kodad
-
దొంగ డాక్టర్ గుట్టు రట్టు
-
అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు...
-
దద్దమ్మలా నోరు మూసుకుని ఉన్నారు.. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ ఫైర్
సాక్షి, సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నాయకులు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారనేది ఆలోచించాలని పేర్కొన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మస్త్రమని, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పంటపొలాలు ఎండాలా, పండాలా? అనేది నిర్ణయిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. గోల్మాల్ చేసి దిగువకు తీసుకొచ్చారు తెలంగాణ రాకముందు 2003లో సాగర్ నీళ్ల కోసం రైతులు తన దగ్గరకు వచ్చినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 24 గంటల్లో నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రస్తావించారు. నాగార్జున సాగర్ పేరు నదిగొండ ప్రాజెక్టని తెలిపారు. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సి ఉండగా.. గోల్మాల్ చేసి 20 కిలోమీటర్లు దిగువకు తీసుకొచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అన్నారు. దద్దమ్మల్లా మారు మాట్లాడలేదు మనం కట్టాలనుకున్న ప్రాజెక్టును ఆపిందెవరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టును ఆపితే నోర్మూసుకొని కూర్చున్నదెవరని నిలదీశారు.. ఇంత జరుగుతున్నా అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకుని పడి ఉన్నారని అన్నారు. దద్దమ్మల్లా మారు మాట్లాడలేదని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే తెలంగాణకు అన్యాయం జరిగింది ‘2001లో నేను గులాబీ జెండా ఎగరేసి ఈ అన్యాయాలపై నిలదీసిన దాక అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో మంత్రులు లేకుండెనా..? చాలా మంది ఉండె. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో ఎవరూ కొట్లాడలేదు. నల్గొడ జిల్లాకు నీళ్లు తేలేదు. రైతులు కోరితే మొన్న సాగర్నుంచి నీళ్లు విడుదల చేశాం. మరోసారి నీళ్లను విడుదల చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ను రప్పించాలని కోరుతున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే రెండు పంటలు పండుతాయి. మల్లయ్య యాదవ్ గెలవరంటూ చాలామంది అన్నారు. గెలవకున్నా పర్లేదు.. టికెట్ ఇస్తానని అని చెప్పాను. మలమలయ్య యాదవ్ను గెలిపిస్తే కోదాడలో బీసీ భవన్ కట్టిస్తా. నీళ్ల కోసం కోదాడనుంచి హలియా వరకు పాదయాత్ర చేశా. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష. డీకే శివకుమార్ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ కాళేశ్వరం నీళ్లు కోదాడలో కనిపించడం లేవని భట్టి విక్రమార్క అంటున్నారు. కాంగ్రెస్ ఉంటే గోదావరి నీళ్లు ఇక్కడి వరకు వచ్చేవా?. రైతుల కోసం 24 గంటలు ఇస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు 3 గంటలే కరెంట్ చాలని మాట్లాడుతున్నారు. కరెంట్ మూడు గంటలు కావాలా? 24 గంటలు కావాలా?. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణిని తీసేస్తామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే మొదటికే మోసం వస్తుంది’ అని కేసీఆర్ మండిపడ్డారు -
కాంగ్రెస్, టీడీపీకి బీఆర్ఎస్ బ్రేక్.. కోదాడలో ఉత్కంఠ పోరు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్ అయిన కోదాడలో ఏపీ రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో టిల్లర్ల ఓటు బ్యాంక్ ప్రభావం ఉన్న నియోజకవర్గం ఇది. ఏపీ, తెలంగాణకు ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాలు కలిసిన వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ తెలంగాణవాదం తక్కువే. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచారు. కానీ ఫస్ట్టైం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు... కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలకు బీఆర్ఎస్ బ్రేక్: నిజానికి కోదాడ నియోజకవర్గం మొదట కాంగ్రెస్కు.. తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా సైకిల్ దిగి కారెక్కారు. దాంతో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లింది. దాంతో మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు : ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నట్లు కనిపించినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకే మరోసారి టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్తమ్ పద్మావతీ పోటీ చేయనున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో రెండు పదవులు అంశం తెరపైకి వస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి నూకల పద్మారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ నియోజవర్గం నుంచి వెళ్తున్నా మోతే లాంటి ప్రాంతాలకు చివరి భూములకు నీరు అందడం లేదని అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఇక కోదాడలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురికావడం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ కబ్జాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్తు టాక్ నడుస్తోంది. మరోవైపు దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం కూడా పెను దుమారాన్ని లేపింది. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ ప్రధానంగా రైతులు, వ్యాపారంపైనే అధికంగా ఆధారపడి ఉంటారు. రైసు మిల్లులు కూడా అధికంగా ఉంటాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో సెటిలర్స్ కూడా ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నిర్ణాయాత్మక పాత్రను పోషిస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి 32427 ఓట్లు, రెడ్డి 24365, గౌడ 22673 , లంబాడా19988, యాదవ్ కులస్తులు -16473, మల 11673, కమ్మ 11628, ముదిరాజ్ 9961, పెరిక 9384, ముస్లీం 8 వేలు భౌగోళిక పరిస్థితులు.. ఆలయాలు : కోదాడ మండలం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా నిత్యం భక్తులు వస్తుంటారు. అనంతగిరి మండలం గొండ్రియల రామాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మునగాల మండలం రేపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బరకత్ గూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం. నదులు : ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. -
అసలు కట్టప్పలు వేరే ఉన్నారు: ఉత్తమ్
సాక్షి, సూర్యాపేట: సామాజిక మాధ్యమాల్లో తనతో పాటు తన సతీమణి పద్మావతిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్లు పెడుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. దీని వెనుక పార్టీకి చెందిన ముఖ్యుల హస్తం ఉందని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్నగర్లలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఫిర్యాదుతో అరెస్టయిన వారు చిన్న వారని, వారి వెనుక ఉన్న అసలు కట్టప్పలు త్వరలో బయటకు వస్తారన్నారు. తన సతీమణి పద్మావతి ఎయిర్పోర్టులో యాధృచ్చికంగా కొంత మంది బీఆర్ఎస్ మహిళా నేతలను కలుసుకుంటే.. ఆమె బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీలో వసతి కల్పించారంటూ ఎయిర్పోర్టు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఉత్తమ్ అన్నారు. కొంత కాలంగా తమను కావాలనే బదనాం చేస్తున్నారని, వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. ‘మీ అందరికీ తెలుసు. మాకు పిల్లలు లేరు. మీరే మా కుటుంబం అని రాజకీయం చేస్తున్నాం. మాకు వేరే వ్యాపకం, వ్యాపారం లేదు. 24 గంటలూ ప్రజా జీవితం, రాజకీయమే’అని ఆయన తెలిపారు. కోదాడలో 50 వేల మెజారిటీ రావాలి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి అధికార పార్టీని చిత్తుగా ఒడిద్దామని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కోదాడలో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని, 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ -
ఒక్క ఓటు తగ్గినా గుడ్బై
కోదాడరూరల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ఈ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 1994లో ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేసి కోదాడ రాజకీయాల్లోకి వచ్చానని, 1999 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచినా కోదాడ, హుజూర్నగర్, హైదరాబాద్ల్లో అద్దె ఇంటిలోనే ఉంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఒక్కసారి గెలిచినవారే కోట్ల రూపాయలు పెట్టి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే వారి అవినీతి, దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు, తహసీల్దార్, ఎంపీడీవో, జిల్లా అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని, వారు చెప్పిన వారికే పనులే చేస్తున్నారని విమర్శించారు. అలాంటి అధికారులు, నాయకులు భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల తనపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని( పార్టీ మార్పును ఉద్దేశించి), వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఉత్తమ్ చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురికావద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. -
మే 26న వివాహం.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
కోదాడ: కష్టపడి చదివి.. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ .. వివాహం కోసం స్వదేశం వచ్చిన ఆ యువకుడు పెళ్లి చేసుకొని 16 రోజులు పండుగ జరుపుకోవాలనే సంతోషంలో ఉండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంభాలలో తీరని విషాదం మిగిల్చిన సంఘటన పలువురిని కలిచి వేచింది. గురువారం నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అడపా పృథ్వీ (27) కుటుంబం మొత్తం విషాదంలో కూరుకొని పోయింది. కోదాడకు చెందిన అడపా రాజేందర్ కుమారుడు పృథ్వీ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న విజయవాడ సమీపంలోని కీలేశ్వరపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం కావడంతో మే నెలలో ఇండియాకు వచ్చారు..మేనెల 26న వివాహం జరిగింది. గత సంవత్సరం కరోనా సమయంలో యువతి తల్లిదండ్రులు మరణించడంతో మేనమామలు దగ్గరుండి వీరి వివాహం జరిపించారు. చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..) ఈనెల 10న పదహారు రోజుల పండుగ జరగాల్సి ఉంది. 11న కెనడా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో హలియాలో ఉన్న చిన్ననాటి మిత్రుడిని కలవడానికి తండ్రితో కలిసి వెళ్లాడు. గుగూల్ మ్యాప్ పెట్టుకొని వెళ్లడంతో అది మిర్యాలగూడ మీద నుంచి కాకుండా నకిరేకల్ మీదుగా చూపించడంతో నకిరేకల్ నుంచి నల్లగొండ మీదుగా వెళ్లాడు. ఈ క్రమంలో నల్లగొండ– నకిరేకల్ మధ్యలో మూల మలుపువద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. పదహారు రోజుల పండుగ చేసుకుంటామనే ఆనందంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు నూతన వధువు పృథ్వీ మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పృథ్వీ అమ్మమ్మ గతంలో కోదాడ పంచాయతీ వార్డు మెంబర్గా పని చేసింది. పృథ్వీ తండ్రి కోదాడలో కిరోసిన్ డీలర్ కాగా తల్లి లెనిన్కుమారి గృహిణి. ఇతడికి చెల్లెలు ఉంది. శనివారం కోదాడలో పృథ్వీ అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఏర్పాట్లు చేశారు. -
సూర్యాపేట: కోదాడ బైపాస్లో రోడ్డు ప్రమాదం
-
షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్
Fans Gave Shock To Anupama Parameswaran: ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వెళ్లిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్కు ఫ్యాన్స్ షాకిచ్చారు. సోమవారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక షాపింగ్ మాల్ను ప్రారంభించిన అనుపమ కాసేపు మీడియాతో ముచ్చటిచ్చింది. అనంతరం ఆమె తిరుగు ప్రయణమవుతుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్, స్థానికులు ఎగబడ్డారు. చదవండి: త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్ హీరోయిన్ అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో తను కాసేపు ఇక్కడే ఉండాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆకతాయిలు ఆమె కారు టైర్లలో గాలి తీశారట. దీంతో ఫ్యాన్స్ తీరుకు అనుపమ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో షాపు నిర్వాహకులు అనపమకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్కు పంపించారట. కాగా అనుపమ చివరిగా ‘రౌడీ బాయ్స్’లో సందడి చేసింది. తాజాగా ఆమె నటించిన ‘18 పేజెస్’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘కార్తికేయ 2’, ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: టికెట్ రేట్ల గురించి వేడుకుంటే తప్పేం కాదు: చిరంజీవి -
నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై..
సాక్షి, ఖమ్మం రూరల్ : నువ్వే నా లోకం.. అంటూ ప్రేమ పేరిట దళిత యువతి వెంట పడిన యువకుడు, శారీరకంగా ఒక్కటైన అనంతరం పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్రోడ్డులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. కోదాడ క్రాస్రోడ్డులో నివసిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన గునిగంటి పవన్కృష్ణ, భద్రాద్రి జిల్లా చర్లకు చెందిన దళిత యువతి సీహెచ్. దీప్తిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా, శారీరకంగా కలవడంతో దీప్తి గర్భం దాల్చింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా పవన్కృష్ణ కాలయాపన చేస్తుండడంతో ఈనెల 15న ఆయన ఇంటి ఎదుట మౌనదీక్ష చేపట్టింది. ఆ సమయాన పవన్కృష్ణ కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు సర్దిచెప్పడంతో దీక్ష విరమించినా ఆ తర్వాత ఫలితం లేకపోవడంతో బుధవారం పురుగుల మందు తాగింది. దీంతో రూరల్ పోలీసులు ఆమెను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో దీప్తి మాట్లాడుతూ.. తనను శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసిన పవన్ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తల్లిదండ్రులు కూడా లేని తనకు న్యాయం చేయాలని తెలిపారు. గతంలో అబార్షన్ చేయించుకోవాలని సూచించగా, భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంతో పాటు చర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాక కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్న పవన్కృష్ణ, తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ఈమేరకు అధికారులు స్పందించిన పవన్తో తన పెళ్లి జరిపించాలని ఆమె కోరారు. -
వాట్ యాన్ ఐడియా.. లారీ కాదండోయ్.. ఫైవ్ స్టార్ స్టైల్ హోటల్!
సాక్షి, కోదాడరూరల్(నల్గొండ) : వారికొచ్చిన ఓ ఐడియాతో లారీని ఫైవ్స్టార్ లుక్లో హోటల్గా తయారు చేశారు.. ఇద్దరు వ్యక్తులు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శివ అతని స్నేహితుడు యశ్వంత్ పాత లారీని కొనుగోలు చేసి దానిని ప్రయాణికులను, ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి హోటల్గా మార్చారు. దానిని హైదరాబాద్ విజయవాడ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్రోడ్లో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం టిఫిన్, ఫాస్ట్ ఫుడ్తో పాటు పలు రకాల టీలు, కాఫీలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే రెస్టారెంట్ తరహాలో రూపొందించి అన్ని రకాల తినుబండారాలు అందిస్తామని అంటున్నారు. ఈ హోటల్ రహదారిపై వచ్చిపోయే ప్రయాణికులు వాహనాలను నిలిపి ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు చిన్న ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో రోడ్డు వెంట పెట్టి హోటల్స్ నిర్వహించడం చూశాము కానీ ఈ తరహాలో చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. -
మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?
సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆమెది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ప్రజాప్రతినిధులుగా అమ్మానాన్న చేస్తున్న సేవలను చిన్నప్పటినుంచీ చూసిన ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఓవైపు ఫ్యాషన్ డిజైనర్గా, ఇంటీరియర్ డిజైనర్గా రాణిస్తూనే రాజకీయంవైపు అడుగులు వేసింది. పలు పార్టీల్లో చేరి పుట్టినింట తన అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నా సాధ్యపడలేదు. కానీ మెట్టినింట మాత్రం తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది. ఆమె కోదాడ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్రెడ్డి కూతురు శ్రీకళారెడ్డి. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికై ప్రజాసేవబాటలో తొలి అడుగువేసింది. జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికైన తర్వాత తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రత్నవరం. మా నాన్న కీసర జితేందర్రెడ్డి కోదాడ సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మా అమ్మ కీసర లలితారెడ్డి. గ్రామ సర్పంచ్గా పని చేశారు. వారికి నేను ఒక్కదానినే సంతానం. మానాన్న యుక్త వయస్సులో ఉండగా పులితో కలబడ్డాడు. ఆయన చేతిని పులి గాయపర్చినా లెక్క చేయకుండా దాన్ని చంపారు. అందరూ ఆయనను పులి అంటారు. ఆయన బిడ్డను కాబట్టి నేను పులి బిడ్డను. నా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్లోనే సాగింది. ఫ్యాషన్ డిజైనర్గా, ఇంటీరియర్ డిజైనర్గా కొంత కాలం పని చేశాను. రాజకీయరంగ ప్రవేశం ఇలా.. మా తండ్రి జితేందర్రెడ్డి 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ– ఆంధ్ర సరిహద్దు పాలేరు వంతెన వద్ద జరిగిన పోరులో ముందుండి కోదాడ పట్టణా న్ని కాపాడాడు. ఆ తరువాత కో దాడ సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మాఅమ్మ లలి తారెడ్డి మా స్వగ్రామం రత్నవరానికి సర్పంచ్గా పని చేశారు. వారిని చూసి స్ఫూర్తిపొంది చిన్నతనం నుంచే రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలనుకున్నాను. 2004 నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీల నుంచి కోదాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా దక్కించుకోలేకపోయాను. తరువాత బీజేపీలో చేరాను. భర్త, మామ ప్రోత్సాహంతో.. పుట్టింట రాజకీయరంగ ప్రవేశం చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరలేక పోయా. ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్సింగ్తో వివాహం జరగడంతో ఉత్తర్ప్రదేశ్లో స్థిరపడ్డాను. మా మామగారు రాజ్దేవ్సింగ్ కూడా ఉత్తరప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే. వారి ప్రోత్సాహంతోనే ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా పరిధిలోని మలహాని నియోజకవర్గ పరిధిలో టిక్రరా మండలం నుంచి బీజేపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేశా. రెబల్ అభ్యర్థి ఉన్నప్పటికీ 12,900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. 83 మంది జెడ్పీటీసీల్లో 43 మంది మద్దతు తెలపడంతో జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యాను. మహిళలకు అండగా.. ప్రజాసేవ చేయాలనే లక్ష్యానికి ఇన్నాళ్లకు ఒక వేదిక దొరికింది. దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంత చేయగలనో అంత చేయ్యాలన్నదే నా లక్ష్యం. త్వరలోనే జిల్లా పరిస్థితులపై అవాహన ఏర్పర్చుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్తాను. -
ఒకరిది మానవత్వం... మరొకరిది ‘పైసా’చికత్వం
కోదాడ: కరోనాతో మృతి చెందాడని బంధువులు ముఖం చాటేశారు.. తమకు ఎక్కడ అంటుకుంటుందేమోనని అయినవారు ఆమడదూరం పారిపోయారు. కానీ... మనిషిలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని దానికి కుల మతాలు ఉండవని కొందరు ముస్లిం యువకులు నిరూపించగా.. ఎలా పోతే మాకేంటి పైసలే మాకు పరమావధి అన్నట్లు మరికొందరు ప్రవర్తించి దహనసంస్కారాలు చేయడానికి వచ్చిన వారి నుంచి మృతదేహాన్ని కాల్చినందుకు రూ.32 వేలను శ్మశానం సాక్షిగా వసూలు చేసి తమలోని ‘పైసా’చికత్వాన్ని చాటుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మహంకాళి గోపాలకృష్ణమూర్తి (70) కరోనాతో మృతి చెందాడు. ఇతడు దివ్యాంగుడు. ఈయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. కరోనాతో మృతి చెందడంతో బంధువులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కేవలం ఇద్దరు బిడ్డలు, ఆయన సోదరుడు హుస్సేన్రావు మాత్రమే వచ్చారు. ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆరుగురు ముస్లిం యువకులు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. మృతదేహాన్ని ఇంటినుంచి బయటికి తీసుకురావడంతో పాటు హిందూ శ్మశానవాటిక వద్దకు చేర్చారు. అక్కడ కూడా మృత దేహాన్ని వారే చితి మీదకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదంతా వారు ఉచితంగా సేవాదృక్పథంతో చేయడం గమనించదగ్గ విషయం.. రూ. 32 వేలు.. నిలబెట్టి వసూలు చేశారు.. కరోనాతో మృతి చెందిన గోపాలకృష్ణమూర్తి అంత్యక్రియలకు కోదాడ హిందూ శ్మశానవాటికలో రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని అక్కడ ఉన్నవారు డి మాండ్ చేసి మరీ వసూలు చేసినట్లు మృతుడి సోదరుడు హుస్సేన్రావు తెలిపాడు. చితి కోసం కేవలం ఆరుక్వింటాళ్ల కట్టెలు పెట్టి రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఇచ్చిన తర్వాతే మృతదేహాన్ని కాల్చారని వాపోయాడు. ఈ విషయాన్ని ఆయన రికార్డు చేసి సామాజికమాధ్యమంలో పెట్టడంతో చర్చనీయాంశమైంది. కరోనా మృతదేహాల దహనం కోసం సిబ్బందిని పెట్టామని పురపాలకసంఘం అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా అక్కడ ఎవరూ లేరని ఈ దోపిడీపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: పెట్రోల్, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు -
'నేను చనిపోతున్నా.. పిల్లల్ని బాగా చూసుకో'
సాక్షి,కోదాడ: భార్యకు వీడియో కాల్ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయిబాబా థియేటర్ బజార్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్(32) టాటాఏస్ వాహనం డ్రైవర్గా పని చేస్తుంటాడు. లాక్డౌన్ కారణంగా పనిదొరక్క పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెలరోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. పని లేకపోవడం.. తాగుడుకు అలవాటుపడిన అశోక్ భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. శుక్రవారం రాత్రి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పిల్లలను మంచిగా చూసుకో అని భార్యకు వీడియో కాల్ చేసి చెప్పాడు. వెంటనే వారు కోదాడకు వచ్చి చూసేవరకు అప్పటికే అశోక్ మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి దావిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ సైదా తెలిపారు. -
చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు.. ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, కోదాడ: ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మతాలు వేరు కావడం.. ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయన్న భయం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారో లేదోనన్న ఆందోళన.. వెరసి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన చేగొండి రామయ్య, తిరపమ్మ దంపతుల చిన్న కుమారుడు మణికంఠ అలియాస్ సాయి (20) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయి ఇంటి సమీపంలో ఎస్కె.కరీమా కూతురు ఫాతిమా (16), కుమారుడితో కలసి నివాసం ఉంటోంది. కోదాడలోని ఉర్దూ పాఠశాలలో ఫాతిమా ఆలిమ్ కోర్సు చదువుతోంది. కాగా, సాయి, ఫాతిమా ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం సాయి రాత్రి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేస్తున్నావ్ అంటూ తండ్రి మందలించాడు. దీంతో మరుసటి రోజు నుంచి సాయి కనిపించకుండా పోయాడు. యాసిడ్ తాగి చెరువులో దూకారా? శుక్రవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన స్థానికులు చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు, రెండు గ్లాసులను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల నోట్లో నుంచి నురగలు వచ్చాయి. యాసిడా.. లేదా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (సహజీవనం చేస్తూ ‘రిచ్’గా బిల్డప్.. పక్కాగా చీటింగ్) -
కోదాడలో దారుణం: ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కోదాడ లక్ష్మిపురం కాలనీకి చెందిన సాయి(19) ఐటీఐ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇతడికి అదే కాలనీకి చెందిన ఫాతిమా(15)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సాయి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఫాతిమా నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వీరద్దరూ కోదాడ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీరి శవాలు వెలుగు చూశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. చదవండి: ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య! -
కాటికి పంపేవారే కరువయ్యారు!
కోదాడ: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తుందో నిరూపించే విషాద ఉదంతమిది. ఊరంతా బలగం ఉన్నా.. కనీసం కడసారి చూపునకైనా కన్నెత్తి చూసినవారు కానరాలేదు. కాటికి సాగనంపడానికి.. పాడెమోసేందుకు నలుగురు బంధువులు కరువయ్యారు. దీంతో కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న మనుమడు పుట్టెడు కష్టంలో ఒక్కడే నాయనమ్మను కారులో కాటికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మునగాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు కుమారులు చనిపోయారు. దీంతో ఆమె కొద్దిరోజులుగా రెండో కుమారుడి కొడుకు (మనుమడి) వద్ద ఉంటోంది. అనారోగ్యంతో ఆదివారం ఆమె మృతిచెందింది. ఇదే సమయంలో ఆమె మనుమడు వేరేచోట కరోనా పాజిటివ్తో హోం ఐసోలేషన్లో ఉన్నాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్ని చూసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గ్రామానికి చెందిన కొందరు ఈ విషయాన్ని మనుమడికి చెప్పగా, తన పరిస్థితిని వివరించి బోరున విలపించాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక గ్రామానికి చెందిన నలుగురు పెద్దలు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. రాత్రి 7 గంటల సమయంలో పాజిటివ్తో ఇబ్బంది పడుతున్న మనుమడు పీపీఈ కిట్ ధరించి కారులో ఇంటికి వచ్చి మృతదేహాన్ని ఒక్కడే కారులోకి చేర్చాడు. అదే కారును నేరుగా శ్మశానం వద్దకు తీసుకెళ్లి నాయనమ్మ అంత్యక్రియలు నిర్వహించాడు. -
కోదాడలో సీనియర్ సిటిజన్లకు పరీక్షలు చేయండి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో కేరళ రెవెన్యూ కాలనీలోని సీనియర్ సిటిజన్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో సి.విద్యాధర భట్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఓరల్ టెస్టింగ్ ల్యాబ్స్’ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ఈ అంశంపై ఆదేశాలివ్వాలంటూ ఆర్టీఐ, సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కమిషన్కు చేసిన ఫిర్యాదును విచారించి పై విధంగా స్పందించారు. కోవిడ్–19 పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి స్పందించవచ్చునని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్దారు కోరినట్టుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. -
కోదాడలో మహిళా రైతు ఆత్మహత్య యత్నం
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తన వ్యవసాయ భూమి కబ్జాకు గురికావడంతో ఆమె పురుగుల మందు తాగినట్టుగా తెలుస్తోంది. ఇది గమనించిన బాధితురాలి బంధువులు ఆమె చర్యను నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే మహిళా రైతును స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు బాధితురాలి భూమిని కబ్జా చేసినట్టు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు రక్షణగా ఉండాల్సిన సర్పంచే తన భూమిని కబ్జా చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైనట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ, తెలంగాణ సరిహద్దు మూసివేత
సాక్షి, ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు. మహారాష్ట్ర సరిహద్దు బంద్.. మహారాష్ట్ర మనకు పొరుగు రాష్ట్రం కావడం పెద్ద భయం. అక్కడ కోవిడ్–19 బాగా పెరుగుతోంది. మహారాష్ట్రతో మనకు ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందెడ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఆ రాష్ట్రంతో సరిహద్దులు మూసేయాలని ఆలోచిస్తున్నం. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ముందు చెప్పి సరిహద్దులు మూసేస్తం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ రాకుండా రాష్ట్ర సరిహద్దులను మూసేస్తాం. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిరంతరం టచ్లో ఉన్నారు. ఢిల్లీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నాం. -
లెక్కిస్తానని చెప్పి నొక్కేశాడు
కోదాడరూరల్ : అంకుల్ నీ డబ్బులకు సిరా అంటుకుంది నేను లెక్కిస్తా ఉండు అని చెప్పి అతడి వద్ద రూ.44వేలు నొక్కేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఈ సంఘటన కోదాడ ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని కాపుగల్లుకు చెందిన నర్రా వెంకటయ్య తన అవసరాల నిమిత్తం బ్యాంకుకు వచ్చి రూ.లక్ష విత్డ్రా చేశాడు. అనంతరం ఆయన అక్కడే కూర్చొని నగదును లెక్కిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చాడు. అంకుల్ మీ నగదుకు సిరా అంటుకుంది, ఇవి బయట చెల్లవు.. ఓ సారి నేను లెక్కిస్తా అని మాయమాటలు చెప్పి అతడి దృష్టి మళ్లించి ఇరవై రెండు రూ.2వేల నోట్లను జేబులో పెట్టుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత వెంటకయ్య మరోసారి లెక్కించగా నగదు తక్కువ ఉండడంతో లబోదిబో అంటూ వెళ్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై ఎస్ఐ క్రాంతికుమార్ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. -
కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!
సాక్షి, కోదాడ: సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ కోదాడలో మరో గొలుసుకట్టు వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలువురు ప్రముఖులు దీనిలో భాగస్వాములు కావడంతో సామాన్యులు సులువుగా మోసపోతున్నారు. రూ.12 వేలు చెల్లిస్తే సభ్యత్వంతో పాటు అంతే విలువైన ఉత్పత్తులను (వివిధ రకాలైన వస్తువులు) ఇస్తామని వీటి అమ్మకం వల్ల రూ.2వేల లాభం వస్తుందని, మరో ఇద్దరిని చేర్పిస్తే మరో రూ.3 వేల లాభం వస్తుందని ఇలా సభ్యులు చేరినా కొద్దీ రూ.లక్షలు మీ జేబుల్లో వచ్చి పడతాయని చెపుతుండడంతో పలువురు వీరి వలకు చిక్కుతున్నారు. దీని వ్యవహారం ఏమిటంటే.. ఇప్పటికే అనేక మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులకు కుచ్చుటోపీ పెట్టి నిండా ముంచుతున్న ఉదంతాలు వెలుగు చూస్తుండగా తాజాగా మరో కంపెనీ కోదాడ ప్రాంతంలో గుటుచ్చప్పుడు కాకుండా తన కార్యకలాపాలు సాగిస్తోంది .‘ఇండుస్ వివా’ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ వ్యాపారం ముందుగా నాలుగు రకాల వస్తువులైనా ఐస్లిమ్, ఐకాఫీ, ఐ పల్స్, ఐ చార్జీలను అంటగడుతున్నారు. వీటి కోసం 12,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని అమ్ముకోవడం వల్ల రూ.2 వేల కమీషన్ వస్తుందని, దీంతో పాటు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా మరో రూ.5 వేలు, వారు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా చైన్ పెరిగి మీ ఖాతాల్లో రూ.లక్షలు జమ అవుతాయని నమ్మబలుకుతూ తేలిగ్గా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యాపారం అంతా రహస్యంగా కొంత మంది తమ ఇళ్లలో సాగిస్తున్నారని సమాచారం. అబ్బో.. కేన్సర్ కూడా తగ్గుతుందట...! ఎక్కడ తయారు అవుతున్నాయో, వాటిలో ఏముంటాయో తెలియకుండా వీరు నాలుగు రకాల ఉత్పత్తులను అంటగడుతున్నారు.. వీటిలో ఐ స్లిమ్ వాడితే ఎంత లావు ఉన్నా ఒక్క నెలలోనే స్లిమ్గా తయారవుతారట. ఇక ఐ ఫల్స్ తాగితే ప్రాణాంతకమైన కేన్సర్ కూడా తగ్గుతుందట. దీనిలో అసైబెర్రీ అనే ఫలరసం ఉంటుందని, ఇది అమెజాన్ అడవుల్లోనే ఉంటుందని మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. ఇక ఐ చార్జీ వాడితే వెంటనే బాడీలో శక్తి వచ్చి పరుగులు పెట్టవచ్చట. ఇలా ఈ ఉత్పత్తుల్లో ఉన్న బ్రహ్మపదార్థం ఏమిటో అర్థం కాక వైద్యులే తలపట్టుకుంటున్నారు. వీరు మాత్రం సులువుగా మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులు వీరి వలకు చిక్కుతున్నారు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు సామాన్యులను బురిడీ కొట్టించడానికి వీరు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు పెడతారు. సూటు, బూటు వేసుకుని కనికట్టు మాటలతో మభ్యపెడుతుంటారు. అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. అంతేకాక కొంత మందిని తీసుకొచ్చి ఇప్పటికే రూ.లక్షలు తమ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నట్లు చెప్పిస్తుంటారు. దీంతో పలువురు యువకులు తమ తల్లిదండ్రులు వద్దంటున్నా వీరికి సొమ్ముచెల్లించి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
బతికున్నవారిని చనిపోయినట్లుగా చూపి..
సాక్షి, హైదరాబాద్: బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్.ఐ.సి సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కయిన ఈ కుంభకోణంలో మొత్తం రూ.3.13 కోట్ల ఎల్.ఐ.సి. డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. వివరాలు.. కోదాడ ఎల్.ఐ.సి కార్యాల యంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసే బానోత్ బీకూనాయక్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గులోతు హర్యా (ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు) మరో ఉద్యోగి పి.రఘుచారి 8 మంది ఎల్.ఐ.సి. ఏజెంట్లతో కుమ్మక్కు అయ్యారు. నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి వాటి ఆధారంగా ఎల్.ఐ.సి.కి చెందిన రూ.3,13,78,733 డ్రా చేసుకున్నారు. పత్రా ల్లో పేర్కొన్న నామినీల బ్యాంకు ఖాతాల్లో కాకుండా సొంత ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకున్నారు. సొంత తండ్రినీ వదల్లేదు.. 2006 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 190 నకిలీ పాలసీలు సృష్టించి రూ.3 కోట్లకుపైగా తమ జేబులో వేసుకున్నారు. ప్రధాన నిందితుడు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీకూ నాయక్ తన తం డ్రి బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించడం గమనార్హం. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన కోదాడ ఎల్.ఐ.సి. చీఫ్ మేనేజర్ ఎడ్ల వెంకటేశ్వర్రావు విచారణ జరిపారు. అంతర్గత విచారణంలో వీరి భాగోతాలు వెలుగుచూశాయి. దీంతో ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని సీబీఐకి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో బీకూనాయక్, గుగులోత్ హర్యా, ఏజెంట్లు పి.రఘుచారి, ఎ.కొండయ్య, పి.సురేశ్, ఎం.దానమూర్తి, టి.సరేందర్రెడ్డి, బి.విజయ్కుమార్, వి.సైదాచారి, భూక్యా రవి, కల్వకుంట్ల వెంకన్నలపై ఐపీసీ 120(బి), 409, 420, 465, 467, 468, 471, 477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
విజయమే లక్ష్యంగా ముందుకుపోదాం
సాక్షి, కోదాడ : లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివా రం కోదాడ పట్టణంలోని గన్నా సర్వయ్య ఫంక్షన్హాలులో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలతో పాటు తెలంగాణలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందన్నారు. మోసపూర్తి మాటలు, వాగ్ధానాలు, గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమితో ఆ పార్టీ పతనానికి పునాది పడినట్లేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. వారితో ఓటు వేయించుకోవడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. రాహూల్గాంధీ ప్రధాని కావడం ఖాయమని అందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హుజూర్నగర్లో సోమవారం జరగనున్న రాహూల్గాంధీ సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కోదాడకు చెందిన న్యాయ వాది నాళం రాజన్న, మునగాల మండల నాయకుడు వేమూరి సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, టీపీసీసీ పరిశీలకుడు ఎం.అనిల్కుమార్, నాయకులు పారా సీతయ్య, వంగవీటి రామారావు, వీరేపల్లి సుబ్బారావు, బషీర్, బాగ్ధాద్, వంటిపులి వెంకటేష్, పాలకి అర్జున్, ధనమూర్తి, వాడపల్లి వెంకటేశ్వర్లు, సైదిబాబు, రంగారావు, వీరారెడ్డి, సంగిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
కోదాడ : కేసులో ఉన్న లారీలను విడుదల చేయడానికి లంచం తీసుకుంటూ కోదాడ పట్టణ ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ అనంద్కుమార్, సీఐ రఘుబాబు, వెంకట్రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన డి. వెంకటేశ్వరరావుకు లారీ ట్రాన్స్పోర్టు కంపెనీ ఉంది. వీటి ద్వార కొత్తగూడెం నుంచి కర్ణాటకకు బొగ్గు రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలో బొగ్గును మధ్యలో కల్తీ చేసి నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారని, ఈ కల్తీ కోదాడ పరిధిలో జరుగుతోందని సదరు కంపెనీ కోదాడ పట్టణ పోలీస్స్టేషన్లో గత సంవత్సరం నవంబర్లో ఫిర్యాదు చేసింది. మూడు లారీలను కోదాడ పోలీసుల స్వాధీనం చేసుకుని దీనిపై క్రైం నంబర్ 373/2018 ద్వార 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై సదరు వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లి లారీల విడుదలకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిలో భాగంగా కోర్టు ఉత్తర్వులతో లారీలను విడుదల చేయడానికి పట్టణ ఎస్ఐ కేటీ మల్లేశ్ను సంప్రదించారు. మూడు లక్షల రూపాయలు డిమాండ్... కోర్టు ఉత్తర్వుల ప్రకారం లారీల విడుదల చేయడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోదాడటౌన్ ఎస్ కె.టి.మల్లేష్ డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని వెంకటేశ్వరావు ప్రాథేయపడగా చివరకు రూ.1.90వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని వెంకటేశ్వరరావు నల్లగొండ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల ప్రకారం శుక్రవారం డబ్బులను తీసుకుని వెంకటేశ్వరరావుతో పాటు ఆయన అనుచరుడు సురేష్ మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాల సమయంలో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. ఎస్ఐను కలవగా వెంకటేశ్వరరావును అక్కడే ఉండమని డబ్బులు తీసుకుని సురేష్ను తన కారు (నెం: టీఎస్ 29 బి 0006)లో కూర్చోమని చెప్పాడు. అనంతరం తాను స్టేషన్ నుంచి బయటకు వచ్చి కారు తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. వీరిని ఏసీబీ అధికారులు అనుసరించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎస్ఐ కారును సందులు, గొందులు తిప్పుతూ మధ్యలో సురేష్ను డబ్బుతో సహా దించి వేశాడు. ఇది గమనించిన ఏసీబీ అధికారుల ఎస్ఐని వెంటాడి శ్రీరంగాపురం వద్ద పట్టుకున్నారు. డబ్బుతో పాటు కారును సీజ్ చేసి కోదాడ డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఉలిక్కిపడిన కోదాడ ఎస్ఐ కె.టి మల్లేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడంతో కోదా డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందులోనూ పోలీస్ అధికారి చిక్కడం ఇంకా సంచలనం కలిగిం చింది. ఇప్పటి వరకు కోదాడలో పోలీసు అధికారి అవినీతి నిరోధక చిక్కిన దాఖలాలు లేవు. గడిచిన 20సంవత్సరాల కాలంలో కోదాడలో ఏసీబీకి చిక్కిన మూడో అధికారి కెటి,మల్లేష్. గతంలో వ్యవసాయశాఖ అధికారిగా పనిచేసిన సింగారెడ్డి, ఎన్ఎస్పీ ఏఈ దర్గయ్య ఏసీబీ ట్రాప్లో చిక్కుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కె.టి మల్లేష్ 2014వ బ్యాచ్కు చెందిన ఈయన మొదటిసారి ఎస్ఐగా సూర్యాపేట జిల్లా పెన్పహడ్లో పని చేశారు. 2018 జూలైలో కోదాడ పట్టణ ఎస్ఐగా వచ్చారు. శుక్రవారం అనూహ్యంగా ఆయన ఏసీబీకి చిక్కారు. పట్టణ ఎస్ఐ ఏసీబీ చిక్కారని తెలియడంతో కోదాడ పట్టణ స్టేషన్లో నిశబ్ద వాతావరణం నెలకొంది. ఒక్క అధికారి, కానిస్టేబుల్కానీ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. పోలీసుల ఏసీబీ చిక్కారని బయటకు తెలిస్తే పరువు పోతుందని, ఇది కోదాడ స్టేషన్కు మాయని మచ్చ అని పలువురు వాపోయారు. -
కొమురబండ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, సూర్యాపేట: కోదాడ మండలం కొమురబండ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు అదుపుతప్పి ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కార్లు బలంగా ఢీ కొనడంతో వాహనాల్లో ఉన్నవారు దగ్గర్లోని పొల్లాలో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఒక కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద తీవ్రతను చూస్తే.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి పండగ ముగించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా.. ఇద్దరు ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి
సాక్షి, కోదాడ: సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆరుగురు ఏపీ సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారం సెలవులు ముగించుకుని.. సోమవారం విధులకు హాజరుకావడానికి అమరావతికి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం కోదాడ మండలం దొరకుంట వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు రోడ్డు దిగి దాదాపు 50 మీటర్లు వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులను భాస్కర్ రావు, హరికృష్ణలుగా గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కోదాడలోని విజయ హాస్పిటల్కు తరలించారు. మరో ఉద్యోగి విజయలక్ష్మీ పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైఎస్ జగన్ సంతాపం.. రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగులు మృతిచెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
నిండా ముంచేశాడు..!
తొలుత అతనో కానిస్టేబుల్.. ఆపై మరొకరితో పరీక్ష రాయించి ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు.. ఆ మోసం బయటపడడంతో సస్పెన్షన్కు గురయ్యాడు.. అనంతరం కొందరి సహకారంతో అధిక వడ్డీ ఆశచూపి వసూళ్ల పర్వానికి తెరలేపాడు.. మొదట నమ్మకంగా వ్యవహరించి ఆపై అందినకాడికి దోచుకున్నాడు.. ఇదీ.. ఐపీ దాఖలు చేసిన నకిలీ ఎస్ఐ ఘరానా మోసం. చిలుకూరు (కోదాడ): చిలుకూరు మండలం పాత కొండాపురం గ్రామానికి చెందిన శ్రీరాం చిన గోపాల కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఇతను తొలుత కానిస్టేబుల్. 2009లో ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. అ తరువాత పైలటింగ్లో ఎస్ఐ ఉద్యోగం సాధించినట్లుగా ఆధారాలు లభ్యకావడంతో అతన్ని 2013 ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది.కాగా అనాటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు వడ్డీలకు డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు ఇస్తామని ఆయన బంధువులను, స్నేహితులను పూర్తిగా నమ్మిం చాడు. ప్రారంభంలో డబ్బులు తీసుకుని సక్రమంగా ఇవ్వడంతో అతనిపై పూర్తి స్థాయిలో నమ్మకం కలిగింది. దీనిని ఆసరగా చేసుకుని చిలుకూరు మండలంలోని పాత, కొత్త కొండాపురం గ్రామాలు, రామాపురం, పోలేనిగూడెం, బేతవోలు, హుజూర్నగర్ గ్రామాల పరిధిలో, హైదరాబాద్లో తన బంధువుల వద్ద నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం, లిక్కర్ బిజినెస్, ఇళ్లు కట్టించి అమ్మడం లాంటి బిజినెస్లు చేస్తున్నారని నిమ్మించి వారి వద్ద నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తీసుకున్నాడు. రూ. 7.50 కోట్లుకు ఐపీ దాఖలు డబ్బులు తీసుకొన్న వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అతని 43 మందికి రూ.7.50 కోట్లుకు ఐపీ దాఖలు చేశాడు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు 43 మంది రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. ఆరుగురి అరెస్ట్ బాధితుల ఫిర్యాదు మేరకు ఖాకీలు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూత్రధారి శ్రీరాం చిన గోపాల్కృష్ణతో సహా అతడికి సహకిరం అందించిన చిలుకూరు మండలం కొండా పురం గ్రామానికి చెందిన పిల్లుట్ల వెంకటి, నారా యణపురం గ్రామానికి చెందిన తిప్పన నరసింహారావు, కీతవారిగూడెం గ్రామానికి చెందిన కీత వెంకటరమణ, పెన్పహాడ్ మండలానికి చెందిన యర్రంశెట్టి సతీష్, నూనవత్ అశోక్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు తెలిసింది. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తన్వీ క్రియేషన్స్ పేరుతో.. తన్వీ క్రియేషన్స్ పేరుతో మల్క్పేట, హైదరాబాద్లో ఒక కార్యలయంలో ప్రారంబించా డు. ఈ పేరుతో ఉద్యగాలు ఇప్పిస్తామని, డబ్బులు పెట్టుబడులు పెడితే రిటన్స్ మంచి లాభాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రారంభంలో డబ్బులు ఇచ్చిన వారికి లాభాలు అధిక మొత్తంలో ఇచ్చాడు. దీంతో అతనిపై నమ్మకం పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని ఆయా గ్రామాల వారి బంధువులు, స్నేహితుల వద్ద నుంచి రూ.50 కోట్ల వరకు వడ్డీకి డబ్బులు తీసుకొన్నట్లుగా తెలసింది. వీరిలో సుమారుగా ఆయా గ్రామాల్లో 150 నుంచి 200 మంది వరకు బాధితులు ఉన్నట్లుగా తెలిసింది. -
రూ.70కోట్లతో ఉడాయించిన చిట్ఫండ్ వ్యాపారి
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కోదాడ: ఐపీఎల్ -10 సందర్భంగా బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ టీచర్స్ కాలనీలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. వీరంతా హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
ఆర్డీఓ కార్యాలయంలో అన్ని వసతులు కల్పించాలి
కోదాడఅర్బన్ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసే ఆర్డీఓ కార్యాలయంలోని సౌకర్యాలను గురువారం రాత్రి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ పరిశీలించారు. కార్యాలయ భవనంలో అన్ని గదులను కలియదిరిగి చూశారు. కార్యాలయం ప్రారంభం నాటికి అన్ని వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం ముందు గ్రీన్బెల్టు ఏర్పాటు చేయాలని, కార్యాలయానికి చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీ గోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ.. కార్యాలయం ఏర్పాటుకు సంబంధించినపనులు నత్తనడకన జరుగుతుండడం పట్ల జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల 11న కార్యాలయం ప్రారంభం కానుందని తెలిసినా పనులు చురుకుగా సాగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రి రానున్నందున ఈ నెల 10వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి, కోదాడ తహసీల్దార్ వి.శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరశర్మ, ఆర్ఐ జానకిరామిరెడ్డి, పలువురు వీఆర్ఓలు పాల్గొన్నారు. -
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అధికారులు
కోదాడఅర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ అభియాన్ పథకంలో భాగంగా మెరుగైన సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వ ఆస్పత్రులకు అవార్డులు అందజేయనున్నుట్లు రాష్ట్ర కుటుంబ నియంత్రణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ప్రభావతి తెలిపారు. స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు మంగళవారం ఆమె కోదాడ ప్రభుత్వాస్పత్రిని సందరించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ అభియాన్ కింద 70శాతానికిపైగా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న ఆస్పత్రులను ఎంపిక చేసేందుకు కాయకల్ప పథకం కింద బృందాలుగా ఏర్పడి పరిశీలన జరుపుతున్నామన్నారు. ఇందులోభాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 9 పీహెచ్సీలు, 2 సీహెచ్సీలు, 1 ఏరియా ఆస్పత్రితోపాటు జిల్లా ఆస్పత్రిలో కూడా ఈ పరిశీలన జరుపనున్నట్లు తెలిపారు. అనంతరం అన్ని వార్డులతోపాటు ఆవరణ, పోస్ట్మార్టం గదులను పరిశీలించిన బృంద సభ్యులు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ ఉమాశంకర్, కాయకల్ప కార్యక్రమ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం లీగల్ అడ్వైజర్ వాణి, వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మాండన్ సుదర్శన్, కోదాడ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కమల, యాతాకుల మధు, కొచ్చెర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఆస్పత్రికి చెందిన స్థలం ఆక్రమణకు గురైందని, దీనిపై చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్య ఈ సందర్భంగాడాక్టర్ ప్రభావతిని కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ ఈ విషయం తన పరిధిలోకి రాదని, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చే యాలని సూచించారు. -
అన్నదాతలను ఆదుకోకపోతే చరిత్ర క్షమించదు
–ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు – విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ కోదాడ: అందరికి అన్నం పెట్టే అన్నదాతలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన పాలకులు ఆ పని చెయకపోతే చరిత్ర క్షమించదని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడవని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతుల రుణమాఫీ నిధులను ఒకే సారి చెల్లించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు కోదాడ బస్టాండ్ వద్ద చేపట్టిన ఒక రోజు రైతుభరోసా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని దీక్ష విరమింపజేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ హమీ ఇచ్చిన ప్రభ్వుత్వం ఎన్నికల అనంతరం విడతల వారి విధానాన్ని తీసుకొచ్చి అవి కూడ సకాలంలో చెల్లించక పోవడం వల్ల రైతులకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వడ్డీతో సహ లక్ష రూపాయల రుణాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నూటికి 70 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చెస్తున్నాయన్నారు. నకిలీ విత్తనాలు, నాశిరకం పురుగుమందులు, మార్కెట్ దళారులు ఇలా ప్రతి దశలో అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయలను ఎగగొడుతున్న వారికి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని, కానీ అన్నం పెట్టే రైతును బ్యాంకు గడపతొక్కనియ్యడం లేదన్నారు. అంతే కాకుండా పాత అప్పుతో సంబంధం లేకుండా రైతులకు కొత్త రుణాలను ఇప్పించే బాధ్యతను కూడ ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. మార్కెట్ల ప్రక్షాళన చేసి దళారులను లేకుండా చెయాలని కోరారు. ఉదయం కొల్లు వెంకటేశ్వరరావు చేపట్టిన దీక్షను రైతుసంఘం నాయకుడు దొడ్డ నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడుగు హుస్సేన్, గంధం బంగారు, రావెళ్ల రవికుమార్, మేకల శ్రీనివాస్, బొల్లు ప్రసాద్, కత్రం నాగేందర్రెడ్డి, కనగాల జనార్ధన్రావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల నేతలు ఈ దీక్షకు మద్దతు తెలిపారు. -
అన్నదాతలను ఆదుకోకపోతే చరిత్ర క్షమించదు
–ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు – విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ కోదాడ: అందరికి అన్నం పెట్టే అన్నదాతలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన పాలకులు ఆ పని చెయకపోతే చరిత్ర క్షమించదని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడవని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతుల రుణమాఫీ నిధులను ఒకే సారి చెల్లించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు కోదాడ బస్టాండ్ వద్ద చేపట్టిన ఒక రోజు రైతుభరోసా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని దీక్ష విరమింపజేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ హమీ ఇచ్చిన ప్రభ్వుత్వం ఎన్నికల అనంతరం విడతల వారి విధానాన్ని తీసుకొచ్చి అవి కూడ సకాలంలో చెల్లించక పోవడం వల్ల రైతులకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వడ్డీతో సహ లక్ష రూపాయల రుణాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నూటికి 70 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చెస్తున్నాయన్నారు. నకిలీ విత్తనాలు, నాశిరకం పురుగుమందులు, మార్కెట్ దళారులు ఇలా ప్రతి దశలో అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయలను ఎగగొడుతున్న వారికి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని, కానీ అన్నం పెట్టే రైతును బ్యాంకు గడపతొక్కనియ్యడం లేదన్నారు. అంతే కాకుండా పాత అప్పుతో సంబంధం లేకుండా రైతులకు కొత్త రుణాలను ఇప్పించే బాధ్యతను కూడ ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. మార్కెట్ల ప్రక్షాళన చేసి దళారులను లేకుండా చెయాలని కోరారు. ఉదయం కొల్లు వెంకటేశ్వరరావు చేపట్టిన దీక్షను రైతుసంఘం నాయకుడు దొడ్డ నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడుగు హుస్సేన్, గంధం బంగారు, రావెళ్ల రవికుమార్, మేకల శ్రీనివాస్, బొల్లు ప్రసాద్, కత్రం నాగేందర్రెడ్డి, కనగాల జనార్ధన్రావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల నేతలు ఈ దీక్షకు మద్దతు తెలిపారు. -
చిరునవ్వును.. చిదిమేశారా..?
బాలుడి అదృశ్యం.. విషాదాంతం ఖమ్మం జిల్లాలోని బావిలో శవమై తేలిన బాలుడు వారం రోజుల తరువాత మృతదేహం లభ్యం శోకసంద్రంగా మారిన మొగలాయికోట కోదాడ : మండల పరిధిలోని మొగలాయికోట గ్రామంలో ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడి ఉదంతం విషాదాంతమైంది. వారం రోజుల తరువాత గ్రామానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా రూరల్మండలం గుర్రాలపాడు వద్ద ఉన్న బావిలో శవమై తేలాడు. దీంతో వారం రోజులుగా ఎక్కడో ఒక దగ్గర తమ కుమారుడు క్షేమంగానే ఉంటాడనే చిరు ఆశతో ఉన్న బాలుడి కుటుంబం విషయం తెలుసుకుని దుఖసాగరంలో మునిగిపోయింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగా గోపాల్రెడ్డి–రమ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు కోదాడలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా, చిన్న కుమారుడు లింగా పూరిజగన్నా«ద్రెడ్డి(9)ఇదే పాఠశాలలకు రోజు బస్సులో వచ్చి పోతు 2వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 13న బక్రీద్ సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యం అయ్యాడు. ఈ రోజు నుంచి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడమే కాకుండా తీవ్రంగా గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అనూహ్యంగా మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపాడు వద్ద వ్యవసాయ భావిలో కుళ్లిపోయిన స్థితిలో బాలుడి శవం తేలడం, అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇచ్చిన సమాచారంతో మృతుడు లింగా పూరిజగన్నా«ద్రెడ్డిగా బంధువులు గుర్తించారు.శవాన్ని ఖమ్మంలోనే పంచనామా చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. శత్రువులు లేరంటున్న తల్లిదండ్రులు... ఇదీలా ఉండగా ఈ కేసులో వారం రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలించినా చిన్న క్లూ కూడా వారికి దొరకలేదు. తమకు శత్రువులు లేరని, ఆస్తి తగాదాలు కూడా లేవని తల్లిదండ్రులు చెబుతుండడం, ఎవ్వరిపై అనుమానం కూడా వ్యక్తం చేయకపోవడంతో కేసు ముందుకు సాగడం లేదు. ఎవరా ఇద్దరు.. వారి పనేనా...? ఈ నెల 13వ తేదీన ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి పూరి జగన్నధరెడ్డితో మాట్లాడినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆ దుండగులే బాలుడిని బైక్పై ఎక్కించుకు వెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ ఇద్దరు ఎవరనేది చెప్పలేక పోతుండడంతో కేసులో పురోగతి ఉండడం లేదు. కాగా బంధువులు మాత్రం పథకం ప్రకారమే బాలుడిని కిడ్నాప్ చేసి దారుణం హత్య చేసి ఉంటారని, పోలీసులు నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు. 13వ తేదీనే హత్య చేసి ఉంటారని, అందువల్లే మృతదేహం అంతగా కుళ్లిపోయిందని వారు అంటున్నారు. మిన్నంటిన రోదనలు.. బాలుడి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం గ్రామానికి తీసుకవచ్చారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పూర్తిగా కుళ్లిపోవడంతో కనీసం బాలుడిని చివరిసారిగా కూడా చూసుకోలేని విషాదపరిస్థితి. సాయంత్రం జోరువాన కురవడంతో ఆ వానలోనే అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
త్వరలో కోదాడ పోలీస్ డివిజన్
ఎన్ఎస్పీ క్యాంపులోనే ఏర్పాటుకు నిర్ణయం భవనాలు పరిశీలించిన ఎస్పీ ప్రకాశ్రెడ్డి కోదాడ: కోదాడ పట్టణంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసేందుకు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్పీ ప్రకాశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కోదాడలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న భవనాలను డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు కోసం పరిశీలించారు. క్యాంపులో ఉన్న పాత ఎమ్మార్వో కార్యాలయంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ నడుస్తోంది. ఈ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఇందులో ఆర్డీఓ కార్యాలయాల ఏర్పాటుకు రెవిన్యూ అధికారులు ప్రతిపాధనలు సిద్ధం చేశారని తెలియడంతో ఇదే క్యాంపు ఆవరణలో రూరల్ పోలీస్ స్టేషన్కు పక్కన ఉన్న మరో భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం విశాలంగా ఉండడమే కాకుండా, పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటు సమీపంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఉండడంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. భవనాల పరిశీలన పూర్తయిందని, దీనిపై కలెక్టర్కు నివేదిక ఇస్తామని అనుమతులు రాగానే కార్యాలయం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో కొత్తగా మునగాల, తుంగతుర్తిలలో కొత్త సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఓఎస్డీ వెంకటేశ్వర్లు, సూర్యాపేట డీఎస్పీ సునీతామోహన్, కోదాడ రూరల్ సీఐ మధుసూదన్రెడ్డి, పట్టణ ఎస్ఐ సురేష్కుమార్ పాల్గొన్నారు. -
విద్యను అందరికీ అందుబాటులోకి ఉంచాలి
కోదాడ : విద్యతోనే తెలంగాణ సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకు ప్రతి ఒక్కరికీ విద్యను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోందడరామ్ అన్నారు. శనివారం కోదాడలో జరిగిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 81వ వార్షికోత్సవం సందర్భంగా ‘విద్య–ఉద్యోగం–ఉపాధి కల్పనలో పాలక వర్గాల వైఫల్యం’ అనే అంశంపై సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలు బలహీనంగా మారాయన్నారు. ప్రస్తుతం వాటిని బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించాచాలన్నారు. కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, వారికి సామాజిక బాధ్యత ఉండదని, దానివల్ల సమాజంలో అసమానతలు ఏర్పడతామన్నారు. కార్పొరేట్ వ్యాపారులు ఉత్తమ బోధకులను తమ గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల సాధారణ కళాశాలల్లో బోధించే కరువవుతున్నారన్నారు. దీంతో సామాన్యులు తలతాకట్టు పెట్టి లక్షలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారన్నారు. ఫలితంగా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థి సంఘాలు విద్యా సంబంధం అంశాలపై రాజీలేని పోరాటాలు చేయాలన్నారు. అంతకు ముందు విద్యార్థి సంఘం పతకాన్ని ఆవిష్కరించారు. చేపూరి కొండలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, ధర్మార్జున్, మేకల శ్రీనివాస్, బొల్లు ప్రసాద్, ఎస్.కె లత్తు, బరిగెల వెంకటేశ్, రాము, కొండూరి వెంకటేష్, నరేష్, జగన్ పాల్గొన్నారు. -
కోదాడలో సార్వత్రిక సమ్మె విజయవంతం
కోదాడ: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె కోదాడలో విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. బ్యాంకులు, సినిమా హళ్లు తెరుచుకోలేదు. ఆర్టీసీ కార్మికులు కూడ సమ్మెలో పాల్గొనడంతో బస్సులు బస్టాండ్ దాటలేదు. ఉదయమే వామపక్ష నాయకులతో పాటు పలు కార్మిక సంఘాలు బస్టాండ్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం కోదాడ పట్టణంలో జాతీయరహదారి మీద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్రీనివాస్, ఎస్కె. లతీఫ్, పోతురాజు సత్యనారాయణ, ఎంఏ షరీఫ్, ఎస్కె. నయీం కుక్కడపు బాబు, ఈదుల కృష్ణయ్య, అంబడికర్ర శ్రీనివాస్, గౌస్, ఎస్. రాధాకృష్ణ, కుక్కడపు ప్రసాద్, వీరభద్రం, ముత్యాలు, బాదెరాము, న ర్సింహారావు, ఓరుగంటి ప్రభాకర్, ఉప్పగండ్ల శ్రీనివాస్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
కోదాడలో భారీ వర్షం
కోదాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మంగళవారం ఉదయం నాలుగు గంటలపాలు కోదాడ పట్టణంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ప్రభావంతో పట్టణంలోని రోడ్లు, వీధులు పూర్తిగా జలమయ్యాయి. లోతట్టులో ఉన్న దుకాణాలలో వర్షపు నీరు చేరడంతో దానిని తొలగించేందుకు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 23వ వార్డులో కాలువ ప్రవాహాన్ని నియత్రించేందుకు వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్ జేసీబీ సహాయంతో కంపచెట్లను తొలగించి, దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. -
వచ్చే నెలలో డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు
కోదాడ : డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను సెప్టెంబర్ 10,11వ తేదీల్లో కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.విప్లవ్కుమార్ తెలిపారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్లో జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభలలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ ముఖర్జీ, జాతీయ ఉపాధ్యక్షుడు కె.భాస్కర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. మహాసభల విజయవంతం కోసం ఈ సందర్భంగా పలు కమిటీలను నియమించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహారావు, నాయకులు ఖాదర్, కిశోర్, భద్రయ్య, రాధాకష్ణ, ముత్యాలు, కేవీ.భద్రం తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
కోదాడఅర్బన్ : నిత్యం వివాదాలతో అర్థంతరంగా ముగిసే కోదాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం మాత్రం ప్రశాంతంగానే జరిగింది. కమిషనర్గా అమరేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహించిన తొలి సాధారణ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 73 తీర్మానాలను ప్రతిపాదించగా అందులో అధికభాగం సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలే ఉండడం గమనార్హం. ఈ తీర్మానాలన్నింటికీ సభ్యులు ఆమోదం తెలపడం విశేషం. సమస్యలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు.. సమావేశం ప్రారంభంలోఎజెండా అంశాలపై ప్రతిపాదనలు చదువుతుండగానే కొందరు సభ్యులు తమ వార్డుల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల వంటి సమస్యలున్నాయని వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇంజనీరింగ్ అధికారులు స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇంకా పలు సమస్యలను ప్రస్తావించగా వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ ప్రకటించి ఎజెండా అంశాలపై చర్చను కొనసాగించారు. వాటర్ ట్యాంకర్ల బిల్లులపై ప్రధాన చర్చ.. పట్టణంలో ప్రజలకు మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్లకు సంబంధించి వాటి యజమానులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బిల్లులు చెల్లించాలని వాడపల్లి వెంకటేశ్వర్లు, పార సీతయ్య సమావేశం దష్టికి తీసుకువచ్చారు. అంతేకాక పట్టణంలో సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఆన్లైన్ టెండర్లు పిలిచినప్పుడు హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేస్తున్నారని, కానీ వారు సకాలంలో పనులు చేపట్టకపోవడం వల్ల కౌన్సిలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంట్రాక్టర్ల వివరాలు పరిశీలించి టెండర్లు ఆమోదించాలని పార సీతయ్య కోరారు. పందుల బెడద నుంచి కాపాడాలని వినతి పట్టణంలో కోతులు, పందులు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని పలువురు సభ్యులు కోరారు. వైఎస్సార్సీపీ సభ్యుడు తుమ్మలపల్లి భాస్కర్ మాట్లాడుతూ తన వార్డులో పార్కు ఏర్పాటు చేసేందుకు గతంలోనే ప్రతిపాదించినా నేటివరకు అమలు కాలేదన్నారు. మొత్తం మీద కౌన్సిల్ సభ్యులు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై చర్చ జరిగిన తరువాత మిగిలిన ప్రతిపాదనలను ఏకగీవ్రంగా ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ అమరేందర్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉరేసుకుని రిటైర్డ్ పోలీస్ మృతి
తొగర్రాయి(కోదాడరూరల్): ఉరేసుకుని రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని తొగర్రాయిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండపునేని వెంకటేశ్వరావు (59) సూర్యాపేటలో హెడ్కానిస్టేబుల్గా పనిచేసి గత సంవత్సరం రిటైర్డ్ అయ్యారు. అక్కడే సొంతింటిని నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. దీంతోపాటు షుగర్ వ్యాధి ఉండటంతో కాలిబోటన వేలిని కూడ తొలగించారు. అయితే ఆదివారం సాయంత్రం సూర్యాపేట నుంచిlస్వగ్రామమైన తొగర్రాయికి బైక్పై బయలు దేరాడు. గ్రామంలోకి వెళ్లకుండానే గ్రామ శివారులో ఉన్న మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గమణించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వారు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగాSఅనారోగ్యం పాలు కావడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు బావిస్తున్నారు. అయితే అతను ఉరేసుకున్న తీరు చూసి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు కిరణ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపారు. -
చికిత్సపొందుతున్న వివాహిత మృతి
అమీనాబాద్(కోదాడరూరల్): కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన మీసాల నాగమణి (30)కి కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేదు. దీంతో పాటు ఇటీవల ఆమె అనారోగ్యం పాలయింది. దీంతో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమణించిన ఆమె భర్త శ్రీను, తమ్ముడు రవి మంటలు ఆర్పే క్రమంలో స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన ఆమెను ఖమ్మం వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. మృతురాలి తమ్ముడు కిన్నెర రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపారు. -
వీధి దీపాల కార్యాలయానికి తాళం
కోదాడ: ఆరు నెలలుగా తమ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అటుంచి కనీసం వీధి ధీపాలు కూడ వేయలేని దుర్భర పరిస్ధితిలో కోదాడ మున్సిపల్ కార్యాలయం ఉందన్నారు. అలాంటప్పుడు వీధి ధీపాల విభాగం ఎందుకని ప్రశ్నిస్తూ మంగళవారం పలువురు కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఉన్న వీధి ధీపాల విభాగానికి తాళం వేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధుల్లో లైట్లు వేయించలేని కౌన్సిలర్ పదవి తమకు ఎందుకని, వార్డుల్లో ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చేప్పలేక పోతున్నామన్నారు. తమకు అనుకూలమైన కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రం లైట్లు వేస్తూ ప్రతిపక్షాల వారిని వేధిస్తున్నారని వారు ఆరోపించారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడ దోమల మందు పిచికారి చెయ్యలేదన్నారు. దాని వల్ల పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. మురుగుకాలువలను కూడ శుభ్రం చెయ్యని దుస్ధితి నెలకొందన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ సత్యారావు వచ్చి కౌన్సిలర్లతో మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కొనుగోలు చేసిన లైట్ల వివరాలను తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తుమ్మలపల్లి భాస్కర్, దండాల వీరభద్రం, ఎస్కె. షఫి, కుడుముల లక్ష్మీనారాయణ, నాయకులు ముడెం సైదిబాబు, ఉప్పగండ్ల శ్రీనివాస్, కమదం చందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
మంగళితండా(కోదాడరూరల్): 40 రోజుల క్రితం గొడ్డలితో దాడిచేయడంతో వ్యక్తి చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చిమిర్యాల ఆవాస గ్రామమైన మంగళితండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరవత్ స్వామి(50), ధరవత్ వీరయ్యలకు గతంలో పాత కక్షలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని వీరయ్య స్వామిని 40 రోజుల క్రితం గొడ్డలితో తల, ఛాతీపై నరికాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. చికిత్స తర్వాత కోలుకున్న అతన్ని ఇంటి వద్దకు తీసుక వచ్చారు. మళ్లీ అతను అనారోగ్యం పాలు కావడంతో ఈ నెల 14న ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స అనంతరం సోమవారం ఇంటికి తీసుకోచ్చారు. సోమవారం బాగానే ఉన్న అతను మంగళవారం తెల్లవారుజామున చూసే వరకు మృతి చెంది ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. అయితే స్వామి మృతి చెందడానికి కారణం వీరయ్య అని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అతని ఇంటి ఎదుట ఉంచి తమకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. విషయం తెలసుకున్న రూరల్ ఎస్ఐ విజయ్ప్రకాశ్ తండాకు చేరుకుని వారికి న్యాయం జరిగే విధంగా చూస్తానని తెలిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. తన భర ్తను వీరయ్య గొడ్డలితో నరకడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తు భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గాయాలతో మృతి చెందలేదు.... S కాగ స్వామి గొడ్డలి గాయాలతో చనిపోలేదని అతను అనారోగ్యం పాలై మృతి చెందాడాని వీరయ్య బంధువులు అంటున్నారు. 40 రోజుల కిత్రం గాయాలైన తర్వాత ఆయన గ్రామంలో బాగానే తిరిగాడాని వారు తెలిపారు. -
ఆర్థికసాయం అందజేత
కోదాడ: పేదరికంలో ఉండి మరణించిన కుటుంబానికి తోటి కార్మికులు, కొందరు నాయకులు ఆదుకొని అండగా నిలిచి తమ మానవతను చాటుకున్నారు. కోదాడలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గుమస్తా మెరిగ గురుస్వామి(40) అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటంబానికి గుమస్తాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తిరపతయ్య, వేంకటేశ్వర్లు సంతాపం తెలియజేసి దహన సంస్కారాలకు రూ.5,010 ఆర్థికసాయాన్ని మృతుని కుటుంబానికి అందజేశారు. అదే విధంగా ఈ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆవుల రామారావు కూడ మృతుని కుటుంబ ధీనపరిస్ధతి చూసి దహన సంస్కారాలకు తనవంతు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండెపంగు రమేష్, వీరయ్య , పాండురంగయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
రామాపురంక్రాస్రోడ్(కోదాడరూరల్): రాష్ట్ర సరిహద్దు కోదాడ మండలం నల్లబండగూడెం శివారు రామాపురంక్రాస్ రోడ్లోని పాలేరు వంతెన వద్ద తెలంగాణ తల్లి బారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతోబాటు ఈ ప్రాంత తెలంగాణ పోరాట యోదుడు కీసర జీతేందర్రెడ్డి విగ్రహాన్ని, అమర వీరుల స్థూప నిర్మాణానికి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్లులో ఎపీ నుంచి∙వచ్చే ప్రజలకు, ప్రయాణికులకు స్వాగతం పలికే విధంగా తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్ర మంత్రులచే ఈ పనుల ప్రారంభానికి శంస్థాపన జరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమరయోధుల సంఘం సభ్యులు కత్రం సీతరారంరెడ్డి, కొడారు వెంకటయ్య, సీహెచ్.విశ్వేశ్వరావు, శివాజీరెడ్డి, తిరపతయ్య, సత్యనారాయణ, నాయకులు వాచేపల్లి వెంకటేశ్వరెడ్డి, ఈదుల కృష్ణయ్య, ముండ్రా వెంకట్రావ్, నల్లపాటి శ్రీనివాసరావు, ఎర్రమళ్ల వెంకటేశ్వర్లు , నిరంజన్రెడ్డి తదితరులున్నారు. -
చర్చిలో విదేశీయుల సందడి
కోదాడ: పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న సీఎస్ఐ చర్చిలో సోమవారం ఇంగ్లాండ్ దేశానికి చెందిన పలువురు సందడి చేశారు. గ్లోస్టర్ డయాసిస్ బృందం చర్చిల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. వీరిని నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చి ఆవరణలో మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ బిషప్ ఆనందరావు, అశోక్సాల్మన్, జాన్వెస్లీ, నెమ్మాది భాస్కర్, ఏర్పుల యాకోబు, కర్ల సుందర్బాబు, ఏర్పుల వెంకటేష్, సునీల్, రాజేష్ పాల్గొన్నారు. -
పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు
కోదాడఅర్బన్ కోదాడ పట్టణంలోని పలుచోట్ల శనివారం పౌరసరఫరాల టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న సుమారు 60 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని రంగా థియేటర్ సమీపంలో గ్యాస్ స్టవ్ రిపేరింగ్ సెంటర్ల పేరుతో నడుస్తున్న గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లపై కూడా వారు దాడి చేసి అక్కడి గృహ వినియోగ సిలిండర్లు, కాటాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాల్లో దాడి చేసి అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కోదాడ, తుంగతుర్తి డీటీసీఎస్లు రమణారావు, బ్రహ్మయ్యలతో పాటు పలువురు డీటీసీఎస్లు, సివిల్సప్లైస్ అధికారులు పాల్గొన్నారు. -
కోదాడలో రేషన్ బియ్యం స్వాధీనం
కోదాడ రూరల్ : నల్గొండ జిల్లా కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్లో సోమవారం ఉదయం 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులోని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీతో సహా బియ్యాన్ని కోదాడ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. -
ఆ రైతన్నలు.. అపర భగీరథులు
నాడు భగీరథుడు కఠోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించి గంగమ్మను దివి నుంచి భువికి రప్పించాడు. ఇది పురాణ గాథ. నేడు జగిత్యాల మండలం గుల్లకోట రైతన్నలు పాతాళగంగను పైకి తెచ్చేందుకు మరో తపస్సు చేస్తున్నారు. ఒకటికాదు, రెండు కాదు.. ఒక్కో రైతు ఏకంగా పదికి పైగా బోర్లు తవ్వించాడు. అదృష్టం కలిసొచ్చి కొంతమందిని గంగమ్మ కరుణించింది. మరికొంత మంది రూ.లక్షలు ధారబోసినా జలసిరి జాడ కనిపించడం లేదు. అయినా వారు తమ ప్రయత్నాన్ని వీడకుండా అపరభగీరథులు అనిపించుకుంటున్నారు. -జగిత్యాల రూరల్ జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం గుల్లకోట గ్రామస్తులు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ జనాభా 1920 కాగా, సుమారు 830 ఎకరాల సాగుభూమి ఉంది. రైతులంతా పంటల సాగుకోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైనే నమ్ముకున్నారు. కాల్వనీళ్లు అందనప్పుడు వ్యవసాయ బావులు, బోర్లతో పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా తమ వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ నీళ్లు లేక వెలవెలబోతోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. నీటి కొరత వల్ల ఖరీఫ్లో ఆయకట్టు భూములకు అరకొరగానే ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలృు దష్టిలో పెట్టుకుని రబీకి సాగునీరందించే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. కానీ వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని రైతులు రబీలో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ఇప్పటికే వేసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు తవ్వుతున్నారు. ఇలా నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 63 మంది రైతులు 123 బోర్లు తవ్వించారు. వాటికి అవసరమైన విద్యుత్ మోటార్లతో పాటు పైపులైన్ల వేసుకున్నారు. నాలుగైదు బోర్లు తవ్వగా కొందరు రైతులకు నీళ్లు రాగా, మరికొందరు రైతులు ఇంకా బోర్ల తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే గ్రామంలోని రైతులు బోర్ల తవ్వకాలు, మోటార్లు, పైపులైన్ల కోసం సుమారు రూ.2.5 కోట్లు ధారబోయడం గమనార్హం. ఇందుకోసం కొంతమంది రైతులు గతంలో దాచుకున్న డబ్బును ఖర్చు చేస్తుండగా, మరికొంతమంది బ్యాంకులు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులందరికీ వ్యవసాయమే జీవనాధారం కాబట్టి.. ప్రభుత్వం ఓ పక్కన పంటలు సాగుచేయవద్దని చెబుతున్నా వారు మాత్రృం అదష్టాన్ని పరీక్షించుకునేందుకే సిద్ధపడుతున్నారు. బోర్లలో నీళ్లుపడితే విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ జనరేటర్ సాయంతో అయినా పంటలను కాపాడుకుంటామని అంటున్నారు. గుల్లకోట రైతుల పరిస్థితి నేడు జిల్లాలోని అన్నదాతల దుస్థితికి అద్దంపడుతోందంటే అతిశయోక్తి కాదు. -
తెలంగాణ పోరాటయోధుడు బ్రహ్మానందం కన్నుమూత
1969 పాలేరువాగు ఘటనకు ప్రత్యక్షసాక్షి కోదాడటౌన్: తొలిదశ తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన కోదాడకు చెందిన తాటికొండ బ్రహ్మానందం(72) శుక్రవారం కోదాడలో కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే దివంగత కీసర జితేందర్రెడ్డికి కుడిభుజంగా ఉన్న బ్రహ్మనందం కోదాడ పంచాయతీ వార్డు సభ్యుడిగా కూడ పనిచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం చురుగ్గా సాగుతున్న తరుణంలో కొందరు ఆంధ్రపాంతం వారు కోదాడపై దాడికి యత్నించారు. దీంతో జితేందర్రెడ్డి పాలేరువాగుపై కాల్పులు జరిపారు. దీంతో వారు వెనుదిరిగిపోయారు. ఈ సంఘటనకు బ్రహ్మానందం ప్రత్యక్షసాక్షి. ఆయన మృతిపట్ల 1969 పోరాట యోధుల కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు, టీఆర్ఎస్ నియెజకవర్గ ఇన్చార్జ్ శశిధర్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. -
నల్లగొండ జిల్లా కోదాడలో జగన్ జనభేరి