terrorist attack
-
న్యూఓర్లీన్స్ ట్రక్కు దాడి.. ఎవరీ జబ్బర్?
కొత్త సంవత్సరం వేళ.. కేవలం గంటల వ్యవధిలో అమెరికాను వరుస దాడులు వణికించాయి. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడి కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేసింది.గతంలో అమెరికా సైన్యం పని చేసిన షంసుద్ దిన్ జబ్బార్(42)ను ఈ దాడికి ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. ట్రక్కుతో దాడికి పాల్పడిన అనంతరం.. అతడ్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. అయితే అతనొక మానసిక రోగినా? లేకుంటే ఉగ్రవాదినా? అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కానీ.. 👉జబ్బార్ గతంలో టెక్సాస్లో రియల్ ఎస్టేట్(Real Estate) ఎజెంట్గా పని చేశాడు. అంతకు ముందు చాలాఏళ్లు అమెరికా సైన్యంలో పని చేశాడు. అయితే.. ఆర్థిక సమస్యలతో పాటు విడాకులు అతని వ్యక్తిగత జీవితాన్ని కుంగదీసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట.. యూట్యూబ్ ఛానెల్లో తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పరిచయం చేసుకున్న ఓ వీడియో సైతం ఇప్పుడు బయటకు వచ్చింది.👉ఇదిలా ఉంటే.. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ స్పెషలిస్ట్గా, ఐటీ స్పెషలిస్ట్గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. అంతేకాదు.. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్లో అతను విధులు నిర్వహించాడు. తాజా దాడి ఘటన తర్వాత.. అమెరికా సైన్యంలో అతను పని చేసిన టైంలో ఓ వీడియో యూట్యూబ్లో వైరల్ అయ్యింది. అయితే కాసేపటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.👉వీటితో పాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్గా విధులు నిర్వహించాడు.👉దాడి ఘటనపై అతని కుటుంబం స్పందించింది. తన సోదరుడు జబ్బార్ ఎంతో మంచివాడని అబ్దుర్ జబ్బార్ చెప్తున్నాడు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది. కానీ, ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదు. రాడికలైజేషన్ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడు అని అబ్దుర్ చెప్తున్నాడు.👉జార్జియా స్టేట్ యూనివర్సిటీలో జబ్బార్ విద్యాభ్యాసం కొనసాగింది. 2015-17 మధ్య కంప్యూటర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. జబ్బార్ డైవోర్సీ. రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే రెండో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు 2022లో అతను పంపిన మెయిల్ను అధికారులు పరిశీలించారు.👉రియల్ ఎస్టేట్ నష్టాలతో జబ్బార్ ఆర్థికంగానూ జబ్బార్ చితికిపోయి ఉన్నాడు. ఒకానొక టైంలో అద్దె కూడా చెల్లించని లేని స్థితికి చేరుకున్నాడు. ఆఖరికి లాయర్కు ఫీజులను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించి.. వాటిని ఎగ్గొట్టాడు.👉నేర చరిత్రను పరిశీలిస్తే.. 2002లో దొంగతనం, 2005లో కాలం చెల్లిన డ్రైవింగ్ లైసెన్స్తో బండి నడిపి శిక్ష అనుభవించాడు.👉షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారని ఏబీసీ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. ఐసిస్ స్ఫూర్తితోనే తాను ఈ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్(ఐసిస్కు మరో పేరు) జెండా కూడా దాడికి పాల్పడిన ట్రక్కులో ఉన్నట్లు ఎఫ్బీఐ తనకు నివేదించిందని బైడెన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 👉షంషుద్దీన్ జబ్బార్ను ఐసిస్ ఒంటరి తోడేలు (Lone Wolf)గా ఎఫ్బీఐ భావిస్తోంది. అంటే.. ఒంటరిగాగానీ లేదంటే చిన్నగ్రూపులుగా ఏర్పడి దాడులు చేయడం. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఈ రూపంలోనే ఉంటున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రస్సెల్స్లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్లో బాస్టిల్డే నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే. ‘‘అతడికి సైనిక నేపథ్యం ఉంది. కానీ, ఏనాడూ యుద్ధంలో పాల్గొనలేదు. నౌకాదళంలో చేరేందుకు ప్రయత్నించినా.. అది వీలుకాలేదు. దాడికి ముందు సెయింట్ రోచ్ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందకి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్ ఎయిర్ బీఎన్బీలో ఒక గది తీసుకొని.. అక్కడ న్యూఆర్లీన్ దాడికి పేలుడు పదార్థాలు తయారుచేశాడు. టూరో అనే యాప్ సాయంతో అతడు ఫోర్డ్ ఎఫ్-150 లైటినింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును బుక్ చేశాడు. దానిని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ బర్బన్ వీధిలో విచక్షణా రహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు’’ అని లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్ల్ తెలిపారు.అయితే జబ్బార్ తన కుటుంబాన్ని ఐసిస్లో కలవాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడని.. వినకపోయేసరికి వాళ్లను సైతం కడతేర్చడానికి వెనుకాడలేదని అధికారులు చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. -
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
సత్వర చర్యలే రక్ష!
మంచుకొండల సీమ మళ్ళీ నెత్తురోడుతోంది. జమ్మూ– కశ్మీర్లోని కఠువా జిల్లా మాచేడీలో భారత సైనిక గస్తీ బృందంపై సాయుధ తీవ్రవాదుల దాడి సహా 48 గంటల్లో నాలుగు ఘటనలు జరగడమే అందుకు తాజా సాక్ష్యం. కఠువా ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో సహా అయిదుగురు సైనిక సిబ్బంది, ఆ వెంటనే మరో ఘటనలో మరో ఇద్దరు అసువులు బాయడం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సాధారణ తీవ్రవాదులు కాక సుశిక్షితులైన సాయుధ మూక కఠువా దుశ్చర్యకు పాల్పడడం సమస్య కొత్త లోతుల్ని చెబుతోంది. ఈ ఏడాది ఇంతవరకు జమ్మూలో ఇలాంటి ప్రధాన ఘటనలే అరడజనుకు పైగా సంభవించాయి. చిన్నాచితకా వాటి సంగతి సరేసరి. ఒక్క జూన్లోనే నాలుగు తీవ్రవాద దాడుల్లో, రెండు రోజుల్లో 9 మంది మరణించారు. ప్రభుత్వ వ్యూహాల వైఫల్యం, పాలకులు కశ్మీర్పై దృష్టి పెట్టి జమ్మూను తేలికగా తీసుకోవడం... ఏదైతేనేం తీవ్రవాదులు తమ కార్యాచరణను కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు బదలాయించారు. అలా తీవ్రవాదానికి ఇప్పుడు రాజౌరీ – పూంఛ్ ప్రాంతం కొత్త కేంద్రమైంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశం మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నందున తీవ్రవాదానికి ముకుతాడు వేయడం తక్షణావసరం.పాతికేళ్ళ క్రితం తీవ్రవాదానికి అడ్డా అయినా, అనంతరం ప్రభుత్వ చర్యలు, స్థానికుల సహకారంతో గత రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ ఇప్పుడు మళ్ళీ అగ్నిగుండం కావడం విషాదం. గమనిస్తే, ముష్కర దాడులతో జమ్మూలో బలైన సామాన్యులు, భద్రతా సిబ్బంది సంఖ్య గత ఏడాది జనవరి నుంచి ఇప్పటికి రెట్టింపయింది. తీవ్రవాద కేంద్రం మారిందడానికి ఇది స్పష్టమైన సూచిక. 2023 డిసెంబర్లో రాజౌరీ ఘటనలో నలుగురు సైనికులను కోల్పోయాం. తరవాత కుల్గామ్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు. ఇలా కొద్ది నెలల్లోనే సాహస జవాన్లను పలువురిని పోగొట్టుకోవడం విచారకరం. ప్రతి ప్రాణం విలువైనదే. అందులోనూ వీర సైనికుల ప్రాణత్యాగం వెల కట్టలేనిది. గత నెలలో వరుస ఘటనలతో తీవ్రవాదులు తెగబడ్డారు. జూన్ 9న పర్యాటకుల బస్సుపై దాడిలో 9మంది మరణించిన ఘటన, అది మరువక ముందే జూన్ 26న దోడాలో ఘటన... ఇవన్నీ అస్థిరతను సృష్టించాలని చూస్తున్న అదృశ్య శక్తుల విజృంభణకు సంకేతాలు. కశ్మీర్లో లోక్సభ ఎన్నికల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత జనం ఉత్సాహంగా పాల్గొనడంతో, అసెంబ్లీ ఎన్నిక లకు పాలకులు సన్నద్ధమవుతున్నారు. దానికి అడ్డం కొట్టడానికే తాజా ఉగ్ర దుశ్చర్యలని విశ్లేషణ. ఢిల్లీలో మోదీ సర్కార్ మూడోసారి కొలువు తీరినరోజే తీవ్రవాదులు పేట్రేగడం యాదృచ్ఛికం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దాయాది పాకిస్తాన్ పాత్రను విస్మరించలేం. భద్రత, విదేశాంగ విధానంలో తీవ్రవాదాన్ని క్రియాశీలంగా, అదే సమయంలో దొంగచాటు సాధనంగా చేసుకోవడం ఆ దేశం ఆది నుంచీ చేస్తున్నదే. ఆర్థికంగా కష్టాల్లో పడి, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తగ్గినా సరిహద్దులో అది తన కుటిల బుద్ధిని వదులుకోవట్లేదు. స్థానికులను ముందుంచి, తాను వెనుక నుంచి కథ నడిపే వ్యూహాన్ని జమ్మూలో అనుసరిస్తోంది. నిజానికి, జమ్మూ – కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేశాక కేంద్రం ఉక్కుపాదంతో వ్యవహరించింది. రద్దు అనంతరం సైతం అంతా సవ్యంగా ఉందని చెప్పడం, చూపడంలో మోదీ సర్కార్ బిజీగా ఉంది. దానికి తగ్గట్టే 2017 – 2022 మధ్య చొరబాటుదారుల సంఖ్య 53 నుంచి 14కి తగ్గిందనీ, దుశ్చర్యలు 228 నుంచి 125కి దిగివచ్చాయనీ హోమ్ శాఖ లెక్క. కానీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు సజావుగా లేవనీ, వాటిని పాలకులు పట్టించుకోవట్లేదనీ ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నది అందుకే. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దు మొదలు 370వ అధికరణం ఎత్తివేత దాకా తమ ప్రతి చర్యా తీవ్రవాదాన్ని తుదముట్టించేదే అని పాలకులు చెప్పినా అది వాస్తవరూపం దాల్చలేదు. పైగా, వర్షాకాలం కావడంతో సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లు సులభమవుతాయి. ప్రస్తుతం ఏటా భారీగా సాగే సంక్లిష్టమైన అమరనాథ్ యాత్రాకాలం కూడా! హిమలింగాన్ని దర్శించడానికి యాత్రికుల రద్దీ ఉండే ఈ సమయంలో మాటు వేసి కాటు వేయాలనీ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలనీ ముష్కరులు ఎత్తుగడ వేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే, తదుపరి పరిణామాలకు చింతించి ప్రయోజనం ఉండదు. వచ్చేవారం బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం జాగు చేయరాదు. చేపడుతున్న చర్యలపై స్వచ్ఛందంగా సవివరమైన ప్రకటన చేయాలి.పాక్తో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ కొనసాగుతున్నా, చైనాతో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మన బలగాలు ఆ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట మోహరించాల్సి వచ్చింది. ఫలితంగా కశ్మీర్తో పోలిస్తే సైనిక బలగాలు తక్కువగా ఉన్న జమ్మూ తీవ్రవాదులకు వాటంగా మారింది. కశ్మీర్ లోయలో కాస్తంత ఊపిరి పీల్చుకొనే లోగా ఇక్కడకు విస్తరించిన ఈ ముప్పును ఆదిలోనే అడ్డుకోవాలి. దేశ భద్రతపై రాజకీయాల కన్నా రాజీ లేని ధోరణి ముఖ్యమని అధికార, ప్రతిపక్షాలన్నీ బాధ్యతతో ప్రవర్తించాలి. పాలకులు గత పదేళ్ళ తమ హయాంలో అంతా సుభిక్షంగా, సుదృఢంగా మారిపోయిందనే ప్రగల్భాలు మాని, కార్యాచరణకు దిగాలి. భద్రతాదళాల పెంపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి. సమస్యను సమగ్రంగా దర్శించి, తీవ్ర వాదం వైపు స్థానికులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు శుష్క వాగ్దానాలకు మించిన భరోసా కల్పించాలి. అప్పుడే ఈ భూతాన్ని అడ్డుకోగలుగుతాం. భారత్తో వాణిజ్యం, శాంతి కోరుతున్నట్టు చెబుతున్న పాక్ సైతం తీవ్రవాదానికి అండదండలు మానాలి. లేదంటే గుణపాఠం తప్పదు. -
జమ్ము కథువాలో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలోనే మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మచెడి ప్రాంతంలో కిండ్లీ-మల్హార్ రోడ్లో పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్ విసిరి.. కాల్పులకు దిగారు. ప్రతిగా సైన్యం దాడికి దిగగా.. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడినవాళ్లకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మచెడి అడవుల్లో ఉగ్రవేట కొనసాగుతున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.ఇదిలా ఉంటే.. జమ్ములో గత 48 గంటల్లో ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీక్యాంప్పై ముష్కరులు జరిపిన దాడుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. ఇంకోవైపు శనివారం కుల్గాంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించగా, ఓ సైనికుడు గాయపడ్డాడు. అప్పటి నుంచి ఉగ్రవాడుల్ని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో(మోడర్గాం, ఫ్రిసాల్ ఏరియా) ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. -
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనక ఇద్దరు పాకిస్తానీయులు ఉన్నట్లు భద్రతా దళాలు సోమవారం గుర్తించాయి. నిందితుల కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. రాజౌరి, పూంచ్, రియాసిలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొండ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతో ఉగ్రవాదులను గాలిస్తున్నారు. జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్ ఖోరి నుంచి కాట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.#WATCH | Security heightened in Jammu & Kashmir's Reasi.Morning visuals from the area where a bus carrying pilgrims was attacked by terrorists led to the loss of 10 lives. pic.twitter.com/9i93KKbhzc— ANI (@ANI) June 10, 2024 రాజౌరి, పూంచ్, రియాసి ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులపై వేట కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.‘ప్రధాని మోదీ దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి మెడికల్ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.దాడిపై స్పందించిన రాష్ట్రపతి‘జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో స్పందించారు.I am anguished by the terrorist attack on a bus carrying pilgrims in Reasi district of Jammu and Kashmir. This dastardly act is a crime against humanity, and must be condemned in the strongest words. The nation stands with the families of the victims. I pray for the speedy…— President of India (@rashtrapatibhvn) June 9, 2024 కేంద్రమంత్రి అమిత్ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఉగ్రవాద దాడి పరికిపంద చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన. ఈ దాడితో జమ్ము కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని ఎక్స్లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.जम्मू-कश्मीर के रियासी ज़िले में, शिवखोड़ी मंदिर से तीर्थयात्रियों को ले जा रही बस पर हुआ कायरतापूर्ण आतंकी हमला अत्यंत दुखद है।यह शर्मनाक घटना जम्मू-कश्मीर के चिंताजनक सुरक्षा हालातों की असली तस्वीर है।मैं सभी शोक संतप्त परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और…— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2024యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
ప్రపంచానికి మాస్కో పాఠం
ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. శుక్రవారం రాత్రి మాస్కో సమీపంలో క్రిక్కిరిసిన మాల్లోకి వచ్చి, ఓ సంగీత కార్యక్రమ హాలులోని జనంపై నలుగురు తీవ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన దాడి ప్రపంచ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో కనివిని ఎరుగని ఈ స్థాయి దాడిలో దాదాపు 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు విడిస్తే, కొన్ని పదుల మంది గాయాల పాలయ్యారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అయిదోసారి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ దుశ్చర్య జరగడం గమనార్హం. యథేచ్ఛగా కాల్పులు జరిపి, భవనాన్ని తగులబెట్టిన దుండగులకు ఉక్రెయిన్తో లింకుందని రష్యా గూఢచర్య సంస్థల మాట. అయితే, 2022 నుంచి రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ మాత్రం తమకు సంబంధం లేదని ఖండించింది. కాగా, ఈ దాడి తామే చేసినట్టు తీవ్రవాద ‘ఐఎస్ఐఎస్’(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) శాఖ అయిన ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరసాన్ ప్రావిన్స్’ (ఐఎస్ఐఎస్–కె) ప్రకటించడంతో కొత్త చర్చకు తెర లేచింది. జనబాహుళ్యం ప్రాంతాల్లో ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ప్రమాదం ఉందని అమెరికా మార్చి 7 నాటికే హెచ్చరించింది. అయినా, రష్యా పెడచెవిన పెట్టింది. అలా ఈ దాడులు మాస్కో స్వీయ భద్రతా వైఫల్యానికి అద్దం పట్టడమే కాక, ఆ దేశానికి తలవంపులయ్యాయి. మాస్కో శివారులోనే తీవ్ర వాదులు చులాగ్గా దాడి చేస్తుంటే, ఉక్రెయిన్పై యుద్ధంతో తీరిక లేని రష్యాకు తగిన ప్రత్యేక దళాలు అందుబాటులో లేకుండా పోయాయనే మాటా వినిపిస్తోంది. అయినా సరే, దేశంలో అసమ్మతిపై ఉక్కుపాదం మోపి, ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతంపైగా ఓట్లు తెచ్చుకొని, ఉక్రెయిన్పై యుద్ధానికి ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్న రష్యా పాలకులు ఇప్పటికీ తప్పుడు దిశ వైపు చూస్తుండడం ఆశ్చర్యకరం. స్వయంకృతమని భావిస్తున్న తీవ్రవాద ముప్పుకూ పాశ్చాత్య ప్రపంచాన్నే నిందిస్తుండడం విచిత్రం. రెండు దశాబ్దాల పైగా ఉత్తర కాకసస్, చెచెన్యాలలో తీవ్రవాదంపై రష్యా తలపడుతోంది. సిరియా – ఇరాన్లతో దాని స్నేహం, మధ్యప్రాచ్యంలో దాని తీవ్రవైఖరి సరే సరి. ఇస్లామిజమ్ అణచివేతకూ దిగింది. దానికిప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విశ్లేషణ. నిజానికి, ఇరాక్, సిరియా దేశాల యుద్ధక్షేత్రాల్లో అసలైన ఐఎస్ఐఎస్ చాలా వరకు ఓటమి పాలైంది. అయితే, ఆ మాతృసంస్థ తాలూకు రక్తసిక్త వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న ‘ఐఎస్ ఐఎస్ –కె’ పడగ విప్పి, బుసలు కొడుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి పనిచేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఈ వర్గం నిదానంగా తన విషవృక్షపు ఊడలను విస్తరిస్తోంది. ఇప్పటికే అటు అఫ్గానిస్తాన్లోనూ, ఇటు పాకిస్తాన్లోనూ అది అనేక దాడులు జరిపింది. ఈ జనవరిలో సైతం ఇరాన్లోని కెర్మాన్లో ఇరానియన్ జనరల్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా అది జరిపిన బాంబు దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మాస్కో దాడితో ఈ తీవ్రవాద గ్రూపు భౌగోళికంగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2015 నాటి సిరియా అంతర్యుద్ధంలో రష్యా సేనలు అక్కడి అధ్యక్షుడు బషర్ అల్–అసద్ ఏలుబడిని సమర్థిస్తూ, ఐఎస్ వర్గానికి వ్యతిరేకంగా నిలిచాయి. సిరియాలో ప్రస్తుతం సద్దు లేనందున ‘ఐఎస్ఐఎస్–కె’ సారథ్యంలోని తీవ్రవాదులు అక్కడ తమ ఓటమికి ఇప్పుడిలా దాడి రూపంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఉండవచ్చు. ఉక్రెయిన్తో యుద్ధంలో మునిగిన పుతిన్ ఈ తాజా తీవ్రవాద దాడిపై స్పందించే తీరు రానున్న రోజుల్లో ప్రపంచ శక్తి సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయం. అసలు దాడికీ, ఉక్రెయిన్కూ సంబంధం ఉందన్న రష్యా మాట నమ్మశక్యంగా లేకపోగా, మధ్య ఆసియా ప్రాంతానికి విస్తరించాలని ‘ఐఎస్ఐఎస్–కె’ పడుతున్న ఆరాటానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. తజిక్ వర్గాల్లో ఈ తీవ్రవాద వర్గానికి ఆకర్షణ పెరుగుతోందనీ, ఈ ప్రాంతానికి విస్తరించే సత్తా దానికి ఉందనీ జనవరిలోనే ఐరాస భద్రతా మండలి తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో వివి«ద రకాల తీవ్రవాద ఘటనలు చూసిన మాస్కో కళ్ళు తెరిచి నిద్ర నటించడం మానాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శుష్క ఆరోపణలు మానేసి, సమస్య అసలు మూలాలపై దృష్టి పెట్టాలి. సొంత పెరట్లోనే ఈ తీవ్రవాద వర్గంతో పోరాటం చేస్తున్న అఫ్గానిస్తాన్ పాలకులతో కలసి కార్యాచరణ చేపట్టాలి. రష్యా ఘటన సాక్షిగా ఇప్పుడు కావాల్సిందల్లా... తీవ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, అంగీకారం. అంతర్జాతీయంగా ఐఎస్ఐఎస్–కె ఊడలు మరింత లోతుగా దిగక ముందే వివిధ ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. మునుపు ఐఎస్ను మట్టి కరిపించడానికి కలసికట్టుగా కాలు కదిపినట్టే ఇప్పుడూ ముందుకు కదలాలి. ఐఎస్ఐఎస్–కె బలంగా వ్యతిరేకించే అఫ్గాన్ తాలిబన్తో అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయం చేసుకోవాలి. సొంత గడ్డపై ఐఎస్ఐఎస్–కె, టీటీపీ లాంటి తీవ్రవాదుల కార్యకలాపాలను అనుమతించడం వల్ల చివరకు తమ దేశంతో పాటు, ఈ ప్రాంత భద్రతకే ప్రమాదమని అఫ్గానిస్తాన్ కూడా గ్రహించాలి. అందుకే, ఆ దేశం, దాని పొరుగునున్న ఈ తీవ్రవాద విషసర్పం కోరలు పీకే పనిలో ముందు వరుసలో నిలవాలి. ఇరాన్, చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు కలిసొచ్చి, ప్రాంతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఈ తీవ్రవాద భూతాన్ని నిర్వీర్యం చేయాలి. ఏకాగ్ర దృష్టితో సునిశితమైన కార్యాచరణకు దిగితేనే ఫలితాలుంటాయి. అప్పుడే అసువులు బాసిన అమాయకుల పక్షాన నిలిచి, దోషులను వెంటాడి వేటాడగలం. పొంచివున్న సరికొత్త తీవ్రవాద వర్గపు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడగలం. -
Russia: మాస్కోలో ఐసిస్ భారీ ఉగ్రదాడి
మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో సైనిక దుస్తుల్లో కాన్సర్ట్హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి. Horrifying visuals of the terror attack coming out of Moscow. The carnage is unimaginable. Devastating to say the least. This world needs peace and sanity. pic.twitter.com/sWFc4mTjVK — Supriya Shrinate (@SupriyaShrinate) March 22, 2024 The scary footage where people are running during the attack.#Moscou #Moskou #CrocusCityHall #Moscow #Russia #terrorist pic.twitter.com/gJchCa8zrU — Reality Talks (@RealityTallk) March 23, 2024 Very sad to hear what happened in #Moscow Praying for them 💔 pic.twitter.com/UUMcl9RsmI — Follow Back (@FzlMah) March 22, 2024 దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు. దాడి మా పనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
పూంచ్లో జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై మరోసారి ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం. కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమచారంతో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం భద్రతా దళాలకు సవాలుగా మారింది. గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్కౌంటర్లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా.. -
పాక్ వైమానిక కేంద్రంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్లోని మియాన్వలి వైమానిక శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టినట్లు సైన్యం ప్రకటించింది. దాడికి యత్నించిన మొత్తం తొమ్మిదిమందినీ మట్టుబెట్టామని తెలిపింది. శుక్రవారం ఉగ్రవాదుల దాడుల్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్వలి వైమానిక శిక్షణ కేంద్రంపైకి శనివారం వేకువజామున భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. అనంతరం మిగతా వారిని చుట్టుముట్టి, హతమార్చాయి. శిక్షణ కేంద్రం ఆవరణలోని నిరుపయోగంగా ఉన్న మూడు విమానాలు, ఒక ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిన్నట్లు ఆర్మీ తెలిపింది. దాడిలో పాల్గొన్న మొత్తం 9 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు స్పష్టం చేసింది. శిక్షణ కేంద్రంలో కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని వివరించింది. సైన్యానికి జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు తామే కారణమంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన ఉగ్ర సంస్థ తెహ్రీక్–ఇ–జిహార్ పాకిస్తాన్(టీజేపీ) మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో ప్రకటించుకుంది. అయితే, ఏకంగా సైనిక కేంద్రంపైనే ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ల్లో శుక్రవారం ఉగ్రవాదుల వేర్వేరు దాడుల్లో 17 మంది సైనికులు హతమయ్యారు. బలోచిస్తాన్లోని గ్వాదర్ జిల్లాలో పాస్ని నుంచి ఒర్మారా వైపు వెళ్తున్న ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రెండు వాహనాలపై జరిగిన ఉగ్రదాడిలో 14 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల దాడుల్లో ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే. టీటీపీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు 2022 డిసెంబర్తో ముగిశాక దాడులు తీవ్రతరం కావడం గమనార్హం. గ్వాదర్ ఘటనకు ముందు ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఒక సైనికుడు చనిపోగా మరో అయిదుగురు గాయాలపాలయ్యారు. -
కశ్మీర్ మళ్లీ మొదటికి?!
అడపా దడపా జరిగే ఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగా ఉన్నట్టు కనబడిన కశ్మీర్పై ఉగ్ర వాదులు పంజా విసిరారు. ఒక ఎన్కౌంటర్ సందర్భంగా అనంతనాగ్ జిల్లాలో బుధవారం సైనికాధికారులు కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆషిష్, డీఎస్పీ హుమాయిన్ ముజామిల్ భట్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు నేలకొరగడం... అదే ప్రాంతంలో శుక్రవారం మరో ఆర్మీ జవాన్ మిలిటెంట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవటం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. దట్టంగా అడవులు, కొండలు ఉండే ప్రాంతాలను ఎంచుకుని భద్రతా బలగాలపై దాడికి తెగబడటం ఇటీవలి కాలంలో మిలిటెంట్లు అనుసరిస్తున్న వ్యూహం. గత నెలలో ముగ్గురు ఆర్మీ జవాన్లను హతమార్చిన ప్రాంతం కుల్గామ్ కూడా దట్టమైన అటవీ ప్రాంతమే. కొండలు, కోనలు ఉండే అటవీప్రాంతంపై సమగ్ర అవగాహన ఉంటే తప్ప సైన్యం మిలిటెంట్లను తిప్పికొట్టడం సాధ్యం కాదు. తమకు బాగా పట్టున్న ఇలాంటి ప్రాంతాల్లో వారానికి సరిపడా ఆహారం, మందుగుండు సిద్ధం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం మిలిటెంట్లు సైన్యాన్ని తామున్నచోటకు రప్పిస్తున్నారు. కొండలపై మాటుగాసి తమవైపు వస్తున్న బలగాలపై కాల్పులు జరపటం మిలిటెంట్లకు సులభమవుతోంది. ఎత్తయిన ప్రాంతంలో ఉండటం వల్ల భద్రతా బలగాలకు బాసటగా వచ్చే హెలికాప్టర్లపై సునాయాసంగా దాడులు చేయగలుగుతున్నారు. పైగా మిలిటెంట్ల ఫోన్ సంభాషణలను వినటం, వారి ఆనుపానులు ఎక్కడ వున్నాయో కచ్చితంగా అంచనా వేయటంలాంటి అంశాల్లో సైన్యం విఫలమవుతోంది. మైదాన ప్రాంతాల్లో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడింది. అక్కడ భద్రతా బలగాలకు సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మిలిటెంట్ల ఆటలు సాగడం లేదు. ఉగ్రవాద దాడులు పెరగటం వెనక ఎప్పటిలాగే పాకిస్తాన్ హస్తం ఉండటం బాహాటంగా కన బడుతోంది. వాస్తవానికి పాక్ ఆర్థికంగా దివాలా తీసి, ఇప్పట్లో కోలుకునే అవకాశం లేని స్థాయికి చేరుకుంది. రాజకీయంగా సరేసరి. ఇమ్రాన్ ఖాన్ను గద్దెదించిన నాటినుంచీ సైన్యంపై సాధారణ ప్రజానీకంలో ప్రతికూలత పెరిగింది. మరోపక్క ఉగ్రవాదులకు నిధులు అందజేయటానికి తోడ్పడే సంస్థలనూ, దేశాలనూ నిరోధించేందుకు అంతర్జాతీయంగా ఏర్పాటైన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్పై నిఘా ఉంచింది. అయినా సరే అది తన వెనకటి గుణాన్ని వదులుకోవటానికి సిద్ధపడటం లేదని కశ్మీర్ తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పుడు జరిగిన దాడులకు బాధ్యు లుగా చెప్పుకున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా పుట్టుకొచ్చిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ ఆంక్షలను అధిగమించటానికి పాకిస్తాన్ ఈ కొత్త ఉగ్ర సంస్థను సృష్టించిందని సులభంగానే గ్రహించవచ్చు. సరిహద్దులకు ఆవలినుంచే టీఆర్ఎఫ్కు ఆయుధాలు, డ్రగ్స్ అందుతున్న సంగతి కూడా నిర్ధారణ అవుతోంది. 370వ అధికరణను రద్దుచేసి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి నాలుగేళ్లు కావస్తోంది. అటు తర్వాత కశ్మీర్లో పరిస్థితి మెరుగు పడిందని, ఆర్థికంగా కోలుకోవటంతోపాటు భద్రతరీత్యా సురక్షితంగా ఉన్నదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. గతంతో పోలిస్తే కశ్మీర్కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. నగరాలు, పట్టణాల్లో మిలిటెంట్ల ఆటలు సాగటం లేదు. కానీ అంతమాత్రానికే సంతృప్తి పడితే ప్రమాదకర పర్యవసానా లుంటాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇటీవలి ఎన్కౌంటర్లను పరిశీలిస్తే బలగాలకు మార్గదర్శకాలిచ్చి వారిని నడిపించాల్సిన ప్రధాన అధికారులే బలవుతున్న సంగతి అర్థమవుతుంది. దాడులకు సీనియర్ అధికారులు నేతృత్వం వహించాలన్నది ఒకరకంగా మంచి నిర్ణయమే. ఇందువల్ల దాడుల్లో చురుగ్గా పాల్గొనేందుకు కింది స్థాయి జవాన్లు సంసిద్ధులవుతారు. అయితే దానికి తగినట్టుగా మిలిటెంట్లు మాటువేసిన ప్రాంతాన్ని నిర్ది ష్టంగా, నిర్దుష్టంగా నిర్ధారించుకోవటానికి అవసరమైన పరికరాలు వారికి అందుబాటులో ఉంచటం అతి ముఖ్యం. తగిన వ్యూహాన్ని రూపొందించటంలో, బలగాల్లో ఆత్మవిశ్వాసం నింపి, వారి నమ్మ కాన్ని గెల్చుకోవటంలో సీనియర్ల పాత్ర కీలకమైనది. అటువంటి అధికారులను కోల్పో వటం వల్ల భద్రతా బలగాలకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇవన్నీ శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించినవి. వీటికి సమాంతరంగా కశ్మీర్లో మళ్లీ రాజకీయ ప్రక్రియ ప్రారంభించటానికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడ గొట్టాక అంతా మెరుగైందని బీజేపీ నేతలు చెబుతున్నా ఉగ్రవాదుల ఆగడాలు క్రమేపీ పెరుగుతున్న సంగతి కాదనలేనిది. పండిట్లపైనా, వలస వచ్చినవారిపైనా మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయని గతంలో కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించిన బృందంలోని సభ్యురాలు రాధాకుమార్ ఇటీవలే గుర్తుచేశారు. కశ్మీర్లో నిరుద్యోగిత దేశ సగటుకన్నా మూడు రెట్లు ఎక్కువున్నదని ఆమె అంటు న్నారు. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం 2015 నుంచి మిలిటెన్సీకి దూరంగా ఉంది. అక్కడ గత ఏడెనిమిదేళ్లుగా చెప్పుకోదగిన ఘటనలు లేవు. అటువంటిచోట ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులు చేయగలిగారంటే ఆలోచించాలి. కశ్మీర్లో నిరుడు దాదాపు వందమంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారని, వీరిలో చాలామంది టీఆర్ఎఫ్వైపు మొగ్గారని గణాంకాలు చెబు తున్నాయి. కనుక ఉగ్రవాదాన్ని నిరోధించటానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించటం, యువతలో నిరుద్యోగితను అరికట్టడం వంటి చర్యలు అవసరం. -
కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో సైనికుడి వీరమరణం
కశ్మీర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఓ పోలీసు అధికారి మరణించారు. ఈ రోజు అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో సైనికుడు తీవ్ర గాయాలతో నెలకూలాడు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అనంతనాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో 48 గంటలుగా భీకర పోరు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో భయంకరమైన బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, పోలీసు అధికారి డీఎస్పీ హుమయూన్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Updates:కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు -
ఇంకా రహస్య యుద్ధమే విధానమా?
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్–ఎ– తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) భయంకరమైన దాడులను చేస్తోంది. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి దిగజారుతోంది. అయినా పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలోని బజౌర్ జిల్లాలో జూలై 30న జమీయత్ ఉలేమా– ఎ–ఇస్లాం ఫజల్ (జేయూఎల్–ఎఫ్) సమావేశంపై జరిగిన ఉగ్రదాడిలో 50 మందికి పైగా మరణించారు, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించింది. గతంలో కూడా జేయూఎల్–ఎఫ్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ అనేక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రధాన కారణాలలో ఒకటి, అఫ్గానిస్తాన్ తాలిబన్లతో జేయూఎల్–ఎఫ్కు ఉన్న అనుబంధం; మరొక కారణం, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి జేయూఎల్–ఎఫ్ ఇస్తున్న మద్దతును ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకించడం అని చెప్పాలి. బలూచిస్థాన్ లోని ఝోబ్ ఆయుధాగారంపై ఇటీవల జరిగిన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖచిత్రంలో తాజా ప్లేయర్ అయిన తెహ్రీక్– ఎ–జిహాద్ పాకిస్తాన్ (టీజేపీ) ఆ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. టీజేపీ, తెహ్రీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. టీటీపీ పాకి స్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తున్న భయంకరమైన సంస్థ. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి మరింత దిగజారుతోంది. గత ఏడాది నవంబర్లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఖైబర్ పఖ్తున్ ఖ్వా, బలూచిస్తాన్లలో టీటీపీ దాడులు పెరిగాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. తాలిబన్లతో చెడిన మైత్రి అఫ్గానిస్తాన్తో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021 ఆగస్ట్లో కాబూల్ను తాలిబన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మాజీ పౌర, సైనిక నాయకత్వం వ్యూహాత్మక విజయంగా భావించిన దానికి ఇది విరుద్ధంగా నడుస్తోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సంబంధాలలో రెండు సమస్యలు కీలకంగా ఉన్నాయి. మొదటిది, డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా గుర్తించడానికి తాలిబన్లు విముఖత వ్యక్తం చేయడంతోపాటు, సరిహద్దుల్లో కంచె వేయడాన్ని వారు ప్రతిఘటించడం. రెండవది, మిలిటెంట్ గ్రూపునకు మద్దతు నిచ్చే స్థావరాన్ని విడిచిపెట్టమని పాకిస్తాన్ సైన్యం పదే పదే సందేశం పంపినప్పటికీ, టీటీపీని తాలిబన్ ప్రోత్సహిస్తోంది. పైగా కాబూల్లో ప్రాతినిధ్య పాలన ఓడిపోయిన తర్వాత టీటీపీ గణనీయంగా బల పడింది. తాలిబన్ తో టీటీపీ బలమైన సైద్ధాంతిక (వ్యూహాత్మక) కూటమిని పంచుకున్నందున ఇది ఊహించదగినదే. టీటీపీ అనేది అఫ్గాన్ తాలిబన్లకు సైద్ధాంతిక విస్తరణ. పైగా ఉగ్రవాదంపై అమెరికా సాగించిన యుద్ధ సమయంలో తాలిబన్లకు ఇది మద్దతునిచ్చింది. కాబట్టి తిరిగి సహాయం చేయడం కోసం టీటీపీకి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత అఫ్గాన్ తాలిబన్లపై ఉంది. అయితే తాలిబన్లు తమ భూభాగంలో టీటీపీ ఉందనడాన్ని ఖండించారు. అంతేకాకుండా అఫ్గాన్ గడ్డపై దాడులను చేయరాదని పాకిస్తాన్ ను హెచ్చరించారు కూడా. అయినప్పటికీ, టీటీపీకి అఫ్గాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నట్లు పాకిస్తాన్ సైన్యం గుర్తించింది. పైగా ఈ విషయంలో తదుపరి చర్యపై బలమైన ప్రకటనలను జారీ చేస్తోంది. ఝోబ్ దాడి తరువాత, ‘అఫ్గానిస్తాన్లో టీటీపీకి అందుబాటులో ఉన్న సురక్షిత స్వర్గ ధామాలు, కార్యాచరణకు చెందిన స్వేచ్ఛపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు’ పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ఇటువంటి దాడులు సహించలేనివనీ, పాకిస్తాన్ భద్రతా దళాలు వీటిపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయనీ ప్రకటించింది. ఉ్రగ్ర సంస్థలు ఏకమయ్యే ప్రమాదం ఐఎస్ఐఎల్ (దాయెష్), అల్–ఖైదా, అనుబంధ గ్రూపులు, వ్యక్తులకు సంబంధించి... ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ‘ది ఎనలిటికిల్ సపోర్ట్ అండ్ శాంక్సన్స్ మానిటరింగ్ టీమ్’ సమర్పించిన 32వ నివేదిక టీటీపీ ఒక ప్రాంతీయ ముప్పుగా మారవచ్చని పేర్కొంది. ‘తాలిబన్ నియంత్రణలో దాడి ప్రయత్నాలను తప్పించు కుంటూ, అనేక రకాల విదేశీ సమూహాలు ఏకఛత్రంగా పనిచేస్తాయి లేదా ఐక్యమవుతాయి’ అని ఈ నివేదిక తెలిపింది. అయితే టీటీపీ గురించిన సైన్యం ప్రతిస్పందనపై పుష్కలమైన ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం, పౌర, సైనిక ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసింది. ఈ సందర్భంలో మూడు ఎంపికలను విశ్లేషించవచ్చు: ఒకటి: పాకిస్తాన్ ప్రభుత్వం టీటీపీని తిరిగి చర్చల బల్ల వద్దకు తీసుకువచ్చి కాల్పుల విరమణకు ప్రయత్నిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న గత ప్రభుత్వం టీటీపీ గ్రూప్తో చర్చలు జరపడానికి ప్రయత్నించి 100 మందికి పైగా టీటీపీ ఖైదీలను విడుదల చేసింది. ఇది టీటీపీ గ్రూప్ బలాన్ని పెంచింది. ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాని డిమాండ్లపై రాజీ పడేందుకు టీటీపీ ఎలాంటి సంకేతాన్నీ చూపలేదు. తీవ్రవాద దాడుల పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ పదే పదే బాధ్యత వహించారని చెప్పవచ్చు. రెండు: అఫ్గాన్ తాలిబన్ ను పాకిస్తాన్ విశ్వాసంలోకి తీసుకుంటుంది. తరువాత గ్రూపును నియంత్రించే బాధ్యత తీసుకుంటుంది. అయితే తాలిబన్, టీటీపీల మధ్య బలమైన సంబంధాలు, తాలిబన్ నుండి టీటీపీ ప్రేరణ పొందడం, పైగా వారిని రోల్ మోడల్గా చూడటం ఈ అవకాశ సాధ్యా సాధ్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే, పాకిస్తాన్ లోని అస్థిర పరిస్థితులను బట్టి, ఇది అక్కడి పాలనా వ్యవస్థకు సాధ్యమైన ఎంపికగానే కనిపిస్తోంది. మూడు: టీటీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతి–తిరుగుబాటు చేయడం. పాక్ మిలిటరీ ఇంతకుముందు 2014లో జర్బ్–ఎ–అజ్బ్, 2017లో రద్–ఉల్–ఫసాద్ వంటి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించింది. ఇవి టీటీపీ సంఖ్యను, ఉగ్రవాద దాడులను నిర్వహించగల దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ ఈ గ్రూప్ తనను తాను నిలబెట్టుకుని తాలిబన్ మద్దతుతో వృద్ధి చెందింది. అయితే నాలుగు కారణాల వల్ల పాక్ సైనిక ప్రతిస్పందనకు అవరోధం ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో గణనీయమైన స్థానభ్రంశాలు చోటు చేసుకోవడం; భయంకరమైన ఆర్థిక సంక్షోభం (దాంతో పాటు వరదల వల్ల కలిగిన దుఃస్థితి); ఏ సైనిక చర్య అయినా దేశంపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతర చేయడం; అఫ్గాన్ తాలిబన్ల నుండి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అపారంగా ఉండటం. కుట్రలో భాగమా? అయితే టీటీపీ గ్రూప్ కార్యకలాపాలను నియంత్రించకపోవడం పాక్ సైన్య ఉద్దేశపూర్వక కుట్ర చర్యలో భాగమనీ, ఉగ్రవాద వ్యతిరేక సహాయాన్ని అమెరికా నుంచి ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఏమైనా పాక్ సైన్యం తన ఎంపికలను అప్రమత్తంగా పరిశీలిస్తుండగా, పాకిస్తాన్ మాత్రం తన వ్యూహాత్మక ఎంపికల బురదలో చిక్కుకుందనేది వాస్తవం. పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. శాలినీ చావ్లా వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
స్టికీ బాంబులు, గ్రనేడ్లు, స్టీలు బుల్లెట్లు.. ఉగ్రదాడిలో కీలక విషయాలు..!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పూంఛ్లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు ఈ దాడికి స్టికీ బాంబులు, స్టీల్ బుల్లెట్లు, గ్రనేడ్లు ఉపయోగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. స్టికీ బాంబులు అంటే పేలుడు పరికరాలు. వీటిని వాహనానికి అమర్చి డిటోనేటర్ల ద్వారా లేదా టైమర్ సెట్ చేసి పేలుస్తారు. ఘటనా స్థలంలో స్టికీ బాంబులతో పాటు, రెండు గ్రనేడ్ పిన్నులు, బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. జవాన్లపై ఉగ్రవాదులు 36 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడిలో రెండు ఉగ్ర సంస్థలకు చెందిన ఏడుగురు తీవ్రవాదులు పాల్గొన్నారు. వీరు పాకిస్థాన్కు చెందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందినవారు అయి ఉంటారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఇంటెలిజెన్స్ బ్యూరో.. కేంద్ర హోంశాఖ, ఎన్ఐఏకు అందించింది. దాడి అనంతరం నిందితుల కోసం వేట మొదలుపెట్టాయి భారత బలగాలు. 2000కు పైగా కామాండోలను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను మరింత పటిష్టం చేశారు. చదవండి: ఉగ్రదాడిలో అమరులైన సైనికులు వీరే.. -
పూంఛ్ ఘటన ప్రమాదం కాదు.. ఉగ్రదాడి: భారత ఆర్మీ
ఢిల్లీ: జమ్ముకశ్మీర్ పూంచ్లో గురువారం జవాన్ల ట్రక్కుకు జరిగింది ఘోరం ప్రమాదం కాదని.. అది ఉగ్రదాడి అని భారత సైన్యం నిర్ధారించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించింది ఆర్మీ. జమ్ము-పూంచ్ హైవేపై రాజౌరీ సెక్టార్ తోతావాలి గల్లీ దగ్గర జవాన్లు వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారని, మంటలు చెలరేగి రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం చెందినట్లు ఆర్మీ తెలిపింది. మరో జవాన్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జవాన్లను ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి మోహరించే క్రమంలోనే ఈ ఘోరం జరిగింది. వర్షం పడుతుండడంతో ట్రక్కు నెమ్మదిగా వెళ్లోందని, ఇది ఆసరాగా తీసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరి దాడికి పాల్పడ్డారని సైన్యం తెలిపింది. తొలుత ఇది పిడుగు ప్రమాదంగా భావించిన ఆర్మీ.. దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా.. చివరికి ఉగ్రదాడిగానే తేల్చింది. -
Rajouri: గ్రామస్థుల చేతికే ఆయుధాలు.. కేంద్రం సంచలన నిర్ణయం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరీలో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఇళ్లల్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక అడుగు వేసింది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 5,000 మంది స్థానికులు ఆయుధాల కోసం పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా వీడీజీగా ఈ నిఘా బలగాలను పిలుస్తారు. గడిచిన రెండు దశాబాద్దాల్లో భారీస్థాయిలో గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా కమిటీలను పునరుద్ధరించడం ఇదే తొలిసారి. ఈ గ్రూపుల్లోని ప్రతిఒక్కరికి .303 రైఫిల్, 100 రౌండ్ల తూటాలు అందిస్తారు. అలాగే వారికి ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ కూడా అందించాలని ప్రభుత్వం భవిస్తోంది. ఏమిటీ ఈ గ్రామ రక్షణ కమిటీలు? జమ్మూకశ్మీర్లో శాంతిభద్రత పరిరక్షణ పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. 1990లో దోడా జిల్లాలో మైనారిటీలపై దాడులు జరిగిన క్రమంలో తొలిసారి వీడీసీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, ఇతర జిల్లాల ప్రజలకు ఆయుధాలు అందించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 28000 మంది వీడీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా హిందూ, సిక్కు, ముస్లిం వర్గాలకు చెందినవారు ఉన్నారు. అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత పోలీసు బలగాల ప్రాబల్యం పెరిగిన క్రమంలో ఈ కమిటీల ఉనికి తగ్గిపోయింది. కానీ, ఇటీవలే హిందువులపై ఉగ్రదాడి తర్వాత గ్రామ రక్షణ కమిటీలు తిరిగి పురుడుపోసుకున్నాయి. రాజౌరీ జిల్లాలోని పంచాయతీల్లో ఆయుధాలను తనిఖీ చేసి గ్రామస్థులకు శిక్షణ ఇస్తోంది పోలీసు శాఖ. చాలా కాలం క్రితం కుటుంబంలోని పెద్దలకు, తల్లిదండ్రులకు అందించిన ఆయుధాలను యువకులు చేతబడుతున్నారు. ‘రైఫిల్ను శుభ్రం చేసుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దీనిని తనిఖీ చేయిస్తున్నా. మాపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నా.’ అని టింకూ రైనా అనే ఓ యువకుడు తెలిపారు. తాను పోలీసు రికార్డుల్లో పేరు నమోదు చేసుకోలేదని, కానీ తన వద్ద .303 రైఫిల్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జోగిందర్ సింగ్ అనే మరో యువకుడు తన ఇంట్లో వారికి చెందిన రెండు రైఫిల్స్ను ఆయుధాల తనిఖీ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను వీడీసీ బృందంలో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ఆయుధాల అందజేత.. వీడీసీ గ్రూప్ సభ్యులకు కొత్త ఆయుధాలు అందిస్తున్నట్లు చెప్పారు జిల్లా పోలీస్ చీఫ్ మొహమ్మద్ అస్లాం. ఫైరింగ్పై శిక్షణ ఇస్తున్నామని, ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. మరోవైపు.. వీడీసీ సభ్యులకు రూ.4000 గౌరవవేతనం ఇస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంత వరకు అమలులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వీడీసీలకు అందిస్తున్న ఆయుధాలు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆందోళనలు నెలకొన్నాయి. సుమారు 200లకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. రంగంలోకి భారీగా పారామిలిటరీ -
మైకేల్ లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవే!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!. స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది. ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు. -
Rajouri: హిందువులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీనగర్: రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్పీఎఫ్ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే సీఆర్ఎఫ్ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. -
ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదుల దాడిలో పాక్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి చెందారు. ఈ ఘటన బలూచిస్తాన్లో ఖరన్ ప్రాంతంలోని మసీదు వెలుపల చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కొంతమంది దుండగులు మసీదు వెలుపల ఉన్న మహ్మద్ నూర్ మొస్కాంజాయ్పై బహిరంగంగా కాల్పులు జరిపినట్లు ఖరన్ పోలీస్ సూపరింటెండెంట్ హలీమ్ తెలిపారు. తాము హుటాహుటినా మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాంటి ధైర్య సాహసాల గల న్యాయమూర్తి సేవలను మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులతో దేశాన్ని భయపెట్టలేరని, ఇవి పిరికిపందలు చేసే దుశ్చలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్వెట్టా బార్ అసోసీయేషన్(క్యూబీఏ) ప్రెసిడెంట్ అజ్మల్ ఖాన్ కాకర్ కూడా న్యాయమూర్తి మొస్కాంజాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి పాకిస్తానీ పౌరుడు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశంలో అధ్వాన్నంగా ఉన్న భద్రతా పరిస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. అదీగాక గత కొద్ది నెలలుగా పాక్లో ఉగ్ర దాడులు ఎక్కువవుతున్నాయని పాక్ న్యాయశాఖ మంత్రి షాహదత్ హుస్సేన్ అన్నారు. అంతేగాదు ఈ ఏడాదిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే అత్యధికంగా ఉగ్రదాడుల జరిగాయని ఇస్లామాబాద్కి చెందిన థింక్ ట్యాంక్ పేర్కొంది. పైగా ఈ హింసాత్మక దాడులు ఫటా, ఖైబర్ పఖ్తుంఖ్వాలలోనే దాదాపు 106 శాతం పెరిగిందని వెల్లడించింది. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
హైదరాబాద్లో హైటెన్షన్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్గా ఉగ్రదాడి ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ ఉగ్ర కుట్ర ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాదులో పలుచోట్ల విధ్వంసాలు సృష్టించేందుకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో లింకులు ఉన్న జాహిద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, జాహిద్ అరెస్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసింది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర చేసింది. హైదరాబాద్లో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడులకు సైతం ప్లాన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్ నుంచి జాహిద్కు ఆదేశాలు అందిన్నట్టు గుర్తించారు. దాడులు చేసేందుకు నాలుగు గ్రనేడ్స్ను జాహిద్కు పంపిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ పంపించారు. సోదాల్లో భాగంగా నిందితుల నుంచి 4 గ్రనేడ్లతో పాటు రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీసీఎస్, సిట్లో జాహిద్ అండ్ టీమ్పై కేసు నమోదు చేశారు. జాహిద్తో పాటు మరో ఏడుగురిపై సిట్ కేసు నమోదు చేసింది. సుజి, సమీయుద్దీన్, అదీల్, అప్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషిను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్లో ఉన్న హ్యాండర్ల ద్వారా నిధులు సేకరిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్ నుంచి జాహిద్కు ఆదేశాలు అందినట్టు తెలుసుకున్నారు. కాగా, గతంలో పలు బ్లాస్ట్ కేసుల్లో అబ్దుల్ జాహిద్ నిందితుడిగా ఉన్నాడు. 2005లో బేగంపేట్ టాస్క్ఫోర్స్ కార్యాలయంపై సూసైడ్ అటాక్కు జాహిద్ ప్లాన్ చేశాడు. ఫర్హతుల్లా ఘోరీ, అణు హంజాల, అబ్దుల్ మజీద్లతో కలిసి కుట్ర చేశారు. 2002 సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ వద్ద కుట్రకు ప్లాన్ చేశారు. 2005లో బేగంపేట్ టాస్క్ఫోర్స్ మానవ బాంబు పేలుళ్లను సైతం జాహిద్ ప్లాన్ చేశాడు. హైదరాబాద్లోనే ఉంటూ జాహిద్ ఉగ్ర కుట్రలు చేస్తున్నాడు. -
కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా టెర్రరిస్టుల కాల్పులు.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తూటా గాయాలయ్యాయి. తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ‘షోపియాన్, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇరువురు మైనారిటీ కమ్యూనిటికీ చెందినవారే. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కశ్మీర్ పోలీసులు. ఇదీ చదవండి: కరాచీలో దిగిన హైదరాబాద్ చార్టర్ ఫ్లైట్.. విమానంలో 12మంది ప్రయాణికులు! -
జమ్మూకశ్మీర్: ఆర్మీ క్యాంప్పై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్లు వీర మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపులోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కి.మీ దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజౌరీలోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున మట్టుబెట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు. చదవండి: ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలొస్తే.. బిహార్లో వారిదే హవా -
కశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్షా ఉన్నతస్థాయి సమావేశం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో హిందువులపై జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జమ్ము కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, ఆర్ అండ్ ఏడబ్ల్యూ చీఫ్ సమంత్ సమంత్ గోయల్ హాజరయ్యారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు. కాగా జమ్మూకశ్మీర్లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని నెలలుగా హిందువులను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు జరగుతున్నాయి. మే 1 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షిత హత్యలు జరిగాయి. గురువారం బీహార్కు చెందిన దిల్ఖుష్ కుమార్ (17) అనే కార్మికుడు బుద్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. అదే రోజు కుల్గామ్లో రాజస్థాన్కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి హత్యకు గురయ్యాడు. అంతకు ముందు గోపాల్పొర ప్రాంతంలోని ఓ పాఠశాలలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడ పనిచేస్తోన్న రజిని బాలా అనే ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. అయితే ఇటీవల జరిగిన దాడులను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనలను నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి వారిని జమ్మూకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో కాశ్మీర్ లోయలోని 350 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, కాశ్మీరీ పండిట్లందరూ మనోజ్ సిన్హాకు రాజీనామాలు సమర్పించారు. చదవండి: ఆర్యసమాజ్లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఉగ్రకాండ.. అమిత్ షా మీటింగ్ ముందర మరొకటి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మైనార్టీలపై వరుస ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో హిందూ కమ్యూనిటీ వ్యక్తిని కాల్చిచంపారు ముష్కరులు. కుల్గాంలోని ఆరే మోహన్పురలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్ వరుస కాల్పుల ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే మరొ ఘటన జరగడం విశేషం. మృతుడిని ఎలఖాహీ డెహతి బ్యాంక్ మేనేజర్ విజయ్కుమార్గా గుర్తించారు. ఆయన స్వస్థలం రాజస్థాన్ హనుమాన్గఢ్. రెండు రోజుల కిందట ప్రభుత్వ టీచర్ రజనీ బాలా(36) ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రాహుల్ భట్ మరణం.. నిరసనలతో పాటు రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ మధ్యలో ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కూడా దారుణ హత్యకు గురైంది. ఇదిలా ఉంటే.. కశ్మీర్లో వరుసగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల భద్రత విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ వర్గాల తరపున అక్కడి పార్టీలన్నీ కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు కశ్మీర్ పండిట్లు సైతం.. తమను బలవంతంగా తీసుకొచ్చి ఉగ్రవాదుల చేతిలో చంపిస్తున్నారంటూ కేంద్రంపై మండిపడుతున్నారు. కశ్మీర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే ఈ ఘటన జరగడం విశేషం. ఈ భేటీలో షాతో పాటు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరుకానున్నారు. కశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు ఎల్జీ. కేంద్రం హోం కార్యదర్శి అజయ్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్.. ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా? -
చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?
శ్రీనగర్: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ కాల్చివేత ఘటన జమ్ము కశ్మీర్ను అట్టుడికిపోయేలా చేస్తోంది. ఈ ఘటనకు నిరసనగా పలు చోట్ల కశ్మీరీ పండిట్లు పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పోలీసులు టియర్గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బుద్గం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్ భట్(36).. టెర్రరిస్టుల దాడిలో చనిపోయాడు. బుద్గాం జిల్లా చదూర గ్రామం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించే లోపు ఆయన ప్రాణం విడిచాడు. గత ఆరు నెలల్లో ఇది మూడో ఘటన. ఈ ఘటనకు నిరసనగా కశ్మీర్ పండిట్లు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. క్యాంపుల నుంచి బయటకు వస్తున్న కశ్మీరీ పండిట్లు.. రోడ్లను దిగ్భంధించి, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వైపు మార్చ్గా వెళ్తున్న నిరసనకారుల్ని టియర్ గ్యాస్ ప్రయోగించి చెల్లాచెదురు చేశాయి భద్రతా బలగాలు. అందుకే తీసుకొచ్చారా? కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు నినాదాలు చేస్తున్నారు. ‘‘సిగ్గుపడాల్సిన ఘటన ఇది. ప్రభుత్వాన్ని మేం నిలదీస్తున్నాం. ఇదేనా పునరావాసం అంటే? మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడసలు భద్రత ఏది? మా పని మేం చేసుకోవడానికి వచ్చాం. మమ్మల్ని ఎందుకు చంపడం? మేం చేసిన నేరం ఏంటి? ఇదంతా నిర్వాహక వైఫల్యమే!. ఆందోళనలు వ్యక్తం చేస్తే టియర్ గ్యాసులు ప్రయోగిస్తారా? అంటూ మండిపడుతున్నారు కశ్మీరీ పండిట్లు. #WATCH Police fire tear gas shells at protestors to prevent them from moving towards the Airport Road in Budgam during their protest demonstration against the recent killings of Kashmiri Pandits in the Union Territory pic.twitter.com/EPHvomqH9j — ANI (@ANI) May 13, 2022 బుద్గం షెకాపోరాలో ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్థానిక ముస్లింలు.. కశ్మీరీ పండిట్లకు మంచి నీళ్లు, భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు వాళ్లకు న్యాయం జరగాలని, భద్రతా అందాలంటూ గళం కలిపారు. ‘‘ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా కశ్మీరీ పండిట్లకు భద్రత లేకపోతే ఎలా? ఇంక ఎక్కడికి వెళ్లాలి వాళ్లు?ఇది పూర్తిగా పరిపాలనపరమైన వైఫల్యమే. కశ్మీర్ ముస్లింలందరికీ విజ్ఞప్తి. కశ్మీరీ పండిట్లకు మద్దతుగా ముందుకు వచ్చి నిరసనలు చేపట్టండి అంటూ తమ కమ్యూనిటీ అక్కడి ప్రజలు పిలుపు ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ అడిగారు! కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో రాహుల్ భట్ ఆరు నెలల కిందటే ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆయన అభద్రతా భావంలోకి కూరుకపోయారని ఆయన భార్య చెప్తున్నారు. -
ఆర్మీ క్యాంప్పై ఆత్మాహుతి దాడి
జమ్మూ/శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. ఆదివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్మీ క్యాంప్పై ఆత్మాహుతి దాడికి దిగాయి. దాన్ని భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకుని, ఇద్దరు సూసైడ్ బాంబర్లను హతమార్చాయి. ఎదురుకాల్పుల్లో సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ పటేల్ నేలకొరిగారు. 9 మందికి గాయాలయ్యాయి. సంజ్వాన్ సమీపంలోని చద్దా ఆర్మీ బేస్ వద్ద ఎన్కౌంటర్కు దారితీసిన క్రమాన్ని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మొహమ్మద్కు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు గురువారం ఆర్ఎస్ పురా సెక్టార్లో సరిహద్దులు దాటారు. శుక్రవారం ఉదయం 4.25 గంటలప్పుడు ఆర్మీ బేస్ వద్దకు చేరుకున్నారు. జవాన్లు వారిని గమనించి అప్రమత్తమయ్యారు. అదే సమయంలో తర్వాతి షిఫ్టు కోసం 15 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. గ్రెనేడ్లు ప్రయోగిస్తూ దగ్గర్లోని జనావాసాల్లోకి పారిపోయారు. జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి కాల్పులకు దిగడంతో జవాన్లు అందులోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 5 గంటలపాటు సాగిన ఎన్కౌంటర్లో ఇద్దరు బాంబర్లు హతమయ్యారు. సకాలంలో స్పందించడంతో... ఉగ్రవాదులు భారీగా పేలుడు పదార్థాలున్న జాకెట్ను ధరించారని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. వారి వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. భారీగా నష్టం కలిగించి, ప్రధాని పర్యటనకు అవాంతరం కలిగించేందుకు జైషే కుట్ర పన్నినట్లు తెలుస్తోందన్నారు. సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పారు. సంఘటన ప్రాంతంలో రెండు ఏకే–47 రైఫిళ్లు, గ్రెనేడ్ లాంఛర్, శాటిలైట్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇదే ఆర్మీ క్యాంప్పై 2018లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. బారామూల్లాలో మరో ఉగ్రవాది హతం బారాముల్లా జిల్లాలో మాల్వాలో గురువారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో నాలుగో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. సుదీర్ఘకాలంగా కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు కారకుడైన లష్కరే టాప్ కమాండర్ యూసుఫ్ కట్రూతోపాటు ముగ్గురు ఉగ్రవాదులు గురువారం హతమైన విషయం తెలిసిందే. మోదీ పర్యటనకు భారీ భద్రత జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న కశ్మీర్లోని సాంబ జిల్లా పాలి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 2019లో కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబ, పరిసరాల్లో మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. మోదీ పాల్గొనే సభా ప్రాంతానికి చేరుకునే మార్గాల్లో చెక్పాయింట్లు పెట్టారు. అత్యాధునిక నిఘా వ్యవస్థను నెలకొల్పినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
జమ్మూ కశ్మీర్: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య షోపియాన్లో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లాలోని హరిపోరా ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారస పడటంతో ఒక్కసారిగా వారి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది అనేది స్పష్టంగా తెలియలేదు. -
శ్రీనగర్లో ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాబలగాలు మైసుమా ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని.. గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు వలసదారులపైనా వరుస దాడులకు ముష్కరులు తెగబడుతున్నారు. 24 గంటల వ్యవధిలో రెండు చోట్ల దాడులు జరిగాయి. పుల్వామా జిల్లాలో వలస కూలీలపై కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు బిహార్కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం.. నౌపొరా ప్రాంతంలో పంజాబ్కు చెందిన ఇద్దరు వలస కూలీలపైనా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. చదవండి: రీట్వీట్ చేసిన కేటీఆర్.. తప్పుపట్టిన కర్ణాటక మంత్రి.. అసలు ఏమైంది? -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతోంది. సొఫియాన్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల శ్రీనగర్, బందిపొరా కాల్పులతో ప్రమేయమున్న ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. ‘సొఫియాన్, తుల్రాన్, ఫీరిపొరా గ్రామాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని 24 గంటల్లో అందిన ప్రాథమిక సమాచారం మేరకు వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఉగ్రవాదులు పోలీసు బృందాలపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్లోని లాల్బజార్లో స్థానికేతరుడిని చంపేసిన ఉగ్రవాది ముక్తార్ షా ఈ ఎన్కౌంటర్లో మరణించాడు’అని కశ్మీర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మరణిస్తే, మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదులందరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారే. వీరంతా ఇటీవల కాలంలో పౌరులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతూ కశ్మీర్లోయలో బీభత్సం సృష్టించినట్టు ఆ అధికారి వివరించారు. చదవండి: (ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం?) పాక్ జాతీయుడు అరెస్ట్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులున్నట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్ జాతీయుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో దాడులకు కుట్ర పన్నిన అతనిని లక్ష్మీ నగర్లో అదుపులోనికి తీసుకొని, ఏకే 47 గన్స్, ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కి చెందిన మొహమ్మద్ అష్రాఫ్ అలియాస్ అలీ(40) బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి చొరబడ్డాడు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడని అధికారులు తెలిపారు. -
ఎస్సైని కాల్చి చంపిన ఉగ్రవాది
శ్రీనగర్: ఉగ్రవాది చేతిలో ఎస్సై హతమైన ఘటన జమ్మూకశీ్మర్లోని శ్రీనగర్లో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. పాయింట్ బ్లాక్ రేంజ్లో తల వెనుక భాగంలో తుపాకీతో కాలి్చన దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్షిద్ అహ్మద్ను ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనానంతరం పోలీసులు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఓ నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ఘటన జరిగిందని వెల్లడించారు. -
సెప్టెంబర్ 11.. మానవత్వంపై దాడి
అహ్మదాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్ర దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి దారుణ ఘటనలు, విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని చెప్పారు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతీయ మానవ విలువల ప్రాధాన్యతను వివరించారని గుర్తుచేశారు. అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11(9/11) దాడికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం ఇచ్చారు. అంతేకాకుండా గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ధామ్ భవన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇక్కడ వసతి కల్పిస్తారు. బాలికల హాస్టల్ అయిన సర్దార్ధామ్ ఫేజ్–2 కన్యా ఛత్రాలయ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్ 11.. ప్రపంచ చరిత్రలో మర్చిపోలేని రోజు. మానవత్వంపై దాడి జరిగిన రోజుగా గుర్తుండిపోతుంది. ఆ రోజు మొత్తం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పించింది’’ అని అన్నారు. ఇలాంటి భీకర దాడుల నుంచి నేర్చుకున్న పాఠాలను సదా గుర్తుంచుకోవాలి్సన అవసరం ఉందని సూచించారు. మానవీయ విలువలను కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. సుబ్రహ్మణ్య భారతికి అంకితం తమిళ భాష అధ్యయనానికి బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్యూ)లోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ప్రత్యేక పీఠాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పీఠాన్ని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఆయన వర్ధంతి సందర్భంగా అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఏక్ భారత్.. శ్రేష్ట భారత్ అనే భావనను సర్దార్ పటేల్ ముందుకు తెచ్చారని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి సాగించిన తమిళ రచనల్లోనూ ఇదే భావన స్పష్టంగా ప్రతిఫలించిందని పేర్కొన్నారు. సమాజానికి నూతన ఆత్మవిశ్వాసం బ్రిటిష్ పాలకులను తలవంచేలా చేసిన సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ స్ఫూర్తి, శక్తి నేడు ఐక్యతా శిల్పం రూపంలో మన ముందు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్ఫూర్తి, దేశ ఐక్యత, ప్రజల ఉమ్మడి ప్రయత్నానికి ఈ శిల్పం ఒక ప్రతీక అని కొనియాడారు. మన సంపద దేశం కోసం నైపుణ్యాల వృద్ధి(స్కిల్ డెవలప్మెంట్)కి అధిక ప్రాధాన్యం ఇస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని మోదీ చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్కు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ విధానం ఉద్దేశమని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మంది యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని వివరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్కా వికాస్’కు సబ్కా ప్రయాస్ను జత చేద్దామని చెప్పారు. విద్యార్థుల కోసం రూ.200 కోట్లతో సర్దార్ధామ్ భవన్ను నిర్మించిన విశ్వ పాటిదార్ సమాజ్పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
రక్తం తో తడిసిన నగరం
-
పుల్వామాలో ఎన్కౌంటర్; లష్కరే కమాండర్ హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా టౌన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ఈ సందర్భంగా వారిని లొంగిపోవాలని కోరామని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ ఉన్నాడని తెలిపారు. మరో ఇద్దరు స్థానికులని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు. -
పుల్వామాలో ఉగ్రదాడి కలకలం
జమ్మూకశ్మీర్: పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్ ఇట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఫయాజ్ భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య మరణించారు. కుమార్తెను శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా, శ్రీనగర్లోని మెంగన్వాజీ నౌగాం ప్రాంతంలో ప్రార్థనలకు వెళ్లే సమయంలో మరో పోలీసు అధికారి పర్వైజ్ అహ్మద్ దార్పై ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మంగళవారం కాల్పులు జరిపారు. అలాగే గత నెలలో జావైద్ అహ్మద్ అనే పోలీసు అధికారిపై తన నివాసం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చదవండి: రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి అణచివేత శకం ముగియాలి -
బీజేపీ సర్పంచ్ను కాల్చి చంపారు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ బీజేపీ నేతపై ఉగ్రమూకలు కాల్పులు జరపగా నేడు మరో బీజేపీ సర్పంచ్ను పొట్టన పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే కుల్గాం జిల్లాలోని వెస్సు ప్రాంతానికి చెందిన సర్పంచ్ సాజద్ అహ్మద్ ఖాండేపై ఆయన ఇంటికి సమీపంలోనే ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలతో నెత్తురోడుతున్న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. (బీజేపీ నేత కుటుంబంపై ముష్కరుల కాల్పులు) బుల్లెట్ గాయాలతో ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా కుల్గాం ప్రాంతానికి చెందిన మరో సర్పంచ్ ఆరిఫ్ అహ్మద్ షాపై సైతం బుధవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అతడిని ఖజిగండ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల్లోనే ఇద్దరు సర్పంచ్లపై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు జూలైలోనూ బీజేపీ నేత వసీం అహ్మద్ బరిని, అతడి సోదరుడిని ఉగ్రమూకలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. (కశ్మీర్లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్) -
పాకిస్తాన్ స్టాక్మార్కెట్పై ఉగ్రదాడి
కరాచీ : పాకిస్తాన్లోని స్టాక్మార్కెట్పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు, ముగ్గరు ఉగ్రవాదులు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. సోమవారం ఉదయం కరాచీలోని స్టాక్మార్కెట్ భవనంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడితో అప్రమత్తమమైన భద్రతా బలగాలు ప్రతిదాడిచేసి ముగ్గుర్ని హతమార్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలోని సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. దాడిలో పలువురికి గాయాలైనట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులేనని పేర్కొంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో బ్యాంకులు, పలు ప్రయివేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సైనిక, అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఉగ్రదాడి: ఒక జవాన్ సహా బాలుడి మృతి
శ్రీనగర్: దక్షిణ కశ్మీరులోని అనంత్నాగ్ జిల్లా బిజ్బెహరా జాతీయ రహదారిపై గస్తీ కాస్తున్న సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) దళాలపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఉగ్రదాడిలో ఒక జవానుతో పాటు ఒక బాలుడు మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా మరికొంత మంది జవాన్లు, పలువురు స్థానికులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనూహ్య ఉగ్రదాడితో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ప్రతిదాడికి దిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరుల కోసం సీఆర్పీఎఫ్తో పాటు ఆర్మీ బృందం, స్థానిక పోలీసులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. దీంతో బిజ్బెమరా ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. -
కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హత మయ్యారు. మృతుల్లో ఒకరిని షకూర్ ఫరూక్ లాంగూగా గుర్తించారు. గత మే 20న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను చంపిన కేసులో నిందితుడు. బీఎస్ఎఫ్ జవాన్ కు చెందిన రైఫిల్ను సైతం జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో హతుడు షహీద్ అహ్మద్ భట్ కాగా, ఇంకొకరిని గుర్తించాల్సి ఉంది. వీరు హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్లకు చెందిన వారు. అలాగే, కుల్గామ్ జిల్లాలో తయాబ్ వలీద్ అలియాస్ ఇమ్రాన్ భాయ్, అలియాస్ గజీ బాబా అనే పాకిస్తానీ హతమయ్యాడు. జైషే మొహమ్మద్ కమాండర్గా ఉన్న ఇతడు బాంబుల తయారీలో సిద్ధహస్తుడు. -
భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపడుతున్న సైన్యంపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో త్రాల్ సెక్టార్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ వ్యానులో వచ్చి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తోన్న పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు తిరిగి ఎదురుకాల్పులకు దిగడంతో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47రైఫిల్, గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ ఇన్స్పెక్టర్ జనరల్ ముకేష్ సింగ్ చెప్పారు. -
మరోసారి నోరు పారేసుకున్న పాక్ మంత్రి!
ఇస్లామాబాద్ : భారత క్రీడా అధికారులు అట్టడుగు స్థాయి వ్యక్తుల్లా ప్రవర్తిస్తున్నారంటూ పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్కు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చవకబారు చర్యలను ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రికెటర్లతో చర్చించిన అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆటగాళ్లు పాక్లో పర్యటించకూడదని నిర్ణయించుకున్నట్లు శ్రీలంక బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై స్పందించిన పాక్ మంత్రి ఫవాద్ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఈ మేరకు...‘ పాక్లో పర్యటిస్తే ఐపీఎల్ ఆడకుండా అడ్డుకుంటామని భారత్ శ్రీలంక ఆటగాళ్లను బెదిరించిందని కొంతమంది స్పోర్ట్స్ కామెంటేటర్లు నాకు చెప్పారు. ఇది నిజంగా చవకబారు చర్య. భారత క్రీడా అధికారుల మితిమీరిన దేశభక్తికి నిదర్శనమైన ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది దిగజారుడు, చవకబారు పని’ అని ఫవాద్ ట్వీట్ చేశారు. Informed sports commentators told me that India threatened SL players that they ll be ousted from IPL if they don’t refuse Pak visit, this is really cheap tactic, jingoism from sports to space is something we must condemn, really cheap on the part of Indian sports authorities — Ch Fawad Hussain (@fawadchaudhry) September 10, 2019 కాగా గతంలో 2009లో పాక్లో పర్యటించిన శ్రీలంక క్రికెటర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇక భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం కావడంపై కూడా ఫవాద్ ఇదే విధంగా స్పందించారు. రాని పనిలో వేలెందుకు పెట్టాలంటూ భారత శాస్త్రవేత్తలను అవమానించి నెటిజన్ల చేతిలో చివాట్లు తిన్నారు. కాగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన అనంతరం దాయాది దేశం భారత్పై విద్వేషపూరిత చర్యలకు తెగబడుగున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా ఇతర మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో విషం చిమ్ముతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. -
మన విద్యార్థులు పదిలం
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్ను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందులో చదువుతున్న 135 మంది తెలుగు విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ల ద్వారా ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ జమ్మూకశ్మీర్ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్రెడ్డి శనివారం ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఎన్ఐటీలోని 5,000 మంది విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులతో సమన్వయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ప్రత్యేక బలగాల రక్షణలో ముందుగా జమ్మూ పట్టణానికి తరలిస్తున్నామని, అక్కడి నుంచి వివిధ రవాణా మార్గాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఎలాంటి ఆందోళన చెందరాదని కోరారు. తెలంగాణ విద్యార్థుల జాబితాను బండి సంజయ్.. కిషన్రెడ్డికి అందజేశారు. మరోవైపు ఈ అంశంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శ్రీనగర్లోని తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతూ తనకు మెసేజ్లు పంపుతున్నారని, అయితే విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని పేర్కొన్నారు. సాయం కావాల్సిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరిని 011–233820141, 919968299337 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులతో భవన్ అధికారుల సంప్రదింపులు ఎన్ఐటీ విద్యార్థులతో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి సంప్రదింపులు జరిపారు. విద్యార్థులను జమ్మూ వరకు చేర్చేందుకు ఎన్ఐటీ అధికారులు నాలుగు బస్సులు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు విద్యార్థులు జమ్మూ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వారిని 3 బస్సుల్లో ఢిల్లీకి చేర్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారని, వారితో సమన్వయం చేస్తున్నామని ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. విద్యార్థులు ఢిల్లీ చేరగానే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. -
కశ్మీర్ హై అలర్ట్!
కశ్మీరం వేడెక్కుతోంది. లోయలో భద్రతా బలగాల పెంపుపై ఊహాగానాలు కొనసాగుతుండగానే.. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తూ శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాత్రపై పాక్ ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రీకులు, ఇతర పర్యాటకులు తక్షణమే తమ పర్యటనను ముగించుకుని కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. యాత్ర మార్గంలో పాకిస్తాన్లో తయారైన మందుపాతర, అమెరికా మేడ్ స్నైపర్ రైఫిల్ లభించాయని భారత ఆర్మీ ప్రకటించింది. యాత్రపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కచ్చితమైన నిఘా సమాచారం వచ్చినట్లు పేర్కొంది. కశ్మీర్కు భారీగా బలగాలను పంపిస్తున్నారన్న వార్తలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదనీ, అంతర్గత భద్రత, సిబ్బంది మార్పిడి కోసం 10 వేల మందిని పంపేందుకు గత వారమే ఆదేశాలిచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల కన్నా.. భూభాగమే ముఖ్యమని తేలిందని పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. శ్రీనగర్: అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితులు హింసాత్మకంగా మారే అవకాశం ఉందంటూ అక్కడి ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన నడుస్తుండటం తెలిసిందే. జూలై 1న మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 15న ముగియాల్సి ఉంది. కాగా, యాత్ర సాగే మార్గాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుందని ఆర్మీ 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ చెప్పారు. అమర్నాథ్ యాత్ర సాగే బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహించగా, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, అమెరికాలో తయారైన ఎం–24 (స్నైపర్) తుపాకి లభించాయని వెల్లడించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. యాత్రికులపై దాడి చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ధిల్లాన్ వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో భద్రతా దళాలు జరిపిన సోదాల్లో, పాకిస్తాన్లోని ఆయుధ కర్మాగారంలో తయారైన మందుపాతర, భారీ స్థాయిలో ఇతర ఆయుధాలు దొరికాయని ధిల్లాన్ తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్తో కలిసి ధిల్లాన్ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘గత మూడు నాలుగు రోజుల నుంచి మాకు నిఘా వర్గాల ద్వారా కచ్చితమైన సమాచారం వస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ నేతృత్వం, సాయంతోనే ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని చెప్పారు. మరోవైపు అవసరమైతే కశ్మీర్ విమానాశ్రయం నుంచి అదనపు విమానాలను నడపడానికి సిద్ధంగా ఉండాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. ఇక కేంద్రం సిద్ధమైంది: మెహబూబా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ప్రభుత్వం కశ్మీర్పై సైనిక శక్తిని ఉపయోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించే విషయంలో కీలక నిర్ణయం త్వరలోనే రావొచ్చన్న వార్తల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ‘ఎట్టకేలకు కేంద్రం సిద్ధమైనట్లుగా ఉంది. ప్రజల కన్నా భూభాగమే ముఖ్యమని ఇండియా నిర్ణయించుకున్నట్లుంది. మీరు (ప్రభుత్వం) దేశంలోని ముస్లిం ఆధిక్య రాష్ట్రం ప్రేమను గెలుచుకోవడంలో విఫలమయ్యారు. మతం ఆధారంగా దేశ విభజనను వ్యతిరేకించి లౌకిక రాజ్యమైన భారత్తో కలిసుండాలని నిర్ణయించుకున్న రాష్ట్రమిది. కానీ ఇప్పుడు ఇండియా సిద్ధమైనట్లుగా ఉంది. జమ్మూ కశ్మీర్ ప్రజలను దోపిడీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లుగా కనిపిస్తోంది’ అని ఆరోపించారు. అలాగే మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా అంశాన్ని కదిలించవద్దని కేంద్రాన్ని కోరింది. భద్రత కోసమే బలగాలు: కేంద్రం కశ్మీర్లో అంతర్గత భద్రతా పరిస్థితుల దృష్ట్యానే పారా మిలిటరీ బలగాలను కశ్మీర్కు పంపుతున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదని హోం శాఖ స్పష్టం చేసింది. కశ్మీర్కు 10 వేల సిబ్బందిని కేంద్రం జమ్మూ కశ్మీర్కు తరలిస్తోందనీ, వారం క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని హోం శాఖ వర్గాలు చెప్పాయి. భయం రేకెత్తిస్తున్నారు: ఎన్సీ, పీడీపీ యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ, ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని జమ్మూ కశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మండిపడ్డాయి. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేస్తూ, ‘ఉన్నపళంగా వెళ్లిపోవాలని యాత్రికులు, పర్యాటకులకు ప్రభుత్వమే చెబితే వారిలో భయం కలగదా? వారంతా తక్షణం అన్నీ సర్దు కుని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు విమానాశ్రయాలు, రహదారులు పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతాయి’ అని అన్నారు. కశ్మీర్కు రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. మాజీ ప్రధాని మన్మోహన్æ అధ్యక్షతన జమ్మూ కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ ఓ భేటీ నిర్వహించిన అనంతరం కేంద్రానికి ఈ విజ్ఞప్తి చేసింది. కశ్మీర్లో భయం భయం.. ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నందున అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులు వెంటనే కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు సరకులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసి ముందస్తుగా భద్రపరచుకునేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ వరుసల్లో నిలబడుతున్నారు. కశ్మీర్కు ప్రత్యేక హోదాను తొలగించే విషయమై కీలక నిర్ణయం రానుందనీ, ఆ కారణంగా గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పుకార్లు వస్తున్నాయి. దీంతో సరకులను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునేందుకు స్థానికులు క్యూలు కట్టారు. పోలీసు సోదాల్లో దొరికిన అమెరికా తయారీ అత్యాధునిక రైఫిల్ -
సోమాలియాలో ఉగ్రదాడి
మొగదిషు: దక్షిణ సోమాలియాలోని సరిహద్దు పట్టణం కిస్మాయోలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోగా 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మెదినా హోటల్లోకి సైనిక దుస్తులు ధరించిన కొందరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ ప్రవేశించారు. అదే సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంపై మరో ఉగ్రవాది ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులతో తలపడ్డాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు 12 గంటలపాటు కొనసాగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సహా కెన్యా, టాంజానియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన పౌరులు కలిపి మొత్తం 26 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు కూడా గాయపడ్డారన్నారు. పేలుడు ధాటికి హోటల్ భవనం ధ్వంసమయ్యింది. ఈ దుశ్చర్యకు తామే కారణమని అల్ షబాబ్ ప్రకటించుకుంది. సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అల్ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అల్ షబాబ్ దశాబ్ద కాలంగా విధ్వంసక చర్యలకు పాల్పడుతోంది. -
దివ్య సందేశంపై రాక్షస కృత్యం!
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక నెత్తురోడింది. క్రైస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు నరహంతకులు మారణహోమం సృష్టించారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్ల అనంతరం ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీ యులు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ అనే ముగ్గురు భారతీయులు మరణించారనీ, వీరి గురించిన అధిక వివరాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సుష్మ తెలిపారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నా మని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడులను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. వాటికన్ సిటీలో ఇచ్చిన సందేశంలో ఈ ఘటనను దారుణ హింసగా అభివర్ణించారు. ఆదివారం ఉత్తర కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చిలో ప్రార్ధనల సమయంలో చోటుచేసుకున్న భారీ పేలుడుతో బీతావాహ దృశ్యం.. దశాబ్దం తర్వాత మళ్లీ విధ్వంసం ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్)తో అంతర్యుద్ధం ముగిశాక గత దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో తాజా పేలుళ్లు మళ్లీ రక్తపాతాన్ని సృష్టించాయి. చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారితోపాటు, శ్రీలంకకు వచ్చి విలాసవంతమైన హోటళ్లలో ఉంటున్న విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. కొలంబోలోని సెయింట్ ఆంథోని చర్చి, నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చిలో ముందుగా ఉదయం 8.45 గంటలకు పేలుళ్లు సంభవించాయి. ప్రజలు ప్రశాంతంగాప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ పేలుళ్లు జరిగాయని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. పేలుళ్లలో విదేశీయులైన ఇద్దరు చైనీయులు, పోలండ్, డెన్మా ర్క్, జపాన్, పాకిస్తాన్, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్ల నుంచి ఒక్కొక్కరు కూడా మృతి చెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలంబో లోని ఐదు నక్షత్రాల హోటళ్లైన షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరిల్లోనూ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఈ దాడికిపాల్పడింది తామేనని ఇంతవరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. శ్రీలంకలో గతంలో ఎల్టీటీఈ భయానక దాడులకు పాల్పడేది. శ్రీలంక నుంచి విడదీసి తమిళుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఎల్టీటీఈ దాదాపు మూడు దశాబ్దాలు పోరాడింది. చివరకు 2009తో ఎల్టీటీఈ అధ్యక్షుడు వేళుపిళ్లై ప్రభాకరన్ను శ్రీలంక ఆర్మీ మట్టుబెట్టడంతో ఇక ఆ సంస్థ అంతరించిపోయింది. ఆత్మాహుతి దాడులేనని చెప్పలేం.. ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు దాడులూ ఆత్మాహుతి దాడులేనని చెప్పడానికి పోలీసుల వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలూ లేవనీ, అయితే నెగొంబో చర్చిలో పేలుడు తీరును పరిశీలిస్తే అది ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని గుణశేఖర చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ సినమన్ గ్రాండ్ హోటల్ లోని రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు వెల్లడించారు. కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో 66 మృతదేహాలను ఉంచామనీ, గాయపడిన 260 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నామని గుణశేఖర తెలిపారు. అలాగే నెగొంబో లోని మరో వైద్యశాలలో 104 మృతదేహాలు ఉండగా, 100 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనుమానంపై ఏడుగురిని అరెస్టు చేశా మని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్ విజెవర్ధనే తెలిపారు. ఈ ఎనిమిది దాడులనూ ఒకే సంస్థ చేసిందని తాము భావిస్తున్నామన్నారు. దాడుల్లో మొత్తం 27 మంది విదేశీయులు చనిపోయారని శ్రీలంక విదేశాంగ కార్యదర్శి రవీంద్ర అరియసింఘె వెల్లడించారు. గాయపడిన విదేశీయుల్లో భారత్తోపాటు అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారని మీడియా తెలిపింది. రాజధాని కొలంబోలోని జూ వద్ద జరిగిన మరో పేలుడులో ఇద్దరు మరణించారు. కొలంబో శివార్లలోని ఓ ఇంట్లో సోదాలు జరిపేందుకు పోలీసులు వెళ్లినప్పుడు మరో వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది చనిపోయారు. ముందే హెచ్చరించినా.. శ్రీలంకలో త్వరలో ప్రధాన చర్చిలు లక్ష్యంగా బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని ఆ దేశ పోలీస్ చీఫ్ 10 రోజుల ముందుగానే హెచ్చరించారు. ఏప్రిల్ 11నే ఆయన నిఘా హెచ్చరికలను ఉన్నతాధికారులకు పంపారు. ‘నేషనల్ తోహీత్ జమాత్ (ఎన్టీజే) అనే సంస్థ చర్చిలు, కొలంబోని భారత దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఓ విదేశీ నిఘా సంస్థ నుంచి సమాచారం అం దింది’అని పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. అయినా శ్రీలంక పోలీసులు దాడులను ఆపలేకపోయారు. ముస్లిం సంస్థ అయిన ఎన్టీజే గతేడాది బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడంతో దాని పేరు వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని విక్రమసింఘే నిరవధిక కర్ఫ్యూ విధింపు ఎనిమిదో పేలుడు సంభవించిన వెంటనే శ్రీలంక ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందంది. ప్రజలు శాంతిని పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. ‘ఈ అనూహ్య పరిణామాల వల్ల నేను విస్మయానికి గురయ్యాను. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతా దళాలను కోరాం’అని ఆయన చెప్పారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘె మాట్లాడుతూ ఇవి పిరికిపందలు చేసిన దాడులనీ, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని కోరారు. సెలవులో ఉన్న పోలీసులు, వైద్యులు, నర్సులు, వైద్యాధికారుల అందరి సెలవులను రద్దు చేసి తక్షణం విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రాజధానిలోని మతపరమైన ప్రదేశాలతోపాటు బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచారు. తాత్కాలికంగా అన్ని సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. పాఠశాలలను సోమ, మంగళవారాల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు నిరవధికంగా మూసివేశారు. కొలంబో జిల్లాలో ఈస్టర్ ప్రార్థనలను రద్దు చేస్తున్నట్లు కార్డినల్ (క్రైస్తవ మతంలో ఓ పదవి) మాల్కొమ్ రంజిత్ చెప్పారు. ఎల్టీటీఈని అణచివేసిన నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స మాట్లాడుతూ ఇది ఆటవిక దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక, ఉగ్రవాద, పిరికిపందల చర్యలను తాము సహించబోమనీ, దేశమంతా ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. ఎన్టీజే..హింసామార్గం శ్రీలంకలో చర్చిలపై నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) దాడులు చేసే అవకాశముందని ఓ విదేశీ నిఘా సంస్థ శ్రీలంక ప్రభుత్వాన్ని 10రోజుల క్రితమే హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాలు తెలి పాయి. అయితే ఈ హెచ్చరికల్ని శ్రీలంక ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ముస్లిం అతివాదులు సభ్యులుగా ఉన్న ఎన్టీజే తొలి సారి 2013లో వెలుగులోకి వచ్చింది. 2013, జూన్లో ఎన్టీజే కార్యదర్శి అబ్దుల్ రెహ్మానీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గౌతమబుద్ధుడు నరమాంస భక్షకుడనీ, బౌద్ధమతం నరమాంస భక్షణను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. బౌద్ధుల ఆరాధనా విధానంపై విమర్శలు చేశారు. దీంతో 2014 మార్చిలో శ్రీలంకలో బౌద్ధులు–ముస్లింల మధ్య హింస చెలరేగడంతో ప్రభుత్వం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. అక్కడితో ఆగకుండా ప్రజలను రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను 2016లో శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్చేసింది. 2018లో ఈ సంస్థకు చెందిన కొందరు సభ్యులు గౌతమబుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు కూడా వచ్చా యి.వీరి వ్యవహారశైలి హద్దుదాటడంతో ఎన్టీజేపై నిషేధం విధించాలని పీస్ లివింగ్ ముస్లిమ్స్ ఇన్ శ్రీలంక(పీఎల్ఎంఎంఎస్ఎల్) డిమాండ్ చేసింది. కేవలం హిం సను ప్రోత్సహించడమే కాకుండా ఇస్లాంలో అతివాద వహాబీ భావజాలాన్ని ఎన్టీజే వ్యాప్తిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీలంకలో 22 లక్షల మంది ప్రజలు ఉండగా వీరిలో బౌద్ధులు 70%, హిందువులు 12.5%, ముస్లింలు 10%, క్రైస్తవులు 7.5%ఉన్నారు. శ్రీలంకను వరుస బాంబు పేలుళ్లు అతలాకుతలం చేసిన నేపథ్యంలో కొలంబో బిషప్ దిలొరాజ్ కనగసబే భావోద్వేగంతో స్పందించారు. ‘30 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో సతమతమైన అనంతరం మన ప్రజలంతా కలసిమెలసి, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. తమ–తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంగా చోటుచేసుకున్న ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. జీసస్ పునరుత్థానమైన రోజున తమ ప్రియమైనవారిని కోల్పోయి మనోవేదనను అనుభవిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. శ్రీలంక లాంటి దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, భగవంతుడిని ప్రార్థించాలని బిషప్ కనగసబే పిలుపునిచ్చారు. ‘ఈ దుర్ఘటనతో అల్లాడిపోతున్న ప్రతీఒక్కరి బాధను తగ్గించాలనీ, వారిపై దయ చూపాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అలాగే విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రాణాలకు విలువ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు. - కొలంబో బిషప్ భావోద్వేగ సందేశం హెల్ప్లైన్లు ప్రకటించిన భారత హైకమిషన్ శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. బాంబు పేలుళ్లు, దాడులకు సంబంధించి ఎలాంటి సహాయం, సమాచారం, స్పష్టత కావాలన్నా భారతీయులు సంప్రదించవచ్చంటూ 5 హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించింది. +94777902082, +94777903082, +94112422788, +94112422789, +94772234176 నంబర్లకు ఫోన్ చేసి భారతీయులు వివరాలు అడగొచ్చని హైకమిషన్ ట్విట్టర్లో తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్పై శ్రీలంక ఆంక్షలు కొలంబో: వరుస బాంబు పేలుళ్లపై సోషల్ మీడియా లో విస్తృతమవుతున్న వదంతులను నిరోధించేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను ఆదివారం బ్లాక్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వదంతులు చెలరేగుతుండటంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బాంబు పేలుళ్లపై భద్రతాదళాల విచారణ సాగుతోందని, విచారణ కొలిక్కి వచ్చేదాగా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు కొనసాగుతా యని ప్రకటించారు. ప్రజలు సహనంతో వ్యవహరిం చాలని, వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా ట్వీట్ చేశారు. ఫేస్బుక్ కూడా బాంబు పేలుళ్లపై స్పందించేందుకు వీలుగా ఒక మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిందని సీఎన్ఎన్ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేం దుకు, తమ వారిని గుర్తించేందుకు, పేలుళ్ల ప్రభావానికి గురైన సన్నిహితులను చేరుకునేందుకు వీలుగా ఈ టూల్ ఉపయోగపడుతుం దని ఫేస్బుక్ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బాంబు పేలుళ్లకు అవకాశమున్న ప్రాంతాలలో గుంపులుగా ఉండవద్దని, ఆసుపత్రుల పరిసరాలకూ ప్రజలు రావొద్దని శ్రీలంక హోంశాఖ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈస్టర్ రోజున జరిగిన ఉగ్ర దాడులు.. 2017 ఈజిప్టు 2017 ఏప్రిల్ 9న ఈజిప్ట్లోని టాంట, అలెగ్జాండ్రియా నగరాల్లో ఈస్టర్ పండగ రోజు జరిపిన బాంబు దాడిలో 45 మంది మరణించారు. ఈ దాడి నుంచి కాప్టిక్ పోప్ తవడ్రోస్ ఐఐ క్షేమంగా బయటపడ్డారు. దాడికి పాల్పడింది తామే అని డాయిష్ ప్రకటించింది. 2016 పాకిస్తాన్ లాహోర్లోని ఓ పార్క్లో ఈస్టర్ వేడుకలను జరుపుకుంటున్న వారిపై బాంబు దాడి జరిగింది. చిన్న పిల్లలు సహా మొత్తం 75 మంది ప్రాణాలు విడిచారు. వందల మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది తామే అని పాకిస్తానీ తాలిబన్ శాఖ జమత్–ఉల్–అహ్రార్ ప్రకటించుకుంది. 2012 నైజీరియా ఉత్తర నైజీరియాలో సాం స్కృతిక, ఆర్థిక నగరమైన ఖడునాలో 2012 ఏప్రిల్ 8న చర్చి వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో 41 మంది మరణించారు. ఇస్లామిక్ సంస్థ బొకొ హరమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. క్రిస్టియన్స్పై దాడులు.. 2019 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న జోలో ప్రాంతంలోని ద్వీపకల్పంలో 2019 జనవరి 27న క్యాథలిక్లపై జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడికి డాయిష్ బాధ్యత వహించింది. కానీ దాడికి పాల్పడింది అజంగ్–అజంగ్ సంస్థగా అధికారులు పేర్కొనారు. 2017 ఈజిప్ట్ 2017 మే 26న సెంట్రల్ మిన్య వద్ద సెయింట్ సామ్యూల్ ఆశ్రమానికి బస్సులో వెళ్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. కాల్పులకు తెగబడింది తామే అని డాయిష్ ప్రకటించుకుంది. 2016 కైరో చర్చిలో పార్థనలు చేస్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్ లక్ష్యంగా 2016 డిసెంబర్ 11న జరిగిన ఆత్మాహుతి దాడిలో 29 మంది ప్రాణాలు వదిలారు. ఈ దాడికి సైతం డాయిష్ బాధ్యత వహించింది. 2016 యెమెన్ ఉగ్రవాదులు యెమెన్లోని అడెన్లో క్యాథలిక్ వృద్ధాశ్రమంపై జరిపిన దాడిలో 16 మంది చనిపోయారు. మరణించిన వారిలో కోల్కతాలోని మిషనరీ ఆఫ్ చారిటీకి చెందిన నలుగురు నన్లు కూడా ఉన్నారు. డాయిష్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 2015 పాకిస్తాన్ 2015 మార్చి 15న ఆదివారం రోజు లాహోర్లోని చర్చిల్లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనతో 17 మంది మృత్యువాత పడగా, 70 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామే అని తెహ్రీక్–ఇ–తాలిబన్ ప్రకటించింది. -
ఉగ్రదాడితో రాజకీయ లబ్ధికి బీజేపీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని రాజకీయం చేసి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అన్నిరంగాల్లో విఫలమైన బీజేపీ ప్రభుత్వం, ఉగ్రదాడిని రాజకీయంగా ఉపయోగించుకుని రానున్న ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా ఇది విద్రోహ చర్యేనని, యావద్దేశం ఈ దాడి విషయంలో ఐక్యంగా నిలిస్తే బీజేపీ మాత్రం రాజకీయం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో సైనికులు చనిపోయారని అయినా తమది కాంగ్రెస్ ప్రభుత్వం కాదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. బుధవారం ఎంబీభవన్లో పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం ఏమి సాధించిందని, ఈ దాడి కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా అని ఆయన నిలదీశారు. పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకువచ్చే ప్రయత్నం అత్యంత ప్రమాదకరమని, అందుకే దానిని వ్యతిరేకించామన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వహయాంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’రక్షణ ఒప్పందం రూపంలో బయటపడిందన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యం... వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని ఏచూరి చెప్పారు. ప్రధాని మోదీని ఓడించి దేశాన్ని కాపాడాలని, పశ్చిమబెంగాల్లో అక్కడి సీఎం మమతాబెనర్జీని ఓడించి బెంగాల్ను పరిరక్షించాలనే నినాదంతో ఎన్నికలకు వెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేయడంపై సీపీఐతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్పార్టీతో నేరుగా పొత్తు ఉండదన్నారు. అయితే తమిళనాడులో డీఎంకేతో తమకు పొత్తు ఉండగా, ఆ పార్టీతో కాంగ్రెస్ కూడా కలసి పనిచేస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాతే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్లు చూస్తుంటామన్నారు. అప్పట్లో హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఎల్ఎఫ్ కొనసాగింపు: తమ్మినేని లోక్సభ ఎన్నికల్లోనూ బీఎల్ఎఫ్ ప్రయోగం కొనసాగించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.ఈ ఎన్నికల్లో కలసి పోటీచేసే విషయంలో సీపీఐ కార్యదర్శిచాడ వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రంలో టీజేఎస్, జనసేనతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. సీపీఎం పక్షంగా తాము ఎలాంటి వ్యాపారాలు చేయలేదని తమ్మినేని ఓ ప్రశ్నకు బదులిచ్చా రు. టెన్ టీవీని విరాళాలు తీసుకుని ఏర్పాటు చేశామని, నష్టాలు రావడంతో విరాళాలు వెనక్కు ఇస్తున్నామన్నారు. పొలిట్బ్యూరో అనుమతి తీసుకున్నాకే నష్టాల్లో ఉన్న సంస్థను విక్రయించినట్టు తెలిపారు. -
పుల్వామా ఉగ్రదాడి; మరో కీలక సమావేశం
న్యూఢిల్లీ : కశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఆయన నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్, ఇంటలెజిన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ సహా కేంద్ర హోంశాఖ సెక్రటరీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పుల్వామా ఘటనపై అనుసరించాల్సిన వ్యూహాలపై, జమ్మూ కశ్మీర్లో భద్రత పెంపుపై చర్చిస్తున్నారు. అదేవిధంగా జమ్మూ కశ్మీర్ విద్యార్థులకు ఎటువంటి హాని కలగకుంగా చూసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజ్నాథ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడిపై చర్చించేందుకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరిగిన ఈ భేటీకి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది. -
పుల్వామా ఉగ్రదాడి; రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం
-
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర ఘాతుక ఘటనను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తీవ్రంగా ఖండిచింది. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన 49మంది జవాన్లను భారతీయులెవరు మరిచిపోలేరని ప్రకటించింది. వారి ప్రాణాలను హరించిన పాక్ తీవ్రవాద మూకలకు భారత్ గట్టి సమాధానం చెబుతుందనే విశ్వాసాన్ని నాట్స్ వ్యక్తం చేసింది. పుల్వామాలో ఉగ్రదాడి తెలిసిన వెంటనే అమెరికాలో ఉండే తెలుగువారంతా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవానుల కుటుంబాలకు నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపింది. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు జవాన్ల కుటుంబానికి అండగా ఉండాలని పేర్కొంది. -
నిప్పులు చెరిగిన యాంకర్ రష్మీ
సాక్షి, హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారకంగా పాకిస్తాన్పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ దాడిలో అసువులు బాసిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ పాకిస్తాన్ దుశ్చర్యపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, బుల్లితెర యాంకర్ రష్మీగౌతమ్ ట్విటర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్లోనే ఉంటూ పాక్ మద్దతుగా మాట్లాడిన వారిని ఏకిపారేశారు. పుల్వామా దాడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధును సైతం ఈ బుల్లితెర యాంకర్ వదిలి పెట్టలేదు. ‘దేశ విభజన సమయంలోనే పాక్ వైపుకి వెళ్ళాల్సింది. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ సిద్ధూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ( చదవండి : ‘సిద్ధూని తీసేయకపోతే చూడం’) పాకిస్తాన్ జిందాబాద్ అంటూ షోయబ్ హఫీజ్ అనే నెటిజన్ చేసిన కామెంట్కు రష్మీ గౌతం ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? సాలే, మాతోనే అస్థిత్వం, లేకపోతే నువ్వు దానితో సమానం.. మూసుకుని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య.. ’ అని నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ స్టూడెంట్ చేసిన కామెంట్పై కూడా ఘాటుగానే కామెంట్ చేశారు. ‘ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఈ నాకొడుకులను ఏరి పారెయ్యాలి’.. అంటూ తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు.. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్, రష్మీకి మద్దతుగా పోస్ట్లు చేస్తున్నారు. (చదవండి: సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) Teri Pakistan ki aise ki tesi Sale tum nikale hi humane HO bacha samhjke maaf karte rahe hai Hum hai tho tum HO Varna tum maati ke barabar Koi asthitva nahi hai tumhara Even few of ur pak states are named after us So shut the fuck up https://t.co/EsqY2pU2Nt — rashmi gautam (@rashmigautam27) February 15, 2019 At the time of partition he was supposed to go to the other side sadly to our bad luck he stayed back here https://t.co/9JSN8z3epP — rashmi gautam (@rashmigautam27) February 16, 2019 -
‘నా తండ్రిని చూస్తే గర్వంగా ఉంది’
సాక్షి, భువనేశ్వర్: కశ్మీర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమర జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారికి సంబంధించిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తండ్రిని కోల్పోయిన బిడ్డలు, భర్తలను కోల్పోయిన భార్యలు.. ఇలా ఒక్కొక్కరి వ్యథలు వర్ణనాతీతం. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎప్ జవాను ప్రసన్న కుమార్ సాహూ కూతురు రోజీ చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. ‘నాన్నను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. అదే సమయంలో దేశం కోసం ప్రాణాలొదిలిని నా తండ్రిని చూస్తే గర్వంగా ఉంది’అని ప్రసన్న కుమార్ సాహూ కూతురు రోజీ బాధతప్త హృదయంతో చేసిన వ్యాఖ్యలివి. రెండు నెలల సెలవులను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వెళ్లిన ప్రసన్న కుమార్ ఇక తిరిగిరాడని కుటుంసభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒడిశాకు చెందిన ప్రసన్న కుమార్ 1995లో సీఆర్పీఎఫ్లో చేరారు. అతనికి భార్య మీన, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సీఎం నవీన్ పట్నాయక్ ప్రసన్న కుమార్, మనోజ్ బెహ్రా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ దాడి పిరికి పందల చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రసన్న కుమార్, మనోజ్ బెహ్రాల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జమ్మూకశ్మీర్లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు
శ్రీనగర్ : మూడేళ్ల క్రితం భారత బలగాలు తన కొడుకును చితక్కొట్టడంతోనే మిలిటెంట్ గ్రూప్లో చేరాడని సూసైడర్ బాంబర్, ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు తెలిపారు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆదిల్ ఆత్మహుతికి దాడికి తెగబడి 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదిల్ ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకొని జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిపై దుండగుడు ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు రాయిటర్స్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకున్న బాధే తమకు ఉందని ఆదిల్ అహ్మద్ దార్ తండ్రి గులామ్ అహ్మద్ దార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2016లో తన కొడుకు అతని స్నేహితులు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. భారత సైనికులు అడ్డుకొని చితక్కొట్టారని, ఈ ఘటనతోనే ఆదిల్ ఉగ్రవాద గ్రూప్ల పట్ల ఆకర్షితుడయ్యాడని తెలిపాడు. అప్పటి నుంచి భారత సైనికులపై కోపం పెంచుకున్నాడని అతని తల్లి ఫహమీదా పేర్కొంది. ఇక తన కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదని, ఈ దాడి వ్యూహం తమకు తెలియదన్నారు. గతేడాది మార్చి 19 నుంచి ఆదిల్.. పని చేసే చోటు నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి జాడలేడన్నారు. అతని జాడ కోసం మూడు నెలలుగా ప్రయత్నించి ఆశ చాలించుకున్నామన్నారు. తన కొడుకు మరణానికి దేశంలోని రాజకీయనాయకులే కారణమని, కశ్మీర్ సమస్యపై తేల్చకుండా నాన్చుతున్నారని గులామ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ అంశం తేలే వరకు.. తమలాంటి పేదల పిల్లలు, భారత జవాన్ల ప్రాణాలు పోతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) -
‘సిద్ధూని తీసేయకపోతే చూడం’
చండీగఢ్ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రజలు భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా సిద్ధుపై దుమ్మెత్తిపోస్తున్నారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై సిద్దూ స్పందిస్తూ.. ‘కొంతమంది కోసం మీరు దేశం మొత్తాన్ని నిందిస్తారా? హింసను ఎప్పుడూ ఖండించాల్సిందే. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించాల్సిందే. పాకిస్తాన్తో.. భారత్ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు పునరావృతమవ్వవు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పాక్కు వత్తాసుగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో సోని టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్ శర్మ షోను నిషేదించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ షో నుంచి సిద్ధూనన్న తీసేయాలని పట్టుబడుతున్నారు. ఈ షోను చూడకపోతే.. రద్దవుతోందని, ఇది అమరజవాన్లకు నిజమైన నివాళని పిలుపునిస్తున్నారు. సిద్ధూకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కూడా కామెంట్ చేస్తున్నారు. ‘దేశ రక్షణ కోసం 40 మంది ప్రాణ త్యాగం చేస్తే.. సిగ్గులేకుండా పరాయి దేశానికి వత్తాసు పలుకుతావా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత జవాన్లపై ఏ మాత్రం గౌరవం ఉన్న సోనీ టీవీ వెంటనే కపిల్ శర్మ షో నుంచి సిద్ధుని తీసేయాలని సూచిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో సిద్ధు తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల విషయంలో భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు ప్రకటించారు. @SonyTV @KapilSharmaK9 We request you to expel @sherryontopp from The Kapil Sharma Show & show courtesy to nation where you earn revenue. Removing him would be great tribute to our martyrs of Pulwama,else we would boycott this show henceforth "Kapil Sharma" — Hitesh Vyas (@vyashit) February 15, 2019 We all must boycott Kapil Sharma show as long as Sidhu is there. — Rajendra Saluja (@RajendraSaluja) February 15, 2019 Throw Out Sidhu From The Kapil Sharma Show Or Els We #Boycott The Kapil Sharma Show..!!@SonyTV @KapilSharmaK9 — Soumya Roy (@SamRoy_) February 15, 2019 -
పాకిస్తాన్తో చర్చించాల్సిందే : సిద్ధు
చండీగఢ్ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్తో.. భారత్ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు జరగవని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధు.. తన తాజా వ్యాఖ్యలతో మరోసారి తీవ్ర విమర్శల పాలవుతున్నారు.(ఉగ్ర మారణహోమం) సిగ్గుచేటు.. సిద్ధు వ్యాఖ్యలపై స్పందించిన రిటైర్డు మేజర్ జనరల్ జీవీ భక్షి మాట్లాడుతూ..‘ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దేశ భద్రత కోసం యూనిఫాం ధరించిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదుర్కొనే సమస్యల గురించి ఆయన అవగాహన లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.(ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం : రాహుల్ గాంధీ) కాగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు అని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో సిద్ధు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ప్రభుత్వానికి అండగా ఉంటాం : రాహుల్
న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల విచారం చేసిన రాహుల్.. రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం అంతిమ లక్ష్యం దేశాన్ని విభజించడమేనని పేర్కొన్నారు. అందుకే వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా హిందుస్థాన్ ప్రజలను వేరుచేయలేరన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒకేతాటిపై నిలవాలని, అపుడే మన ఐక్యత గురించి వారి తెలుస్తుందని పేర్కొన్నారు. వేరే చర్చకు తావు లేదు.. ‘ ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉక్కుపాదం మోపాలి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదం పట్ల ఉక్కుపాదం మోపాలని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
పంజాబ్లో ఉగ్రదాడి
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్ నగర శివార్లలో ఉన్న సంత్ నిరంకారి భవన్పై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ప్రార్థనలు జరుగుతుండగా ఇద్దరు ఉగ్రవాదులు భక్తులపైకి గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ముగ్గురు మరణించగా మరో 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిని తాము ఉగ్రవాదుల దుశ్చర్యగానే భావిస్తున్నామని పోలీసులు చెప్పగా, దాడి వెనుక ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థలు ఉండొచ్చనీ, పంజాబ్లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయతిస్తోందని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు. అమృత్సర్ శివార్లలో, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న రాజాసన్సీ ప్రాంతంలోని అద్లివాల్ అనే గ్రామంలో ఉన్న సంత్ నిరంకారి భవన్పై ఈ దాడి జరిగింది. దాదాపు 200 మంది నిరంకారీలు లోపల ప్రార్థనలు చేస్తుండగా, మొహాలకు ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు బైక్పై అక్కడకు చేరుకున్నారు. ద్వారం వద్ద తనిఖీలు చేస్తున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి లోపలకు చొరబడిన అనంతరం ప్రార్థనలు చేస్తున్న వారిపైకి గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. దీనిని ఉగ్ర చర్యగానే తాము పరిగణిస్తున్నామని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా వెల్లడించారు. గ్రెనేడ్ పడిన ప్రాంతంలో చిన్న గుంత ఏర్పడిందన్నారు. అక్కడ పడి ఉన్న గ్రెనేడ్ ముక్కలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని తెలిపారు. నిరంకారి భవన్ ప్రాంతంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలను అమర్చలేదని ఐజీ ఎస్ఎస్ పర్మార్ చెప్పారు. దాడి జరిగిన నిరంకారి భవన్కు సీల్ వేసిన పోలీసులు, పంజాబ్లోని ఇతర నిరంకారి భవన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హెచ్చరికలు ఉన్నా దాడి.. 1980, 90ల్లోని తీవ్ర హింసాత్మక పరిస్థితుల నుంచి బయటపడి, ఇటీవలే శాంతి నెలకొన్న పంజాబ్లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవలే హెచ్చరించారు. మరోవైపు ఆరు నుంచి ఏడు మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రస్తుతం పంజాబ్లో ఉన్నారనీ, వారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా నిఘా సమాచారం ఉంది. కొన్ని రోజుల క్రితమే పఠాన్కోట్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి కారును నలుగురు కలిసి లాక్కొని పరారయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉన్నా ఆదివారం నిరంకారి భవన్పై దాడి జరగడం గమనార్హం. తీవ్రంగా భయపడ్డాం:ప్రత్యక్ష సాక్షులు గ్రెనేడ్ దాడి కారణంగా తాము తీవ్ర భయానికి లోనయ్యామని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గ్రెనేడ్ పేలిన అనంతరం భవన్లో దట్టమైన పొగ అలముకుందనీ, భక్తులంతా పరుగులు తీశారని చెప్పారు. ప్రతి ఆదివారం తాము ఇక్కడ ప్రార్థనలు చేసుకోవడం మామూలేనన్నారు. సిమ్రన్జిత్ కౌర్ అనే మహిళ మాట్లాడుతూ ‘ప్రతి ఆదివారం నేను ఇక్కడ సేవకు వస్తాను. నేను గేటు వద్ద విధుల్లో ఉండగా యుక్తవయసులో ఉన్న ఓ వ్యక్తి మొహానికి ముసుగు కప్పుకుని వచ్చాడు. ఏదో విసిరి పరారయ్యాడు. అది బాంబు అని తర్వాత అర్థమైంది. అంతటా దట్టమైన పొగ అలముకుంది. అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు’ అని ఆమె తెలిపారు. ప్రశాంతతకు భంగం కలగనివ్వం: సీఎం పంజాబ్ చాలా కష్టపడి సంపాదించుకున్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు దుష్టశక్తులకు అవకాశం ఇవ్వబోమని సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజలెవ్వరూ భయపడాల్సిన పని లేదని ఆయన అభయమిచ్చారు. ఈ దాడి వెనుక ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. పంజాబ్లో కల్లోలం సృష్టించేందుకు పాక్ దుర్మార్గ ప్రయత్నాలు చేస్తోందన్న భావన ఈ దాడితో బలపడిందన్నారు. మృతుల బంధువులకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సీఎం, క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. దాడి వెనుక ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. గత 18 నెలల్లో 15 ఉగ్ర కుట్రలను భగ్నం చేసినట్లు సీఎం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు.. రోదిస్తున్న బాధితుల కుటుంబీకులు -
జవానులకు కష్టం వస్తే స్పందించే తీరు ఇదేనా?
‘‘దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వీరులను గౌరవించడం ఇలాగేనా? సరిహద్దుల్లో వారి ప్రాణాలను అడ్డుపెట్టి ఈ దేశంలో ఉంటున్న వారందరినీ కాపాడుతున్నారు. అటువంటి వీరులకు కష్టం వస్తే స్పందించే తీరు ఇదేనా? వారి కుటుంబాలు ఎంత దుర్భర స్థితిలో జీవితాన్ని సాగిస్తున్నా పరిహా రం కోసం అడుక్కోరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. విధి నిర్వహణలో వీరోచిత మరణం పాలైతే వారికి శ్రద్ధాంజలి ఘటించే పేరుతో నేతలు పతాక శీర్షికలకు ఎక్కుతారు. అంత పరిహారం ఇస్తాం.. ఇంత ఇ స్తాం.. అంటూ వాగ్దానాలు చేస్తారు. మళ్లీ వారి గురిం చి పట్టించుకోరు. ఆ వీరుల చేతుల్లో ఉండేది జాతీయ జెండాలే తప్ప.. రాజకీయ పార్టీల జెండాలు కాదు. బహుశా అందుకే వారంటే ప్రభుత్వాలకు పట్టదేమో. – కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: పఠాన్కోట్ ఎయిర్ బేస్పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి కుడి కన్ను, కుడి చేయి, కుడి కాలు పనిచేయని స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) సైనికుడు కంగాల శ్రీరాములుకు తగిన సాయం అందజేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. శ్రీరాములుకు జంటనగరాల చుట్టుపక్కల అది కూడా జనావాసాలకు సమీపంలోనే కనీసం 10 సెంట్ల భూమి, రూ.1.5 కోట్లకు తగ్గకుండా ఆర్థిక సాయం అందించాలని ఇరు ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. లేకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ శ్రీరాములు నేపథ్యం కంగాల శ్రీరాములు ఎన్ఎస్జీ కమాండో. బాంబుల నిర్వీర్య నిపుణుడు. 2016లో పఠాన్కోట్‡ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన కుడి కన్ను, కుడి చేయి, కుడి కాలు పనిచేయకుండా పోయాయి. ఈ ఘటన తర్వాత అతడి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు దక్కలేదు. దీనిపై పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ లేఖ రూపంలో శ్రీరాములు పరిస్థితిని అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్గా పరిగణించి విచారణ ప్రారంభించారు. గతేడాది ఈ కేసులో కేంద్రం, తెలంగాణలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఉభయ ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగింది. ఓ న్యాయమూర్తి లేఖ రాస్తే, దానిపై తాము నోటీసులు జారీ చేసి వివరణ కోరితే తప్ప శ్రీరాములు వంటి యుద్ద వీరులను గౌరవించారా అంటూ నిలదీసింది. గౌరవించకపోయినా ఫర్వాలేదని, అవమానించడం మాత్రం సహించరాని విషయమని మండిపడింది. ఏడాది కింద నోటీసులు ఇస్తే శ్రీరాములకు సాయం విషయం ఇంకా పరిశీలన దశలో ఉందని చెప్పడం ఎంత మాత్రం క్షమార్హం కాదంది. రాష్ట్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అతడి పిల్లల చదువు, వసతి బాధ్యతలను తీసుకుని ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలా చేయకపోవడం చాలా దురదృష్టకరమంది. యుద్ద వీరులను గౌరవించడం ఈ దేశానికి తెలియదని, రష్యా వంటి దేశాల్లో ఎంత గౌరవం ఇస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంది. ప్రతీ విషయానికి చేస్తున్నా.. సమయం కావాలని కోరడం సరికాదని, తల దగ్గర తుపాకీ పెడితే ఎంత వేగంగా పనులు అవుతాయో అంతే వేగంగా పనులు జరగాలని స్పష్టం చేసింది. -
ఉగ్రదాడిలో నలుగురు పోలీసుల మృతి
సోఫియాన్ : జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అరహమాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతిచెందారు. చెడిపోయిన వాహనానికి మరమత్తులు చేస్తున్న పోలీస్ బృందంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు తెగబడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్లు ఇష్వాక్ అహ్మద్ మిర్, జావెద్ అహ్మద్ భట్, మొహ్మద్ ఇక్బాల్ మిర్, ఎస్పీఓ అదిల్ మంజూర్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. -
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి:133 మంది మృతి
-
ఇండోనేషియాలో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
-
ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట..!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సున్జ్వాన్లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా.. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సున్జ్వాన్లోని ఆర్మీ క్యాంప్పై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. దాడిలో మొత్తం నలుగురు వరకు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు తెలుస్తుండగా.. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం సున్జ్వాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపునకు 500 మీటర్ల వెలుపల ఉన్న అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడితో కేంద్రహోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్ డీజీపీతో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
బహిరంగ కాల్పులు జరిపిన ఉగ్రవాది అరెస్ట్
శ్రీనగర్ : విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను పొట్టనబెట్టుకొని పరారైన ఓ లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రత బలగాలు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నాయి. మంగళవారం ఉదయం శ్రీనగర్లోని మహారాజా హరిసింగ్ హాస్పిటల్లో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులతో తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా ఒకరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి లష్కరే తోయిబా ఉగ్రవాది అబు హన్జుల్లా అలియాస్ నవీద్ జాట్గా గుర్తించారు. సెంట్రల్జైలు నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆరుగురి ఖైదీల్లో నవీద్ ఒకడు. ఈ ఖైదీలకు కాపలాగా వచ్చిన పోలీసుల నుంచి ఆయుధాన్ని తీసుకొని వారిపై కాల్పులకు పాల్పడ్డాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. 2015లో నవీద్ బీఎస్ఫ్ బలగాల కాన్వయ్పై దాడిచేసిన ఘటనలో అరెస్ట్ అయ్యాడని, అప్పటి నుంచి శ్రీనగర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడని తెలిపారు. అక్కడికి భద్రత బలగాలు చేరుకొని అణువనువు గాలిస్తున్నాయి. ఆసుపత్రిలో అత్యవసర, ఓపీ సేవలన్నింటిని నిలిపివేశారు. -
మిలిటరీ అకాడమీపై బాంబు దాడి.. కాల్పులు
కాబూల్ : ఉగ్రదాడితో అప్ఘనిస్థాన్ మరోసారి వణికిపోయింది. కాబూల్లోని మిలిటరీ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పుల మోతతో అకాడమీ దద్దరిల్లి పోయింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మార్షల్ ఫాహిమ్ నేషనల్ ఢిపెన్స్ యూనివర్సిటీ అకాడమీపై ఐదుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, పది రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు కాబూల్ నగరంపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. ఇంటర్కాంటినెంటల్ హోటల్పై జరిపిన దాడిలో 22 మంది ప్రాణాలు బలితీసుకున్న తాలిబన్లు.. రెండు రోజుల క్రితం అంబులెన్స్తో భారీ ఎత్తున్న బాంబు దాడి నిర్వహించి 100 మందికి పైగా పొట్టనబెట్టుకున్నారు. అఫ్ఘన్ మిలిటరీ అకాడమీలే లక్ష్యంగా ఉగ్రవాదులు గతంలో చాలాసార్లు దాడులకు పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబర్లో మార్షల్ ఫాహిమ్ వద్దే బాంబు దాడి చోటు చేసుకోగా.. 11 మంది సైనికులను మృతి చెందారు. -
పసిపిల్లలే లక్ష్యంగా ఉగ్రవాదుల బీభత్సం
జలాలాబాద్ : అభంశుభం తెలియని పసిపిల్లలే లక్ష్యంగా ఉగ్రవాదులు భీకరదాడికి పాల్పడ్డారు. అఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్ పట్టణంలోగల ‘సేవ్ ద చిల్డ్రెన్’ కార్యాలయంపై విరుచుకుపడ్డ ముష్కరులు.. కనిపించినవారిని కనిపించినట్లు కాల్చేశారు. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో పదుల మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. భీతావహదృశ్యాలు : పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తోన్న ‘సేవ్ ద చిల్డ్రెన్’ సంస్థ కార్యాలయం ఎదుట కారుబాంబును పేల్చిన ఉగ్రవాదులు.. అనంతరం తుపాకులతో లోపలికి ప్రవేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారాన్నిబట్టి 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యాలయం లోపలున్న ఉగ్రవాదులు ఇంకా ఎంతమందికి హానితలపెట్టారో ఇప్పుడే చెప్పలేమని జలాలాబాద్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అతావుల్లా పేర్కొన్నారు. భయంతో వణికిపోతున్న పిల్లల్ని.. సంస్థ సహాయకులు దూరంగా తీసుకెళుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. దాడి సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ బలగాలు ఘటనా స్థలికి తరలివెళ్లాయి. కౌంటర్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. గతవారం కాబూల్లోని అతిపెద్ద హోటళ్లలో ఒకటైన ఇంటర్ కాంటినెంటల్పై దాడిచేసిన ఉగ్రవాదులు 22 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఓ పక్క మారణ హోమం..మరో పక్క ప్రాణ భయం
-
ప్రాణ భయంతో తప్పించుకునే యత్నంలో...
కాబూల్ : హోటల్ ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి ఓ వీడియో ఫుటేజీ అఫ్ఘన్ వార్త ఛానెళ్లలో చక్కర్లు కొడుతోంది. ఓ పక్క ఉగ్రవాదులు మారణహోమం కొనసాగిస్తుంటే.. మరోపక్క ప్రాణ భయంతో కొందరు తప్పించుకోవాలని ప్రయత్నించటం అందులో నమోదు అయ్యింది. బాంబు దాడితో హోటల్లోని పై అంతస్థులో మంటలు ఎగిసిపడుతుండగా.. పక్క పోర్షన్ నుంచి కొందరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. బెడ్ షీట్ల సాయంతో బాల్కనీ నుంచి దూకేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ఓ వ్యక్తి కింద పడిపోగా.. మరొకరిని కింది ఫ్లోర్లో ఉన్న వ్యక్తి కాపాడాడు. దూరం నుంచి ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి మీడియాకు అందించాడు. గ్రెనేడ్లతో తుపాకులతో దూసుకొచ్చిన ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లు కాల్చుకుంటూ పోయారని.. తాము మాత్రం ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నామని తప్పించుకున్న అహ్రుద్దీన్ తెలిపాడు. తన స్నేహితుడు మాత్రం కిందపడి గాయాల పాలైనట్లు అతను వివరించాడు. కాగా, శనివారం అర్ధరాత్రి ఇంటర్కాంటినెంటల్ హోటల్పై ఉగ్రవాదులు దాడి చేయగా.. ఘటనలో ఓ విదేశీయుడు సహా ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. హోటల్ను ఇంకా పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకోలేదన్న అధికారులు.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. -
హోటల్పై ఉగ్ర దాడి.. భారీగా ప్రాణ నష్టం
-
హోటల్పై ఉగ్ర దాడి.. భారీగా ప్రాణ నష్టం
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం రాత్రి సాయుధులైన ఆగంతకులు నగరంలోని ఓ స్టార్ హోటల్లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు సమాచారం. కాబూల్లోని అతిపెద్ద హోటళ్లలో ఇంటర్ కాంటినెంటల్ ఒకటి. సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ వంట గది ద్వారా ప్రవేశించిన దుండగలు విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆపై గ్రేనేడ్ దాడులు చేయటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటన నుంచి తప్పించుకున్న హోటల్ మేనేజర్ అహ్మద్ హరిస్ నయబ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హ్యాండ్ గ్రేనేడ్లతో హోటల్లోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు ప్రకటించిన భద్రతా దళాలు.. ఐదుగురు పౌరులు మృతి చెందినట్లు చెబుతూ ఆ సంఖ్య ఇంకా పెరగొచ్చనే సంకేతాలు అందిస్తోంది. మరోపక్క హోటల్కు సమీపంలో ఉన్న పాక్ ఎంబసీ కార్యాలయంలో కూడా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాబూల్ హోటళ్లపై దాడులకు అవకాశం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించిన కొద్దిరోజులకే ఈ దాడి చోటు చేసుకోవటం గమనార్హం. గతంలో(2011) ఇదే హోటల్ పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి 24 మందిని పొట్టనబెట్టుకున్నారు. -
సీఆర్పీఎఫ్ సెంటర్పై మెరుపుదాడి.. నలుగురు జవాన్ల మృతి
-
న్యూఇయర్ వేళ : ఆత్మాహుతి దాడి
కొత్త సంవత్సరం ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఆఫ్ఘానిస్తాన్ నేల రక్తంతో తడిసింది. నెత్తురు రుచి మరిగిన రాక్షసులు, మానవుల రూపంలో ఉన్నఉగ్రవాదులు మరోసారి తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నించారు. ఇందుకోసం 12మంది ప్రాణాలను పొట్టనపెట్టకున్నారు. వివరాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఆదివారం జరిగిన మానవ బాంబుదాడిలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో ఈదాడి జరిగినట్టు నంగార్హర్ గవర్నర్ అధికార ప్రతినిధి అతుల్లా కోగ్యాని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
పుల్వామా ఉగ్రదాడి.. నేలరాలిన జవాన్లు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు నేలరాలారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పుల్వామా జిల్లా కేంద్రంలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. గ్రెనేడ్లు, తుపాకి కాల్పులతో బీభత్సం సృష్టించారు. గంటలపాటు కొనసాగిన కౌంటర్ ఆపరేషన్లో చివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సుదీర్ఘ ఆపరేషన్ : తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. క్యాంప్లోని ఓ బిల్డింగ్లో నక్కిన ఉగ్రవాదులు దొంగచాటుగా కాల్పులు జరిపారు. గంటలపాటు సాగిన ఆపరేషన్లో చివరికి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
అమెరికాలో ట్రక్ టెర్రర్
న్యూయార్క్: అమెరికాలో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల తరహాలోనే.. న్యూయార్క్లో ఓ ఉన్మాది ట్రక్కుతో పాదచారులపైకి దూసుకుపోయాడు. 9/11 నాటి దాడులకు కేంద్రమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోనే ఉగ్రవాది ట్రక్కుతో దూసుకురావటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఉజ్బెకిస్తాన్కు చెందిన సైఫుల్లా హబీబుల్లాయ్విక్ సైపోవ్ (29) అనే ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి.. ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో న్యూయార్క్తోపాటుగా అమెరికా ఉలిక్కిపడింది. ఈ ఘటనను ఉగ్రదాడిగానే భావిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఉన్మాది 2010లో డైవర్సిటీ లాటరీ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాకు వలస వచ్చినట్లు తెలిసింది. కడుపులో బుల్లెట్ తగలడంతో కుప్పకూలిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ఎలా జరిగింది? మంగళవారం రాత్రి హాలోవీన్ సంబరాలకోసం న్యూయార్క్ సిద్ధమవుతోంది. మన్హాటన్ పశ్చిమభాగంలోని హడ్సన్ నది సమీపంలో (వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరలో)ని హైవే వద్ద మార్కెట్ రద్దీగా ఉంది. సైకిల్ లేన్, పాదచారుల లేన్కూడా రద్దీగా ఉంది. మధ్యాహ్నం 03.04 గంటల (స్థానిక కాలమానం) సమయంలో ఓ ట్రక్కు హైవే నుంచి వేగంగా ఈ రెండు లేన్ల వైపు దూసుకొచ్చింది. ట్రక్కు నడుపుతున్న ఐసిస్ ఉగ్రవాది ‘అల్లాహు అక్బర్’ అని గట్టిగా అరుస్తూ ట్రక్కును వేగంగా పోనిచ్చాడు. దీంతో కొందరు ట్రక్కు కింద చిక్కుకుపోగా.. ప్రమాదాన్ని గుర్తించిన వారు సైకిళ్లు వదిలి పారిపోయారు. ట్రక్కు త్రీలైన్డ్ సైకిల్ లేన్లో ఆగకుండా దాదాపు అరకిలోమీటర్ వరకు సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయింది. దీంతో రోడ్డు పొడుగునా రక్తపు మరకలు భయానకంగా కనిపించాయి. ట్రక్కుతో పార్కింగ్లో ఉన్న స్కూలు బస్సును ఢీకొట్టి ఇద్దరు చిన్నారులు సహా పలువురు యువకులను గాయపరిచిన ఉన్మాది.. డమ్మీ తుపాకీ పట్టుకుని ట్రక్కునుంచి బయటకు దిగాడు. అప్రమత్తమైన పోలీసులు అతని కడుపులో కాల్చారు. దీంతో ఉన్మాది సైఫుల్లా కుప్పకూలిపోయాడు. ఆరుగురు ట్రక్కు వేగానికి సైకిల్ లేన్లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు అర్జెంటీనా వాసులు, ఓ బెల్జియన్ ఉన్నారు. మరో ఇద్దరి గుర్తింపు తెలియలేదని పోలీసులు తెలిపారు. గాయాలతో ఉన్న సైఫుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఆపరేషన్కు ముందే ఉగ్రవాదితో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు సమాచారం. విదేశీయులపై తనిఖీలు కఠినతరం: ట్రంప్ ఈ ఘటనను ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ‘పశ్చిమాసియాలో మరోచోట ఐసిస్ ఉగ్రవాదులను ఓడిస్తున్నాం. అది చాలు. వారిని మన దేశంలోకి రానివ్వం’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. ‘న్యూయార్క్లో ఓ మానసిక ఉన్మాది మళ్లీ దారుణానికి ఒడిగట్టాడు. అధికారులు ఈ ఘటనను పరిశీలిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికాకు వస్తున్న విదేశీయుల గత చరిత్రను, ఇతర వివరాలను తనిఖీ చేసే ప్రక్రియను మరింత కఠినంగా జరపాలని ఆదేశించారు. మరింత కఠినంగా తనిఖీ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంతాప సూచకంగా తన ట్వీటర్ అకౌంట్ బ్యానర్ను ‘న్యూయార్క్ స్కైలైన్’ అని మార్చారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో ట్రంప్ తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గ్రీన్ కార్డు లాటరీ విధానాన్ని రద్దు చేస్తానని అన్నారు. ‘ఉజ్బెకిస్తాన్కు చెందిన ఐసిస్ ఉగ్రవాది సైఫుల్లా డైవర్సిటీ లాటరీ విధానం ద్వారా అమెరికాకు వచ్చాడు. ఈ విధానాన్ని రద్దు చేసే ప్రక్రియను నేను ప్రారంభించబోతున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సోనియా గాంధీ ఖండించారు. కాగా, బాధితుల్లో భారతీయులెవరూ లేరని అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. సైఫుల్లా నేరచరితుడే ‘హైవే నుంచి ఓ ట్రక్కు వేగంగా పాదచారులు, సైక్లిస్టుల లేన్లోకి దూసుకురావటం చూశాను. అదే వేగంగా చాలా మందిని ఈ ట్రక్కు ఢీకొంది. 9–10 సార్లు కాల్చిన శబ్దం కూడా వినిపించింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘అల్లాహు అక్బర్’ అని గట్టిగా అరుస్తూ ట్రక్కును వేగంగా పోనిచ్చాడని పలువురు తెలిపారు. ట్రక్కులో దొరికిన ఓ నోట్లోనూ ఐసిస్కు సంబంధించిన వివరాలున్నాయని తెలిసింది. పెల్లెట్ గన్, పెయింట్ బాల్ గన్లను కూడా ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 11 మందికి గాయాలయ్యాయన్న న్యూయార్క్ ఫైర్ కమిషనర్.. వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టేనని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన ఉన్మాది న్యూజెర్సీలోని పాటర్సన్ నుంచి వచ్చాడని తెలిసింది. మిస్సోరి, పెన్సిల్వేనియాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా సైఫుల్లాపై అభియోగాలు కూడా ఉన్నాయి. మృతదేహాలున్న ఘటనాస్థలి వద్ద దర్యాప్తు చేపట్టిన ఫోరెన్సిక్ నిపుణులు వేడుకలకొస్తే విషాదం వెక్కిరించింది వారంతా చిన్నతనం నుంచి స్నేహితులు. అర్జెంటీనాలోని రోజారియో పట్టణంలో పాలిటెక్నిక్ కలిసే చదువుకున్నారు. వీరంతా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పదిమంది మిత్రులు న్యూయార్క్లో సంబరాలు జరుపుకోవాలనుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వీరంతా కలిసిన సమయంలోనే ఉగ్రవాది సైఫుల్లా ట్రక్తో దూసుకొచ్చాడు. దీంతో వీరిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో హెర్న్ మెండోజా, డీగో ఎన్రిక్, డామిన్ పాంగ్నుకో, ఏరియల్ ఎర్లిజ్, హెర్న్ ఫెర్రూచీలు మృతిచెందినట్లు అమెరికాలోని అర్జెంటీనా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఉగ్రదాడితో మిగిలిన మిత్రులంతా షాక్కు గురయ్యారు. న్యూయార్క్కు రాకముందు వీరంతా లిబ్రె (స్వేచ్ఛ) అని రాసున్న టీ–షర్ట్లో దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మృతుల్లో ఒకరైన ఎర్లిజ్.. న్యూయార్క్ టూర్కోసం ఆర్థికంగా ఇబ్బందులున్న ఇద్దరు మిత్రుల ఖర్చులను తానే భరించారు. -
నరమేధం.. 50మంది రక్తపు మడుగులో
-
నరమేధం.. 50మంది రక్తపు మడుగులో
న్యూయార్క్ : లాస్ వేగాస్ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వందలాదిమంది గాయాలపాలయ్యారని, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపింది ఇద్దరు వ్యక్తులని తెలుస్తోంది. లాస్ వేగాస్లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తొలుత ఇద్దరే చనిపోయినట్లు తెలిసినా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 50మంది పైగా చనిపోయారు. లాస్ వేగాస్ స్ట్రిప్లో దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడ్డాడు. దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు భయభ్రాంతులకు గురై.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. కాల్పుల గురించి సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని హతమార్చినట్టు లాస్ వేగాస్ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, మరొకరు ఉన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి ఒక మహిళ అని, ఆమెకోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డు లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. లాస్ వేగాస్ లోపలికి వచ్చే మార్గాలన్నంటిని మూసి వేసి హై అలర్ట్ విధించారు. -
విమానం నేలకూల్చేందుకు కుట్ర
కాన్బెర్రా: విమానంపై ఉగ్రదాడి కుట్రను ఆస్ట్రేలియా పోలీసులు భగ్నం చేశారు. సిడ్నీ సబర్బన్లో పలు చోట్ల దాడులు చేసిన పోలీసులు కుట్ర పన్నిన ఉగ్రవాదులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్నబుల్ ఓ ప్రకటన చేశారు. గురువారం నుంచి సిడ్నీ ఎయిర్పోర్టులో భద్రతను పెంచామని, అందుకు కారణం ఉగ్రదాడి జరుగుతుందని ఇంటిలిజెన్స్ రిపోర్టులు అందడమేనని తెలిపారు. మిగిలిన ఎయిర్పోర్టుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ నలుగురిని అరెస్టు చేశారని, మిగిలిన వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. -
ఎనిమిదికి చేరిన ‘అమర్నాథ్’ మృతులు
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికుల బస్సును లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరొ యాత్రికురాలు మృతిచెందారు. గత సోమవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో గాయపడ్డ ఓ మహిళా యాత్రికురాలు లలిత చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మృతులంతా గుజరాత్, మహారాష్ట్రకు చెందినవారే. గత సోమవారం (జులై 10న) అమర్నాథ్ యాత్ర పూర్తిచేసుకుని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికులపై జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ సలీం వీరోచితంగా ప్రవర్తించి బస్సును వేగంగా నడిపినందుకు ప్రాణనష్టం తీవ్రత మరింత పెరగలేదన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో గాయపడ్డ ఓ యాత్రికురాలు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిది చేరగా, అందులో మహిళలే ఏడుగురు కావడం గమనార్హం. ఉగ్రదాడి అనంతరం భద్రతను మరింత పటిష్టం చేసిన అధికారులు అమర్నాథ్ యాత్రకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గురువారం అదుపులోకి తీసుకున్నాయి. -
సోమాలియాలో ఉగ్రవాదుల దాడి
31 మంది మృతి మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్పై అల్–షబాబ్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో మొత్తం 31 మంది మరణించగా, దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో దాడికి పాల్పడ్డ ఐదుగురు ఉగ్రవాదుల్ని పోలీసులు హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. పేలుడు పదార్థాలు, తుపాకులతో రెస్టారెంట్ వద్దకు దూసుకొచ్చిన ఉగ్రవాదులు కారు బాంబుతో భయోత్పాతం సృష్టించారు. అనంతరం రెస్టారెంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు రెస్టారెంట్ను ముట్టడించడంతో ఇరు వర్గాల మధ్య రాత్రంగా ఎదురుకాల్పులు కొనసాగాయి. అనంతరం భద్రతా బలగాలు రెస్టారెంట్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి కెప్టెన్ మహమూద్ హుస్సేన్ తెలిపారు. -
ఇద్దరు ఉగ్రవాదుల హతం
కశ్మీర్లో ఎస్పీ కాన్వాయ్పై ఉగ్రదాడి శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఎస్పీ స్థాయి అధికారిని లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఘటన పుల్వామా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. అనంతనాగ్, శ్రీనగర్ లోక్సభ స్థానాల్లో ఉపఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమావేశమై తిరిగివస్తున్న అదనపు ఎస్పీ చందన్ కోహ్లీ(32) కాన్వాయ్పై పద్గమ్పొరా ప్రాంతం లో ఈ దాడి జరిగింది. వెంటనే స్పందించిన గార్డులు ఉగ్రవాదుల కారుపై కాల్పులు జరిపి దుండగుల్ని మట్టుబెట్టారు. రెచ్చిపోయిన ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో శనివారం రాత్రి సబ్–ఇన్స్పెక్టర్ సుభాన్ భట్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, అతడి కుమారుడు, మేనల్లుడిని బందించి, ఇంటిని లూటీ చేయడంతో పాటు వాహనానికి నిప్పు పెట్టి పరారయ్యారు. మరో ఘటనలో దుండగులు పోలీసు రక్షణాధికారి మహమ్మద్ హనీఫ్పై దాడికి తెగబడ్డారు. అతనివద్ద ఉన్న ఎకే–47 రైఫిల్ను ఎత్తుకెళ్లారు. కశ్మీర్ మంత్రి ఇంటిపై ఉగ్ర దాడి దక్షిణ కశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని ఆ రాష్ట్ర మంత్రి ఫరూక్ అబ్ద్రాబి పూర్వీకులకు చెందిన ఇంటిపై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడిచేయడంతో ఓ పోలీస్ గాయపడ్డాడు. గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. -
జమ్మూలో హై అలర్ట్
జమ్మూ: ఆర్మీక్యాంప్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ ఘటనతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. అఖ్నుర్ సెక్టార్లోని ఆర్మీ క్యాంప్ జీఆర్ఈఎఫ్(జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్)పై ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో క్యాంప్లో పనిచేసే ముగ్గురు కూలీలు మృతి చెందినట్లు తెలిపారు. అయితే దాడిలో పాల్గొన్నది ఎంతమంది పాల్గొన్నరానేదానిపై స్పష్టత లేదని, దాడి అనంతరం వారు పరారైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాదిలో ఉగ్రవాదులు దాడి చేయడం ఇదే తొలిసారి. మరోవైపు ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
శ్రీనగర్లో మళ్లీ ఉగ్రదాడి
-
శ్రీనగర్లో మళ్లీ ఉగ్రదాడి
ఒక జవాను మృతి; ఎనిమిది మందికి గాయాలు శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగారు. శ్రీనగర్ శివారు ప్రాంతమైన జకురలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) జవాను ఒకరు మృతిచెందాడు. ఒక పోలీసు సహా మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనగర్లో విధులు నిర్వర్తించిన తర్వాత జవాన్లు తమ శిబిరాలకు తిరిగి వెళ్తుండగా వారి కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ‘మా మూడు కంపెనీల సిబ్బంది ఆరు వాహనాల్లో శిబిరాలకు వెళ్తున్నాం. ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు చిన్న వీధిలోంచి వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు’ అని ఎస్ఎస్బీ అధికారి దీపక్ కుమార్ చెప్పారు. భద్రతా దళాలు వెంటనే ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ఈ దాడి తామే చేశామని ఉమర్ ముజాహిదీన్ అనే సంస్థ ప్రకటించింది. ఆగస్టు 15 నాటి నౌహట్టా ఎన్కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు నగరంలో దాడి చేయడం ఇదే తొలిసారి. -
మరో ఉగ్ర దాడి
ముగ్గురిని మట్టుపెట్టిన సైన్యం ♦ కుప్వారా జిల్లాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల కాల్పులు ♦ ఆయుధాలు, మందుగుండు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్న ఆర్మీ ♦ ఎల్వోసీ వెంట ఉగ్ర చొరబాట్లు విఫలం.. నలుగురి హతం ♦ సర్జికల్ దాడులపై ఆధారాలు చూపాల్సిన అవసరం లేదు: పరీకర్ శ్రీనగర్/ఆగ్రా: కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం సైనిక శిబిరంపై కాల్పులకు తెగబడగా... సైన్యం ఉగ్రదాడిని సమర్థంగా తిప్పికొట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. కుప్వారా జిల్లా లాన్గేట్ వద్ద ఆర్మీ శిబిరంపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తంగా ఉన్న సైన్యం వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, మ్యాప్లు వంటి సామగ్రి స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్మీ కమాండింగ్ అధికారి కల్నల్ రాజీవ్ శారంగ్ కథనం ప్రకారం... సైనిక శిబిరం కంచె పరిధిలో అనుమానాస్పద కదలికల్ని గమనించిన జవాన్లు అప్రమత్తమై ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని తెలిపారు. ‘శిబిరానికి కాపలాగా ఉన్న సెంట్రీ పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు మొదలయ్యాయి. జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు.వెంటనే క్విక్ రియాక్షన్ బృందం అప్రమత్తతతో ఉగ్రవాదులు తప్పించుకోలేకపోయారు. వెంటనే ప్రకాశవంతమైన పరికరాల సాయంతో ఉగ్రవాదుల్ని కనిపెట్టి హతమార్చారు’ అని చెప్పారు. హతులైన ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే రైఫిల్స్, మూడు అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్స్, పెద్ద ఎత్తున మ్యాగజీన్స్, బుల్లెట్లు, నాలుగు వాకీ టాకీ రేడియో సెట్లు, మూడు జీపీఎస్ పరికరాలు, మూడు మొబైల్ ఫోన్లు, డ్రై ఫ్రూట్స్, మందులు, మ్యాప్లు, మాట్రిక్స్ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. మందులపై పాకిస్తాన్లో తయారైనట్లు ముద్రలు ఉండడంతో ఉగ్రవాదుల్ని పాకిస్తాన్కు చెందిన వారిగా నిర్ధారించామని కల్నల్ శారంగ్ వెల్లడించారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చా? అని ప్రశ్నించగా.. ‘ఉండవచ్చు. అయితే కేవలం ముగ్గుర్ని మాత్రమే హతమార్చాం. కంచె దాటేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని మాత్రమే గుర్తించాం. సమీప ప్రాంతాల్లో వెదుకులాట, అప్రమత్తత చర్యలు కొనసాగుతున్నాయి. మ్యాప్ల్ని, మ్యాట్రిక్స్ షీట్లను విశ్లేషిస్తున్నాం. వాటి ద్వారా మరిన్ని వివరాలు తెలిస్తే వెల్లడిస్తాం’ అని చెప్పారు. ఒక్కోసారి ఉగ్రవాదులు ఒకటి కంటే ఎక్కువ రేడియో సెట్లను వాడతారని, అందుకే నాలుగు సెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మందుల్ని బట్టి కొద్ది రోజులుగా క్యాంప్పై దాడికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందన్నారు. నూరు శాతం సర్జికల్ దాడులే సైనిక చర్యకు సంబంధించి వీడియో ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం చెప్పారు. ఆగ్రాలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ... నియంత్రణ రేఖ వెంట జరిగిన దాడి నూటికి నూరు శాతం సర్జికల్ దాడేనన్నారు. దేశం పట్ల విశ్వాసం చూపని వారి విషయంలో జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. మన బలగాల ధైర్యం పట్ల ఇంతవరకూ ఎవరికీ అనుమానం లేదని... మొదటిసారి కొందరు వ్యక్తులు సందేహపడుతున్నారని పరీకర్ విమర్శించారు. ఒక జాతీయ న్యూస్ చానల్ కథనం ప్రకారం సర్జికల్ దాడి జరిగినట్లు పాకిస్తాన్ పోలీసు అధికారి అంగీకరించారన్నారు. సరిహద్దుల్లో పోరాటానికి అవసరమైతే చాలామంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాక్ హోదాపై సమీక్షిస్తాం: భారత్ పాకిస్తాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశంగా ఇచ్చిన హోదాపై పునఃసమీక్షిస్తామని భారత్ ప్రకటించింది. భద్రతా, వాణిజ్య ఆసక్తులు ఆధారంగా ఈ సమీక్ష చేస్తామని, ఉగ్రవాదం ఎగుమతి చేసే వస్తువు కాదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. 3 చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టిన ఆర్మీ జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఆర్మీ మూడు చొరబాట్ల యత్నాల్ని విఫలం చేసి నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. గురువారం తెల్లవారుజామున నౌగామ్ సెక్టార్లో చొరబాటును అడ్డుకుని నలుగురిని హతమార్చామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చన్న అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపాయి. నౌగామ్, రాంపూర్ సెక్టార్లలో బుధవారం రాత్రి రెండు చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
నదులూ ఆయుధాలేనా?
దాయాదుల మధ్య మండుతున్న సింధు జలాలు - ‘ఉడీ’కి ప్రతిగా పాక్పై భారత్ ‘జల’ఖడ్గం - నీటి వాడకం పెంచి దెబ్బతీయడానికి సిద్ధం - ఇదే అదనుగా భారత్పై చైనా ‘బ్రహ్మా’స్త్రం - బ్రహ్మపుత్రను అడ్డుకుని డ్యాముల నిర్మాణం (పోతుకూరు శ్రీనివాసరావు) నీళ్లు మండుతున్నాయి. నదులు ఆయుధాలుగా మారుతున్నాయి. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్పై ‘సింధు’ జలఖడ్గాన్ని ప్రయోగించడానికి భారత్ సన్నద్ధమౌతుండగా... బ్రహ్మపుత్రకు అడ్డుకట్ట వేసి భారత్ను ఉక్కిరిబిక్కిరిచేయాలని చైనా చూస్తోంది. నిత్యం ‘చొరబాట్ల’తో పరోక్షయుద్ధం చేస్తున్న పాకిస్తాన్కు అదే తగినశాస్తి అని భారత్ భావిస్తుండగా... తన పని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఇదే మంచి తరుణమని చైనా తలపోస్తోంది. ‘ఉడీ’ ఉగ్రదాడి మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయని ఆధారాలతో సహా బైటపడడంతో దానిపై అన్నిరకాల చర్యలకు భారత్ సిద్ధపడుతోంది. అందులో భాగంగానే ‘సర్జికల్ స్ట్రయిక్స్’తో అదరగొట్టి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇపుడు పాకిస్తాన్కు ప్రాణాధారమైన సింధునదీ జలాలను బిగబట్టాలని భావిస్తోంది. అయితే ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్, అస్సాంలతో పాటు బంగ్లాదేశ్కు అతి ముఖ్యమైన బ్రహ్మపుత్ర నదికి అడ్డుకట్టలు వేసే యత్నాలను చైనా వేగవంతం చేసింది. ‘మా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం బ్రహ్మపుత్ర ఉపనదికి అడ్డుకట్ట వేశాం’ అని చైనా ప్రకటించింది. అంటే ‘మా మిత్రదేశమైన పాకిస్తాన్ను మీరు ఇబ్బంది పెడితే మిమ్మల్ని మేం ఇబ్బంది పెడతాం’ అని చైనా చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే భారత్- పాక్ మధ్య ఘర్షణను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చైనా చూస్తున్నట్లు కూడా దీనిని బట్టి అర్ధమౌతోంది. ఏదిఏమైనా భారత్- చైనా - పాకిస్తాన్ మూడూ అణ్వాయుధ దేశాలు. వీటి నడుమ రాజుకుంటున్న నదీజలాల వివాదాలు ఏ ఘర్షణలకు దారితీస్తాయో.. ఉపఖండం భవితవ్యం ఎలా ఉండబోతోందోనని అందరూ భయంభయంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు, బ్రహ్మపుత్ర నదీ జలాల మూలాలను, మూడు దేశాల మధ్య వినిపిస్తున్న జలఘోషను ఓమారు పరిశీలిద్దాం... సింధునదీ జలాల ఒప్పందమిదీ... భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రపంచబ్యాంకు చొరవతో 1960 సెప్టెంబర్ 19న సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు జనరల్ ఆయూబ్ఖాన్ సంతకాలు చేశారు. ⇒ పంజాబ్ నుంచి ప్రవహిస్తున్న బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్కు, సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్తాన్కు నియంత్రణ అధికారాన్ని కల్పించారు. ⇒ సింధు జలాలలో 20శాతం భారత్, 80శాతం పాకిస్తాన్ వాడుకునేలా హక్కులు కల్పించారు. భారత్ ఏం చేయాలనుకుంటోంది? ‘ఉడీ’ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ సమీక్షించింది. ఈ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలేమిటంటే... ⇒ పాక్ అధీనంలోని సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని సాగు, విద్యుదుత్పత్తి, నిల్వల కోసం గరిష్టంగా ఉపయోగించుకోవాలి. ⇒ కశ్మీర్లో సాగునీటి సమస్యలేకుండా చేయాలి. ⇒1987లో చేపట్టిన తుల్బుల్ నేవిగేషన్ ప్రాజెక్టును సమీక్షించాలి. ⇒ చీనాబ్ నదిపై పాకుల్దుల్, సావల్కోట్, బుర్ఫార్ డ్యామ్లను వెంటనే చేపట్టి వేగంగా పూర్తి చేయాలి. భారత్కు ఏం ఉపయోగం? ⇒ సింధు జలాల వినియోగాన్ని పెంచడం వల్ల కశ్మీర్లో అదనంగా సుమారు ఆరు లక్షల హెక్టార్ల భూములకు సాగునీరు అందించవచ్చు. ⇒ కశ్మీర్అభివృద్ధి ద్వారా ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపవచ్చు. ⇒ అయితే అంతర్జాతీయ నదీజలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం భారత్పై మరకలా మారుతుంది. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశ హోదా ఆశిస్తున్న భారత్కు ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పాకిస్తాన్ ఏం చేస్తోంది? సింధు నదీ జలాల వినియోగం పెంచేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నదన్న అనుమానంతో పాకిస్తాన్ ప్రపంచబ్యాంకును ఆశ్రయించింది. పాకిస్తాన్ అటార్నీ జనరల్ అష్తార్ అసఫ్ అలీ నేతృత్వంలోని అధికారుల బృందం వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు సీనియర్ అధికారులను కలుసుకున్నారు. భారత్ను ఎలాగైనా సరే అడ్డుకుని సింధు నదీ జలాల ఒప్పందాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అర్ధించారు. జీలం, చీనాబ్ నదులపై భారత్ ఎలాంటి డ్యాములూ కట్టకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాక్కు ఏం నష్టం? ⇒ మొత్తంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోయినా సింధు జలాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని భారత్ నిర్ణయిస్తే పాక్లో తీవ్ర సంక్షోభం తలెత్తుతుంది. దేశంలో మూడింట రెండువంతుల భూమి సింధునదీ బేసిన్ కిందకే వస్తుంది. ⇒ పాకిస్తాన్ వ్యవసాయానికి సింధు జలాలే ప్రధాన ఆధారం. స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 20శాతం వ్యవసాయం నుంచే వస్తోంది. దేశంలోని 2.1 కోట్ల హెక్టార్ల సాగుభూమిలో 80శాతంపైగా సింధు నది కాల్వల పైనే ఆధారపడి ఉన్నాయి. పంజాబ్, సింధ్ రాష్ట్రాలు బాగా దెబ్బతింటాయి. కరువుబారిన పడతాయి. ⇒ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వస్త్రపరిశ్రమ సింధు జలాలపై ఆధారపడి ఉంది. ఎలానంటే సింధు పరీవాహకప్రాంతంలో పత్తి ఎక్కువగా పండుతుంది. అది దెబ్బతింటుంది కాబట్టి దాని ప్రభావం వస్త్ర పరిశ్రమపై పడుతుంది. ⇒ రవాణాకు కూడా సింధునది పాకిస్తాన్కు చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి అవసరాలను కూడా ఈ నది తీరుస్తోంది. తాగునీటికి జనం కటకటలాడే పరిస్థితి వస్తుంది. ⇒ పాక్ మత్స్య పరిశ్రమకు కూడా సింధునది ప్రధాన ఆధారం. ఇక్కడ దొరికే అరుదైన ట్రౌట్ రకం చేపలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. సింధు జలాలు తగ్గిపోతే మత్స్యపరిశ్రమపై ఆధారపడినవారు జీవనోపాధి కోల్పోతారు. బ్రహ్మపుత్ర స్వరూపం.. పుట్టింది: టిబెట్ పొడవు: 2,880 కి.మీ పరీవాహక ప్రాంతం: 5,80,000 చ.కి.మీ. ⇒ 50.5 శాతం టిబెట్లోనూ, 33.5 శాతం భారత్లోనూ, 8శాతం బంగ్లాదేశ్లోనూ, 8శాతం భూటాన్లోనూ ఈ నది ఉంటుంది. ⇒ బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతంలో 63 కోట్ల జనాభా నివసిస్తోంది. బ్రహ్మపుత్రకు అనేక పేర్లు... బ్రహ్మపుత్ర నదికి అనేక పేర్లున్నాయి. చైనాలో దీనిని ‘యార్లాంగ్ సాంగ్పో’ అని పిలుస్తారు. టిబెట్నుంచి మనదేశంలోని అరుణాచల్ప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడ బ్రహ్మపుత్రను ‘సియాంగ్’ అంటారు. అస్సాంలో మాత్రమే దీనిని ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు. తర్వాత ఇది బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘జమున’ అని పిలుస్తారు. ఇక్కడే పద్మానది (గంగానది), మేగ్నానదులతో కలసి చివరకు బంగాళాఖాతంలో సంగమిస్తుంది. చైనా ఏం చేస్తోంది? బ్రహ్మపుత్ర నదిపై చైనాకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఈ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడమే కాదు అత్యంత నిస్సారమైన ఉత్తరప్రాంతానికి బ్రహ్మపుత్ర నదిని మళ్లించాలని తలపోస్తోంది. ⇒ టిబెట్లోని జిగేజ్ వద్ద నిర్మిస్తున్న ‘లాల్హో’ ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్రహ్మపుత్ర ఉపనది ‘జియాబుకు’కి చైనా అడ్డుకట్ట వేసింది. ⇒ బ్రహ్మపుత్రపై 2014 నవంబర్లో ‘జంగ్ము’ భారీ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించింది. గత ఏడాది అక్టోబర్ నాటికి మొదటి యూనిట్ పని ప్రారంభించింది. ⇒ జంగ్ము ప్రాజెక్టుతో ఏడాదికి 250 కోట్ల కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని అంచనా. జంగ్ముతో పాటు మరికొన్ని ఇతర జలవిద్యుత్ కేంద్రాలను కూడా చైనా నిర్మిస్తోంది. ⇒ జలవిద్యుత్ ప్రాజెక్టులే కాదు పలు డ్యాములను కూడా చైనా నిర్మిస్తోందని, వాటికి సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచుతోందన్న విమర్శలున్నాయి. చైనా ప్రాజెక్టుల ప్రభావం ఏమిటి? ⇒ నిజానికి టిబెట్లో నిర్మిస్తున్న డ్యాముల గురించిన సమాచారం చైనా బైటపెట్టడం లేదు. ⇒ బ్రహ్మపుత్ర ఉపనది జియాబుకుకు అడ్డుకట్ట వేసి నిర్మిస్తున్న ‘లాల్హో’ ఓ భారీ రిజర్వాయర్. ఇందులో 29.5 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వచేసి 30వేల హెక్టార్లు సాగుచేయనున్నారు. ⇒ ‘జంగ్ము’ విద్యుత్ కేంద్రం కోసం కూడా ఓ భారీ డ్యామ్ నిర్మించిందని అంటున్నారు. ⇒ చైనా నిర్మిస్తున్న డ్యాములు, రిజర్వాయర్లలో భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయడం వల్ల భారత్, బంగ్లాదేశ్లు నీటి కొరతను ఎదుర్కోనున్నాయి. ⇒ చైనా డ్యాములలో ఎంత నీటిని నిల్వ చేస్తున్నారో, ఎప్పుడు ఎంత పరిమాణంలో విడుదల చేస్తారో తెలియకపోవడం వల్ల అరుణాచల్, అస్సాంలలో అకస్మాత్తుగా వరదలు వచ్చి పెను ఉత్పాతాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. సింధునదీ స్వరూపం.. పుట్టింది: టిబెట్ పొడవు: 3,200 కి.మీ పరీవాహక ప్రాంతం: 11,02,000 చ.కి.మీ ⇒ ఈ నది 47శాతం పాకిస్తాన్లోనూ, 39శాతం భారత్లోనూ, 8శాతం టిబెట్లోనూ, 6శాతం ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉంటుంది. ⇒ సింధు పరీవాహకప్రాంతంలో 30 కోట్ల జనాభా నివసిస్తోంది. -
పోలీస్ స్టేషన్పై గ్రెనెడ్తో దాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ విరుచుపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీస్ మరణించగా, మరో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. జమ్ము కశ్మీర్లో ఇటీవల భద్రత బలగాలు హిజ్బుల్ కమాండర్ బుర్హాన్తో అతని ఇద్దరు సహాయకులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటువాదులు బంద్కు పిలుపునివ్వడం, నిరసనకారులు ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది. దాదాపు 30 మంది మరణించారు. పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. -
మక్కా మసీదులో తప్ప..
ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. 'నీస్ పై జరిగిన దాడి నైస్ కాదు. ఇలాంటి దాడి ఎక్కడైనా జరగొచ్చు. ఇలాంటివి ఆగిపోవాలని దేవుడిని ప్రార్థించాలని ఉంది, కానీ ఏ దేవుడిని వేడుకోవాలో తెలియడం లేదు. ఉగ్రవాదులు నరమేధం సృష్టించడానికి బాంబులు కూడా అక్కర్లేదు.. వాహనాలు ఉంటే చాలనే భయంకర వాస్తవాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పిచ్చి జోకుల్లా తయారయ్యాయి. నీస్ నగరంపై జరిగిన దాడి ఒకటే నిరూపిస్తుంది.. ప్రపంచంలో ఎక్కడా ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండలేరేమో, బహుశా ఒక్క మక్కా మసీదులో తప్ప' అంటూ ట్వీట్లు ఎక్కుపెట్టాడు వర్మ. కాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా నీస్ నగరంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంగా ట్రక్కును నడిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 84 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. Attack on Nice is not nice.it's horrific that terror can strike anywhere.I wish to pray to God for it to stop but I don't know to which God? — Ram Gopal Varma (@RGVzoomin) 15 July 2016 Terrifying realisation #Niceattack is terrorists don't need bombs anymore for mass murder ..they just need what everyone has like vehicles — Ram Gopal Varma (@RGVzoomin) 15 July 2016 Leaders condemning #Niceattack is like a repetitive bad joke..Are they dumb to think that a man who runs down crowds will listen to sense? — Ram Gopal Varma (@RGVzoomin) 15 July 2016 #Niceattack proves that nowhere in the world can anyone be safe except maybe in Mecca Masjid — Ram Gopal Varma (@RGVzoomin) 15 July 2016 -
‘బౌలింగ్ పిన్స్లా ఎగిరిపడుతున్నా ఏం చేయలేకపోయా’
నీస్: ఫ్రాన్స్ దినోత్సవం(బాస్టిల్ డే) సందర్భంగా సంబురాలు చేసుకుంటున్న ప్రజలపైకి గుర్తు తెలియని భారీ ట్రక్కు ఏ విధంగా దూసుకొచ్చిందో.. ఆ సందర్భంలో కనిపించిన దృశ్యాలేమిటో ప్రత్యక్ష సాక్షి ఒకరు పంచుకున్నారు. ’రోడ్డుపై ట్రక్కు అందరిని ఢీకొడుతుంటే బౌలింగ్ పిన్స్లాగా వారంతా ఎగిరిపడుతుండటం నేను స్వయంగా చూశాను. ఆ సమయంలో వారి అరుపులు విన్నాను. అది నా జీవితంలో మర్చిపోలేను. మీటర్ల వ్యవధిలోనే రక్తపుటేర్లు శవాలు ఒక్కొకటిగా పడుతూ వస్తున్నాయి’ అని అలెమండ్ అనే ఒక సాక్షి తన బ్లాగ్ లో పేర్కొన్నాడు. ‘అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. ఇంతలోనే జనాలు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీస్తూ కనిపించారు. ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు పరుగెత్తండి పరుగెత్తండి అంటూ అరుస్తున్నారు. ఈలోగా గాల్లో రెండు మూడు మీటర్ల ఎత్తులో జనాలు ట్రక్కు ఢీకొనడంతో ఎగిరిపడుతున్నారు. కానీ నేను ఏం చేయలేకపోయాను. ఓ రెస్టారెంటు వద్దకెళ్లి తలదాచుకున్నాను. నేను ఆ ట్రక్కులో డ్రైవర్ని చూడలేదు.. కానీ, అది వేర్వేరు దిశలుగా వెళుతుండటం చూశాను. ఈ ఘటన తర్వాత ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లాను. నేను వెళ్లిన మార్గం వెంట ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు, గాయాలతో అరుస్తున్నవారు కనిపించారు. ఆ దృశ్యం చూసి పూర్తిగా ధైర్యం కోల్పోయాను’ అని ఆ భయానక దృశ్యాలు వివరించాడు. -
'కోపం వస్తోంది.. గుండె పగిలిపోతోంది'
ముంబై: ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముష్కరుల మతిమాలిన చర్యను గర్హిస్తూ ట్విట్టర్ లో కామెంట్లు పోస్ట్ చేశారు. దర్శకుడు సాజిద్ ఖాన్, మీడియా ప్రముఖులు రాజ్దీప్ సర్దేశాయ్, బర్కాదత్ సహా పలువురు సెలబ్రిటీలు నీస్ ఉగ్రదాడి బాధితులకు బాసటగా నిలుస్తూ సందేశాలు పెట్టారు. 'ఉదయం లేవగానే విషాద వార్త తెలిసింది. హృదయం ద్రవించిపోతోంది. గతేడాది నేను అక్కడ ఉన్నా. నీస్ నగరం చాలా అందమైన ప్రాంతం. అక్కడి ప్రజలు చాలా మంచివారు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా'నని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు. 'నీస్ దాడి తీవ్రవాదం సృష్టించిన క్రూరమైన చర్య. మరో ఉగ్రదాడితో ఫ్రాన్స్ ప్రజలు షాక్ తిన్నాడు. బాధితులు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నా'నని హీరోయిన్ బిపాసా బసు తెలిపింది. 'అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. షాక్కు గురయ్యాను. కోపం వస్తోంది. గుండె పగిలిపోతోంది. గత నెలలో నేను నీస్ నగరంలో ఉన్నాను. బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాల'ని బ్రిటీష్ నటి, గాయని సోఫీ చౌద్రి వెల్లడించింది. 'నీస్ ఉగ్రదాడి గురించి విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగింది. హృదయం ద్రవీస్తోంది. భయానక దాడికి గురైన బాధితుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా'నని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. More innocent lives lost..Shocked, angry, heartbroken! Was in #Nice last month! All my prayers for the families. Restez fort. #NiceAttack — SOPHIE CHOUDRY (@Sophie_Choudry) 15 July 2016 Shocked to hear about the terrorist attack on innocent crowd in Nice.Heartbreaking.Prayers for the victims of this horrific act.#NiceAttack — VVS Laxman (@VVSLaxman281) 15 July 2016 Heart goes out to all the victims of yet another shocking and brutal act of terrorism#NiceAttack — Bipasha Basu (@bipsluvurself) 15 July 2016 Sad 2 wake up 2 the news of the #NiceAttack! Heartbreaking!Was there last yr,beautiful place & people. Prayers 4 the families of the victims — Akshay Kumar (@akshaykumar) 15 July 2016 -
ఐసిస్ మద్దతుదారుల హర్షం
నీస్: భయంకరమైన పేలుడుతో ఛిద్రమైన దేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఫ్రాన్స్ లోని నీస్ నగరం మార్మోగింది. పసి పిల్లలతో సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన గురించి తెలిసిన వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) మద్దతుదారులు మాత్రం హర్షాతిరేకాలు ప్రకటిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. నీస్ నగరంలో జరిగిన ఉగ్రదాడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఉగ్రదాడిలో ఫ్రాన్స్ పౌరులు మృతి చెందడం తమకెంతో సంతోషం కలిగించిందని కామెంట్లు చేశారు. 'దేవుడు గొప్పవాడు' అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు నీస్ దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించింది. అమాయక పౌరుల ప్రాణాలు తీయడాన్ని తీవ్రంగా గర్హించింది. పారిస్ దాడి జరిగిన తర్వాత దాదాపు 8 నెలలకు ఐసిస్ మరోసారి నరమేధం సృష్టించింది. అయితే యూరో 2016 సాకర్ టోర్నమెంట్ ఆదివారంతో ప్రశాంతంగా ముగియడంతో ఫ్రాన్స్ ఊపిరి పీల్చుకుంది. ఈలోగా ఐసిస్ మరోసారి ఉగ్రదాడికి తెగబడడంతో ఫ్రాన్స్ తో పాటు ప్రపంచమంతా ఉలికిపడింది. -
మరో 90 రోజులు నిఘా నీడలో ఫ్రాన్స్..
పారిస్: ఫ్రాన్స్లో మరో దాడి జరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు హోలాండే మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది నవంబర్లో పారిస్ నగరంలో పై ఉగ్రవాదులు విరుచుకుపడి దాదాపు 130మందిని బలిగొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రస్తుతం అది కొనసాగుతుంది కూడా. అయితే, తాజాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా మరోసారి ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు నడుపుతూ వారి ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు దేశంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తున్నట్లు చెప్పారు. -
రక్తపు మడుగులో శవాల కుప్పలు
నీస్: సరిగ్గా ఆరు నెలలు దాటింది.. ఫ్రాన్స్లో ఉగ్రవాదులు దాడిచేసి. ఆ దాడినే ఇప్పటివరకు ఆ దేశంతో సహా ప్రపంచ దేశాలు జీర్ణించుకోలేదు. ఇంతలోనే మరో సంఘటన. స్వరూపం ఎలా ఉన్నా మళ్లీ అమాయకుల ప్రాణాలు మాత్రం పోయాయి. ఒక్కడు పదుల సంఖ్యలో ప్రాణం తీశాడు. బాస్టిల్ డే (ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం) సందర్భంగా వీధుల్లో సంబురాలు జరుపుకుంటూ టపాసుల వెలుగులను వీక్షిస్తున్న వారిని అత్యంత క్రూరంగా చిదిమేశాడు. ఆయుధాలతో నిండిన ఓ భారీ ట్రక్కుతో జనాలపైకి దూసుకొచ్చాడు. దాదాపు రెండు కిలో మీటర్ల పొడవునా దొరికినవారిని దొరికినట్లు తొక్కేసి రక్తం పారించి అందులో శవాలను తేలియాడేలా చేశాడు. బాస్టిల్ డే రోజే జరిగిన ఈ ఘటన మరోసారి ఫ్రాన్స్లో భద్రత లేమిని మరోసారి చూపిస్తోంది. అలా దాడి చేసిన వాడు ఉగ్రవాదా.. లేక మరింకెవరు? అసలు అతడు దాడి ఎందుకు చేశాడు? ట్రక్కు నిండా ఆయుధాలు ఉన్నాయంటే ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు దూసుకొచ్చాడా? పోలీసులు అతడిని మట్టుబెట్టకుంటే ఎంత పెద్ద అనర్థం జరిగి ఉండేది? ఊహించుకుంటేనే గుండెల్లో రైల్లు పరుగెత్తుతాయి. ఇలాంటి ఘటన ఎలా జరిగింది? జరగడానికి.. జరిగిన తర్వాత పరిస్థితులు ఏమిటీ అనే విషయాలు ఒకసారి పరిశీలిస్తే.. 1. సమయం సరిగ్గా రాత్రి 11.00గంటలు. గురువారం రాత్రి. వందలమంది నీస్ లోని బీచ్ ముందున్న రోడ్డు పైకి వచ్చి క్రాకర్లు వీక్షిస్తున్నారు. అదే సమయంలో జనాలపైకి ఓ భారీ ట్రక్కు శరవేగంతో దూసుకొచ్చింది. దాదాపు రెండు కిలో మీటర్ల పొడవునా అందిరినీ గుద్దేసుకుంటా వెళ్లింది. దానిని అడ్డుకునేందుకు సామాన్యులు పోలీసులు వెంటపడ్డారు. అయినా ట్రక్కు వేగం పెంచడంతో అప్రమత్తమైన మరికొద్ది దూరంలో ఉన్న పోలీసులు ట్రక్కు నడుపుతున్న ఉగ్రవాదిపై వరుస కాల్పులు జరిపి హతమార్చారు. 2. ట్రక్కు వచ్చిన రెండు కిలోమీటర్ల మేర రక్తపు మడుగులో శవాల కుప్పలు పడ్డాయి 3. ఉగ్రవాది చనిపోయిన తర్వాత ట్రక్కు నిండా బాంబులు, గన్లు ఉన్నాయని ఆ ప్రాంత చీఫ్ క్రిస్టియన్ ఎస్ట్రోసి చెప్పారు. 4. మొత్తం 77మంది చనిపోయారని వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే ప్రకటన చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదిని హతం చేసినట్లు తెలిపారు. 5. కొంతమందిని ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నారని ఆన్ లైన్ లో వార్తలు హల్ చల్ చేయగా వాటిని అంతర్గత వ్యవహారాల మంత్రి కొట్టి పారేశారు. దాడి చేసింది ఒక్క ఉగ్రవాదే అని చెప్పారు. 6. దాడిచేసిన ఉగ్రవాది పేరు తెలియరాలేదు. కానీ, అతడికి 31 ఏళ్లు ఉంటాయని, ఫ్రెంచ్-ట్యూనిషియన్ అయ్యుంటాడని పోలీసులు చెప్తున్నారు. అయితే, అతడు నీస్ ప్రాంతం వాడేనని లభ్యమైన ఆధార పత్రాలు చెబుతున్నాయి. 7. దాడికి ఒక్కడే దిగాడా.. లేక మధ్యలో ఎవరైనా ఉగ్రవాదులు దిగి ఎక్కడైనా దాచుకున్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. 8. ఇరాక్, సిరియాలో ఫ్రాన్స్ ప్రాబల్యాన్ని పెంచుతాం. జిహాదిస్టులను అంతమొందిస్తాం. వెనుకడు వేసేది లేదు అని హోలాండే ప్రకటించారు. 9. ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు 10. ఫ్రాన్స్లో దాడులు కొనసాగిస్తామని గత నవంబర్ దాడి సందర్భంలోనే ఇస్లామిక్ స్టేట్ చెప్పిన నేపథ్యంలో ఆ సంస్థే ఈ దాడికి వ్యూహం పన్ని ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. -
'నీస్ దాడిలో భారతీయులకు ఏం కాలేదు'
-
నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
-
పక్కా స్కెచ్ వేసి 'ట్రక్'తో బీభత్సం
-
'నీస్ దాడిలో భారతీయులకు ఏం కాలేదు'
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులెవరూ మృతి చెందలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయులు మృతి చెందినట్టుగానీ, గాయపడినట్టు గానీ సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పారిస్ లోని భారత రాయబారి అక్కడి భారతీయులకు అందుబాటులో ఉన్నారని, నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. నీస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్ లోని భారతీయుల కోసం రాయబార కార్యాలయం +33-1-40507070 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిందని ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఈ నంబర్ కు ఫోన్ చేయొచ్చని తెలిపింది. ఉగ్ర దాడిలో కనీసం 80 మంది మృతి చెందగా, వందమందిపైగా గాయపడినట్టు సమాచారం. -
పక్కా స్కెచ్ వేసి 'ట్రక్'తో బీభత్సం
నీస్: ఉగ్రవాదులు ఈసారి రూట్ మార్చారు. ప్రతిసారి ఆత్మాహుతి దాడి, బాంబులు పేల్చి నరమేధం సృష్టించే ఉగ్రవాదులు...ఈసారి ట్రక్తో పెద్ద వ్యూహాన్నే రచించారు. జాతీయ దినోత్సవం సందర్భంగా ట్రక్తో మెరుపు దాడికి దిగి బీభత్సం సృష్టించారు. ఎవరూ ఊహించలేని విధంగా... నిఘా వర్గాలు కూడా పసిగట్టకుండా పథక రచన చేశారు. ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలతో పక్కా ప్లాన్తో ఈ దాడికి తెగబడ్డారు. ట్రక్తో అక్కడున్న ప్రజల్ని ఢీకొట్టి చంపారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొడితే పేలుడు పదార్థాలతో బీభత్సం సృష్టించేందుకు స్కెచ్ వేశారు. ఒకవేళ పేలుళ్లు జరిగే ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకూ 80 మంది దుర్మరణం చెందారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఉగ్రవాదులు వచ్చిన ట్రక్కులో పేలుడు పదార్థాలు, గ్రెనైడ్లు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. దారుణానికి తెగబడిన ట్రక్కు డ్రైవర్ను కాల్చి చంపాయి. అతనిని 31ఏళ్ల ట్యునీషియాకు చెందిన వ్యక్తిగా గుర్తించాయి. వాహనంలో ఉన్న మరో ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్లో దాక్కోగా... అతన్ని కూడా హతమార్చాయి. ఘటనా స్థలంలో మరింతమంది ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నీస్ నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్న సైన్యం... బీచ్రోడ్ను జల్లెడ పడుతోంది. రెస్క్యూటీం సహాయక చర్యలు చేపడుతోంది. సంఘటనా స్థలం నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్టీరోస్ స్పందించారు. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. మరోవైపు నీస్ దాడి జరగగానే అక్కడున్న ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వీధుల్లో పరుగులు తీశారు. కొందరు పక్కనే ఉన్న రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్లో తలదాచుకున్నారు. కాసేపు బయట ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఓ రెస్టారెంట్లో కొందరు వ్యక్తులు భయంతో దాక్కున్నారు. అక్కడి పరిస్థితిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రాణ భయంతో వారంతా వణికిపోతున్న వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. -
నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
నీస్: పారిస్ ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే ఫ్రాన్స్ లో మరోసారి ముష్కరులు మారణహోమానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే సంబరాల్లో నరమేధం సృష్టించారు. పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో పెను విధ్వంసం సృష్టించి 80 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. 100 మందిపైగా క్షతగాత్రులయ్యారు. నీస్ నగరంలో ఉగ్రదాడిని ప్రపంచ దేశాధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. నీస్ దాడి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొన్న అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని తెలిసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుకు ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దాడిని మతిలేని చర్యగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ కు అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. అమెరికా ప్రజల తరపున భయానక ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. నీస్ దాడి నేపథ్యంలో రేపు జరగనున్న విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉగ్రదాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. I hope the injured recover soon. India shares the pain & stands firmly with our French sisters & brothers in this hour of immense sadness. — Narendra Modi (@narendramodi) 15 July 2016 Appalled by the horrific attack in Nice. I strongly condemn such mindless acts of violence. My thoughts are with the families of deceased. — Narendra Modi (@narendramodi) 15 July 2016 I hope the injured recover soon. India shares the pain & stands firmly with our French sisters & brothers in this hour of immense sadness. — Narendra Modi (@narendramodi) 15 July 2016 -
ఫ్రాన్స్లో మరో ఉగ్రదాడి: 84 మంది మృతి
ఫ్రాన్స్: ఫ్రాన్స్లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 84 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 18మంది పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపారు. ట్రక్కులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. ఫ్రాన్స్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. క్షతగాత్రులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిచాయి. మృతులకు ఒబామా సంతాపం తెలిపారు. -
అష్టకష్టాలు
♦ జమ్మూ చేరుకున్న అమర్నాథ్ యూత్రికులు ♦ యాత్రికుల బస్సులపై ఉగ్రమూకల దాడి ♦ రెండు బస్సుల అద్దాలు ధ్వంసం అరచేతిలో ప్రయూణికుల ప్రాణాలు ♦ గుక్కెడు మంచినీరిచ్చే దిక్కులేదు.. చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ♦ పరామర్శలకే పరిమితమైన అధికారులు ♦ సైనికుడి సహకారంతో ఢిల్లీకి వచ్చే ప్రయత్నం తినడానికి తిండిలేదు.. తాగేందుకు గుక్కెడు నీరిచ్చే దిక్కులేదు.. అవసరానికి చేతిలో చిల్లి గవ్వలేదు.. ఆదుకుంటామన్న అధికారులు అడ్రస్ లేరు. ప్రకాశం జిల్లాకు చెందిన అమర్నాథ్ యూత్రికులు అర్ధరాత్రి ప్రయూణాల్లో ఉగ్రమూకలను దాటుకుని ఇళ్లకు చేరేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మూడు బస్సుల్లో జమ్మూకు బయల్దేరిన యూత్రికులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం 6.45 గంటలకు జమ్మూ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. జిల్లాకు చెందిన సైనికుడు సురేష్బాబు ఆర్థిక సాయంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో జమ్మూ నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాకు చెందిన ఒంగోలు, అమ్మనబ్రోలు, చీరాల, కందుకూరు, సింగరాయకొండ ప్రాంతాలకు చెందిన 118 మంది యాత్రికులున్నారు. 6వ తేదీ సాయంత్రం నుంచి అమర్నాథ్ 14 కి.మీ. దూరంలోని బల్తాల్లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు వీరిని ఆదివారం రాత్రి 1 గంటల ప్రాంతంలో సైన్యం వారు వచ్చిన మూడు బస్సుల్లో 118 మంది అమర్నాథ్ యాత్రికులను జమ్మూకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. మూడు బస్సుల్లో యాత్రికులు వస్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో దారికి అడ్డంగా వచ్చిన ఉగ్రమూకలు అత్యధిక వెలుగునిచ్చే టార్చ్లైట్లు వేసి రోడ్డుకు అడ్డంగా వచ్చిన బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సులపై రాళ్లతో దాడి చేశారు. రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును వేగంగా నడుపుకుంటూ వెళ్లడంతో పెనుప్రమాదమే తప్పింది.ఆ తర్వాత సోమవారం సాయంత్రం 6.45గంటల ప్రాంతంలో మూడు బస్సులు జమ్మూ రైల్వేస్టేషన్కు చేరుకున్నాయి. డబ్బు కోసం బస్సు ఓనర్ల పేచీ.. కర్ఫ్యూ నేపథ్యంలో యాత్రికులు తీసుకె ళ్లిన బస్సులు నాలుగు రోజుల పాటు అదనంగా ఉండాల్సి రావడంతో అదనపు మొత్తాన్ని చెల్లించాలని బస్సుల యజమానులు యాత్రికులపై ఒత్తిడి తెచ్చారు. లేకుంటే స్వస్థలాలకు వెళ్లనివ్వబోమంటూ జమ్మూ రైల్వేస్టేషన్ వద్ద పేచి పెట్టారు. దీంతో యాత్రికులు, బస్సుల ఓనర్ల మధ్య గొడవైంది. బస్సులు మాట్లాడిన కాంట్రాక్టర్ ఏం మాట్లాడకుండా చేతులెత్తేశారు. దీంతో యాత్రికులు అటు ఏపీ భవన్ అధికారులకు తెలిపిన వారు స్పందించలేదు. సైనికుడి సాయంతో స్వస్థలాలకు.. ఒంగోలుకు చెందిన సైనికుడు సురేష్ జమ్మూలో పని చేస్తున్నాడు. జిల్లాకు చెందిన యాత్రికులకు సురేష్ అండగా నిలిచారు. నాలుగు రోజుల పాటు పలువురు యాత్రికులకు బిస్కెట్లు, మంచినీరు సరఫరా చేసిన సురేష్ ఆర్థిక సాయం సైతం చేసి జిల్లా వారు స్వస్థలాలకు తరలివెళ్లేందుకు తన వంతు సహకారం అందించారు. జమ్మూ రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు 118 మంది యాత్రికులకు రైల్వే టికెట్లకు అవసరమైన మొత్తాన్ని సురేష్ సమకూర్చినట్లు హైదరాబాద్కు చెందిన యాత్రికుడు పూర్ణచంద్రరావు సాక్షికి వివరించారు. యాత్రికుడు పొదిలి శ్రీనివాసరావుకు పరిచయం ఉన్న సైనికుడు సురేష్ యాత్రికులకు సహాయ సహకారాలు అందించడంతోనే స్వస్థలాలకు చేరుకునే అవకాశం వచ్చిందని పలువురు యాత్రికులు ‘సాక్షి’కి చెప్పారు. స్పందించని అధికారులు.. అమర్నాథ్లో చిక్కుకున్న జిల్లాకు చెందిన యాత్రికులను స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అధికారులతో పాటు అటు ఏపీ భవన్ అధికారి శ్రీకాంత్ సైతం చెప్పారు. అయితే ఒకటి, రెండు సార్లు ‘ఆర్ యు సేఫ్’ అంటూ యాత్రికులను ప్రశ్నించడం మినహా ఏపీ భవన్ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వారు ఇబ్బం దులు పడుతున్నా స్పందించిన పాపానపోలేదు. ఒంగోలు ఆర్డీవో సైతం ‘అంతా క్షేమంగా ఉన్నారా... అంటూ’ యాత్రికులను పలకరించటం మినహా వారిని జిల్లాకు సురక్షితంగా చేర్చే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ‘మీతో కలెక్టర్ మాట్లాడతారు’ అని ఆర్డీవో యాత్రికులకు చెప్పిన ఆ తర్వాత కలెక్టర్ తమతో మాట్లాడలేదని పలువురు సాక్షికి తెలిపారు. తమ వద్ద పైసా డబ్బులు లేవని, కనీసం స్వస్థలాలకు ఎలా చేరుకుంటారన్న విషయం కూడా అధికారులు ఆరా తీయలేదని బాధితులు వాపోయారు. -
ఉగ్ర కదలికలపై మరింత దృష్టి పెట్టండి
- కేంద్ర హోంమంత్రితో భేటీలో దత్తాత్రేయ విజ్ఞప్తి - ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసులను రాజ్నాథ్ అభినందించారని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏ మూల ఉగ్ర దాడులు జరిగినా హైదరాబాద్లో ఒక్క ఉగ్రవాదైనా పట్టుబడుతున్నాడని, అందువల్ల వారి కదలికలపై మరింత దృష్టి పెట్టాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో రాజ్నాథ్తో సమావేశమైన దత్తాత్రేయ హైదరాబాద్లో ఐసిస్ కార్యకలాపాలు, హైకోర్టు న్యాయవాదుల నిరసనలపై చర్చించారు. హైదరాబాద్లో విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రను ఛేదించిన ఎన్ఐఏతోపాటు తెలంగాణ పోలీసుల పనితీరును రాజ్నాథ్ అభినందించారని దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో న్యాయవాదుల ఆందోళనలపై జోక్యం చేసుకోవాలని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. గవర్నర్తో చర్చించి సమస్య పరిష్కరించుకునేలా చూడాలని కోరగా అం దుకు రాజ్నాథ్ సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్లో దాడులు జరగనివ్వకుండా సకాలంలో ఉగ్రవాదులను పట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భవి ష్యత్తులో ఇస్తాంబుల్ వంటి దాడులు హైదరాబాద్లో జరగకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరగాలని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారన్నారు. కాగా, న్యాయవాదుల ఆందోళనలు, సబార్డినేట్ జడ్జిల సస్పెన్షన్పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడతో దత్తాత్రేయ చర్చించారు. ఈ అంశాలను సత్వరమే కొలిక్కి తెస్తామని సదానంద హామీ ఇచ్చారు. -
టర్కీలో నరమేధం
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి 41 మంది మృతి ఇస్తాంబుల్: టర్కీలోని ప్రముఖ పర్యాటక నగరం ఇస్తాంబుల్లో గల అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పది గంటలకు తుపాకులు, బాంబులతో విచక్షణారహితంగా విరుచుకుపడి మారణహోమానికి తెగబడ్డారు. ఈ ఉన్మాదానికి 41 మంది అమాయక ప్రజలు బలయ్యారు. మరో 239 మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థేనని టర్కీ ప్రభుత్వం పేర్కొంది. మృతుల్లో 23మంది టర్కీ పౌరులు కాగా.. 13 మంది విదేశీ జాతీయులు ఉన్నారు. వారిలో పలువురు సౌదీ పౌరులతో పాటు చైనా, ట్యునీసియా, ఉక్రెయిన్ దేశస్తులు ఒక్కొక్కరు ఉన్నారు. టర్కీలో అతిపెద్దదే కాదు, యూరప్లో అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాల్లో మూడోది, ప్రపంచ స్థాయిలో 11వ స్థానంలో ఉన్న అటాటర్క్ విమానాశ్రయానికి ముగ్గ్గురు ఆత్మాహుతి బాంబర్లు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ట్యాక్సీలో చేరుకుని ఈ మారణహోమానికి తెరతీశారు. వారిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో ముగ్గురూ తమను తాము పేల్చేసుకున్నారని ప్రభుత్వం చెప్తోంది. అయితే.. ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుంది కచ్చితంగా ఎక్కడన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఎవరూ ప్రవేశమార్గం దగ్గర భద్రతా తనిఖీల ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లలేదని.. ఇద్దరు ముష్కరులు అంతర్జాతీయ ఆగమనాల ప్రాంతంలో, మరొక ఉగ్రవాది పార్కింగ్ ప్రదేశంలో పేల్చేసుకున్నారని ఒక అధికారి చెప్పారు. అయితే.. ఒక ఉగ్రవాది టెర్మినల్ వెలుపల పేల్చేసుకున్నాడని, ఇద్దరు ఉగ్రవాదులు ఎక్స్రే మిషన్ల సమీపంలో కాల్పులు జరిపారని హాబర్టర్క్ వార్తా పత్రిక తెలిపింది. ప్రాణభయంతో పారిపోతున్న ప్రయాణికులతో కలిసి పరిగెడుతున్న ఒక ఉగ్రవాదిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో అతడు వెలుపలికి వెళ్లే ద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడని, మూడో ఉగ్రవాది ఒక అంతస్తు ఎక్కి అంతర్జాతీయ నిష్ర్కమణల ప్రాంతం వరకూ వెళ్లగా పోలీసులు కాల్పులు జరపటంతో తనను తాను పేల్చివేసుకున్నాడని పేర్కొంది. విమానాశ్రయ నిఘా వీడియో దృశ్యాలను సామాజిక వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఒక వీడియోలో మరొక ఉగ్రవాది పోలీసుల కాల్పులకు నేలకొరిగి తనను తాను పేల్చేసుకోవటం కనిపించింది. అలాగే ఒక ఉగ్రవాది ఏకే47 తుపాకులతో పరుగెడుతూ కాల్పులు జరపటమూ మరొక వీడియోలో కనిపించింది. దాడి జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసేసి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. ముష్కరుల దాడులతో భీతిల్లి పరుగులు తీసిన ప్రయాణికులు విమానాశ్రయం వెలుపల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కన్నీళ్లతో కాలం గడిపారు. బుధవారం ఉదయానికి విమానాశ్రయాన్ని శుభ్రంచేసి మళ్లీ తెరిచారు. ఈ దాడికి పాల్పడింది ఐసిస్ ఉగ్రవాద సంస్థ అని అంచనాలు చెప్తున్నట్లు ప్రధానమంత్రి బినాలి యిల్దిరిమ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచం సమైక్యం కావాలని అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చారు. అయితే.. దాడి చేసింది తామేనని ఆ సంస్థ ప్రకటించలేదు. ఏదో ప్రవక్తలా నడుస్తూ కాల్చేశాడు... ‘నేను నా లగేజీని పెడుతున్నాను. అంతలో ఒక వ్యక్తి రహస్యంగా దాచిన తుపాకీ బయటకు తీయటం చూశాను. అతడు వెంటనే కాల్పులు జరపటం మొదలు పెట్టాడు. రెండు సార్లు కాల్పులు జరిపాడు. చాలా మామూలుగా జనాన్ని కాల్చివేస్తున్నాడు.. ఏదో ప్రవక్త లాగా నడుస్తూ కాల్చివేస్తున్నాడు’ అని ఓట్ఫా మొహమద్ అబ్దుల్లా అనే మహిళ ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు. అమానవీయం: రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ: ఈ దాడి అమానవీయం అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలసి పోరాడాలన్నారు. మృతుల్లో భారతీయులు లేరని ప్రభుత్వం తెలిపింది. టర్కీలో ఏడాదిగా ఉగ్రవాద రక్తపాతం... పశ్చిమాసియా అస్థిరత టర్కీనీకబళిస్తోంది. ప్రభుత్వంతో పోరాడుతున్న కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స్ ఉగ్రవాదులు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ గత ఏడాది కాలంగా రక్తపాతం సృష్టిస్తున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ఉగ్రవాదులు దాదాపు 14 భారీ దాడులకు పాల్పడి 200 మందికి పైగా సామాన్య ప్రజల ప్రాణాలను హరించాయి. గత ఏడాది అక్టోబర్లో అంకారాలో ఐసిస్ జరిపిన దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియా తిరుగుబాటుదారులకు మద్దతిచ్చి... ముస్లిం ప్రజాస్వామ్య దేశమైన టర్కీకి ఈ ప్రాంతంలో విశిష్ట స్థానముంది. పొరుగు ముస్లిం దేశాలకు సాయం చేయటం ద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపుతుంటుంది. సిరియాలో ఐసిస్పై పోరాటంలో నాటో దళాలతో కలసి పనిచేస్తోంది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం చెలరేగినపుడు.. ఆ దేశాధ్యక్షుడు అసద్ను పదవీచ్యుతుడ్ని చేయటానికి మద్దతిస్తూ సిరియా రెబల్స్కు సాయం చేసింది.సిరియాలో ఐసిస్తో పోరాడుతున్న కుర్దు రెబల్స్కు అమెరికా మద్దతివ్వడంపై టర్కీ ఆగ్రహంగా ఉంది. టర్కీ ఆదాయ వనరుల్లో పర్యాటకం కీలకమైనంది. దేశంలో పర్యాటకానికి ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు ప్రవేశద్వారం లాంటిది. ఈ ఏడాది పర్యాటక సీజన్ ఇప్పుడే మొదలైంది. దీంతో పర్యాటక రంగాన్ని దెబ్బతీసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చేందుకుఐసిస్ ఇస్తాంబుల్ ఎయిర్పోర్టుపై దాడి చేసుంటుందని భావిస్తున్నారు. అంతకుముందే బయల్దేరా: హృతిక్ ముంబై: ఈ దాడి నుంచి బాలీవుడ్ నటుడు హృతిక్రోషన్ త్రుటిలో బయటపడ్డారు. దాడికి కొద్ది గంటలముందు అక్కడి నుంచి వేరే విమానంలోవెళ్లారు. ‘నేను ఇస్తాంబుల్లో విమానం మారాల్సి ఉంది. కానీ సమయానికి చేరుకోలేకపోయాను. తర్వాతి విమానం మరుసట్రోజు ఉండటంతో ఎయిర్పోర్టులోనే ఉండాల్సివచ్చేది. అక్కడి సిబ్బంది సాయం చేశారు. టికెట్ తీసుకుని కొన్నిగంటల ముందుబయల్దేరాను. దిగ్భ్రాంతికరమైన వార్త’ అని ట్వీట్ చేశారు. హృతిక్ తన కుమారులిద్దరితో మాడ్రిడ్ నుంచి ఆఫ్రికాకు వెళ్తూ ఇస్తాంబుల్లో ఆగారు. -
హైదరాబాద్- టర్కీ విమాన సర్వీసుల రద్దు
హైదరాబాద్: ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మేరకు విమాన సర్వీసులను రద్దుచేసినట్లు అధికారలులు తెలిపారు. కాగా, విమానాలు రద్దుకావడంతో టర్కీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు పాతబస్తీలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న పది మంది పట్టుబడిన నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్, రాక్సా, ఎయిర్పోర్టు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలో తనిఖీలను ముమ్మరం చేశారు. -
ప్రయాణికుల్ని పిట్టల్లా కాల్చి.. పేల్చేసుకున్నారు
ఇస్తాంబుల్: ఆసియా- యూరప్ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడి 36 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరణాల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడుల్లో మరో 150 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్నేషనల్ టెర్మినలే లక్ష్యంగా మంగళవారం రాత్రి 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఎయిర్ పోర్టు లోపల మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) బుల్లెట్ల వర్షం.. ఆపై మెరుపు లాంటి పేలుడు భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చిచంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తోన్న వందల మంది ప్రయాణికులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్ వాతావరణం పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది. ఏరులైపారిన రక్తం, బుల్లెట్లు, ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహంగా మారిపోయింది. ఆత్మాహుతికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయినట్లు తెలిసింది. కాగా, దాడులకు పాల్పడింది ఐఎస్ అనుబంధ దేశీయ సంస్థే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. దేశాధినేతల అత్యవసర సమావేశం.. అంతర్జాతీయ సహకారానికి పిలుపు ప్రపంచంలో అత్యంత రద్దీ పర్యాటక నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డొగాన్ ఖండించారు. దాడి సమాచారం తెలియగానే ప్రధానమంత్రి బినాలి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన తైపీ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు టర్కీకి సహకరించాల్సిందిగా కోరారు. విదేశీ టూరిస్టులే లక్ష్యంగా ఇటీవల టర్కీలో మరీ ప్రధానంగా ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో గత డిసెంబర్ లో జరిగిన పేలుడులో ఇద్దరికి గాయాలైన సంగతి తెలిసిందే. -
ఏకే 47 బుల్లెట్లు దిగినా..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇద్దరు పోలీసులను నడి రోడ్డుపైనే కాల్చి చంపిన ఉగ్రవాదులు ఓ వీడియోకి చిక్కారు. వారి చేతుల్లో ఆ సమయంలో ఏకే 47 గన్ లతో వీడియోల్లో కనిపించారు. పేలుళ్ల చప్పుళ్లు వినిపించగానే పరుగులు పెట్టినట్లు ఈ వీడియోలో రికార్డయింది. గత శనివారం అనంతనాగ్ జిల్లాలోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న పోలీసులపై సాయుధులుగా వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఆ ఘటనను ఓ పాదచారి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం ఓ ఉగ్రవాది బ్లూ షర్ట్ తో భుజాన పెద్ద బ్యాగు వేసుకొని చేతిలో ఏకే 47 గన్ తో ఉండగా మరో ఉగ్రవాది బ్లాక్ పాయింట్.. తిక్ బ్లూ షర్ట్ ఏకే47 గన్ తో కనిపించాడు. తొలుత కాల్పులు జరిపిన వారిద్దరు కిందపడిన పోలీసు అధికారి దగ్గరకు వెళ్లి అతడి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించినా అతడు ప్రతిఘటించాడు. ఈ లోగా పోలీసుల కాల్పుల చప్పుళ్లు వినిపించడంతో వారు పారిపోతూ కనిపించారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరిని జునాయిడ్ లష్కరే తోయిబాకు చెందిన జునాయిడ్ మతూగా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని గుర్తించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా ఈ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించగా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్గా గుర్తించారు. -
ఆ విమానాన్ని ఉగ్రవాదులే కూల్చారా?
వాషింగ్టన్: భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం మధ్యదరా సముద్రంలో ఈజిప్ట ఎయిర్ విమానం కూలిపోవడానికి ఉగ్రవాదులే కారణమని యూఎస్ అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ అన్నారు. విమానం కూలిపోవడానికి గల కారణాలను ప్రధాన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇంకా అన్వేషించక ముందే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. మొత్తం 66 మంది ప్రయాణీకులతో పారిస్ నుంచి కైరోకు బయల్దేరిన ఈజిప్టు ఎయిర్ కు చెందిన ఏ320 కూలిపోయినట్లు తొలుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ ప్రకటించారు. ఇది ఉగ్రదాడి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ట్రంప్ ఇది టెర్రరిస్ట్ ల పనేనని అభిప్రాయపడ్డారు. విమానం ఆచూకీ కనిపించకుండా పోయిన కొన్ని గంటల తర్వాత ఓ గ్రీకు నౌక శకలాలు గమనించడంతో కూలిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం కన్నా టెర్రరిస్టు దాడిగానే కనిపిస్తోందని ఈజిప్టు విమానయాన శాఖ మంత్రి పేర్కొన్నారు. -
మసూద్పై మళ్లీ రెడ్కార్నర్
పఠాన్కోట్ కేసులో ఎన్ఐఏ సాక్ష్యాల ఆధారంగా ఇంటర్పోల్ జారీ న్యూఢిల్లీ: పఠాన్కోట్లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి నిషిద్ధ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్పై ఇంటర్పోల్ మంగళవారం తాజా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈదాడికి మసూద్, రవూఫ్లు కుట్రపన్నారన్న ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు పొందిన నేపథ్యంలో ఈ తాజా నోటీసును జారీ చేశారు. నాటి ఉగ్ర దాడిలో దాదాపు 80 గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మసూద్, రవూఫ్లపై ఇంతకుముందు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ల విషయంలో పాక్ స్పందించలేదు. దీంతో తాజా రెడ్ కార్నర్ నోటీసులను లాంఛనంగానే పరిగణిస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న అజహర్పై.. భారత పార్లమెంటుపై, జమ్మూకశ్మీర్ శాసనసభపై దాడికుట్ర ఆరోపణల్లో గతంలో రెడ్కార్నర్ నోటీసులు ఉన్నాయి. రవూఫ్పై 1999లో విమానం హైజాక్కు సంబంధించి అదే తరహా వారెంట్ పెండింగ్లో ఉంది. ఉగ్రవాదులకు, జైషే నేతలైన జాన్, లతీఫ్లకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు, ఆ దాడి తమ పనేనంటూ రవూఫ్ పేర్కొన్న వీడియో దృశ్యాలను ఎన్ఐఏ సమర్పించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు నేతృత్వం వహించిన కాషిఫ్, షాహిద్ లతీఫ్ పైనా రెడ్ కార్నర్ నోటీసులను ఎన్ఐఏ కోరింది. 2010లోనే లతీఫ్విడుదల న్యూఢిల్లీ: పఠాన్కోట్పై దాడి చేసిన ఉగ్రవాదులు భారత్లో ఎలా చొరబడ్డారన్న దానిపై దర్యాప్తు అధికారులు సమాచారాన్ని వెలికితీశారు. ఆదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మద్దతు అందించిన జైషే నేత షాహిద్ లతీఫ్(47)ను 2010లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం విడుదల చేసింది. పాక్కుచెందిన లతీఫ్.. 1996లో జమ్మూలో అరెస్టయ్యాడు. పాక్తో సంబంధాలను మెరుగుపరచుకునే చర్యల్లో భాగంగా లతీఫ్ను, మరో 20 మంది పాక్ ఉగ్రవాదులను ఆరేళ్ల కిందట నాటి యూపీఏ ప్రభుత్వం విడుదల చేసింది. -
'ఉగ్రవాదులు ఎలా వచ్చారో అర్థంకాలేదు'
న్యూఢిల్లీ: గణతంత్ర్యవేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయినప్పటికీ ఆయుధాలు చేతపట్టుకున్న ఉగ్రవాదులు పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డారు. జనవరి 2న చోటుచేసుకున్న నాటి ఘటనతోపాటు దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితులపై అధ్యయనం చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. తన నివేదికను పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య మంగళవారం ఢిల్లీలో మాట్లాడారు. 'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చుట్టూ ఉన్న రక్షణ కంచె బలంగా లేదు. భద్రతా చర్యలు బలహీనంగా ఉన్నాయి' అని భట్టాచార్య అన్నారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కూడా ఉగ్రవాదులు లోపలికి ఎలా వచ్చారో అర్థంకాలేదని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుందన్న కమిటీ.. తీవ్ర చర్యలు చేపడితేతప్ప పరిస్థితిలో మార్పురాబోదని ప్రభుత్వానికి సూచించింది. -
పాకిస్తాన్ వెళ్లనున్న ఎన్ఐఏ బృందం
న్యూఢిల్లీ: పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం త్వరలో పాకిస్తాన్లో పర్యటించనుంది. ఎన్ఐఏ బృందం పాక్ పర్యటన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్ఐఏ డెరైక్టర్ జనరల్ శరద్కుమార్ శుక్రవారం తెలిపారు. పఠాన్కోట్ దర్యాప్తు కోసం ఐదు రోజుల క్రితం భారత్కు వచ్చిన పాక్ బృందం శుక్రవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. కాగా, జేఐటీ దర్యాప్తు సమయంలో పాక్ అధికారులతో ఎన్ఐఏ చర్చలు జరిపింది. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృందాన్ని పాకిస్తాన్కు పంపాలని భావిస్తున్నట్లు చెప్పగా.. దానికి పాక్ సానుకూలంగా స్పందించినట్టు శరద్కుమార్ తెలిపారు. పఠాన్కోట్ దాడికి కుట్ర వెనుక జైషే మహమ్మద్ ఉందనేందుకు కీలక ఆధారాలను జేఐటీకి సమర్పించినట్లు పేర్కొన్నారు. -
పఠాన్కోట్లో పాక్ బృందం
పఠాన్కోట్: ఐదుగురు సభ్యుల పాకిస్తాన్ సంయుక్త విచారణ బృందం(జేఐటీ) ఉగ్రదాడి జరిగిన పఠాన్కోట్ ఎయిర్బేస్ను మంగళవారం పరిశీలించింది. ఉదయం ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీ నుంచి అమృత్సర్కు చేరుకున్న బృందాన్ని రోడ్డు మార్గంలో పఠాన్కోట్ తీసుకెళ్లారు. ఉగ్రదాడి జరగొచ్చన్న సమాచారంతో ఆరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో పోలీసు కమెండోల రక్షణ మధ్య పాక్ బృందం పఠాన్కోట్ పర్యటన సాగింది. ప్రత్యేక విమానంలో తీసుకెళ్లాలని నిర్ణయించినా రక్షణ శాఖ అనుమతి నిరాకరణతో రోడ్డు మార్గంలోనే తీసుకెళ్లారు. అప్పర్ దోబా కాల్వ వద్దే కాన్వాయ్ నిలిపివేసి అక్కడి నుంచి మినీ బస్సులో బృందం ఎయిర్బేస్లోకి వెళ్లింది. ఉగ్రవాదులు దాడిచేసిన ప్రాంతం, భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఐజీ సంజీవ్సింగ్ నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం చూపించింది. విచారణ బృందానికి కనిపించకుండా ఎయిర్బేస్లోని చాలా ప్రాంతాన్ని తెరలతో కప్పిఉంచారు. ఎస్పీ సల్వీందర్ సింగ్, అతని స్నేహితుడు రాజేష్ వర్మ, వంటమనిషి కిడ్నాపైన కొలియాన్ గ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం సల్వీందర్, వంటమనిషినివదిలిపెట్టినగుల్పుర్ గ్రామంతో పాటు రాజేష్ గాయాలతో కనిపించిన తాజ్పూర్ గ్రామాన్ని కూడా జేఐటీకి చూపించారు. పఠాన్కోట్లోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రవేశించినట్లు భావిస్తున్న ఊంజా నది ప్రాంతాన్ని కూడా పాక్ బృందం పరిశీలించింది. ఈ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు ఎయిర్బేస్ ముందు ధర్నా నిర్వహించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పర్యటనను శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తప్పుపడుతూ... ఉగ్రదాడిపై విచారణకు భారత్ బృందాన్ని పాక్కు పంపాలన్నారు. -
'మోదీ పాకిస్థాన్ ముందు సాగిలపడ్డారు'
న్యూఢిల్లీ: పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై విచారణ జరిపేందుకు పాకిస్థాన్కు చెందిన ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం రాకను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పాక్ విచారణ బృందం తక్షణమే స్వదేశానికి వెళ్లిపోవాలని ప్లకార్డులు, బ్యానర్లతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించింది. తమ పార్టీ కార్యకర్తల చర్యలను సమర్థిస్తూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు సాగాలపడ్డారు. ఐఎస్ఐ అధికారులను విచారణకు ఆహ్వానించడంద్వారా ఆ దేశానికి పూర్తిగా లొంగిపోయారు'అని కేజ్రీవాల్ అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ(ఐఎస్ఐ) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, పఠాన్ కోట్ ఉగ్రదాడి కూడా ఆ సంస్థ కనుసన్నల్లో జరిగిందేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాంటి ఐఎస్ఐకి చెందినవారిని విచారణ పేరుతో దేశంలోకి, అది కూడా కీలకమైన ఎయిర్ బేస్ లోకి అనుమతించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆదివారం పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి పాకిస్థాన్ హై కమిషన్, ఎన్ఐఏ అధికారులు స్వాగతం పలికారు. పాక్లోని పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహ్మద్ తాహిర్ రాయ్ నేతృత్వంలో హాజరైన ఐదుగురు సభ్యుల బృందంలో లాహోర్లోని ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మొహ్మద్ హర్షద్ అజీమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మిర్జా, గుజరాన్వాలా సీటీడీ దర్యాప్తు అధికారి షాహీద్ తన్వీర్ ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్న అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలు కొందరు ఫ్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన నిర్వహించారు. దీంతో సభ కొద్దిసేపు నిలిచిపోయింది. పాక్ బృందం సోమవారం ఉదయం ఎన్ఐఏ కేంద్రకార్యాలయాన్ని సందర్శించింది. మంగళవారం నాడు పఠాన్కోట్లో పర్యటించనున్నది. పొరుగుదేశం నుంచి ఒక దర్యాప్తు బృందం ఉగ్రదాడి ఘటనపై భారత్లో దర్యాప్తు జరుపడం ఇదే తొలిసారి. పాక్ కేంద్రంగా పనిచేసే జైష్ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ జనవరి రెండున గుజరాత్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలుకోల్పాయారు. కౌంటర్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. -
మళ్లీ ఉగ్ర మూకల దాడి
బెల్జియం రాజధానిగా మాత్రమే కాదు...యూరప్ యూనియన్ ప్రధాన కార్య క్షేత్రంగా ఉన్న బ్రస్సెల్స్పై ఉగ్రవాదం పంజా విసిరింది. నగరంలోని అంతర్జా తీయ విమానాశ్రయం, సబ్వే మెట్రో స్టేషన్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చి పోయి పేలుళ్లకు పాల్పడి 34మందిని పొట్టనబెట్టుకున్నారు. 270మందిని గాయ పరిచారు. నిత్యం రెప్పవాల్చని నిఘా ఉంటుందనుకున్నచోటే ఇంతటి కిరాతకానికి పాల్పడటం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఏమైనా చేయగలమని ఉగ్రవాదులు నిరూపించదల్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలకు సంబంధించి 24 గంటలు గడవకుండానే పేలుళ్ల కారకులుగా భావిస్తున్న ఇద్దరు మానవబాంబులను గుర్తించ డంతోపాటు మరొకడి కోసం గాలిస్తున్నారు. మానవబాంబులుగా మారి తమను తాము పేల్చుకున్న ఉగ్రవాదులిద్దరూ సోదరులని, వీరు పారిస్ పేలుళ్ల ఉదంతంలో ప్రధాన అనుమానితులని చెబుతున్నారు. విమానాశ్రయంలో జరిగిన రెండు పేలు ళ్లకూ మానవబాంబులే కారణమని తేల్చగా మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడు ఎలాంటిదో ఇంకా నిర్ధారణ కాలేదు. అంతవరకూ నవ్వుతూ, ఆత్మీయులతో సర దాగా గడుపుతూ ఉన్న మనుషులు ఒక్క క్షణంలో మాంస ఖండాలుగా మారి చెల్లా చెదురుగా పడిపోవడమంటే ఊహకందని విషాదం. నాలుగు నెలలక్రితం పారిస్లో 130మంది ఉసురుతీసిన ముష్కరులే తప్పించుకుపోయి ఈ ఉన్మాదానికి పాల్ప డ్డారని వస్తున్న వార్తలు దిగ్భ్రాంతికరమైనవి. ఆ పేలుళ్లకు సంబంధించి ఒక ప్రధాన అనుమానితుణ్ణి బ్రస్సెల్స్లో అదుపులోకి తీసుకుని నాలుగురోజులు కావస్తుండగా ఈ దాడులు జరిగాయంటే నిఘా విభాగం సరిగా పనిచేయలేక పోయిందని అర్ధం. ఇలాంటి ఉదంతాలు సమాజాన్ని మొద్దుబారుస్తాయి. సాధారణ పౌరులు సైతం విచక్షణాశక్తిని కోల్పోయేలా చేస్తాయి. మానవ సహజాతాలైన ప్రేమ, కరుణవంటి భావనలు కొడిగట్టడం మొదలవుతుంది. భయాందోళనలు ఆవరించి ఉన్నచోట హేతుబద్ధత కరువవుతుంది. ఉన్మాద ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో, దేశంలో ఇవి తప్పనిసరి పరిణామాలు. అపరిచితులను అనుమానిం చడం మాట అటుంచి...నిన్నటివరకూ తెలిసినవారే అయినా ఆ ఉగ్రవాదులు అనుసరిస్తున్నామని చెబుతున్న మతానికే చెందినవారన్న కారణంతో తెలియని శత్రుత్వాన్ని పెంచుకునే ధోరణులు ప్రబలుతాయి. ఇలాంటి దాడులకు పాల్పడే ఉగ్రవాదులు కోరుకునేది కూడా అదే. చీలిన సమాజాలు వారికి ప్రాణధాతువుల వుతాయి. అలాంటిచోట విద్వేషాలు నూరిపోయడం, ఎదుటి వర్గంపై అనుమా నాలు రేకెత్తించడం, పరస్పరం కలహించుకునే వాతావరణాన్ని సృష్టించడం చాలా తేలికవుతుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టడం వల్లనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ పారిస్ దాడులు జరిగిన సమయంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లా డారు. ఉగ్రవాదంపై జరిపే ఈ యుద్ధంలో అతిగా స్పందించి అకారణ దాడులకు పాల్పడవద్దని హితవు చెప్పారు. యూదులనో, ముస్లింలనో లక్ష్యంగా చేసుకుని బలప్రయోగానికి దిగితే మనకూ, ఉగ్రవాదులకూ తేడా ఉండదని హెచ్చరించారు. జాతీయవాదం ముసుగులో కొన్ని గ్రూపులు అప్పటికే రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, ఒకటి రెండుచోట్ల అనుచిత ఘటనలు చోటుచేసుకున్నా ఫ్రాన్స్ మొత్తం ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. తమ గడ్డపైనే పుట్టి పెరిగి ఉగ్రవాదుల ప్రభావంలోకి వెళ్తున్నవారు ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచానికి పెద్ద బెడదగా మారారు. యాంత్రిక జీవనం, కొరవ డుతున్న సామాజిక సంబంధాలు, నిరుద్యోగం, భవిష్యత్తును గురించిన బెంగ వంటివి ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కావడానికి తోడ్పడుతున్నాయని మనో విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఇరాక్, సిరియా, లిబియా, సోమాలియా తదితర దేశాల్లో అమెరికా, యూరప్ దేశాలు సాగిస్తున్న నరమేథం అల్కాయిదా, ఐఎస్లాంటి ఉగ్రవాద మూకలకు పశ్చిమాసియాలో ఊపిరి పోస్తున్నాయి. మరోపక్క ఉన్న వనరులన్నిటినీ ఈ నిరర్ధక యుద్ధానికే ఖర్చుచేసే స్థితి ఉండటంవల్ల అభివృద్ధిపై పూర్తిగా కేంద్రీకరించే అవకాశం యూరప్ దేశాలకు కలగటం లేదు. రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన ఉత్పాతాలను చూశాక మానవాళి మరోసారి అలాంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకోకూడదన్న మహదాశయంతో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలివంటి అంతర్జాతీయ వేదికలు ఏర్పడ్డాయి. దేశాలమధ్య ఏర్పడే ఎంతటి క్లిష్ట సమస్యలైనా ఈ వేదికలపైనే పరి ష్కారం కావాలని భావించారు. కానీ అగ్రరాజ్యాలు తమ వెనకటి గుణాన్ని విడనా డలేదు. ఫలితంగానే ఉగ్రవాదం వేళ్లూనుకుంటోంది. బెల్జియంలో ఉగ్రవాద ఉదంతాలు తక్కువే. 2014లో తొలిసారి బ్రస్సెల్స్లో ఒక యూదు మ్యూజియంపై ఉగ్రదాడి జరిగింది. నిరుడు మరొక దాడిని పోలీ సులు ముందుగా పసిగట్టి నివారించగలిగారు. అయితే ఉగ్రవాదులకు చెందిన స్లీపర్ సెల్స్ అక్కడ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని చాన్నాళ్లనుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఈ సెల్స్ ఏ క్షణంలోనైనా దాడులకు తెగబడవచ్చునన్న సూచ నలూ వెలువడ్డాయి. బెల్జియంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం పాశ్చాత్య దేశాలకు పెద్ద తలనొప్పిగానే మారింది. 2012లో బెల్జియం పౌరుడొకరు తొలిసారి ఉగ్రవాదుల్లో చేరడం కోసం సిరియా వెళ్లాడు. అలాంటివారి సంఖ్య ఇప్పుడు 450కి చేరుకుంది. వారిలో దాదాపు 120మంది స్వస్థలానికి తిరిగొచ్చారు. అందులో ఎందరు నిరాశానిస్పృహలకు లోనైనవారో, ఎందరు తమ గడ్డపైనే ఉగ్రవాద కార్య కలాపాలు సాగించడానికి వచ్చారో తెలుసుకునేందుకు అనువైన వ్యవస్థ బెల్జియం లో సరిగా లేదని నిపుణులు చెబుతున్నారు. బెల్జియంలో భద్రతా విభాగం సిబ్బంది సంఖ్య 600కు మించదని, నిఘా విభాగంలో సైతం వెయ్యిమందికి మించి అధికా రులుండరని గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యాలయం, దానికి సంబంధించిన అనుబంధ కార్యాలయాలు, నాటో ప్రధాన కార్యాలయం ఉన్నచోట భద్రత ఇంత బలహీనంగా ఉండటాన్ని నిపుణులు తప్పుబడతారు. అయితే గట్టి భద్రత దానంతటదే సురక్షితమైన సమాజానికి హామీ ఇవ్వలేదు. పౌరులందరికీ మెరుగైన అవకాశాలు సాధించే ప్రజాస్వామిక వ్యవస్థ మాత్రమే ఉగ్రవాదం బెడదను సమర్ధంగా ఎదుర్కొనగలదు. ఆ దిశగా బెల్జియం మాత్రమే కాదు...పాశ్చాత్య ప్రపంచమంతా ఆలోచించాలి. అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం తేలికవుతుంది. -
ఉగ్రవాదిని గిటార్తో కొట్టి ఆపేశాడు!
ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో ఒక దొంగను వయొలిన్తో తలమీద కొడతాడు.. సరిగ్గా అలాంటి సన్నివేశమే ఇజ్రాయెల్లోని టెల్ అవివ్ నగరంలో జరిగింది. వరుసపెట్టి జనాన్ని కత్తితో పొడుచుకుంటూ వెళ్తున్న ఓ ఉగ్రవాదిని 26 ఏళ్ల యువకుడు తన చేతిలో ఉన్న ఎకోస్టిక్ గిటార్తో తలమీద కొట్టాడు. దాంతో అతడు ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక ఆగిపోయాడు. ఇషాయ్ మాంట్గోమరీ అనే యువకుడు బీచ్లో గిటార్ వాయిస్తుండగా అతడికి కొందరి అరుపులు వినిపించాయి. కాసేపటికి బషర్ మాసల్హా (22) అనే వ్యక్తి చాకు పట్టుకుని తనవైపు పరిగెడుతూ రావడం చూశాడు. వెంటనే రెండో ఆలోచన లేకుండా తన చేతిలో ఉన్న గిటార్తో అతడి తలమీద ఒక్కటిచ్చుకున్నాడు. దాంతో స్టన్ అయిన మాసల్హా అక్కడే ఆగిపోయాడు. అప్పటికే అతడు ఓ అమెరికన్ పర్యాటకుడిని చంపి, మరో 12 మందిని గాయపరిచాడు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో పోలీసులు అతడిని కాల్చి చంపేశారు. అయితే.. మరింతమంది మీద ఆ ఉగ్రవాది దాడి చేయకుండా ఆపి.. తన గిటార్ పోగొట్టుకున్న యువకుడి సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తాయి. అతడు కొత్త గిటార్ కొనుక్కోడానికి డబ్బులు కూడా వచ్చాయి. మాంట్గోవరీని అందరూ గిటార్ హీరో అని ప్రశంసించి, ఇప్పటికి వెయ్యి డాలర్లు ఇచ్చారు. మరో 500 డాలర్లు వస్తే అతడు కొత్త గిటార్ కొనుక్కోవచ్చు. ఓ దాత అయితే 5 డాలర్లు ఇవ్వడమే కాక, తానే కొత్త గిటార్ కొనిస్తానని చెప్పి, తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఓ మహిళ తన వద్ద ఉన్న గిటార్ను అతడికి ఇచ్చేస్తానని చెప్పారు. మరో మహిళ.. గిటార్ తయారీ కంపెనీ గిబ్సన్ వాళ్లు ఉచితంగా అతడికి కొత్త గిటార్ ఇవ్వాలని అన్నారు. -
పాంపోర్ ఉగ్రదాడిలో రూ.220 కోట్లు గల్లంతు!?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని పాంపోర్ లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ముగిశాయి. శనివారం నుంచి కొనసాగిన ఈ ఆపరేషన్ లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు, ముగ్గురు ఉగ్రవాదులు కలిపి మొత్తం 9 మంది మరణించారు. ఇప్పటివరకు ఇద్దరు ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మరొకడి శవం కోసం గాలిస్తున్నాయి. కాగా ఉగ్రదాడితో జేకేఈడీఐ సంస్థకు భారీగా ఆస్తినష్టం సంభవించడమేకాక కంప్యూటర్ డేటా ధ్వంసం కావడంతో రూ.220 కోట్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంస్థనే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకోవడం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 2004లో జమ్ముకశ్మీర్ ఎంటర్ ప్రెన్యూర్స్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్(జేకేఈడీఐ)ను నెలకొల్పింది. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారికి అతి సమీపంగా పాంపోర్ లో మూడున్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పటివరకు 13వేల మందికిపైగా యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చింది. మరో 5వేల మంది ఔత్సాహికులకు లోన్ల రూపంలో కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం చేసింది. అయితే నిత్యం వందలమంది వచ్చిపోయే ఈ సంస్థపై దాడి జరగవచ్చనే అనుమానం గతంలోనే వ్యక్తమైంది. ఆ క్రమంలోనే జేకేఈడీఐకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ముందుకొచ్చింది. కానీ సంస్థ నిర్వాహకులు, ప్రభుత్వం మాత్రం పోలీసుల హెచ్చరికలను తేలికగా తీసుకుంన్నారు. శనివారం నాటి ఘటనలో మొదట జాతీయ రహదారి మీద సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి జేకేఈడీఐ ప్రాంగణంలోపలికి సులువుగా చొచ్చుకుపోయారు. అడ్మినిస్ట్రేటివ్ భవంతి నాలుగో అంతస్తులో దాక్కున్నారు. సరిగ్గా అదే అంతస్తులో జేకేఈడీఐ డేటాబేస్ సెంటర్ ఉంది. దాదాపు మూడు రోజులపాటు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కంప్యూటర్లతోపాటు డేటా మొత్తం ధ్వంసమైందని, బ్యాకప్ సౌకర్యం కూడా లేకపోవడంతో పారిశ్రామికవేత్తలకు రుణంగా ఇచ్చిన రూ.220 కోట్లకు సంబంధించిన వివరాలు గల్లంతయ్యాయని జేకేఈడీఐ ఉద్యోగి ఒకరు తెలిపారు. భద్రతా బలగాలు, పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. 'భద్రత విషయంలో జేకేఈడీఐ తీరు గర్హనీయం. పొరపాటున ఎప్పుడైనా మా పోలీస్ జీపులు ఆ ప్రాంగణంలోకో లేక ప్రహారీ బయటో ఆపితే అధికారులు ఊరుకునేవారు కాదు. 'అరే.. మేం పోలీసులం' అని చెప్పినా వినిపించుకునేవారుకాదు. మమ్మల్ని కాదని ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు రక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉగ్రవాదులు ఈ సంస్థను టార్గెట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమే' అని పోలీస్ అధికారి ఒకరు కుండబద్దలు కొట్టారు. -
ఆ 24 గంటలు ఏం చేశారు?
ఉగ్రదాడులను పసిగట్టడంలో భద్రతా వైఫల్యం పఠాన్కోట్: గురువారం ఎస్పీని బంధించి, చితగ్గొట్టి వదిలిపెట్టాక 24 గంటలపాటు ఉగ్రవాదులు ఏం చేశారు? వీరి కదలికలను గుర్తించకపోవటం పంజాబ్ పోలీసుల వైఫల్యమేనా?ఎయిర్బేస్పై ఉగ్రదాడి తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివి. ఈ ఘటన తర్వాత పంజాబ్-పాక్ సరిహద్దుల్లో నిఘా పెంచినా.. అంతకుముందే వచ్చేసిన ఉగ్రవాదుల కదలికలను గుర్తించకపోవటంలో నిఘా వ్యవస్థ వైఫల్యమూ కనబడుతోంది. డిసెంబర్ 30,31న దాదాపు 15 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పఠాన్కోట్తోపాటు.. పంజాబ్లో ఇతర ఐఏఎఫ్ బేస్లున్నాయి. ఆదంపూర్, హల్వారా, బథిండా, అమృత్సర్, పాటియాలాల్లో వైమానిక దళాల కీలక కేంద్రాలున్నాయి. ఇలాంటి ప్రాంతంలో ఎస్పీ కిడ్నాప్ తర్వాత అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించినా ఐదుగురు ఉగ్రవాదులు తిరగగలిగారంటే.. భద్రతా లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ‘నాకాబందీ నిర్వహిస్తుండటం వల్ల ఉగ్రవాదులు వాహనాలు వదిలి నడుస్తూనే ఈ ప్రాంతమంతా తిరిగి ఉండాలి. ఎయిర్బేస్ సమీపంలో వారు తిరుగుతుండగా ఎవరికీ అనుమానం రాలేదా? స్థానికులతో పాటు.. భద్రతా దళాలు వీరిని గుర్తించలేదా?’ అని పంజాబ్ మాజీ పోలీసు అధికారి ప్రశ్నించారు. కిడ్నాపై బయటపడ్డ ఎస్పీ వెల్లడించిన విషయాలను సీరియస్గా తీసుకోలేదని అర్థమవుతుందన్నారు. గురుదాస్పూర్ ఘటన జరిగినప్పుడు కూడా పంజాబ్ పోలీసులు కునుకుతీస్తున్నట్లు సీసీటీవీల్లో కనిపించింది. శుక్రవారం పఠాన్కోట్ ఎస్పీ కిడ్నాపైన సంగతి తెలుసుకుని.. ఆయనకు కాల్ చేసిన గన్మాన్కు.. ‘సలాం అలైకూం’ అనే సమాధానం వచ్చింది. ‘ఇది మా ఎస్పీసార్ నెంబరు మీరెవరు మాట్లాడుతున్నారని ప్రశ్నించగానే.. ఫోన్ కట్ చేశారు’ అని ఎస్పీ గన్మ్యాన్ తెలిపాడు. దీన్ని బట్టి ఎస్పీని కొట్టి వాహనం తీసుకెళ్లిన వారూ పాక్ ఉగ్రవాదులేననే అనుమానం బలపడుతోంది. మరోపక్క.. ఐఎస్ఐకి సమాచారం అందించిన కేసులో ఇటీవలే అరెస్టైన భారత వైమానిక దళం అధికారి కేకే రంజిత్ను పంజాబ్లో ఉగ్రఘటన నేపథ్యంలో మరోసారి విచారించనున్నారు. వాళ్లు వస్తుండగానే చూశాం గగనతల నిఘాతోనే ఎదురుదాడి: ఐఏఎఫ్ న్యూఢిల్లీ: పఠాన్కోట్ ఘటనలో ఉగ్రవాదులు ఎయిర్బేస్లో అడుగుపెడుతుండగానే.. గగనతల నిఘా (ఏరియల్ సర్వీలెన్స్) ద్వారా గుర్తించి సమర్థవంతంగా అడ్డుకున్నామని భారతీయ వైమానిక దళం ప్రకటించింది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ విభాగం ముందుగానే హెచ్చరించటంతో అప్రమత్తంగానే ఉన్నామని.. పక్కా ప్రణాళిక, వివిధ విభాగాల సమన్వయంతో ఎదురుదాడి చేయటం వల్లే ఎయిర్బేస్ను కాపాడుకోగలిగామని పేర్కొంది. మిలటరీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు ఎయిర్ బేస్ స్టేషన్లోకి వస్తుండటాన్ని గగనతల నిఘా నేత్రం ద్వారా గుర్తించి.. వారిపై కాల్పులు జరిపినట్లు ఈ ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్కోట్ ఎయిర్బేస్ కీలకమైన మిగ్-21 యుద్ధ విమానాలు, ఎమ్ఐ-25 యుద్ధ హెలికాప్టర్లకు బేస్ పాయింట్ కావటం విశేషం. ఉగ్రదాడుల పంజాబ్ న్యూఢిల్లీ: ఆరునెలల్లో పంజాబ్పై ఇది రెండో ఉగ్రదాడి. గతేడాది జూలైలో గురుదాస్పూర్పై జరిగిన ఉగ్రవాదుల దాడినుంచి తేరుకోకముందే.. అదే తరహాలో దాడికి యత్నం జరగటం సంచలనం సృష్టిస్తోంది. 2001 నుంచి శనివారం ఘటన వరకు పంజాబ్లో జరిగిన ఉగ్రవాదుల ఘటనలను ఓసారి పరిశీలిస్తే.. మార్చి 1, 2001: గురుదాస్పూర్ ప్రాంతంలో భారత్,పాక్ సరిహద్దుల్లో 135 గజాల సొరంగ మార్గాన్ని గుర్తించారు జనవరి 1, 2002: పంజాబ్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఐదుగురు స్థానికులు మృతిచెందారు. జనవరి 31, 2002: హోషియార్పూర్ జిల్లాలో బస్స్టేషన్లో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా 12 మందికి గాయాలయ్యాయి. మార్చి 31, 2002: లూధియానా దగ్గర్లోని రైలులో జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. ఏప్రిల్ 28, 2006: జలంధర్ బస్స్టేషన్లో జరిగిన బాంబు పేలుడులో 8 మంది చనిపోయారు. అక్టోబర్ 14, 2007: లూధియానాలో ఓ థియేటర్లో బాంబు పేలుడులో పదిమంది మరణించగా 40 మందికి పైగా గాయాలయ్యాయి. జూలై 27, 2015: మిలటరీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. ఓ పోలీస్స్టేషన్పై దాడి చేయటంతో.. ఎస్పీతో సహా ఎనిమిది మంది చనిపోయారు. జనవరి 2, 2016: పఠాన్కోట్లోని ఐఏఎఫ్ ఎయిర్బేస్పై జరిగిన ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు భదత్రా సిబ్బంది మృతిచెందారు. -
దాడుల భయంతో న్యూ ఇయర్ వేడుకలకు దూరం
-
దాడుల భయంతో న్యూ ఇయర్ వేడుకలకు దూరం
బ్రస్సెల్స్: ఉగ్రదాడుల భయాందోళనతో నూతన సంవత్సర వేడుకలకు బెల్జియం దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని బ్రస్సెల్స్ లోని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తుంటే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉన్నందున తాము అ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెల్జియం అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి, కొంత మంది అధికారులతో కలిసి సమావేశమైన అనంతరం ఈ నిర్ణయంపై స్పష్టత వచ్చిందని ఓ ఉన్నతాధికారి స్థానిక మీడియాకి వెల్లడించారు. అధికారికంగా ఈ వేడుకలు నిర్వహించనప్పటికీ, ప్రజలు మాత్రం సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. గురువారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేస్తున్నట్లు బ్రస్సెల్స్ మేయర్ వైవన్ మయేర్ తెలిపారు. నగరంలో ఇప్పటికీ పండుగ వాతావరణం ఉందని, ప్రజల సౌకర్యార్థం రెస్టారెంట్లు సహా సిటీ సెంటర్ అన్ని తెరచి ఉంటాయని ఆయన వివరించారు. అధికారులు న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న టెర్రర్ అటాక్ లెవల్-3 నుంచి కొత్త సంవత్సర వేడుకల నాటికి లెవల్-4కి చేరుకుంటుందని ఈ నెల 15న ఆ దేశ అంతర్గతవ్యవహారాల మంత్రిత్వశాఖ హెచ్చిరించింది. ఈ క్రమంలో ఉగ్రదాడులకు తావివ్వకూడదని భావించిన మంత్రులు, అధికారులు సెలబ్రెషన్స్ పక్కనపెట్టి భద్రతా, రక్షణ వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తూ గురువారం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. -
ప్రమాదం తప్పించారని.. కోట్ల రూపాయల బహుమానం
ఓ చేత్తో కత్తి పట్టుకుని.. విమానానికి నిప్పు పెట్టేస్తానంటూ ఎవరైనా బెదిరిస్తుంటే, అదే విమానంలో ప్రయాణిస్తున్న మీరు ఏం చేస్తారు? దేవుడా.. మా విమానం గాల్లో పేలిపోకుండా చూడు అంటూ ప్రార్థిస్తారా? అలా కాకుండా జాగ్రత్తగా సిబ్బందితో కలిసి ఆ ఉగ్రవాదిని పట్టుకోడానికి ప్రయత్నిస్తారా? చైనాలో ఓ విమానాన్ని ఇలా పేలిపోకుండా కాపాడినందుకు తొమ్మిది మంది సిబ్బందితో పాటు ఇద్దరు ప్రయాణికులకు సదరు విమానయాన సంస్థ భారీగా బహుమానాలు ప్రకటించింది. షెంజెన్ ఎయిర్లైన్స్ సంస్థ మొత్తం 9 మంది సిబ్బంది ఒక్కొక్కరికి రూ. 2.55 కోట్లు, ఇద్దరు ప్రయాణికులకు రూ. 16 లక్షల వంతున నగదు బహుమతులు ప్రకటించింది. ఒక సీటుకు నిప్పు పెట్టిన తర్వాత ఆ దుండగుడిని సిబ్బంది, ప్రయాణికులు పట్టుకున్నారు. ఆ సమయానికి విమానంలో వందమందికి పైగా ప్రయాణికులున్నారు. ముందుగా ఓ ఫ్లైట్ అటెండెంటు పెట్రోలు వాసనను గుర్తించారు. రెండు సీట్ల మీద పెట్రోలు పడినట్లు కూడా గుర్తించి, వెంటనే సిబ్బందికి చెప్పారు. వెంటనే సిబ్బంది అక్కడకు వస్తుండటంతో ఓ వ్యక్తి కత్తి చేత్తో పట్టుకుని, ఆ సీట్ల మీద నిప్పంటించాడు. సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేసి, అతడితో పోరాడారు. ఇద్దరు ప్రయాణికులు కూడా దిళ్లు, బ్యాగులతో అతడిని పట్టుకోడానికి యథాశక్తి తోడ్పడ్డారు. దాంతో ఇప్పుడా సిబ్బందికి, ప్రయాణికులకు కూడా విమానయాన సంస్థ భారీగా నగదు బహుమతులు ఇచ్చింది. -
ఆ ముష్కరులు పాక్ నుంచే వచ్చారు
గురుదాస్పూర్ ఉగ్రదాడిపై రాజ్యసభలో రాజ్నాథ్ ప్రకటన న్యూఢిల్లీ: గురుదాస్పూర్లో ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్తో సంబంధముందని.. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయటానికి పాక్ నుంచే చొరబడ్డారని నిర్ధారించేందుకు బలమైన సాక్ష్యాలున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 27వ తేదీ సోమవారం నాడు పంజాబ్లోని గురుదాస్పూర్లో జరిగిన ఉగ్రదాడిని పార్లమెంటు ఉభయసభలైన లోక్సభ, రాజ్యసభ గురువారం తీవ్రంగా ఖండించాయి. ఆ దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పించాయి. అనంతరం.. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం అంత్యక్రియలు జరుగుతున్నందున లోక్సభను శుక్రవారానికి వాయిదా వేయగా.. రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదావేశారు. మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ గురుదాస్పూర్ దాడిపై ప్రకటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య ఆయన మాట్లాడుతూ.. గురుదాస్పూర్ జిల్లాలో రావి నది పాకిస్తాన్లో ప్రవేశించే ప్రాంతమైన తాష్ ప్రాంతం వద్ద ఉగ్రవాదులు పాక్ నుంచి చొరబడినట్లు జీపీఎస్ సమాచారం ప్రకారం పోలీసుల ప్రాధమిక విశ్లేషణ సూచిస్తోందని తెలిపారు. సరిహద్దులో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. అయితే ఈ దాడి చేసిన ఉగ్రవాదులు పంజాబ్లో చొరబడగలగటానికి అక్కడ ఇటీవల కురిసిన భారీ వర్షాలు తోడయిన ఫలితంగా సరిహద్దు వెంట నదులు, కాల్వల్లో నీటి ప్రవాహం పెరగటం కావచ్చునని అభిప్రాయపడ్డారు. -
ఉగ్రదాడిని ఖండించిన రాహుల్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్ పూర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఉగ్రవాదుల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తుననట్టు రాహుల్ ట్విట్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పంజాబ్ లో సాధ్యమైనంత తొందరగా పరిస్థితి అదుపులోకి రావాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మానసిక స్థైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు రాహుల్ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పిరికతనంతో అమాయకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే అపరాధులైన వారిని త్వరలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్నట్టు కేజ్రీవాల్ ట్విట్ చేశారు. కాగా, పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై సోమవారం ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
ఉగ్రదాడి జరిగిందిలా..
