని టాయ్లెట్లను వినియోగించుకునేందుకు చ ర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. -
నిమజ్జనం ఇక ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల నిమజ్జనాన్ని మరింత వేగవంతం చేసేందుకు పోలీసుశాఖ అధునాతన క్రేన్ హుక్కులను అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల సంఖ్య ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకుక్రేన్ల సంఖ్య పెంచుకుంటూపోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్తో కూడిన కొండీలను (హుక్స్) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్డŠస్ హుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రెండురోజుల క్రితం ట్యాంక్బండ్ వద్ద పరీక్షించిన నగర పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్ రూపొందించిన ఈ ‘క్విక్ రిలీజ్ డివైజ్’ (క్యూఆర్డీ) హుక్స్ ఈసారి ట్యాంక్బండ్ మీద ఉండే అన్ని క్రేన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనాకి వినియోగించే అవకాశం ఉంది. తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్ను గతేడాది వినియోగించారు. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిక వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే విడిపోతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లిన తర్వాత క్రేన్పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలు సైతం జరిగేవి. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే.. క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటినిపై మరింత రీసెర్చ్ చేసిన మురళీధర్.. ‘అడ్వాన్డŠస్ వెర్షన్’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీని బరువును గరిష్టంగా 5 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. -
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ పోలీసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్ బండ్ చౌరస్తా కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహుతులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. ♦ కర్బాలామైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను సైలింగ్ క్లబ్ నుంచి కవాడీగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపుతారు. ♦ ఎన్టీఆర్ ఘాట్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్ను అంబేడ్కర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుని ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్రూమ్, బషీర్బాగ్ మీదుగా వెళ్లాలి. ♦ సైఫాబాద్ పాత పోలీసుస్టేషన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ స్టాట్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్ మీనార్ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్రూమ్, బషీర్బాగ్ మీదుగా వెళ్లాలి. ♦ సాధూరామ్ కంటి ఆసుపత్రి నుంచి సెక్రటేరియేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్ దర్బార్ హోటల్, జీహెచ్ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాలి. -
కోదండరామ్ అరెస్ట్; టెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. తార్నాకలోని తన నివాసం నుంచి మిలియన్ మార్చ్ సభకు బయలుదేరుతుండగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వాహనాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన చాలాసేపు కారులోనే ఉండిపోయారు. తర్వాత ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. ఇప్పటికే పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డిని పార్టీ కార్యాలయంలోనే అరెస్ట్ చేశారు. కాగా, ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్ సభకు అనుమతి లేదని, ఇటువైపు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ట్యాంక్బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇటువైపు వచ్చే దారులను మూసివేసినప్పటికీ కొంత ట్యాంక్బండ్ చేరుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సాయంత్రం సభ నిర్వహించి తీరతామని జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
పోలీసుల అదుపులో కొదండరామ్
-
ట్యాంక్బండ్పై ‘మిలియన్ మార్చ్’ ట్రాఫిక్ ఆంక్షలు
-
ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ‘మిలియన్ మార్చ్’ పిలుపు నేపథ్యంలో ట్యాంక్బండ్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇవి అమలులో ఉంటాయని పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అప్పర్ ట్యాంక్బండ్పై రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ♦ సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను కర్బాలా మైదాన్ దాటి అప్పర్ ట్యాంక్బండ్ వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్ క్లబ్–కవాడిగూడ–డీబీఆర్ మిల్స్–కట్టమైసమ్మ–అంబేడ్కర్ విగ్రహం–తెలుగుతల్లి–రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు. ♦ నెక్లెస్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్బండ్ మీదికి అనుమతించరు. వీటిని గగన్మహల్–ఇందిరాపార్క్ మీదుగా పంపిస్తారు. ♦ నిరంకారి, పాత సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఇక్బాల్ మీనార్ మీదుగా వచ్చే ట్రాఫిక్ను మింట్ కాంపౌండ్/సెక్రటేరియేట్–ఎన్టీఆర్ మార్గ్–నెక్లెస్ రోటరీ–సంజీవయ్య పార్క్–నల్లగుట్ట–సికింద్రాబాద్ మీదుగా మళ్లిస్తారు. ♦ లిబర్టీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను బీఆర్కే భవన్–తెలుగుతల్లి –నెక్లెస్ రోటరీ–వీవీ స్టాట్యూ లేదా నెక్లెస్ రోడ్–సంజీవయ్యపార్క్–సికింద్రాబాద్ మీదుగా పంపిస్తారు. ♦ బషీర్బాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలను మోర్ మెడికల్ హాల్–బాలాజీ గ్రాండ్ బజార్–క్రిస్టల్–తెలుగుతల్లి–ఇక్బాల్ మీనార్ మీదుగా పంపిస్తారు. నేడు పార్కులకు సెలవు తార్నాక: మిలియన్ మార్చ్ను పురస్కరించుకుని హెచ్ఎండీఏ పరిధిలోని పార్కులకు శనివారం సెలువు ప్రకటించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఎన్టీఆర్, లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు, లేక్వ్యూ పార్కులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంటాయని ప్రజలు గమనించాలని హెచ్ఎండీఏ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. -
మిలియన్ మార్చ్ : ట్యాంక్బండ్ అష్ట దిగ్బంధం
-
హైదరాబాద్కు "లవ్" లేదు..!
సాక్షి,సిటీబ్యూరో: ట్యాంక్బండ్పై సెల్ఫీ స్పాట్గా మారిన ‘లవ్ హైదరాబాద్’ ను శుక్రవారం తొలగించారు. స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు నేతృత్వంలో గత ఏడాది నవంబర్ 25న సాగర్ తీరంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే, కొందరు సందర్శకులు సెల్ఫీలతో సరిపెట్టుకోకుండా ఐకాన్పై తమ పేర్లు, పిచ్చి రాతలు రాస్తుండడంతో కళ కోల్పోయింది. మరోవైపు సింబల్ ముందు సెల్ఫీలతో ట్రాఫిక్ సమస్య సైతం నెలకొంటోంది. ఈ నెలాఖరులో జరిగే గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ట్యాంక్బండ్పై ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఈ ఐకాన్ను తొలగించినట్లు సమాచారం. త్వరలో ‘లవ్ హైదరాబాద్’ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. -
ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ విగ్రహ ఏర్పాటు
► తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానం సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 5వ వర్ధంతిని గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమారస్వామి తదితరులు ఘనంగా నివాళులర్పించారు. -
92 మందిని కాపాడిన ఆపద్బాంధవుడు
-
విభిన్నరూపాల్లో ఉన్న గణేశుల నిమజ్జనం
-
గణపతి నినాదాలతో హోరెత్తిన ట్యాంక్బండ్
-
గణేశుడికి జియోట్యాగ్!
- సులభతరం కానున్న వినాయక నిమజ్జనం - ప్రత్యేక క్యూఆర్ కోడ్ సైతం ఏర్పాటు - ఒక్క క్లిక్తో విగ్రహాల పూర్తి వివరాలు.. - పోలీసులకు తప్పనున్న తిప్పలు - గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలో విగ్రహాల సంఖ్య, ఎత్తు, మండపం అనుమతి తీసుకున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచనుంది. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించే ప్రతి వినాయక విగ్రహానికి జియోట్యాగ్ ఏర్పాటు చేశారు. గతంలో పోలీసులు మండపం వద్దకు వెళ్లి తనిఖీ చేసి తమ రిజిస్టర్లో నమోదు చేసుకుని, నిర్వా హకుల సంతకం తీసుకునేవారు. కానీ ఇప్పుడలా కాకుండా జియోట్యాగ్ ద్వారా మండపానికి 50 మీటర్ల దూరంలో ఉండ గానే హైదరాబాద్ ‘కాప్యాప్’ద్వారా కమాండ్ సెంటర్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి. పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లారా లేదా అనే వివరాలనూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. విగ్రహాల వివరాలు పక్కాగా.. ఈసారి హైదరాబాద్లో కొత్తగా ప్రతి గణేశుడికి క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్)ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ బార్కోడ్ ద్వారా పోలీసు సిబ్బంది ట్యాబ్లో స్కాన్ చేయగానే విగ్రహం ఎత్తు మండప నిర్వాహకులు తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. నిమజ్జన సమయంలో విగ్రహం ఎంతవరకు వచ్చింది.. ఎప్పుడు నిమజ్జనం అవుతుంది.. వంటి వివరాలను కూడా పోలీసులకు తెలియజేస్తుందన్నమాట. ట్యాంక్బండ్ వద్ద నిమజ్జనమైన విగ్రహాల సంఖ్యను పోలీసులు లెక్కిస్తూ నమోదు చేసుకోవాల్సి వచ్చేది. క్యూఆర్ కోడ్ వల్ల ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నిమజ్జనమైన విగ్రహాల వివరాలు పక్కాగా తెలిసిపోతాయి. క్రేన్ల రీడిజైన్.. ట్యాంక్బండ్పై ఏర్పాటుచేసిన క్రేన్ల కొండీల (హుక్స్)ను రీడిజైన్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలి పారు. విగ్రహాలు నీళ్లలోకి వెళ్లగానే కొండీలు వాటంతట అవే తెరుచుకుంటాయన్నారు. గతంలో వాటిని మనుషులు తీసేవార ని, భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో కొండీల తొలగింపు కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య ఉండబోదన్నారు. 24 వేల మందితో బందోబస్తు.. నగరంలో సెప్టెంబర్ 5న జరిగే నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తుపై డీజీపీ అనురాగ్శర్మ సోమవారం సమీక్ష నిర్వ హించారు. 24 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి డీజీపీకి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ పారామిలిటరీ బలగాలు, ఏపీ పోలీస్ బలగాలు, ఛత్తీస్గఢ్లోని పోలీస్ సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేస్తున్నట్టు తెలిపారు. యూనిఫాం సర్వీసులైన ఫారెస్ట్, ఎక్సైజ్ సిబ్బందిని కూడా బందోబస్తులో వినియోగించనున్నామన్నారు. ఈ మేరకు ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల నుంచి 2 వేల మందిని కేటాయించా లని సంబంధిత విభాగాధిపతులకు లేఖలు రాశామన్నారు. -
నాట్ ఇన్ మై నేమ్
సమానత్వం కోరుతూ శాంతికాముకుల వినూత్న నిరసన సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ సందడిగా ఉండే ట్యాంక్బండ్ బుధవారం సాయంత్రం నాలుగ్గంటల సమయంలో నిశ్శబ్దం ఆవహించింది. అది న్యాయాన్ని డిమాండ్ చేస్తోన్న నిశ్శబ్దం. నిరసనతో కూడిన నిశ్శబ్దం. అన్యాయాన్ని మౌనంగా ధిక్కరిస్తోన్న నిశ్శబ్దం. ఆహారం పేరుతోనో, ఆవు పేరుతోనో, ఇంకో పేరుతోనో, మరేదైనా పేరుతోనో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై నోరు విప్పాలంటూ నిశ్శబ్దంతో నిరసనని పాటించారు దేశంలో శాంతిని కాంక్షిస్తున్న వారు. మానవ హక్కులు కాలరాయొద్దంటున్న వారు. మానవతావాదులు. అంతా ఒక్కరొక్కరుగా ట్యాంక్బండ్పైకి చేరారు నిశ్శబ్దంగా. ప్రజలంటే ఒక మతమో, ఒక అంకెనో, ఒక ఓటో మాత్రమే కాదు అని అభిప్రాయపడుతున్న వారు. జనం అంటే ధనవంతులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే ఒక్క పురుషులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే మనం అంటున్నవారు. సమానత్వానికీ దేశంలో స్థానం కల్పించాలంటున్న వారు. స్త్రీలూ, పురుషులూ, థర్డ్ జెండర్స్, ట్రాన్స్ జెండర్స్, పిల్లలూ, పెద్దలూ అంతా అక్కడ చేరారు. అయితే అక్కడంతా నిశ్శబ్దమే. సంస్థల పేర్లు లేవు, రాజకీయ పార్టీల జాడల్లేవు, విద్యాసంస్థల, సంఘాల బ్యానర్లు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాలసలేలేవు. ఉన్నదంతా వ్యక్తులే. వారి చేతుల్లో మాత్రం ‘‘నాట్ ఇన్ మై నేమ్’’ ప్లకార్డులు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతోన్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని జంతర్మంతర్, హైదరాబాద్లాంటి ప్రధాన నగరాల్లో సమానత్వాన్ని కాంక్షిస్తోన్న పౌరులంతా సాయంత్రం నాలుగ్గంటల నుంచి ఆరుగంటల వరకు మౌనంగా నిరసనని తెలియజేశారు. ‘‘నాట్ ఇన్ మై నేమ్’’ అనే స్లోగన్కి అర్థం ఈ రోజు నేను దాడికి గురికాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను కూడా ఒకానొక కారణంతో దాడికి గురికావచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే రేపు నా వంతూ రావచ్చు. అందుకే ఈ దాడులు ఆపాలంటూ మా నిశ్శబ్ద నిరసన ఇది అన్నారు కార్యక్రమంలో ప్రొఫెసర్ రమామేల్కొటే, వసంతా కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్, సుధ, సునీతా రెడ్డి, ఆశాలత, పద్మజాషా, వసుధ, సుమతి, అనితా రెడ్డి, అజీజ్పాషా, తేజస్వీని, కృశాంక్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
మాయదారి!
సిటీబ్యూరో : హైదరాబాద్ పేరు చెప్పగానే చార్మినార్ తర్వాత గుర్తుకువచ్చేది ట్యాంక్బండ్. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉండే ఈ ప్రాంతం ప్రమాదాలకూ నిలయంగా మారింది. గత ఏడాది మొత్తం 24 యాక్సిడెంట్స్ చోటు చేసుకోగా... నలుగురు మరణించారు. సిటీ ట్రాఫిక్ పోలీసులు రూపొందించిన బ్లాక్ స్పాట్స్ జాబితాలో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. నాలుగేళ్ళ క్రితం ప్రవేశపెట్టిన ‘30 కేఎంపీహెచ్’ నిబంధన సైతం ఫలితాలు ఇవ్వట్లేదు. ఉల్లంఘనులకు ఈ–చలాన్ జారీ చేయడం మినహా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒకే ‘బండ’పై మూడు ప్రాంతాలు... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు గత ఏడాది గణాంకాలు ఆధారంగా సిటీలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల జాబితాను రూపొందించారు. నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాల పరిధిలో మొత్తం 85 బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు తేలింది. వీటన్నింటిలోనూ ట్యాంక్బండ్ ప్ర«థమ స్థానంలో నిలిచింది. 2.6 కిలోమీటర్లు పొడవు ఉన్న దీనిపై మూడు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది. లేపాక్షి, రామదాసు విగ్రహం, వీరేశలింగం విగ్రహాలకు అటు ఇటు 300 మీటర్ల పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు స్పష్టమైంది. మొత్తం ట్యాంక్బండ్లో దాదాపు మూడో వంతు ప్రమాదాలకు నిలయంగా మారింది. లోకాయుక్త ఆదేశించినప్పటికీ... ట్యాంక్బండ్పై నాలుగేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఘోర ప్రమాదం లోకాయుక్తనే కదిలించింది. పశ్చిమబెంగాల్కు చెందిన సైకిల్షాపు యజమాని ప్రవీర్ సమ్హమ్, భార్య మాలా సమ్హమ్ కుమార్తెలు రాకా సోమ్, రుత్వికలతో కలిసి 2012 అక్టోబర్ 24న నగరానికి వచ్చారు. లోయర్ ట్యాంక్బండ్లో ఉన్న భారత్ సేవాశ్రమంలో బస చేసిన వీరు అదే నెల 27వ రాత్రి 9 గంటల ప్రాంతంలో ట్యాంక్బండ్ పైకి వచ్చారు. లేపాక్షి సమీపంలో వీరు రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన నిజమాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మాలా అక్కడికక్కడే మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రవీర్ చనిపోయారు. రాఖీకి తీవ్రగాయాలు కాగా... రుత్విక స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన లోకాయుక్త జస్టిస్ సుభాషణ్రెడ్డి సీరియస్గా స్పందించారు. ప్రమాదాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘30’తో చేతులు దులుపుకున్న అధికారులు... లోకాయుక్త ఆదేశాలతో కదిలిన యంత్రాంగాలు గంటకు 30 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్ళకూడదంటూ ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నాయి. ఈ ప్రాంతంలో అప్పటికే గంటకు 40 కిలోమీటర్ల మించిన వేగంతో వెళ్లకూడదనే నిబంధన ఉంది. దీన్ని పట్టించుకోని యంత్రాంగాలు..నామ్కే వాస్తేగా ‘30’ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అమలులో ఉంటుందనేది స్పష్టం చేయలేదు. ట్యాంక్బండ్పై ప్రస్తుతం ఉన్న సమస్యలు... ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా పాదచారులతో పాటు వాహనచోదకులూ బాధితులుగా మారుతున్నారు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. పాదచారులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం, రోడ్డు దాటే సౌకర్యాలు కల్పించకపోవడం, వాహనాలను నియంత్రించే డివైడర్ కరవు కావడం, సరైన పార్కింగ్ వసతులు లేకపోవడం. ఓ పక్క మాత్రమే వాహనాలు ఆపుకోవడానికి అవకాశం ఉండటంతో అక్కడ వాటిని నిలిపిన వారు భారీ ట్రాఫిక్లోనూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ ప్రమాదాల్ని కొంత వరకు తగ్గించడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ) నిర్మాణం ఓ మార్గమని అధికారులు భావిస్తున్నారు. అయితే ట్యాంక్బండ్పై ఉన్న పరిస్థితులు దీని నిర్మాణానికి ప్రతికూలంగా ఉన్నాయి. అక్కడున్న స్ట్రక్చర్ ఎఫ్ఓబీ ఏర్పాటుకు సహకరించదు. దీని ఏర్పాటు వల్ల ఏటా జరిగే గణేష్ నిమజ్జనం సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎఫ్ఓబీ వల్ల భద్రతా సమస్యలు రావడంతో పాటు సరైన నిఘా లేకుంటే అంది అసాంఘికశక్తులకు అడ్డాగా మారి నేరాలకు నెలవు కావచ్చు. ‘ఆ ఉల్లంఘనుల’ మాటేమిటి? పరిమితికి మించిన వేగంతో వెళ్తూ ‘చిక్కిన’ వాహనాలను గుర్తించి చలాన్ వేసే అధికారం పోలీసులకు ఉంది. దీంతో ఆ ప్రాంతంలో నిత్యం స్పీడ్ లేజర్ గన్స్తో తనిఖీలు చేపడుతున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్ళే వాహనాల ఫొటోలు తీసి ఈ–చలాన్లు ఇంటికి పంపిస్తున్నారు. అయితే ఇది సమస్యకు పరిష్కారం కానేకాదు. మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనచోదకుడికి ఆ చలాన్ అందే లోపే ప్రమాదం జరుగవచ్చు. లేదా ఎదుటి వారిని అతడు ఢీ కొట్టే ప్రమాదమూ లేకపోలేదు. మరోపక్క ఇక్కడ సమస్య పాదచారులకు సంబంధించింది. నిర్దేశించిన ప్రాంతంలో తప్ప ఎక్కడికక్కడ రోడ్డు దాటే పాదచారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. తాజాగా వీరికోసం మూడుచోట్ల జీబ్రా క్రాసింగ్ పెట్టారు. 2.6 కిలోమీటర్ల పొడవున్న ట్యాంక్బండ్పై ఎక్కిన వారికి ఆ మూడూ ఫలానాచోటా ఉన్నాయని వీరికి తెలియడం కష్టం. ఇలా ఎందుకు చేయరు? ఈ చర్యల ప్రధాన ఉద్దేశం పాదచారుల్ని కాపాడటం. దీనికి ట్రాఫిక్ పోలీసులు ఒక్కరు పూనుకున్నంత మాత్రాన ఫలితాలు ఉండవు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం ముందుకు వచ్చి సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యాంక్బండ్పైకి ఎక్కిన పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుండా ఆద్యంతం తాత్కాలిక రెయిలింగ్ ఏర్పాటు చేయాలి.మొత్తమ్మీద రెండు లేదా మూడు చోట్ల రోడ్డు క్రాసింగ్కు అవకాశం ఇవ్వాలి. ట్యాంక్బండ్కు రెండు వైపులా, ఈ క్రాసింగ్లకు ఇరువైపులా 300 మీటర్ల దూరంలో బోర్డులు ఏర్పాటు చేయాలి. అంతా ఈ ప్రాంతాల నుంచే క్రాస్ చేయాలి కాబట్టి ఇవి కచ్చితంగా అతిపెద్ద జీబ్రాక్రాసింగ్ అయి ఉండాలి. కనిష్టంగా 4 మీటర్ల వెడల్పు ఉండాలి. దీనికి అటు ఇటు పెడస్ట్రియన్ క్రాసింగ్ ఎహెడ్ అనే గ్లోసైన్ బోర్డులు కానీ, పెడస్ట్రియ్ బ్లింకర్ లైట్లు కానీ, అనువైన పెడస్ట్రియన్ సిగ్నల్ కానీ ఏర్పాటు చేయాలి. ఈ క్రాసింగ్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వేగ పరిమితిని అమలు చేయాలి. దీని కోసం అక్కడి నలుగురైదుగురు సిబ్బందిని మోహరించాలి. ట్యాంక్బండ్కు రెండు చివరలా... మధ్యలో అనువైన చోట్ల, క్రాసింగ్స్ ఏర్పాటు చేసిన చోట్ల రంబ్లర్ స్ట్రిప్స్గా పిలిచే వాటిని కనిష్టంగా మూడు మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తే వాహనాల వేగం దానంతట అదే తగ్గుతుంది. యాక్సిడెంట్ జోన్ను నిర్దేశిస్తూ అంబేడ్కర్ విగ్రహం, సెయిలింగ్ క్లబ్ మధ్యలో 20 చోట్ల సూచికలు, మూడు చోట్ల స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్స్, లైనింగ్స్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. 2012లో లోకాయుక్త సైతం ఇదే విషయం స్పష్టం చేసింది. -
జిల్లా మార్చాలంటూ యువకుడి ఆత్మహత్య!
- ట్యాంక్బండ్పై ఘటన - నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో చేర్చాలని డిమాండ్ హైదరాబాద్, నాగిరెడ్డిపేట: కామారెడ్డి జిల్లాలో చేర్చిన నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ట్యాంక్బండ్పై ఉన్న త్యాగరాజ విగ్రహం సమీపంలో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామానికి చెందిన ఉడువాటి రాజు అలియాస్ డప్పు రాజు (29) కుటుంబంతో కలసి కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయనకు భార్య సంధ్య, ఇద్దరు కుమారులు అరవింద్, ఆదర్శ్ ప్రేమ్ ఉన్నారు. రాజు తండ్రి ఏసయ్య స్వగ్రామంలోనే సఫారుు కార్మికుడిగా పనిచేస్తుండగా.. రాజు హైదరాబాద్లోనే కూలి పనులు చేస్తూ భార్య, పిల్లలను పొషిస్తున్నాడు. రాజుకు స్వస్థలంపై ప్రేమ ఎక్కువ. జిల్లాల పునర్విభజనలో భాగంగా నాగిరెడ్డిపేటను మెదక్లో కలుపుతారని ఆశించాడు. ముసాయిదా నోటిఫికేషన్లో నాగిరెడ్డిపేటను కామారెడ్డి జిల్లాలో కలపడంతో నిరాశకు గురయ్యాడు. నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలంటూ జరిగిన ఉద్యమానికి ప్రోత్సాహం అందించాడు. ఆ ఉద్యమం, నిరసన ప్రదర్శనల గురించి ఎప్పటికప్పుడు గ్రామస్తులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇటీవలే మాల్తుమ్మెద గ్రామానికి వెళ్లి వచ్చాడు కూడా. అయితే నాగిరెడ్డిపేటను మెదక్లో కలపకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు. తన ఆత్మహత్యతోనైనా ప్రభుత్వంలో చలనం వస్తుందని భావించాడు. శనివారం ఓ పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కున్న రాజు.. ట్యాంక్బండ్పై ఉన్న త్యాగరాజ విగ్రహం వద్దకు చేరుకున్నాడు. నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన కొందరు వెంటనే సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని రాజును గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఒంటిపై తీవ్రంగా కాలిన గాయాలైన రాజు.. చికిత్స పొందుతూ సాయంత్రం 6.30 సమయంలో కన్నుమూశాడు. రాజు మృతితో ఆయన తండ్రి, భార్య, పిల్లలు కన్నీటిలో మునిగిపోయారు. గాంధీనగర్ పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రాజు ఆత్మహత్య నేపథ్యంలో.. నాగిరెడ్డిపేట మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించారు. -
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే
-
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే
ట్యాంక్బండ్పై మిన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురం సాక్షి, హైదరాబాద్: హుస్సేన్సాగర్ తీరాన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్ని అంటింది. ట్యాంక్బండ్పై తెలంగాణ సంస్కృతీ వైభవం ఘనంగా ఆవిష్కృతమైంది. తీరొక్క పూల పండుగ చివరి రోజైన ఆదివా రం ఆడపడుచులు బతుకమ్మ ఆడి పులకించి పోయారు. వర్షంలోనూ ఉత్సాహంగా గౌరీదేవిని అర్చించారు. ఇరవై ఐదు వేల మందికి పైగా మహిళలు దారి పొడవునా బతుకమ్మలు చేతబట్టి ట్యాంక్బండ్పైకి వరుసకట్టగా... రహదారులు పూదారులై... సంప్రదాయ సిరి విరిసి భాగ్యనగరి పరవశించింది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గౌరీదేవిని.. సద్దులతో సాగర ఒడికి చేర్చారు. ‘మాయమ్మ.. శ్రీదేవి పోయిరావమ్మా’ అంటూ సాగనంపారు. జీహెచ్ఎంసీ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చే శారు. హుస్సేన్సాగర్లో బోట్లపై నుంచి పేలిన బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అలరించాయి. అచ్చతెలుగు సంప్రదాయ దుస్తుల్లో విదేశీ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. నంబర్ వన్ పండుగ...: బతుకమ్మ సంబరాలకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తదితరులు హాజరయ్యారు. ప్రపంచ నంబర్ వన్ పండుగగా తెలంగాణ బతుకమ్మ ఎదుగుతోందని నాయిని అన్నారు. అమెరికా, దుబాయ్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐలు సైతం సంబరాలను వైభవంగా నిర్వహిస్తూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు. ప్రతిష్ట పెరిగింది: హరీశ్ మరోవైపు కూకట్పల్లిలో బతుకమ్మ వేడుక వైభవంగా జరిగింది. ఆటపాటల అనంతరం ఐడీఎల్ వద్ద నియోజకవర్గ స్థారుు బతుకమ్మ పోటీలను స్థానిక శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గుజరాతీలు, మళయాళీలు, తెలంగాణ మహిళలు దాండియా, ఓనం, బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. భారీ బతుకమ్మల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి టి.హరీశ్రావు మాట్లాడుతూ... బతుకమ్మతో తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి వల్ల పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులు అందరూ నగరం ైవె పే మొగ్గు చూపుతున్నారన్నారు. ఇక్కడ కృత్రిమ బతుకమ్మలుంటాయనుకున్నానని.. కానీ పూర్తిగా పూలతో పేర్చిన బతుకమ్మలు ఇంతపెద్ద స్థారుులో కనిపిస్తుంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనం వ్యర్థాల వెలికితీత షురూ
