ఎన్పీకుంట (కదిరి) : ఎన్పీకుంట మండల కేంద్రంలోని ప్రైవేటు ఏటీఎం కేంద్రంలో నకిలీ నోట్లు వస్తున్నాయి. కదిరి – రాయచోటి రహదారిలో ఉన్న ఇండియా ఏటీఎం కేంద్రంలో నకిలీ నోటు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం రూ.2వేలు డ్రా చేశాడు. రూ.2వేల నోటు వచ్చింది. ఆ డబ్బును తన కూతురుకు ఫీజు కట్టడానికి ఇచ్చాడు. కాలేజీ యాజమాన్యం అది నకిలీనోటు అంటూ తిప్పి పంపారు. ఈ ఘటనతో ఈ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లడానికి ఖాతాదారులు జంకుతున్నారు.