Published
Wed, Aug 17 2016 12:58 AM
| Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
ఆర్థికసాయం అందజేత
కోదాడ: పేదరికంలో ఉండి మరణించిన కుటుంబానికి తోటి కార్మికులు, కొందరు నాయకులు ఆదుకొని అండగా నిలిచి తమ మానవతను చాటుకున్నారు. కోదాడలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గుమస్తా మెరిగ గురుస్వామి(40) అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటంబానికి గుమస్తాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తిరపతయ్య, వేంకటేశ్వర్లు సంతాపం తెలియజేసి దహన సంస్కారాలకు రూ.5,010 ఆర్థికసాయాన్ని మృతుని కుటుంబానికి అందజేశారు. అదే విధంగా ఈ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆవుల రామారావు కూడ మృతుని కుటుంబ ధీనపరిస్ధతి చూసి దహన సంస్కారాలకు తనవంతు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండెపంగు రమేష్, వీరయ్య , పాండురంగయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.