Published
Thu, Sep 15 2016 11:36 PM
| Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
సాగుబడిపై ప్రదర్శన
శాఖాపురం(నిడమనూరు) : సాగుబడిపై బొమ్మలద్వారా ప్రదర్శనను ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు గురువారం మండలంలోని శాఖాపురంలో ఏర్పాటు చేశారు. వ్యవసాయ విద్యాలయంలో బీఎస్సీ 4వ సంవత్సరం విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా మండలంలోని శాఖాపురంలో మూడునెలల పాటు రైతులతో కలిసి పని చేయనున్నారు. ఇందులో భాగంగా గ్రామ స్పరూపం, పొలాలకు సంబంధించిన వివిధ అంశాలను అందులో చేర్చారు. కార్యక్రమంలో విద్యార్థులు శివ, సంతోష్, శివకుమార్, ప్రశాంత్, రాజేష్, నాగరాజు పాల్గొన్నారు.