మహా నిమజ్జన పర్వం ముగిసింది. ఈసారి హుస్సేన్సాగర్లో సుమారు 51 వేల గణేష ప్రతిమలు నిమజ్జనం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్యాంక్బండ్ వైపు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనాలు కొనసాగాయి. ఈలోపు పెద్ద విగ్రహాల నిమజ్జనం పూర్తయిన ఎన్టీఆర్ మార్గ్లో వ్యర్థాల వెలికితీత పనులను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 3,456 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు చెప్పారు.శనివారం మధ్యాహ్నం నాటికి ఎన్టీఆర్ మార్గంలో వ్యర్థాల తొలగింపు ముగిస్తుందని చెప్పారు. ఆ తర్వాత ట్యాంక్బండ్ పక్క వెలికితీత పనులు మొదలు పెట్టనున్నారు. ఇనుప, చెక్క ఫ్రేంలు, కొబ్బరి పీచు తదితర వ్యర్థాలు ఎక్కడికక్కడ జలాశయంలో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని ఆంఫిబియస్ ఎక్స్కవేటర్ ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి జేసీబీల ద్వారా వాహనాల్లో నింపుతున్నారు. గతేడాది 4,500 టన్నుల వరకు వ్యర్థాలు రాగా.. ఈసారి 5000 టన్నులకు చేరేఅవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది 4 అడుగుల పైబడి విగ్రహాల సంఖ్య పెరిగిందని పోలీసుల రికార్డుల ప్రకారం తెలుస్తోంది. 500 టన్నుల ఇనుము, 240 టన్నుల కలప, 200టన్నుల పీఓపీ సాగరంలో కలిశాయని పీసీబీ అంచనా వేస్తోంది. ఇందులో ఇనుము, కలప, కొబ్బరిపీచును 4500 టన్నుల మేర తొలగించినా..పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్సాగర్ మరింత గరళసాగరం కానుందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. వ్యర్థాల తరలింపునకు ఆటంకం కలిగించింది. వాహనాల రాకపోకలు ఎన్టీఆర్ మార్గంలో నెమ్మదించడంతో వ్యర్థాలను డంప్ యార్డ్కు తరలించే టిప్పర్లు ముందుకు వెళ్లేందుకు గగనంగా మారింది. దీంతో తరలింపు పనులను కొద్ది సేపు నిలిపివేయాల్సి వచ్చిందని హెచ్ఎండీఏ ఈఈ జే.కృష్ణారావు, డీఈఈ దయాకర్రెడ్డి తెలిపారు. -
ట్యాంక్బండ్పై ఐలమ్మ విగ్రహాన్నిఏర్పాటు చేయాలి
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సందర్భంగా పోస్టర్ను ఫిలింనగర్ రజక సంఘం అధ్యక్షుడు కనకయ్య ఆదివారం ఫిలింనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంక్బండ్పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. రజకులకు ప్రత్యేక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన రజకుల ఆత్మగౌరవ సభకు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని, సుందరయ్య కళానిలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రజక కులస్తులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఫిలింనగర్ రజక సంఘం నాయకులు వి.రామలింగం, ఎం.శ్రీనివాస్, బి.యాదగిరి, జి.ఎల్లయ్య, ఆర్.బాలనర్సయ్య, ఎం.మణెమ్మ, జి.లలిత తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంక్బండ్ వద్ద టీఎస్ వైఎస్ఆర్ సీపీ నిరసన
-
ట్యాంక్ బండ్ పై గిరిజనుల ధర్నా
హైదరాబాద్: ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం గిరిజనులు ఆందోళనకు దిగారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. -
ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి
సూర్యాపేట : ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, బస్సుయాత్ర కన్వీనర్ ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ జిల్లా కిలాషాపురంలో ప్రారంభమైన బస్సుయాత్ర నల్గొండ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు తిరుగుతూ సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీపార్కులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించి కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పి మీరా ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఆగస్టు 18 వరకు ప్రభుత్వం గీత కార్మికులు పెట్టిన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులను కదిలించి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంతకుముందు పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి గౌడకులస్తులు, మోకుముస్తాదులతో, తాటిమట్టలతో పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు గోపగాని వెంకట్నారాయణగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్, ఎల్గూరి గోవింద్, వర్ధెల్లి బుచ్చిరాములు, జలగం శ్రీనివాస్, బూడిద గోపి, ఉయ్యాల నగేష్, జ్యోతి, లక్ష్మణ్గౌడ్, బైరు వెంకన్నగౌడ్, కసగాని లక్ష్మి, బైరు శైలేందర్గౌడ్, పొలగాని బాలుగౌడ్, జెర్రిపోతుల కృష్ణ, మడ్డి అంజిబాబు, కృష్ణ, మట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ జెండాకు రూ.1.96 కోట్లు
303 అడుగుల ఎత్తున ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద జాతీయ పతాకం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.96 కోట్లు మంజూరు చేసింది. ట్యాంక్బండ్ సమీపంలోని సంజీవయ్య పార్కులో ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మే 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 303 అడుగుల ఎత్తుండే జెండా పోల్ నిర్మాణ బాధ్యతలను కోల్కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సంబంధిత కంపెనీకి ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సమ్మతి పత్రాన్ని అందజేశారు. దీనికి మంజూరు చేసిన రూ.1.96 కోట్లలో స్కిప్పర్ కంపెనీకి రూ.1.32 కోట్లను కేటాయించారు. మిగతా మొత్తాన్ని పిల్లర్ బేస్ నిర్మాణం, సివిల్ వర్క్స్కు వినియోగిస్తారు. -
రేపటి నుంచి తెలంగాణ స్ఫూర్తి యాత్ర
టీయూవీ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రారంభం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ లక్ష్యంతో తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) తెలంగాణ స్ఫూర్తి యాత్ర తలపెట్టింది. టీయూ వీ కన్వీనర్ డా.చెరుకు సుధాకర్ నేతృత్వంలోని ఈ యాత్రను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి యాత్ర చేపడుతున్నామని నిర్వాహకులు చెప్పారు. ఉద్యమ జేఏసీ నిర్మాణం కోసం... గతేడాది మేలో ఏర్పాటైన టీయూవీ ఇప్పటికే వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా టీజేఏసీకి ప్రత్యామ్నాయ గొంతుకగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావొస్తున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న వారి కుటుంబాలు, జైళ్లకు వెళ్లిన వారికి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విపరీత ధోరణులు మింగుడు పడడం లేదని టీయూవీ బాధ్యులు పేర్కొంటున్నారు. తె లంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపై ఇంకా అనేక కేసులు కొనసాగడం, 1969 ఉద్యమకారులను పట్టించుకునే నాథుడే లేకపోవడం వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లి వివరించే ప్రయత్నం ఈ యాత్ర ద్వారా చేయనున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యాలయాలు, యూనివర్సిటీలు నిరాదరణకు గురవుతున్నాయన్నది వీరి వాదన. మరో వైపు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి హామీ పూర్తిగా పట్టాలు ఎక్కపోవడం, కేజీ టు పీజీ ఉచిత విద్య కేవలం సన్న బియ్యం సరఫరాకే పరిమితం కావడం వంటి విషయాలపైనా యాత్రలో చర్చించనున్నారు. ‘గ్రామ స్థాయిలో సంఘటితమైన జేఏసీ, ఇక రాష్ట్రం వచ్చింది కదా అని చేష్టలుడిగి కూర్చోకుండా తెలంగాణ ఉద్యమ జేఏసీగా పరిపుష్టం కావాల్సిన అవసరం ఉంది. ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ జరగాల్సి ఉంది. ఈ కదలిక ఏ అధికార పార్టీకో, ప్రతిపక్ష పార్టీకో ఎదురు దెబ్బ కావాలని కాదు. దెబ్బతిన్న సబ్బండ కులాలు అన్ని విషయాలు చర్చించడానికి, తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దారులు వెదకడానికే. నిన్నటి గ్రామ జేఏసీ రేపటి రాష్ట్ర ఉద్యమ జేఏసీగా నిలబడితే అనేక మార్పులకు పునాది పడుతుంది’ అని టీయూవీ కన్వీనర్ చెరుకు సుధాకర్ చెప్పారు. యాత్ర షెడ్యూలు ఈనెల 14న హైదరాబాద్, భువనగిరి, 15న నల్లగొండ, సూర్యాపేట, 16న ఖమ్మం, 17, 18 తేదీల్లో వరంగల్, 22న సిద్దిపేట, కరీంనగర్, 23న పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, 24న మంచిర్యాల, జగిత్యాల, 25న ఆర్మూ రు, నిజామాబాద్, 28న వికారాబాద్, పరిగి, 29న మహబూబ్నగర్లలో స్ఫూర్తి యాత్ర జరుగుతుంది. 30న హైదరాబాద్ ఉస్మానియా యూరివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ ఉంటుంది. -
అక్రమాల కట్ట
ట్యాంక్బండ్ పనుల్లో నాణ్యతాలోపం నాసిరకం మట్టి వినియోగం వర్షమొస్తే కట్ట కనుమరుగే.. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ప్రసిద్ధిగాంచిన భద్రకాళి చెరువును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ వద్దనున్న నెక్లెస్రోడ్డు తరహాలో భద్రకాళి చెరువులో కట్ట(ఫోర్ షోర్ బండ్) నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో గ్రేటర్ వరంగల్కు కొత్త శోభ తేవాలని ప్రభుత్వం భావించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక పనుల్లో నాణ్యత ఎక్కడా కనిపించడం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు ఉందన్న ధీమాతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులు చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పనులు జరిగేలా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. వరంగల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రక నగరాల అభివృద్ధి పథకం(హృదయ్)లో భాగంగా భద్రకాళి చెరువును సుందరీకరించేందుకు రూ.15 కోట్లు కేటాయించారు. చెరువును అభివృద్ధి చేసి... హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డు తరహాలోనే భద్రకాళి చెరువు ముందువైపు కట్ట(ఫోర్ షోర్ బండ్) నిర్మించాలని నిర్ణయించారు. చెరువు కట్టను ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసేందుకు మొదటి దశలో రూ.2.97 కోట్లు విడుదలయ్యాయి. హృదయ్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం కింద అదనంగా రూ.4.05 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల టెండర్ల నిర్వహణ చిన్ననీటి పారుదల శాఖ అధ్వర్యంలో జరగగా.. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నాణ్యత లేని పనులు ఫోర్ షోర్ బండ్ పనులకు సంబందించి టెండర్ల ప్రక్రియలోనే నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే కూడా ఇదే స్పష్టమవుతోంది. అన్ని దశల్లోనూ పనులు టెండరు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. భద్రకాళి చెరువు కట్టను పరిష్టపరిచేందుకు సమీపంలోని రంగసముద్రం చెరువు నుంచి మట్టి తేవాలని నిబంధన ఉంది. రంగసముద్రంలోని చెరువు మట్టి గట్టిగా ఉంటుంది. దూరంలో ఉన్న ఈ చెరువు మట్టిని తెస్తే ఖర్చు ఎక్కువవుతుందనే ఉద్దేశంతో కాంట్రాక్టరు.. భద్రకాళి చెరువులోని బురద మట్టినే తీసి కట్ట నిర్మాణం కోసం వినియోగిస్తున్నాడు. చెరువులోని అడుగు మట్టి(రేగడి) బురదమయంగా ఉంది. ఇలాంటి మట్టిని కట్ట నిర్మాణ కోసం ఉపయోగించడం వల్ల ఫోర్ షోర్ బండ్ నాణ్యత లేకుండా పోతోంది. ఎండాకాలం కావడంతో ఆ మట్టి ఇప్పుడు కొంత గట్టిగా ఉంది. ఒక్క వర్షం పడితే నల్లమట్టి మొత్తం బురదగా మారి కట్ట మొత్తం నీళ్లలోకి జారిపోతుంది. అప్పుడు నెక్లెస్రోడ్డు తరహా నిర్మాణం కాదు కదా... అసలు కట్ట ఆనవాళ్లే కనిపించని పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా మట్టి కట్ట నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కట్టను వెడల్పు చేసేందుకు మట్టి పోస్తూ పాత రోలర్ను ఉపయోగిస్తే ప్రతి 22సెం.మీటర్లకు, వైబ్రేటర్ రోలర్ను ఉపయోగిస్తే ప్రతి 0.45 సెం.మీటర్లు నీళ్లు చల్లుకుంటూ రోలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదేమీ చేయకుండా ఒకేసారి పెద్దఎత్తున మట్టిపోస్తూ రోలింగ్ చేయ డం వల్ల భవిష్యత్తులో భారీ వర్షాలకు గుంతలు పడే అవకాశాలుంటాయని ఇం జనీరింగ్ నిఫుణులు అంటున్నారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న కుడా ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పనుల్లో మట్టిపైన మొ రం పోస్తూ నాణ్యత లోపాలను పైకి కనిపించకుండా చేస్తున్నారు. చారిత్రక చెరు వు పనుల్లో ఇన్ని రకాలుగా అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలు తావిస్తోంది. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతి నిధి అండతోనే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. -
ట్యాంక్బండ్పై సాహూ విగ్రహం నెలకొల్పాలి
సాహూ సతీమణి శోభ మాణిక్యాపూర్(భీమదేవరపల్లి) : కొమురంభీం చరిత్రను వెలికితీసి, గోండుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజాకవి కామ్రెడ్ సాహూ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై నెలకొల్పాలని సాహూ సతీమణి శనిగరం శోభ కోరారు. సాహూ వర్ధంతి సభ ఆయన స్వగ్రామం మాణిక్యాపూర్లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సాహూ మెమోరియ ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులతో ర్యాలీ నిర్వహించారు. శోభ మాట్లాడుతూ తన భర్త నక్సలైట్ ఉద్యమంలో కొనసాగుతూ ఆదిలాబాద్లోని గోండుల సమస్యల పరిష్కారానికి వారి భాష నేర్చుకుని పోరాడారన్నారు. సాహూ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. సర్పంచ్ వనపర్తి రాజయ్య, ఎంపీటీసీ గడ్డం వెంకన్న, జేఏసీ నాయకులు డ్యాగల సారయ్య, చెప్యాల ప్రభాకర్, మానవ వికాస వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రొంటాల బుచ్చయ్య, లోక్సత్తా నాయకులు బెల్లి రాజయ్య, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ఇంద్రసేన, పెట్టం రాంనారాయణ, పులి జగ న్నాథం, ట్రస్ట్ సభ్యులు ఉగ్గె శేఖర్, బండి రమేశ్, తూముల స్వామి, తాళ్లపల్లి జగన్, ప్రభాకర్, సాంబరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బోట్ ఈవెంట్ ప్రారంభించనున్న సానియా
హైదారబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, స్టార్ ప్లేయర్ సానియా మిర్జా అమెరికన్ అల్యూమినియం కాటమారన్ పాంటూన్ బోట్ రైడింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట లోని ప్లాజా హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహంచనున్నట్లు అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్, ఛైర్మన్ పేర్వారం రాములు, టీఎస్ టీడీసీ, క్రిస్టినా ఛోంగ్తు(ఐఏఎస్)లు ఈ లాంచింగ్ కార్యక్రమానికి హాజరుకాగా, వీరి సమక్షంలో సానియా మిర్జా ఈ బోటింగ్ ను ప్రారంభించనుంది. ప్రెస్ మీట్ లో ఈ ఈవెంట్ వివరాలను వెల్లడించనున్నారు.