వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి కృషి చేయాలి | Develop the YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి కృషి చేయాలి

Aug 7 2016 7:19 PM | Updated on May 29 2018 4:26 PM

మాట్లాడుతున్న మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి

పెబ్బేరు : గ్రామగ్రామాన వైఎస్సార్‌ సీపీ అభివద్ధికి ప్రతిఒక్కరూ కషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.

-వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌ రెడ్డి
పెబ్బేరు : గ్రామగ్రామాన వైఎస్సార్‌ సీపీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్‌సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఎన్నో అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి  వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ అభివద్ధి జరగాలని, అందరూ కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దేవాచారి, నాయకులు చంద్రశేఖర్, విజయ్‌కుమార్‌ రెడ్డి, కష్ణయ్య, చింతలయ్య, భానుప్రకాష్, జయరాం, భరత్, బాలచంద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement