అల్లాదుర్గం(మెదక్): మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ కుటుంబం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుభాష్(34) అనసూయమ్మ(29) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రులు కుమారుడు కిట్టు(12)తో కలిసి గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య
Published Sun, Jan 15 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
Advertisement
Advertisement