-
ఉగ్రదాడి జరిగిందిలా..
గుర్దాస్పూర్: పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడిచేశారు. సైనిక దుస్తులు ధరించి, అత్యాధునిక ఆయుధాలతో.. సెంట్రీలను కాల్చేసి స్టేషన్ లోకి చొరబడ్డ ముష్కరులు అక్కడ భీభత్సం సృష్టించారు. ఆ తరువాత ఓ భవనంలోకి ప్రవేశించి లోపలి నుంచి కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో పోరుకు బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు. పాకిస్థాన్లోని నరోవల్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించారు. జమ్ములోని హరినగర్ నుంచి ఆదివారం అర్ధరాత్రి తరువాత పంజాబ్ కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పఠాన్కోట్ మీదుగా గుర్దాస్పూర్- జమ్ము హైవేపై వద్దకు చేరుకుని ఓ మారుతీ కారును హైజాక్ చేశారు. అప్పటికే వారు సైనిక దుస్తులు ధరించారు. అదే మార్గంలో జమ్ము వైపు వెళుతోన్న బస్సుపై కాల్పులు జరపగా ఓ ప్రయాణికుడు మరణించాడు. అక్కడి నుంచి హైజాక్ చేసిన కారులో నేరుగా దీనానగర్ పోలీస్ స్టేషన్ వైపునకు బయలుదేరారు. దీనానగర్ లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ఉదయం 5:45 గంటలకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ముష్కరులు సెంట్రీలపై కాల్చిచంపారు. స్టేషన్ లో భీభత్సం సృష్టించిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ హెల్త్ సెంటర్ లోకి ప్రవేశించారు. లోపలి నుంచి ప్రతి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, ఎన్ఎస్జీ బలగాలు రంగంలోకి దిగి దీనానగర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను చూట్టుముట్టాయి. ఈలోపే దీనానగర్- పఠాన్ కోట్ మధ్య రైల్వేట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దీనానగర్ లోని స్కూళ్లు, కాలేజీలు ఇతర కార్యాలయాలన్నీ మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీఅయ్యాయి. దాదాపు 10 గంటల సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ ప్రారంభం. కౌంటర్ ఆపరేషన్ లో ఆర్మీ హెలికాప్టర్ ను కూడా ఉపయోగిస్తున్నారు. ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటు పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు చనిపోయారు. కౌంటర్ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాది హతం. దీంతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో గుర్ దాస్ పూర్ జిల్లా ఎస్సీ బల్జీత్ సింగ్ మరణించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. -
లిబియా హోటల్పై ఉగ్రపంజా
ట్రిపోలీ: లిబియా రాజధాని ట్రిపోలీలో విదేశీయులు ఎక్కువగా బస చేసే కోరింథియా హోటల్పై మంగళవారం ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఐదుగురు విదేశీయులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు సహా 9 మంది మృతిచెందారు. తొలుత హోటల్లోకి చొరబడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు ముగ్గురు గార్డులతోపాటు ఐదుగురు విదేశీయులను కాల్చి చంపారు. అనంతరం ఒకరిని బందీగా పట్టుకున్నారు. 24వ అంతస్తులోని ముష్కరులను భద్రత బలగాలు చుట్టుముట్టగా వారు తమను తాము పేల్చేసుకున్నారు. పేలుడుతో బందీ కూడా మృతి చెందారు. మృతిచెందిన విదేశీయుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ హోటల్లోని 24వ అంతస్తును కొంతకాలంగా లిబియాలోని ఖతర్ ఎంబసీ వాడుకుంటోంది. దాడి సమయంలో ఎంబసీ ఉద్యోగులెవరూ లేరని అధికారులు తెలిపారు. దాడి మొదట్లో హోటల్లో బసచేసిన వారు పారిపోతుండగా హోటల్ ఆవరణలో కారు బాంబు పేలింది. తనను తాను లిబియా ప్రధానిగా ప్రకటించుకున్న ఒమర్ అల్ హసీ దాడి సమయంలో ఈ హోటల్లోనే ఉన్నారు. ఆయనను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎస్ విభాగం ప్రకటించుకుంది. -
భారత్పై ఉగ్ర దాడి జరగకూడదు
ఒబామా పర్యటన సందర్భంగా పాక్కు అమెరికా హెచ్చరిక ఒకవేళ అటువంటి దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఒబామా భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల జాగ్రత్తలు గణతంత్ర వేడుకల్లో రాజ్పథ్ వీవీఐపీ వేదికకు ఏడంచెల భద్రత వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్లో పర్యటిస్తుండగా భారత్పై ఎలాంటి సీమాంతర ఉగ్రవాద దాడి జరగకుండా చూడాలని పాకిస్తాన్కు అమెరికా సూచించింది. ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే, అది పాక్ నుంచే జరిగిందని వెల్లడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించింది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్లో పర్యటించనుండడం తెలిసిందే. ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఒబామా.. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు బహిరంగ వేదిక (ఓపెన్ ఎయిర్ ప్లాట్ఫాం)పై ఉండనున్నారు. దీంతో ఆయన భద్రత విషయమై అమెరికా, భారత భద్రతా సంస్థలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి నేతలు భారత్లో పర్యటిస్తుండగా.. పాక్ నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్లో దాడులకు పాల్పడిన చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్చరికలు జారీచేసినట్లు చెప్తున్నారు. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ భారత్లో పర్యటిస్తున్నపుడు కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. అఫ్ఘానిస్థాన్లోని అమెరికా బలగాలు ఆ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా, భారత్ల మధ్య నిఘా సమాచారం మార్పిడి అనూహ్యంగా పెరిగింది. ఒబామాకు గుర్తిండిపోయేలా ఏర్పాట్లు న్యూఢిల్లీ: వేడుకలు జరిగే రాజ్పథ్కు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ఈ మార్గం చుట్టూ 80,000 మంది పోలీసులతో పాటు 10,000 మంది పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నారు. వేదికపై వీవీఐపీ ఎన్క్లోజర్ చుట్టూ ఏడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గగనతలాన్ని రాడార్తో పర్యవేక్షించనున్నారు. ఒబామా భారత యాత్రను సుదీర్ఘ కాలం గుర్తుంచుకునేలా తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ చెప్పారు. విద్యావేత్తల బోధనపై ఒప్పందం! భారత్లోని విద్యా సంస్థల్లో అంతర్జాతీయ అధ్యాపకులు బోధించటానికి సంబంధించిన ఒప్పందం ఒబామా పర్యటన సందర్భంగా ఖరారయ్యే వీలుంది. ఐఐటీలు, సెంట్రల్ వర్సిటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే విద్యా సంస్థలతో పాటు ‘ఎ’ గ్రేడ్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు విదేశాల నుంచి అత్యుత్తమ అధ్యాపకుల చేత బోధన అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది. మోదీ అమెరికా పర్యటనలో ప్రతిపాదించిన ‘గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ ఎకడమిక్ నెట్వర్క్స్’ కింద ఏటా వేయి మంది వరకూ అమెరికా విద్యావేత్తలను ఇక్కడ బోధించేందుకు పంపించటానికి ఆ దేశం అంగీకరించింది. కాగా, దీపావళిని పురస్కరించుకుని అమెరికాలో దీపావళి పోస్టల్ స్టాంపును జారీ చేసేందుకు ఒబామా పర్యటన సందర్భంగా మద్దతివ్వాలని కోరుతూ అమెరికా పార్లమెంటు సభ్యురాలు కారొలిన్ మాలొనీ ఆయనకు లేఖ రాశారు. -
ఒక అనుమానితుడు లొంగుబాటు: ఇద్దరు పరారీ
పారిస్: ప్రాన్స్ లో ఓ పత్రికా కార్యాలయంపై విధ్వంసం సృష్టించిన ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడు లొంగిపోగా, మరో ఇద్దరు పరారయ్యారు. గతంలో పలు దాడులతో ప్రమేయమున్న చెర్రిఫ్ కౌచీ(34), అతని సోదరుడు సయ్యద్ కౌచీ(34)లతో పాటు మరో యువకుడికి పోలీసులు గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అయితే ఒకరు లొంగిపోగా.. మరో ఇద్దరు అనుమానితులు పరారయ్యారు. ఆ ఇద్దరు సోదరులు కాల్పులు జరిపిన అనంతరం కారులో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఫోటోలను విడుదల చేసిన ఫ్రాన్స్ పోలీసులు వారి కోసం గాలింపు చర్యలను తీవ్ర చేశారు. నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై కొంతమంది ముష్కరుల దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఇద్దరు అనుమానితుల ఫోటోలు విడుదల
పారిస్: ప్రాన్స్ లో ఓ పత్రికా కార్యాలయంపై ముష్కరులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఇద్దరు అనుమానితులకు ఆ దేశ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. గతంలో పలు దాడులతో ప్రమేయమున్న చెర్రిఫ్ కౌచీ(34), సయ్యద్ కౌచీ(34) లకు గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి వారి ఫోటోలను తాజాగా విడుదల చేశారు. ప్రజా భద్రతలో భాగంగానే వారి ఫోటోలను విడుదల చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై కొంతమంది ముష్కరుల దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. -
కలంపై తూటా
* ‘ఫ్రాన్స్ పత్రిక’పై ఉగ్రవాదుల దాడి * 12 మంది మృతి, 10 మందికి గాయాలు * పారిస్లోని ‘చార్లీ హెబ్డో’ పత్రిక కార్యాలయంలో విచక్షణరహితంగా కాల్పులు * మృతుల్లో ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు * దేశమంతటా హై అలర్ట్.. ముష్కరులను వేటాడి పట్టుకుంటాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు * దాడిని తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు ఉగ్రమూకల కర్కశత్వానికి నిదర్శనమీ చిత్రం. పత్రిక కార్యాలయం వద్ద గాయపడి నేలకొరిగిన పోలీసు అధికారి ఒకరు సరెండర్ అయినట్లుగా చేయి పెకైత్తినా.. ‘నన్నే చంపాలనుకుంటావా?’ అంటూ దగ్గరికొచ్చి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఇలా తూటాలు కురిపించి హతమార్చారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఫ్రాన్స్పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ప్రపంచ సంస్కృతుల రాజధానిగా పేరుగాంచిన పారిస్లో బీభత్సం సృష్టించారు. నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయ సిబ్బందిపై తూటాల వర్షం కురిపించిన ఉగ్రవాదులు ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేస్తూ పారిపోయారు. ఈ ఘటనతో ఫ్రాన్స్లో హై అలర్ట్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాదులు ఫ్రాన్స్లో ఇంతమందిని పొట్టనబెట్టుకోవడం ఇదే ప్రథమం. దాడిని అమెరికా, రష్యా, భారత్ తదితర దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. పారిస్: చేతిలో ఏకే-47 తుపాకులు.. భుజాలకు రాకెట్ లాంచర్లు.. ముఖాలకు ముసుగులు.. ఒక్కసారిగా దూసుకొచ్చారు.. విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు.. 12 మంది ప్రాణాలను బలిగొన్నారు.. ఏం జరుగుతుందో తెలిసేలోపే పరారయ్యారు.. వెళ్తూవెళ్తూ ‘ప్రవక్త పగదీర్చుకున్నాడు.. అల్లాహో అక్బర్..’ అంటూ నినాదాలు చేశారు! బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ‘చార్లీ హెబ్డో’ పత్రికా కార్యాలయంపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ స్టీఫెన్ చార్బోనియర్, ముగ్గురు కార్టూనిస్టులు కబూ, టింగోనస్, విలిన్స్కీ సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాడిలో పాల్గొన్నది ఎందరో కచ్చితంగా తెలియడం లేదు. ఇద్దరే ఉన్నారని కొందరు చెబుతుండగా.. నలుగురి దాకా ఉన్నారని మరికొందరు పేర్కొంటున్నారు. పారిపోయిన ఉగ్రవాదులు మరెక్కడైనా దాడికి పాల్పడే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. కాల్పులు చోటుచేసుకున్న కాసేపటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద దాడేనని, ముష్కరులను వేటాడి చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు. దాడిని ప్రపంచదేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ఎలా జరిగింది.. ముష్కరులు ముందుగా ఓ కారును హైజాక్ చేసి దాన్ని నేరుగా పత్రికా కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. కారులోంచి దిగుతూనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడి సిబ్బందిపై తూటాల వర్షం కురిపించారు. అనంతరం అదే కారులో పారిపోయారు. పోతూపోతూ రోడ్డుపై కనిపించినవారిని కూడా కాల్చారు. ‘‘ఉదయం 11.30 గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరుపుతూ ఏవో నినాదాలు చేస్తూ పారిపోయారు. వారి భుజాలకు రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘‘డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్నవారిని పోలీసులు వెంబడిస్తున్నారేమోనని అనుకున్నా. తర్వాత వారు ఉగ్రవాదులని తెలిసింది’’ అని మరో ప్రత్యక్ష సాక్షి వివరించారు. దాడి అందుకేనా..? వ్యంగ్య వారపత్రిక అయిన చార్లీ హెబ్డోకు వివాదాలు కొత్త కాదు. గతంలో అనేకసార్లు వివాదాస్పద కార్టూన్లు ప్రచురించింది. గతంలో డెన్మార్క్ పత్రిక జైలాండ్స్-పోస్ట్ ప్రచురించిన వివాదాస్పద మహమ్మద్ ప్రవక్త కార్టూన్ను 2006 ఫిబ్రవరిలో యథాతథంగా అచ్చేసింది. దీంతో ముస్లిం దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అప్పట్నుంచీ ముస్లిం ఛాందసవాదులకు ఈ పత్రిక టార్గెట్గా మారింది. అయినా తీరుమారని చార్లీ హెబ్డో 2011లో మరోసారి ప్రవక్త కార్టూన్ను ప్రచురించింది. ఆ సమయంలో పత్రికా కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. 2012లో అమెరికాలో కొందరు ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ పేరుతో ఓ వివాదాస్పద చిత్రాన్ని తీశారు. ముస్లింలను, ప్రవక్తను కించపరిచారంటూ ఈ చిత్రంపై ముస్లిం దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్న సమయంలోనే... చార్లీ హెబ్డో మరోసారి ప్రవక్త కార్టూన్ను ప్రచురించింది. దీంతో ఆ పత్రికపై మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చంపేస్తామంటూ పత్రిక ఎడిటర్కు అనేక బెదిరింపులు వచ్చాయి. చివరికి ఆయనకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఆ సమయంలో దాడులు జరగొచ్చన్న భయంతో ఫ్రాన్స్ ఏకంగా 20 ముస్లిం దేశాల్లో తమ ఎంబసీలను, కాన్సులేట్లను, సాంస్కృతిక కేంద్రాలను, స్కూళ్లను తాత్కాలికంగా మూసివేసింది. కొన్నేళ్లుగా ఉగ్రవాదుల హిట్లిస్ట్లో ఉన్న నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. దాడికి సరిగ్గా ఒక గంట ముందు.. చార్లీ హెబ్డో తన వెబ్సైట్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ కార్టూన్ను పోస్ట్ చేయడం గమనార్హం. దాడిని ఫ్రాన్స్ ముస్లిం మండలి తీవ్రంగా ఖండించింది. ‘‘ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం. కష్టకాలంలో ఉన్న ఫ్రాన్స్కు అవసరమైన సాయం చేస్తాం’’ - బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు ‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. ఈ దాడిని ఖండిస్తున్నాం. అన్ని చేతులు ఒక్కటైతేనే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఓడించగలమని ఈ ఘటన నిరూపించింది’’ - వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు ‘‘ప్రపంచంలో ఉగ్రవాదానికి ఎక్కడా చోటు ఉండకూడదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందకు ప్రపంచదేశాలన్నీ ఏకం కావాలి. పారిస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం’’ - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘‘ఇది హేయమైన చర్య. తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతున్నాం’’ - ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ఇది పిరికిపందల చర్య. తీవ్రవాదం, అసహనం పత్రికా స్వేచ్ఛను హరించలేవు’’ - సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ -
ఏకే 47, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల దాడి
ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, అత్యాధునిక మిషన్ గన్లతో ప్యారిస్ నగరంలోని పత్రికా కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. ఫ్రాన్స్లోని అన్ని మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా పలు ఉగ్రవాద కుట్రలను ముందుగానే అడ్డుకున్నామని హోలండ్ అన్నారు. తాజాగా చార్లీ హెబ్డో కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత హేయమైనదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పత్రికా కార్యాలయంలోకి ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా మెట్లు ఎక్కి లోపలకు వెళ్లిన ఉగ్రవాదులు.. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపి, లాంచర్లతో రాకెట్లు కూడా ప్రయోగించారు. దాంతో పదిమంది అక్కడికక్కడే మరణించారు. తిరిగి పారిపోతూ.. రోడ్డుమీద ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపారు. దాంతో ఓ పోలీసు అక్కడే మరణించారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు పత్రికా కార్యాలయం సమీపంలోని ఓ మెట్రో స్టేషన్ వైపు పారిపోయారు. కాగా, ప్యారిస్ ఘటన హేయమైన చర్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రెంచి వాసులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై పోరుకు తాము ఎప్పుడూ ముందుంటామని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. -
తెగబడిన ఉన్మాదం
మాట పెగలని బరువైన క్షణాలివి. నా హృదయం ఓ తల్లిగా, ఓ స్త్రీగా కాదు సాటి మనిషిగా రోదిస్తోంది. మానవత్వం హత్యకు గురైంది. హంతకుడూ మనిషే !! టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ నా ఆలోచనలకు కళ్లెం వేసింది. రక్తమోడుతున్న చిన్నారులను మూటల్లా మోసుకెళ్తుంటే నా మెదడు మొద్దుబారిపోయింది. ఏ మనిషీ, ఏ జాతి, ఏ మతమూ సహించలేని ఘాతుకం మన పొరుగు దేశంలో జరిగింది. ఇది నేను రాస్తున్న సమయానికి 140కి పైగా పసిమొగ్గలు రాలిపోయాయి. మీరు చదివే సమయానికి మరెన్ని ప్రాణాలు ఆవిరి అయిపోతాయో అని భయంగా ఉంది. ఈ భయం సృష్టించాలనే కదా మారణహోమం చేస్తోంది ఉగ్రవాదం. ఈ భయానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నిటి దగ్గరా ఉన్న ఆయుధం ధైర్యం. ఏకే47లు, కలష్నికోవ్లు, ట్యాంకర్లు, బంకర్లు, బాంబులు, మిసైల్స్ ఇవి సైన్యం దగ్గర మాత్రమే ఉండే రోజులు కావివి. మనం ఇప్పుడు భయపడాల్సింది, ఉగ్రవాదుల చెంతనున్న ఆయుధ బలం చూసి కాదు, ప్రాణాలను సైతం లెక్క చేయనంతగా యువత మనసులను ప్రభావితం చేస్తున్న ఛాందస భావజాలం చూసి. తమ ప్రాణాలనే లెక్క చేయని కరడుగట్టిన ఉన్మాదులకు పసిపిల్లల ప్రాణం విలువ ఏం అర్థమవుతుంది. అందుకే విచక్షణ రహితంగా కాల్చారు, పేల్చారు, తగులబెట్టారు. వాళ్లు రగిల్చిన చిచ్చు చూసేందుకు వాళ్లు ఎలాగూ మిగిలి ఉండరు. కానీ, ఈ వినాశనం ఓ భయంకరమైన దృశ్యంగా బతికి ఉన్న పిల్లలను వెంటాడుతూనే ఉంటుంది. తెర వెనుక మత రాజకీయాలకు ఆజ్యం పోసే వ్యవస్థలకూ ఇది పీడకలలా వేధిస్తూనే ఉంటుంది. మానవత్వానికి మచ్చగా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రభుత్వాలు, అగ్రరాజ్యాలు ఇప్పుడు ఏం చేస్తాయో వేచి చూడాలి. సోమవారం సిడ్నీలోని చాక్లెట్ కెఫేలో ఒక్క దుండగుడు సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం తేరుకోకముందే మంగళవారం పాకిస్థాన్లో ఈ దారుణం జరిగింది. రేపు మళ్లీ ఏ మూల నుంచి పంజా విసురుతారో అనే భయం అందరి మనసుల్లోనూ ఉంది. పరాకు చేటుగా.. గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ పేలుళ్లు మన మనసుల నుంచి ఇప్పుడిప్పుడే మాయమవుతున్నాయి. అంతా సాధారణంగా నడిచిపోతోంది అని మన భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నాం. భద్రత మన హక్కు అయితే అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. హైఅలర్ట్ ప్రకటిస్తేనే తనిఖీలు మొదలవుతాయి, మెటల్ డిటెక్టర్లు మోగుతాయి. మామూలు రోజుల్లో తనిఖీ అంటే మనకు అవమానం, మెటల్ డిటెక్టర్లు మనకు టైమ్ వేస్ట్. మాల్స్లో సెక్యూరిటీ తనిఖీలను పెద్ద ఫార్స్లా మార్చిన ఘనత మనకే చెందుతుంది. మనకు క్యూలో నిల్చోవడమే సరిగ్గా రాదు.. ఇక మాక్ డ్రిల్స్, ఎమెర్జెన్సీ ప్రాక్టీస్లు ఏం తెలుస్తాయి. అవగాహన మనమూ పెంచుకోవాలి. పొరుగింట్లో ఎవరుంటారో వారి కార్యకలాపాలు, భావజాలం ఇవన్నీ తెలుసుకోవడం మన బాధ్యత. ఇవి తెలుసుకోవాలంటే కనీసం వారితో మాట్లాడటం అవసరం. నిఘాతో పాటుగా.. ఇక భద్రతావిభాగాల సంసిద్ధత మరో కోణం. మన బలగాల బల ప్రదర్శన అవసరం రాకూడదనే కోరుకుందాం. కానీ ఒకవేళ అలాంటి సమయమే వస్తే.. ఆస్ట్రేలియా సిడ్నీ కెఫే ఉదంతంలో సైనిక చర్య మనకు ఉదాహరణగా నిలవాలి. మనదీ ఉగ్రవాద పిరికిపంద చర్యలు చూసిన దేశమే. మనదీ ఈ దాడులను తిప్పికొట్టగల సామర్థ్యం ఉన్న ఇంటెలిజెన్సే. నిఘా వర్గాలను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాళ్లున్నారు.. బాధ్యత కేవలం వారిదే అనుకుని కళ్లు మూసుకుని చల్లగా ఉండటం మనకు తగదు. కళ్లు తెరవండి. నిఘా నేత్రాలకు మీ అప్రమత్తతను జోడించండి. తనిఖీలు సరిగ్గా జరిగేలా సహకరిద్దాం. చేయని పక్షంలో డిమాండ్ చేసి మరీ తనిఖీలు చేయిద్దాం. బ్రేక్ఫాస్ట్లో బ్రేకింగ్ న్యూస్ ఉంటే కానీ తోచని మొద్దు చర్మం సమాజంలా తయారవ్వొద్దు మనం. వేయి మలాలాల దీటుగా.. కళ్ల ముందు మాంసపు ముద్దల్లా పసికందులు కనిపిస్తుంటే చలించని హృదయం లేదు. ఆ కుటుంబాలను మాత్రమే కాదు ఈ నష్టం, ఆ దేశం అంతటికీ కోలుకోలేని నష్టం ఈ ఉగ్రపర్వం. భయానకమైన ఈ సంఘటన నుంచి బయటపడిన పిల్లలు ద్వేషం, భయం, కోపం, పగ వంటి ఎమోషనల్ డిస్ట్రబెన్స్లో పెరగకుండా చూడాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న మన సమాజానిదే. మలాలాపై దాడి జరిగిన వాయవ్య పాకిస్థాన్లోనే ఈ స్కూల్ దాడి కూడా జరిగింది. వేల మంది బాలికల విద్య కోసం గొంతువిప్పిన మలాలా లాగ నేల రాలిన వంద మంది చిన్నారుల నుంచి రేపు వేల మంది మలాలాలు జనించాలి. హక్కుల గళం వినిపించాలి. ఈ రోజు భయంతో కాదు బాధతో నిద్రపట్టదు. రేపు ఉదయం భయంతో కాదు బాధ్యతతో లేస్తాను. వేయి మలాలాల సూర్యోదయం కోసం ఎదురు చూస్తాను. -
పెషావర్ ఘటన అమానవీయం: రాజ్నాథ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో పెషావర్ ఆర్మీ స్కూల్పై ఉగ్రవాద దాడిని భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాజ్నాథ్ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదుల చర్య అమానవీయమని అన్నారు. ఉగ్రవాదుల వికృతచేష్టకు ఈ ఘటన పరాకాష్టని రాజ్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి
-
కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి
ఆది, సోమవారాల్లో ఉగ్రవాద దాడితో కకావికలమైన కరాచీ ఎయిర్ పోర్ట్ మంగళవారం మళ్ళీ దాడికి గురైంది. అయిదు నుంచి పది మంది ఉగ్రవాదులు విమానాశ్రయంలోని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఫోర్సు కార్యాలయంపై రెండు వైపుల నుంచి ఒకే సారి దాడి చేశారు. భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో మరొక్క సారి కరాచీ ఎయిర్ పోర్టు కదనరంగంగా మారింది. ఆదివారం రాత్రి ఉగ్రవాదులు సిబ్బంది వేషాలతో ఎయిర్ పోర్టులోకి చొరబడి చేసిన దాడిలో 36 మంది చనిపోయారు. మంగళవారం ఉదయం సహాయ సిబ్బంది కార్గో విభాగం కోల్డ్ స్టోరేజి నుంచి మరో ఏడు శవాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన వారిలో 10 మంది ఉగ్రవాదులు, మరో 10 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మిగతావారంతా మామూలు పౌరులే. అయితే కరాచీ విమానాశ్రయ సిబ్బంది సాయం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యమని భద్రతా దళాలు భావిస్తున్నాయి. -
చైనాలో ఉగ్రవాద దాడి
- రద్దీ మార్కెట్లో 12కు పైగా పేలుళ్లు - 31 మంది మృతి; 94 మందికి గాయూలు బీజింగ్: చైనాలోని జింజియూంగ్ ప్రాంతీయ రాజధాని ఉరుంఖి పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం ఉదయం పేలుడు పదార్థాలతో నిండిన రెండు వాహనాలతో రద్దీ మార్కెట్లోకి దూసుకువెళ్లిన మిలిటెంట్లు 12కు పైగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో కనీసం 31 మంది మరణించగా.. 94 మంది గాయపడ్డారు. ఉదయం 7.50 (స్థానిక సమయం) ప్రాంతంలో రెన్మిన్ పార్క్ సమీపంలోని పార్క్ నార్త్ స్ట్రీట్ వద్ద ఉన్న రోడ్డుపక్క కంచెల్ని ఎలాంటి లెసైన్స్ ప్లేట్లు లేని వాహనాల (ఎస్యూవీలు)తో వేగంగా ఢీకొట్టిన మిలిటెంట్లు ఓ ఆరుబయలు మార్కెట్ లోనికి ప్రవేశించారు. ప్రజలను ఢీకొడుతూనే చివరివరకు వెళ్లిన వారు పేలుళ్లకు పాల్పడినట్టు జింజియూంగ్ ఇఘర్ స్వయంపాలిత ప్రాంత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వాహనాల ముందు విసిరిన పేలుడు పదార్థాలు పేలిపోరుునట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ భారీ ఉగ్రదాడి కి నిషేధిత తూర్పు తర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ (ఈటీఐఎం) కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)కు, అఫ్ఘానిస్థాన్కు సరిహద్దు ప్రాంతమైన జింజియూంగ్ స్వాతంత్య్రం కోసం ఈ ఉగ్ర సంస్థ పోరాడుతోంది. ఉగ్రదాడికి కారకులైనవారిని కఠినంగా శిక్షిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిపింగ్ చెప్పారు. -
ఎర్రకోటపై దాడికి తీవ్ర వాదుల పన్నాగం!
న్యూఢిల్లీ: ఎర్రకోటపై మరోమారు దాడి చేసేందుకు తీవ్రవాదులు కుట్రపన్నారు. ఇప్పటికే భారతదేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించని ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తాజాగా ఎర్రకోటపై దాడి చేసేందుకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. వఖాస్ అనే తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఆ తీవ్రవాది నుంచి ఎర్రకోట ఫోటోగ్రాఫ్ లు, అందుకు సిద్ధం చేసిన ప్రణాళికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు వఖాస్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా జమ్మూలో కతువా ప్రాంతంలో శక్రవారం తీవ్రవాదుల దాడికి పూనుకున్నారు. రెండు చోట్ల చేసిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో సైనికుడు సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆర్మీ బలగాలు ఎదురుదాడి చేసి ముగ్గురు తీవ్రవాదుల్ని హతమార్చారు. -
ఎన్నికలపై ఇండియన్ ముజాహిదీన్ దాడి చేస్తుందా?
ఎన్నికలు పూర్తయేలోపల ఇండియన్ ముజాహిదీన్ దేశంలో భారీ దాడి చేస్తుందా? మే నెలలోపునే ఈ దాడి జరిగే అవకాశం ఉందా? అవుననే అంటున్నారు ప్రొఫెసర్ వి.ఎస్ సుబ్రమణియన్. 'ఎవరే... ఎవరే... ఎవరే సుబ్రమణ్యన్?' అనుకుంటున్నారా. ఆయన అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. లష్కరె తోయబా, ఇండియన్ ముజాహిదీన్ల కార్యకలాపాలను కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సాయంతో అధ్యయనం చేసిన సుబ్రమణియన్ మే నెలలోపు ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తాము తయారుచేసిన కంప్యూటర్ మోడల్స్ ఈ దాడి జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయని ఆయన ఢంకా బజాయిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు భారీ సంఖ్యలో అరెస్టయిన కొన్ని రోజులకే ఉగ్రవాద దాడులు జరిగాయని, అదే విధంగా భారత, పాక్ దౌత్య సంబంధాలు కొద్దిగా మెరుగుపడగానే ఈ దాడులు జరుగుతాయని ఆయన లెక్క వేసి మరీ చెబుతున్నారు. కాబట్టి మే నెలలోపు దాడులు జరగడం ఖాయమని ఆయన అంటున్నారు.సరిగ్గా ఎన్నికల వేడి పుంజుకోగానే ఈ దాడులు జరుగుతాయంటున్నారు ఆయన. ఆదివారం నాడు నరేంద్ర మోడీని టార్గెట్ చేయాలని ప్లాన్ వేస్తున్న నలుగురు ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు అరెస్టు కావడం గమనార్హం. -
మళ్లీ రెచ్చిపోయిన మణిపూర్ ఉగ్రవాదులు
మణిపూర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదుల తూటాలకు ఒక డ్రైవర్ బలయ్యాడు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తరుణిబాలా దేవి అనే మెడికల్ ప్రొఫెసర్ ఉరిపోక్ అనే చోట తన ప్రైవేట్ క్లినిక్ లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఆమెను హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఈ సంఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటి వరకూ బాధ్యత వహించలేదు. తరుణిబాల రాజధాని ఇంఫాల్ లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. మరో సంఘటనలో సేనాపతి జిల్లా కాంగ్పాక్ పి ప్రాంతంలో ఉండే మానస్ అలీ అనే 22 ఏళ్ల యువకుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అలీ లారీ డ్రైవర్. అతని యజమానినుంచి ఉగ్రవాదులు 15 లక్షలు డిమాండ్ చేశారు. యజమాని అంగీకరించకపోవడంతో ఫిబ్రవరి 22 న అలీని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మణిపూర్ లో దాదాపు 40 ఉగ్రవాద సంస్థలున్నాయి. వీటిలో పదిహేను ఉగ్రవాద సంస్థలు అత్యంత ప్రమాదకరమైనవి. గత ఇరవై ఏళ్లలో మణిపూర్ లో ఉగ్రవాద హింసాకాండ 5900 ప్రాణాలను బలిగొంది. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.