17, 18 తేదీల్లో పార్మసీ, ఫార్మాడీ తుదివిడత కౌన్సెలింగ్
Published Mon, Aug 15 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఈ నెల 17, 18 తేదీల్లో తది విడత బైపీసీ స్ట్రీమ్, బీ ఫార్మసీ, ఫార్మా డీ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్లు ఆదివారం చెప్పారు. గతంలో హాజరుకాని విద్యార్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, సీట్లు పొందిన విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చని సూచించారు.
Advertisement
Advertisement