ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య | family commits suicide over debt crisis | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య

Published Sun, Jan 15 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

family commits suicide over debt crisis

అల్లాదుర్గం(మెదక్‌): మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ కుటుంబం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన సుభాష్‌(34) అనసూయమ్మ(29) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.


ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రులు కుమారుడు కిట్టు(12)తో కలిసి గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement