కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత | food poison in manchala | Sakshi
Sakshi News home page

కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత

Jun 6 2016 2:44 AM | Updated on Mar 28 2018 11:26 AM

కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత - Sakshi

కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత

కాలంచెల్లిన వంటనూనెతో చేసిన ఆహార పదార్థాలు తిని.. పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మంచాలలో ఆదివారం జరిగింది.

మంచాల: కాలంచెల్లిన వంటనూనెతో చేసిన ఆహార పదార్థాలు తిని.. పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మంచాలలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..  నారెడ్డి విజయ్‌భాస్కర్ ఇంట్లో ఓ శుభకార్యం ఉండడంతో శ్రీగణేష్ సూపర్‌మార్కెట్లో దుకాణంలో గోల్డెన్ ప్యూర్ కంపెనీ పేరుతో ఉన్న మంచినూనె ప్యాకెట్లను ఆదివారం కొన్నాడు. వీటితో ఆహార పదార్ధాలు తయారుచేశారు. అయితే భోజనం చేస్తున్న సమయంలోనే ఓ రకమైన వాసన వచ్చిందని తెలిపారు. అప్పటికే అన్నం తిన్న ఐదారుగురు వాంతులు చేసుకోవడంతో.. ఇదేమిటా? అని పరిశీలించారు.

తేదీ దాటిపోయిన నూనెను వాడడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకున్నారు. 2015 ఆగస్టు 8న ప్యాక్ చేసిన నూనెను 6 నెలలలోపే విక్రయించాలి. కానీ 10 నెలలు దాటిన నూనెను వ్యాపారి తమకు అంటగట్టాడని విజయ్‌భాస్కర్ మండిపడ్డారు. ఈ విషయమై దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మంచాల సీఐ  గంగాధర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వచ్చి సూపర్‌మార్కెట్లో పరిశీలించగా పది నెలల కాలం దాటిన ఆయిల్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ తెలిపారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement