edible oil
-
వంట నూనెని తీసుకోవడం తగ్గించండి..!: ప్రధాని మోదీ విజ్ఞప్తి
శారీరక శ్రమ లేకపోవడం, జంక్ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లు, జీవనశైలి తదితరాలే ఊబకాయం సమస్యకు కారణం అని అంతా చెబుతుంటారు. కానీ ప్రధాన కారణం వంట నూనె అట. సాక్షాత్తు ప్రధాని మోదీనే అన్నారు. ఆయన ఎందుకిలా పిలుపునిచ్చారు..? ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.దయచేసి అందరూ ఇళ్లల్లో వంటనూనె వినియోగాన్ని తగ్గించండి ఇదే ఊబయకాయం రావడానికి ప్రధానం కారణం అంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. న్యూఢిల్లీలో జరిగిన 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంటనూనె అధిక వినియోగమే ఊబకాయం సమస్యకు ప్రధాన కారణం అని అన్నారు. దేశంలోని అన్ని వయసుల వారు, ముఖ్యంగా యువత ఈ సమస్య బారినపడుతున్నారని అన్నారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఊబకాయం మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని పెంచుతోందన్నారు. రోజువారీగా వ్యాయమం చేయడం, సమతుల్య పోషకాహారంపై దృష్టిపెట్టడం తోపాటు నూనె తీసుకోవడం తగ్గించాలని ప్రజలకు సూచించారు మోదీ. "మన ఇళ్లల్లో నెల ప్రారంభంలో రేషన్ వస్తుంది. ఇప్పటి వరకు ప్రతినెల రెండు లీటర్ల వంట నూనె ఇంటి తీసుకొచ్చినవారు దానిని కనీసం 10%కి తగ్గించండి." అని కోరారు మోదీ. మరి దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. మణిపాల్ ఆస్పత్రిలోని డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ కుమార్ సైతం వంట నూనెని తగ్గించాలన్నారు. అధిక బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీసే కడుపు నిండిన అనుభూతిని కలిగించకుండా చేసేది వంటలో ఉపయోగించే అదనపు నూనె అని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నెలకు 600-700 ఎంఎల్ కంటే ఎక్కువ తినకూడదని చెప్పారు. అంటే రోజుకి సుమారు నాలుగు టీస్పూన్లకు మించి వాడకూడదని అన్నారు.మరో డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ..సాధారణంగా ప్రజలు సిఫార్సు చేసిన నూనెకి మించి అధికంగా నూనెని వాడతారు. కొందరూ ఫ్రై చేసిన నూనెని తిరిగి వినియోగిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఆహార పదార్థాలు వేయించడానికి ఉపయోగించిన నూనెని తిరిగి ఉపయోగించడం వల్ల ట్రాన్స్-ఫ్యాట్స్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక నూట్రిషన్లు నూనె పరిమాణం తోపాటు నూనె నాణ్యత కూడా ముఖ్యమేనని అన్నారు. ముఖ్యంగా ఆవాల నూనె, వేరుశెనగ నూనె వంటకు చాలామంచివని చెప్పారు. అలాగే మిశ్రమ నూనెల కలయిక కూడా చాలామంచిదని చెప్పారు. ఉదాహారణకి వేరుశెనగ, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, బియ్యం ఊక నూనెల మిశ్రమంగా వాడటం కూడా మంచిదని అన్నారు. ఇక ఆర్థిక సర్వే 2023-2024 అనారోగ్యకరమైన ఆహారం,ఎక్కువగా కూర్చొనే అలవాట్లు మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. అంతేగాదు ఇది దేశ ఆర్థిక సామర్థ్యానికి ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. శతాబ్దాలుగా మన భారతీయ సాంప్రదాయ ప్రకృతి, పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యంగా, సామరస్యంగా ఎలా జీవించాలో చూపించాయి. దానికి అనుగుణంగా భారతీయ వ్యాపారాలు ఉండాలి. ప్రపంచ మార్కెట్ని ఉపయోగించుకోవడానికి బదులుగా నడిపించేలా భారతీయ వ్యాపారాలు ఉండాలి. అంటే ఆరోగ్యానికి పెద్దపీటవేసేలా సాగితే.. అన్ని విధాల శ్రేయస్కరం, ప్రగతి పథం కూడా అని అన్నారు ప్రధాని మోదీ. (చదవండి: -
Sankranti 2025 : భోగి ‘మంట నూనెలు’ పిండి వంటలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంతకూ తగ్గమంటున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. పిండివంటల నూనెలు మండిపోతున్నాయి. ఇక రోజూ వంటల్లో సరిపడా నూనె వాడేందుకే ఒకటికి, రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో రోజుకు వందల టన్నుల వంటనూనెల అమ్మకాలు జరుగుతున్నాయి. గృహ అవసరాలకే కాకుండా హోటల్స్, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధరకాల వంట నూనెలు భారీగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి పండుగ రావడంతో నగరంలో వంట నూనెల డిమాండ్ మూడింతలు ఎక్కువైంది. దీంతో నూనె ధరలు ఆమాంతం పెరిగాయి. హోల్సెల్ మార్కెట్ అన్ని రకాల నూనెలపై ధర రూ.5 నుంచి రూ.8 పెరిగింది. రిటైల్, బహిరంగ మార్కెట్లో ప్రతి లీటరు నూనెపై రూ.12 నుంచి రూ.15 పెరిగింది. అన్ని రకాల నూనెల ధరలు భగ్గుమంటున్నాయి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్, వేరుశనగ, రైస్బ్రాన్.. ఇలా అన్ని రకాల నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెలకు సంబంధించి హోల్సేల్ ధరలు, రిటైల్ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హోల్సేల్ మార్కెట్లో పామాయిల్ కిలో ధర రూ.100 నుంచి రూ.105కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ.115కు చేరింది. సన్ఫ్లవర్ ఆయిల్ హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.130 నుంచి రూ.140 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.145–150 పలుకుతోంది. కిలో వేరుశనగ నూనె ధర నెల క్రితం రూ.150 ఉండగా, ఇప్పుడు రూ.165కు పెరిగింది. వీటితోపాటు రైస్బ్రాన్ ఆయిల్ ధర రూ.140 నుంచి రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. ఈ స్థాయిలో వంటనూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే ముడి ఆయిల్పై సుంకాన్ని 5–10 శాతం నుంచి ఏకంగా 45 శాతానికి ప్రభుత్వం పెంచిందని, అందుకే ధరలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. వంటనూనెల ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వంటనూనెలపై దిగుమతి సుంకం పెరగడం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. పాత స్టాక్ను గోడౌన్లలో దాచేసి ధరలు పెంచి అమ్ముతున్నారు.ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే -
కొబ్బరి నూనె.. హెయిర్ ఆయిలా? వంటనూనా?
కొబ్బరి నూనె ఎందుకు వాడతారు? తలకు పెట్టుకుంటారు, కేరళలో వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే మరి కొబ్బరినూనె.. హెయిర్ ఆయిలా లేక వంటలనూనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే రెండింటికీ వాడతారు. మనదేశంలో హెయిర్ ఆయిల్గానే అధికంగా కొబ్బరి నూనె వాడతారు. కాళ్లు, చేతులతో పాటు శరీరాన్ని మర్దన చేయడానికి కూడా కొబ్బరినూనె ఉపయోగిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? దశాబ్దన్నర కాలం నుంచి కొబ్బరినూనెపై జరుగుతున్న ‘పన్ను’ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ముగింపు పలికింది. ఎక్సైజ్ శాఖ, తయారీదారుల మధ్య సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.ఏమిటా వివాదం?చిన్నచిన్న సీసాల్లో విక్రయించే కొబ్బరి నూనెను ఎడిబుల్ ఆయిల్ (తినదగిన నూనె)గా వర్గీకరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తయారీదారులు, వినియోగదారులకు ఊరట లభించనుంది. కొకొనట్ ఆయిల్పై ‘పన్ను’ వివాదం 2009లో ప్రారంభమైంది. మనం కొనే ప్రతి వస్తువుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తుంటాయి. అలాగే రెడీమేడ్ కొబ్బరినూనె అమ్మకాలపై కూడా పన్ను ఉంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ (సెట్ యాక్ట్) 1985 ప్రకారం ఎడిబుల్ ఆయిల్ కేటగిరీ కింద కొబ్బరినూనెపై 8 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. సెట్ యాక్ట్కు 2005లో కేంద్రం సవరణ చేసింది. దీని ప్రకారం 2009, జూన్లో కొబ్బరినూనెను కేశసంరక్షణ ఉత్పత్తిగా పేర్కొంటూ సుంకాన్ని 16 శాతానికి పెంచింది.అయితే 2009లో సర్క్యులర్ జారీ చేయడానికి ముందే, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు 2007లో మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు పలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెయిర్ ఆయిల్ ఉత్పత్తిగా వర్గీకరిస్తూ కొబ్బరి నూనెపై అధిక పన్ను రేటు విధించాలని నోటీసుల్లో ప్రతిపాదించారు. మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కొబ్బరి నూనెను 5 మిల్లీలీటర్ల నుంచి 2 లీటర్ల వరకు ప్యాకెట్లలో విక్రయిస్తుంటుంది. పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(సెస్టాట్)ను మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. సెస్టాట్ తీర్పును సుప్రీంకోర్టులో సేలం సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ సవాల్ చేశారు.ఎటూ తేల్చని ద్విసభ్య ధర్మాసనంకొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్ విభాగంలో చేర్చాలా, వంటనూనెగా పరిగణించాలా అనే దానిపై 2018లో జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ప్యాకేజీ పరిమాణంతో సంబంధం లేకుండా కొబ్బరి నూనెను తినదగిన నూనెగా వర్గీకరించాలని జస్టిస్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. కొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్గా పరిగణించాలని జస్టిస్ భానుమతి పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది.15 ఏళ్ల న్యాయవివాదం15 ఏళ్ల సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ ఆర్. మహదేవన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. కొబ్బరి నూనెను చిన్న బాటిళ్లలో ప్యాక్ చేసి విక్రయిస్తే ఎడిబుల్ ఆయిల్గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే వంటనూనె, హెయిర్ ఆయిల్ మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా ఏదైనా చేయాలని ధర్మాసం సూచించింది. తినదగిన నూనెగా విక్రయించబడే కొబ్బరి నూనె తప్పనిసరిగా 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించింది.చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్రూ. 740 కోట్లు పెండింగ్రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం.. ఈ వ్యవహారంలో వడ్డీ, జరిమానాలు కాకుండా పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 740 కోట్లు రావాల్సి ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కేసులు పెండింగ్లో ఉండడంతో కొకొనట్ ఆయిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ ప్రకారం చూసుకుంటే ఎడిబుల్ ఆయిల్పై 5 శాతం, హెయిర్ ఆయిల్పై 18 శాతం పన్ను ఉంది. స్వల్ప పరిమాణంలో విక్రయించే కొబ్బరినూనెను ఎడిబుల్ ఆయిల్ జాబితాలో చేర్చడం వల్ల పన్నుల భారంతో పాటు ధర కూడా తగ్గుతుంది. ఫలితంగా తయారీదారుడితో పాటు వినియోగదారుడికి ఊరట లభిస్తుంది. -
జోరుగా వంట నూనెల దిగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు భారత్లో 2024 నవంబర్లో 15.9 లక్షల టన్నులు నమోదైంది. గతేడాది నవంబర్తో పోలిస్తే ఇది 38.5 శాతం అధికం. ముఖ్యంగా విదేశాల నుంచి ముడి పొద్దుతిరుగుడు నూనె, ముడి సోయాబీన్ నూనెలు భారత్కు వెల్లువెత్తడం ఇందుకు కారణం.సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం.. 2024–25 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరం మొదటి నెలలో వివిధ దేశాల నుంచి భారత్కు వెజిటబుల్ ఆయిల్స్ సరఫరా 40 శాతం అధికమై 16,27,642 టన్నులకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం 11,60,590 టన్నులుగా ఉంది. 2023 నవంబర్లో నమోదైన 12,498 టన్నులతో పోలిస్తే నాన్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి గత నెలలో 37,341 టన్నులకు పెరిగింది. ఆర్బీడీ పామోలిన్ 1,71,069 టన్నుల నుంచి 2,84,537 టన్నులకు ఎగసింది. ముడి సన్ఫ్లవర్ ఆయిల్ 1,28,707 టన్నుల నుంచి 3,40,660 టన్నులకు చేరింది. పెరిగిన సాఫ్ట్ ఆయిల్స్.. గత నెలలో భారత్కు ముడి సోయాబీన్ ఆయిల్ రాక 1,49,894 టన్నుల నుంచి 4,07,648 ట న్నులకు దూసుకెళ్లింది. విదేశాల నుంచి భారత్కు ముడి పామాయిల్ సరఫరా 6,92,423 టన్నుల నుంచి గత నెలలో 5,47,309 టన్నులకు పడిపోయింది. గత నెలలో ముడి, శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి 8,69,491 టన్నుల నుండి 8,41,993 టన్నులకు వచ్చి చేరింది. విదేశాల నుంచి భారత్కు సాఫ్ట్ ఆయిల్ సరఫరా 2023 నవంబర్తో పోలిస్తే 2024 నవంబర్లో 2,78,601 టన్నుల నుంచి ఏకంగా 7,48,308 టన్నులకు దూసుకెళ్లింది.పామాయిల్ వాటా 76% నుంచి 53 శాతానికి పడిపోయింది. సాఫ్ట్ ఆయిల్స్ 24 నుంచి 47 శాతానికి పెరిగాయి. ఇండోనేషియా, మలేషియా నుంచి ఆర్బీడీ పామోలిన్, ముడి పామాయిల్ ప్రధానంగా సరఫరా అవు తోంది. సోయాబీన్ నూనె ప్రధానంగా అర్జెంటీ నా, బ్రెజిల్, రష్యా నుండి, సన్ఫ్లవర్ ఆయిల్ ర ష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుండి భారత్కు వస్తోంది. -
కిలో మునక్కాయలు రూ. 400, కూరగాయల ధరలకు రెక్కలు
దాదర్: మహారాష్ట్రవ్యాప్తంగా పప్పు దినుసులు, కూరగాయలు ఇతర నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒకపక్క మహాయుతి ప్రభుత్వం లాడ్కి బహిన్ పథకం ప్రవేశపెట్టి అక్కచెల్లెళ్లను సంతోషపెడుతూనే మరోపక్క నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా పోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు నియంత్రణలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సాధారణ, మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్నారు. కోస్తే కాదు..కొనాలన్నా కన్నీళ్లే... ముంబైసహా ఇతర ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రస్తుతం ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. న్యూ ముంబైలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) హోల్సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.40–60 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.80–100 ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి కేజీ రూ.110–120 ధర కూడా పలుకుతోంది. అదేవిధంగా రూ.10–15 ధర పలికిన వివిధ ఆకు కూరలు ఇప్పుడు రూ.30–40 ధర పలుకుతున్నాయి. రాష్ట్రంలోని హోల్సేల్ మార్కెట్లోకి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో సరుకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉల్లి, వెల్లుల్లితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధరలు అందుబాటులో లేకుండా పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. కూడా అపార నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు.వంటనూనెలదీ ఇదే దారి... కూరగాయలు, పప్పుదినుసులతోపాటు వంటనూనెధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.100–120 ధర పలికిన లీటరు వంటనూనె ప్యాకెట్ ఇప్పుడు ఏకంగా రూ.165 ధర పలుకుతోంది. అలాగే రూ.90 ధర పలికిన పామాయిల్ ఇప్పుడు రూ.130 పలుకుతోంది. సామాన్యులు తినే సాధారణ బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, ఆఖరుకు కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం తిని బతకాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
వంట నూనెల దిగుమతులు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు 2023–24 ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరానికి 3.09 శాతం తగ్గి 159.6 లక్షల టన్నులు నమోదయ్యాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెరగడం, అధికం అవుతున్న ధరలతో డిమాండ్ తగ్గడం ఈ క్షీణతకు కారణమని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది.ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్.. 2022–23 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ ఏడాదికి 164.7 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. విదేశాల నుంచి భారత్ కొనుగోలు చేసిన ఈ నూనెల విలువ 2022–23తో పోలిస్తే రూ.1,38,424 కోట్ల నుంచి 2023–24లో రూ.1,31,967 కోట్లకు పడిపోయింది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ధరలు స్థిరపడ్డాయి. ఇది దేశీయ ధరల పెరుగుదలతో ప్రతిబింబించింది. అలాగే కొంత మేరకు దిగుమతులను తగ్గించింది’ అని అసోసియేషన్ తెలిపింది. విభాగాల వారీగా ఇలా.. ముడి పామాయిల్ దిగుమతులు 75.88 లక్షల టన్నుల నుంచి 69.70 లక్షల టన్నులకు వచ్చి చేరాయి. ఆర్బీడీ పామోలిన్ 21.07 లక్షల టన్నుల నుంచి 19.31 లక్షల టన్నులకు క్షీణించింది. సోయాబీన్ నూనె 35.06 లక్షల టన్నుల నుంచి 34.41 లక్షల టన్నులు నమోదైంది. పొద్దుతిరుగుడు నూనె 30.01 లక్షల టన్నుల నుంచి 35.06 లక్షల టన్నులకు ఎగసింది. శుద్ధి చేసిన నూనెల వాటా అయిదేళ్లలో 3 నుంచి ఏకంగా 12 శాతానికి దూసుకెళ్లింది. -
వంటనూనె ధరలు మరింత ప్రియం?
దేశీయంగా వంటనూనెల ధరలు మరింత పెరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో ప్రభుత్వం వంట నూనులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడంతో రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) నివేదిక తెలిపింది.ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, నన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను 27.5 శాతం పెంచింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం అధికమయ్యాయి. దేశంలో దాదాపు 58 శాతం ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ ధరలు సైతం అందుకు తదనుగుణంగా పెరుగుతున్నట్లు ఎన్ఈఏ నివేదించింది.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసంసాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం..గురువారం నాటికి ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల బేస్ ధరలు వరుసగా 1145 డాలర్లు/టన్ను(రూ.96వేలు), 1160/టన్ను(రూ.97వేలు), 1165/టన్ను(రూ.98వేలు)గా ఉన్నాయి. ఇది గతంలో కంటే వరుసగా 32 శాతం, 18 శాతం, 26 శాతం పెరిగింది. దాంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 2.47 శాతం వంట నూనెల ధరల ద్రవ్యోల్బణం అధికమైంది. అయితే భారత్లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. -
వంటనూనెల రేట్లు పెంచొద్దు
న్యూఢిల్లీ: ఇటీవల దిగుమతి సుంకాలు పెంచినప్పటికీ రిటైల్ ధరలను (ఎంఆర్పీ) పెంచొద్దంటూ వంటనూనెల కంపెనీలకు కేంద్ర ఆహార శాఖ సూచించింది. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న ఆయిల్స్ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఇలా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు 30 లక్షల టన్నుల మేర ఉంటాయని, అవి 45–50 రోజులకు సరిపోతాయని వివరించింది.సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ (ఎస్ఈఏ), ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) తదితర సంస్థల ప్రతినిధులతో ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా భేటీ అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొంది.దేశీయంగా నూనెగింజల ధరలకు మద్దతు కల్పించే దిశగా కేంద్రం గత వారం వివిధ రకాల వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచింది. సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాల ప్రకారం ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్ మొదలైన వాటిపై డ్యూటీ సున్నా స్థాయి నుంచి 20 శాతానికి పెరిగింది. ఇతరత్రా అంశాలన్నీ కూడా కలిస్తే ముడి నూనెలపై ఇది 27.5 శాతంగా ఉంటుంది.మరోవైపు, రిఫైన్డ్ పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మొదలైన వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి, నికరంగా 37.5 శాతానికి పెరిగింది. భారత్ పామాయిల్ను మలేషియా, ఇండొనేషియా నుంచి, సోయాబీన్ ఆయిల్ను బ్రెజిల్, అర్జెంటీనా నుంచి, సన్ఫ్లవర్ ఆయిల్ను ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. -
సామాన్యులకు షాక్.. వంటనూనెలు ప్రియం
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వంట నూనెలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయా బీన్, సన్ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అదనం. విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో వంట నూనెల ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘సోయా, నూనెగింజల రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు భారీగా ప్రయోజనం పొందుతారు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రపంచంలో వంట నూనెలను అత్య ధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉంటోంది. పామాయిల్ వాటా 50 శాతంపైనే. ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్ఫ్లవర్ భారత్కు సరఫరా అవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఉన్న సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. రిటైల్ మార్కెట్లో పెంచేసి విక్రయం విదేశాల నుంచి నూనెలు దిగుమతి అయిన తర్వాత రిఫైనరీలకు చేరుకుని అక్కడ శుద్ధి లేదా ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పెరిగిన పన్నుల ప్రకారం కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాల్సి ఉన్నా.. మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. రిటైల్లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం దాకా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో లీటర్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లను రూ.108 వరకు విక్రయించగా, శనివారం ఒక్కసారిగా రూ.124 కి చేరింది. అంటే ఒక్క ప్యాకెట్పై రూ.16 పెరిగింది. సూపర్మార్కెట్లు, దుకాణాల్లో పెరిగిన ధరలను చూసి వినియోగదారులు షాకయ్యారు. పామాయిల్ ధర మొన్నటి వరకు లీటర్కు రూ.95 ఉండగా, శనివారం మార్కెట్లో రూ.105కు అమ్మారు. అలాగే పల్లీ నూనె లీటర్కు రూ.155 ఉండగా, రూ.10 పెరిగి రూ.165కి చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లీ నూనెలు లీటర్కు రూ.106 ఉండగా, శనివారం రూ.116కు అమ్మారు. -
వంటనూనె ధరలు పెంపు..?
వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.భారత్లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్ఫ్లవర్ ఆయిల్పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలుఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
వంట నూనెల ధరలు తగ్గాయి.. దిగుమతులు భారీగా పెరిగాయి!
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు తెలిపింది. 2022–23లో తొలి తొమ్మిది నెలల సీజన్లో (నవంబర్–అక్టోబర్) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొంది. వెజిటబుల్ నూనెల్లో వంటకు వినియోగించేవే కాకుండా, వంటకు వినియోగించనివి (ఆహార పదార్థాల్లో వినియోగానికి) కూడా ఉంటాయి. ఇక ఈ ఏడాది జూలైలో వంట నూనెల దిగుమతుల వరకే చూస్తే 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 12.05 లక్షల టన్నుల మేర దిగుమతి అయ్యాయి. ఇతర నూనెల దిగుమతులు 9,069 టన్నుల నుంచి 15,999 టన్నులకు పెరిగాయి. దేశీయంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ తిరిగి పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. దేశంలో 45 రోజుల వినియోగానికి సరిపడా వంట నూనెల నిల్వలు ఉన్నాయని, పండుగల రోజుల్లో నూనెల సరఫరా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. పామాయిల్ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి అవుతోంది. సన్ఫ్లవర్ నూనె ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తోంది. -
సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వంట నూనె ధరలు తగ్గనున్నాయి. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది. చదవండి: ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే! -
సామాన్యులకు భారీ ఊరట..తగ్గనున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణికి అనుగుణంగా వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8–12 తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వివరించింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది. భారతీయ వినియోగదారులు తినే నూనెల కోసం తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తారు. దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయి అని ఆహార మంత్రిత్వ శాఖ వివరించింది. అధిక తయారీ వ్యయం, రవాణా ఖర్చుతో సహా అనేక భౌగోళిక రాజకీయ కారణాలతో 2021–22లో అంతర్జాతీయ, దేశీయంగా తినే నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 2022 జూన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. -
గొంగ్లూర్ టు జపాన్! గానుగ వంటనూనెల ఎగుమతికి సన్నాహాలు..
సాక్షి, సంగారెడ్డి: సంఘటితమై పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామ మహిళలు (స్వయం సహాయక బృందం) తయారు చేస్తున్న గానుగ (కోల్డ్ ప్రెస్డ్) వంటనూనెలను జపాన్కు ఎగుమతి చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గొంగ్లూర్ గ్రామానికి చెందిన 126 మంది మహిళలు నడుపుతున్న సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న గానుగ వంటనూనెల నమూనాలను ఇటీవల నాణ్యతా పరీక్షలకు తీసుకెళ్లిన జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) వాటి ఫలితాలపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయా నూనెల ఎగుమతికి వీలుగా సర్వోదయ సంస్థ త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. నూనెలు.. చేతితో చేసిన సబ్బులు.. శుద్ధిచేసిన పప్పు దినుసులు ఐఆర్ఎస్ అధికారి సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు వైద్యుల సహకారంతో గ్రామంలో పలు రకాల కుటీర పరి శ్రమలను స్థాపించారు. అందులో ఒకటైన సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్... ‘సర్వోదయాస్ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన సబ్బులు, పప్పు దినుసుల ప్రాసెసింగ్తోపాటు సహజ పద్ధతుల్లో వంట నూనెలను తయారు చేస్తోంది. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనెలు, కుసుమ, కొబ్బరినూనెలను ఉత్పత్తి చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ సహకారం.. ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ తయారీ, నాణ్యతా పరీక్షలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని గొంగ్లూర్ మహిళలు గతంలో ఐఐటీ–హైదరాబాద్ను కోరారు. అందుకు అంగీకరించిన ఐఐటీ–హెచ్... భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంలో భాగంగా తమ క్యాంపస్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్ఐసీ) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఎస్ఐసీ ద్వారా ‘జెట్రో’ను సంప్రదించింది. ఐఐటీ–హెచ్, ఎస్ఐసీలు ఫెసిలిటేటర్గా వ్యవహరించాయి. మరోవైపు పర్యావరణ అనుకూల పద్ధతుల్లో తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ తయారీకి తోడ్పాటు అందించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) హైదరాబాద్కు గొంగ్లూర్ మహిళలు విజ్ఞప్తి చేయగా ఆ సంస్థ సైతం అందుకు అంగీకారం తెలిపింది. కీలక ముందడుగు పడింది.. సర్వోదయ మంజీరా వంట నూనెల ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మేము పంపిన శాంపిల్ను పరిశీలించి దిగుమతి చేసుకోవాలని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సానుకూల నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎంవోయూ కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ప్రతినెలా 5 వేల లీటర్ల నూనెలను ఉత్పత్తి చేస్తున్నాం. ఎగుమతి ఆర్డర్ వస్తే ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – సుధాకర్నాయక్, మంజీరా సర్వోదయ ఫౌండర్ తొలుత బెంగళూరుకు.. వంట నూనెల ఎగుమతులకు సంబంధించి జపాన్ సంస్థలు సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గొంగ్లూర్ మహిళలు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను ఆయా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఇక్కడ తయారు చేసిన వంటనూనెలను తొలుత బెంగళూరులోని ‘జెట్రో’ గోదాములకు తరలించి అక్కడి నుంచి ఎగుమతి చేసే యోచనలో ఉన్నారు. జాతీయ సంస్థల నుంచి లైసెన్స్లు.. సర్వోదయ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సంస్థ ఇప్పటికే పలు జాతీయ సంస్థల నుంచి లైసెన్స్లు పొందింది. బహుళజాతి సంస్థలు తీసుకున్నట్లే ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్), హ్యాండ్మేడ్ సబ్బులు వంటి కాస్మెటిక్స్ ఉత్పత్తులకు ఆయూష్ విభాగం నుంచి కూడా లైసెన్స్ పొందింది. చదవండి: బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ కావాలా? చలో పోచారం.. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరండి.. -
మళ్ళీ భారీగా తగ్గిన వంట నూనె ధరలు..
-
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతుల విలువ అక్టోబర్తో ముగిసిన సంవత్సరంలో రూ.1.57 లక్షల కోట్లకు చేరుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 34.18 శాతం అధికం కావడం గమనార్హం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం.. విదేశాల నుంచి భారత్కు దిగుమతి అయిన∙వంట నూనెల పరిమాణం 6.85 శాతం అధికమై 140.3 లక్షల టన్నులుగా ఉంది. 2020–21 నవంబర్–అక్టోబర్లో 131.3 లక్షల టన్నుల నూనెలు భారత్కు వచ్చి చేరాయి. వీటి విలువ రూ.1.17 లక్షల కోట్లు. 2021–22 నవంబర్–అక్టోబర్ కాలానికి పామ్ ఆయిల్ దిగుమతులు 4 లక్షల టన్నులు తగ్గి 79 లక్షల టన్నులుగా ఉంది. ధరల అధిక అస్థిరత ఈ తగ్గుదలకు కారణం. ఆర్బీడీ పామోలిన్ దాదాపు మూడింతలై 18.4 లక్షల టన్నులకు చేరింది. ముడి పామాయిల్ 20 శాతం క్షీణించి 59.94 లక్షల టన్నులు నమోదైంది. సాఫ్ట్ ఆయిల్స్ 48.12 లక్షల టన్నుల నుంచి 61.15 లక్షల టన్నులకు ఎగసింది. సాఫ్ట్ ఆయిల్స్లో సోయాబీన్ 28.66 లక్షల టన్నుల నుంచి 41.71 లక్షల టన్నులు, సన్ఫ్లవర్ స్వల్పంగా అధికమై 19.44 లక్షల టన్నులకు చేరింది. నవంబర్ 1 నాటికి దేశంలో 24.55 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నెలకు 19 లక్షల టన్నుల నూనె వినియోగం అవుతోంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలిన్ అధికంగా ఇండోనేషియా, మలేషియా నుంచి సరఫరా అవుతోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని నెలల్లో ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ తగ్గుదలకు కారణమని పేర్కొంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు 200-300 డాలర్లు తగ్గాయి. దీని ప్రభావం భారత్లోని రిటైల్ మార్కెట్లో కూడా కనిపించడం ప్రారంభించిందని తెలిపింది. సామాన్యులకు రిలీఫ్.. ధరలు తగ్గాయ్! దేశవ్యాప్తంగా వీటిపై ఓ లుక్కేస్తే.. RBD పామోలిన్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వనస్పతి రిటైల్ ధరలు గత 6 నెలల్లో 26%, 9%, 12%, 9% 11% తగ్గాయి. గత మూడు నెలల్లో, శుద్ధి చేసిన సన్ఫ్లవర్ సగటు దేశీయ రిటైల్ ధరలు కిలోకు రూ.181 నుంచి రూ.170కి తగ్గింది. వనస్పతి ధరలు రూ.154 నుంచి రూ.146, రిఫైన్డ్ సోయాబీన్ రూ.157 రూ. 154 తగ్గింది. మహమ్మారి, సరఫరా కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలను అరికట్టడానికి దిగుమతి సుంకాలు, పప్పులపై సెస్ తగ్గింపు, సుంకాల హేతుబద్ధీకరణ, తినదగిన నూనెలు, నూనెగింజలపై స్టాక్ పరిమితులను విధించడం, బఫర్ స్టాక్ నిర్వహణ వంటి పలు నిర్ణయాల కారణంగా వంట నూనె ధరలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎడిబుల్ ఆయిల్స్పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన ఫలితంగా చమురు ధరలు తగ్గాయి. ప్రస్తుతం తగ్గించిన సుంకం పూర్తి ప్రయోజనాన్ని ప్రజలకు అందేలా చూడాలని పరిశ్రమలను కేంద్రం కోరింది. చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్కి 40 కి.మీ వరకు మైలేజ్తో నడిచే కార్లు వస్తున్నాయట! -
పండుగ తర్వాత షాకిచ్చిన కేంద్రం.. పెరగనున్న వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6-11 శాతం పెంచనుంది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయిల్పై (Oil) దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం వల్ల వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ముడి పామాయిల్ (CPO) దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952డాలర్లకి పెరిగింది. అలాగే ఆర్బీడీ (RBD) పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905డాలర్ల నుంచి 962డాలర్లకు ఎగసింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ముడి పామాయిల్పై ప్రాథమిక దిగుమతి పన్నును రద్దు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్కు అధిక భాగం రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి సరఫరా జరుగుతోంది. చదవండి: 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! -
సామాన్యులకు శుభవార్త, భారీగా తగ్గిన వంట నూనెల ధరలు
వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చిలో ఉక్రెయిన్పై రష్యా దా డుల కారణంగా మన దేశానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ కారణంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరి గాయి. సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇ బ్బందులు పడ్డారు. పల్లి, సన్ఫ్లవర్, పామాయిల్ నూనెలను వంటలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో తక్కువగా ఉండటంతో పొరుగు దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దిగుమతులు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తు తం నెల రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా తగ్గడంతో సామాన్యులపై భారం తప్పింది. గతంలో సన్ఫ్లవర్ నూనె లీటర్కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150కి చేరింది. పల్లి నూనె లీటర్కు రూ.220 పలుకగా రూ.165కి తగ్గింది. పామాయిల్ ధర లీటర్కు రూ.150 నుంచి రూ.95కు తగ్గింది. పామాయిల్న్ గతంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణా ల్లో తక్కువ ధరకు విక్రయించేవారు. సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ నూనె సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతం నూనె ధరలు రూ.55 నుంచి రూ.60 వరకు తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు మళ్లీ పెరగకుండా చూడాలని కోరుతున్నారు. చదవండి👉 చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట? -
సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
-
సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గనున్న వంటనూనె ధరలు!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉన్న విషయం తెలిసిందే. చదవండి👉 హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల బాదుడు -
వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం, సామాన్యులకు ఊరట
న్యూఢిల్లీ: వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోణంలో సుంకాల రాయితీని కేంద్రం పొడిగించినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ ఈడీ బీవీ మెహతా తెలిపారు. -
సామాన్యుడికి శుభవార్త.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!
ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు జీఎస్టీ ప్రభావం మరింత భారం కానుంది. ఈ క్రమంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరల తగ్గింపుపై కేంద్రం ఆహార మంత్రిత్వశాఖ వంటనూనెల తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో గురువారం(ఆగస్టు4)న సమావేశం కానుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే తర్వాత ఇలాంటి సమావేశాలు జరగడం ఇది మూడోసారి. ముఖ్యంగా పామాయిల్ అతిపెద్ద ఎగుమతిదారుడు ఇండోనేషియా రవాణాపై నిషేధాన్ని తొలగించి, సన్ఫ్లవర్, సోయా నూనెల సరఫరాను సడలించిన తర్వాత అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్(వంటనూనెల) ధరలు క్షీణించాయి. అయితే దేశీ మార్కెట్లో రిటైల్ ధరలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. దీని వల్ల సామాన్యులకు ధరల పంపు నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది. కాగా గతంలోనూ కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచచ్చిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం, జూన్ 1 నుంచి దేశీయ మార్కెట్లో ఆవాలు, సోయా, సన్ ఫ్లవర్ పామాయిల్ రిటైల్ ధరలు 5-12% శ్రేణిలో క్షీణించాయి. తగ్గుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. భారత్ వార్షిక దిగుమతులు దాదాపు 13-14 మిలియన్ టన్నులు ఉండగా, అందులో ఇండోనేషియా, మలేషియా నుంచి 8 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటోంది. అయితే సోయా , సన్ఫ్లవర్ వంటి ఇతర నూనెలు అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నుంచి వస్తాయి. చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి! -
తగ్గనున్న వంట నూనె ధరలు..ఎప్పటి నుంచంటే..?
సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా ఆగస్ట్ 31 వరకు అన్ని పామాయిల్ ఉత్పత్తులకు ఎగుమతి సుంకాన్ని రద్దు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్లో వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ సంక్షోభం తలెత్తినా ఆ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది. ఉదాహరణకు..ఉక్రెయిన్ నుంచి భారత్ 70శాతం సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా భారత్లో ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధానికి ముందు రూ.135 నుంచి 150 మధ్యలో ఉన్న వంట నూనె రూ.200కి చేరింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నూనె రావడం లేదని వ్యాపారస్తులు వాటి ధరల్ని భారీగా పెంచారు. ధరల్ని తగ్గించాలి ఈ నేపథ్యంలో కేంద్రం ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిపోతున్న నిత్యవసర ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేలా వెంటనే ఆయిల్ ధరల్ని రూ.15 తగ్గించాలని సూచించింది. ఈ తరుణంలో పామాయిల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని ఇండోనేషియా రద్దు చేయడంతో..దేశీయ ఆయిల్ కంపెనీలు నూనెల ధరల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వంట నూనె ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే! 'విదేశాల నుంచి భారత్కు రవాణా అయ్యే సరకు జులై 15 ముందు నుంచే ప్రారంభమవుతుంది. జులై 25కల్లా భారత్కు చేరుతుంది. కాబట్టి.. అదే నెలలో (జులై) వంట నూనెల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాతి నెల నుంచి ధరలు తగ్గుతాయని' అదానీ విల్మార్ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ అన్నారు. ఆయిల్ ధరల్ని తగ్గించాయి భారత్లో కొన్ని ఆయిల్ కంపెనీలు వాటి ధరల్ని తగ్గించాల్సి ఉంది. అదే సమయంలో అదానీ విల్మార్, మదర్ డెయిరీ, ఇమామి ఆగ్రోటెక్ పాటు ఇతర సంస్థలు గత నెలలో ఆయిల్ ఉత్పత్తులపై రూ .10 -15 ధరని తగ్గించాయి. -
భారీ ఊరట: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెల ధరలను అదుపు చేసేందుకవసరమైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా శుభవార్త అందించింది. వంట నూనెల రిటైల్ ధరను లీటరుకు రూ. 15 తగ్గించింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ధర తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు తక్షణమే అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో సామాన్యులకు వంటింటి భారం నుంచి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు దిగిరావడం, ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చల నపథ్యంలో వంట నూనె ధరలు దిగి వచ్చాయి. కాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి దేశంలో ఆవ, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామాయిల్ రిటైల్ ధరలు 5-11 శాతం తగ్గాయి. -
శుభవార్త! వంట నూనెల ధరలు తగ్గనున్నాయ్..
వంటనూనెల ధరలు తగ్గనున్నాయ్! అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో వంట నూనెల ప్రైస్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు ఈ తగ్గింపు ఉండవచ్చని చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో సామాన్యులు బడ్జెట్ తలకిందులైపోయింది. మేలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు అయ్యింది. మనం వినియెగించే వంట నూనెలో సగానికి పైగా దిగుమతి చేసుకోవ్లాసి ఉంది. దీంతో కేంద్రం సైతం దిగుమతి సుంకాలు తగ్గించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ ధరలు తగ్గాయని ఇండియన్ వెజిటేబుల్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే తగ్గింపు హోల్సేల్ మార్కెట్లలో అమలకు చర్యలు మొదలయ్యాయని ఆయిల్ అసోసియేషన్ తెలిపింది. వారం పదిరోజుల్లో రిటైల్ మార్కెట్లో ఎంఆర్పీ ధరలు కూడా తగ్గుతాయంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం పామాయిల్పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్ఫ్లవర్ ఆయిల్పై రూ.10 నుంచి 15, సోయాబీన్పై రూ.5 వంతున ధరలు తగ్గే అవకాశం ఉంది. చదవండి: బంగారం వెండి, వంటనూనెల బేస్ దిగుమతి రేటు తగ్గింపు -
‘పామాయిల్’ సెగ తగ్గేదెలా!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్కు అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది. భారత్లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్–రష్యా యుధ్దం కారణంగా సన్ఫ్లవర్ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్ఫ్లవర్ నూనె మన దేశానికి ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్ వినియోగం 1–1.10 మిలియన్ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్లోనే ప్రభుత్వం పామాయిల్పై సెస్ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఇండోనేషియా నిషేధం...సామాన్యులపై మరో పిడుగు....!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్లో వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధిక వంటనూనె ధరలతో సతమతమవుతోన్న సామాన్యులకు ఇప్పుడు ఇండోనేషియా నిర్ణయం కంటిమీద కునుకు లేకుండా చేయనుంది. ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో మరోసారి వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. వీపరితమైన కొరత..! ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారు ఇండోనేషియా. ఏప్రిల్ 28 నుంచి పామాయిల్ ఎగుమతులను నిషేధించాలని ఆ దేశం నిర్ణయించుకుంది. ఇండోనేషియాలో వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశీయంగా వంటనూనెకు వీపరితమైన కొరత ఏర్పడటంతో పామాయిల్ను ఇతర దేశాలకు ఎగుమతులను నిషేధించేందుకు ఇండోనేషియా సిద్దమైన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనాపై ప్రభావం..! ఇండోనేషియా నిర్ణయం నేరుగా భారత్, చైనాలపై పడనుంది. ఆ దేశం నుంచి పామాయిల్ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో చైనా, భారత్లు తొలి స్థానంలో ఉన్నాయి. ఇరు దేశాల దిగుమతులు ప్రపంచ సరఫరాలో సగానికి పైగా ఉంది. ఇండోనేషియా నుంచి పామాయిల్ సరఫరా నిలిచిపోవడం వల్ల భారత్కు ప్రతి నెలా దాదాపు 4 మిలియన్ టన్నుల పామాయిల్ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్తో ఇప్పటికే భారత్లో సన్ఫ్లవర్ ఆయిల్ సరఫరా నెలకు దాదాపు లక్ష టన్నులకు సగం తగ్గిపోయింది. ఇప్పుడు ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో వంటనూనె ధరలు వీపరితంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పామాయిల్ వాడకం ఎక్కువ..! పామాయిల్ను వంట నూనెల నుంచి ప్రాసెస్ చేసిన ఆహారాలు, కాస్మొటిక్స్, జీవ ఇంధనాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే కూరగాయల నూనె. అంతేకాకుండా బిస్కెట్లు, వనస్పతి, లాండ్రీ డిటర్జెంట్లు, చాక్లెట్ వంటి అనేక ఉత్పత్తుల తయారీలో కూడా పామాయిల్ను విరివిరిగా ఉపయోగిస్తారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..! -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, భారత్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్..ఎంతలా ఉందంటే!
ముంబై: భారత్ ఎకానమీపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 0.8 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో క్రితం 7.8 శాతం అంచనాలు 7.2 శాతానికి తగ్గాయి. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ముఖ్యాంశాలు... ►కమోడీటీ ధరల పెరుగుదల ప్రధాన సమస్య. యుద్ధం నేపథ్యంలో తాజా సరఫరాల సమస్యలు తలెత్తుతున్నాయి. ►2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలు ప్రస్తు తం 7.8%గా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న పాలసీ సమావేశాల్లో ఈ అంకెను తగ్గించే అవకాశం ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4% కాగా, నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి 2022) ఈ రేటు 3 నుంచి 4 % మేరకే నమోదయ్యే వీలుంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 8.5%గా ఉంటుందని భావిస్తున్నాం. ►ఊహించినట్లుగానే మహమ్మారి కరోనా మొదటి, రెండవ వేవ్లతో పోల్చితే మూడవ వేవ్లో ఆర్థిక, ప్రాణ నష్టాలు చాలా తక్కువగానే నమోదయ్యాయి. 2022 మార్చి ప్రారంభంలో ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నప్పటికీ, రష్యా–ఉక్రెయిన్ వివాదం, వస్తువుల ధరలలో పెరుగుదల ఎకానమీలో అనిశ్చితిని పెంచిం ది. పలు కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ►ఇంధనం, వంట నూనెల వంటి వస్తువుల అధిక ధరలు మధ్య, దిగువ స్థాయి ఆదాయ వర్గాల విచక్షణ రహిత వ్యయాలను తగ్గించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్ పునరుద్ధరణను అడ్డుకుంటుంది. ►సెప్టెంబరు 2022 వరకు ఉచిత ఆహారధాన్యాల పథకం పొడిగింపు హర్షణీయం. బలహీన ఆర్థిక కుటుంబాల ఆహార బడ్జెట్లకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. ►భారత్ ఎగుమతుల విషయానికి వస్తే, మూడవ త్రైమాసికంతో పోల్చితే నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) సామర్థ్య వినియోగ స్థాయిలు 72% నుంచి 75%కి పెరిగింది. ►2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోడానికి కేంద్ర మూలధన వ్యయాలు కీలకంగా మారనున్నాయి. ►ఎకానమీలో వివిధ రంగాల్లో పలు స్థాయిల్లో (కే నమూనాలో) రికవరీ చోటుచేసుకునే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతాయి. వ్యవసాయంలో వృద్ధి 3 % లోపే... ఇక్రా నివేదిక ప్రకారం, 2022లో రిజర్వాయర్ స్థాయిలు బాగున్నాయి. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడినా, వ్యవసాయ రంగంపై అంతగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఎరువుల కొరత వ్యవ సాయ రంగానికి ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీ య మార్కెట్లో పరిమిత లభ్యత, పెరిగిన ధరలు, తక్కువ దిగుమతులు వంటి అంశాలు వ్యవసాయ రం గంపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అందువల్ల తగిన రిజర్వాయర్ స్థాయిలు, సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగే అవకాశం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3%కన్నా తక్కువగా నమోదయ్యే వీలుంది. -
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎఫెక్ట్..పెరిగిన టిఫిన్ ధరలు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన రాష్ట్రంలో సామాన్యులపై భారం మోపుతోంది. వంట నూనెల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. వంట నూనెలను ప్రధానంగా మన దేశం ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వంట నూనెలకు ఉన్న డిమాండ్తో ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం అల్పాహార ధరలపై పడింది. వంట నూనెలతో తయారయ్యే అన్ని రకాల టిఫిన్ ధరలను హోటళ్ల యాజమాన్యాలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. నూనెతో తయారయ్యే దోశె, పూరి, వడ, బజ్జి, పుణుకులు వంటివాటి ధరలు ఇప్పటికే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా పెరిగాయి. యుద్ధం రాకముందు సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.135గా ఉండేదని, ఇప్పుడు అది రూ.180కు చేరుకుందని.. దీంతో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని విజయవాడలోని సాయి ప్రియాంక హోటల్ యజమాని తెలిపారు. మొన్నటి దాక రూ.40గా ఉన్న ప్లేట్ మైసూర్ బజ్జి, గారెల ధరలను ఇప్పుడు రూ.50కు పెంచామని వివరించారు. అలాగే దోశెల ధరలను రూ.5 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. చదవండి: సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్లు భగ్గుమంటున్న ఇతర వస్తువుల ధరలు ఇదే సమయంలో వంట నూనెలతోపాటు వంట గ్యాస్, ఎండు మిర్చి వంటి వాటి ధరలు కూడా భారీగా పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,750 ఉండగా ఇప్పుడిది రూ.1,980కు చేరిందన్నారు. అలాగే ఎండు మిర్చి ధర 15 రోజుల క్రితం కిలో రూ.200లోపు ఉండగా అది ఇప్పుడు రూ.260కి చేరిందని వివరించారు. అలాగే లైవ్ చికెన్ కిలో ఫిబ్రవరిలో రూ.92–112 మధ్య ఉంటే ఇప్పుడది రూ.149కి చేరిందని దీంతో చికెన్తో తయారయ్యే ఆహార ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు. నష్టాలు భరించలేని చిన్న హోటల్స్ ధరలు పెంచాయని.. పెద్ద హోటల్స్ మాత్రం వేచిచూస్తున్నట్లు తెలిపారు. యుద్ధం సద్దుమణిగితే నూనె ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందేమోనని వేచిచూస్తున్నట్టు తిరుపతిలోని స్టార్ హోటల్ యజమాని ఒకరు ‘సాక్షి’కి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా రిటైల్ ధరలను సవరించలేదన్నారు. ఒక్కసారి డీజిల్ ధరలు పెరిగితే అందరూ ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. నష్టాలు భరించలేం.. గత రెండేళ్లుగా కరోనాతో హోటల్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. అయినా వ్యాపారం పునరుద్ధరించుకోవడం కోసం రెండేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా టిఫిన్ ధరలను పెంచకుండా నష్టాలను భరించాం. కానీ ఇప్పుడు వంట నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరలు ఇదేవిధంగా కొనసాగితే అన్ని రకాల టిఫిన్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. – బాలకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ -
వంట నూనెలు భగభగ.. వార్తో ‘వంద’ పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంట నూనెలు భగభగమండుతున్నాయి. లీటర్ పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్ ధర నెలరోజుల్లో దాదాపుగా రూ.100 పెరిగింది. గత నెలలో రూ.120 నుంచి రూ.130 ఉన్న నూనె ధరలు ఏకంగా రూ. 225 వరకు చేరుకున్నాయి. హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లలో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఎంఆర్పీ ధరల స్టిక్కర్లతో సన్ఫ్లవర్ నూనెలను విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ నూనె తయారీ సంస్థలే ఎంఆర్పీ ధరలను సవరిస్తూ విక్రయిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ముడి చమురు కంటెయినర్లు ఇప్పట్లో తయారీ సంస్థల వద్దకు రావని అర్థం కావడంతో, మార్కెట్లో ఉన్న డిమాండ్ను ఆధారం చేసుకొని 5 నుంచి 7రోజులకోసారి ఎంఆర్పీలను సవరించి మార్కెట్లకు పంపిస్తున్నారు. తద్వారా ఈరోజు ఉన్న ధర రేపు ఉండని పరిస్థితి. ఇతర కంపెనీలతో పాటే ప్రభుత్వ సంస్థ ‘విజయ’కూడా సన్ఫ్లవర్ నూనె ధరను రూ. 225గా ప్రింట్ చేసి విక్రయిస్తోంది. వారం క్రితం విజయ ఎంఆర్పీ రూ.196 మాత్రమే. వేరుశనగ, రైస్బ్రాన్, సోయాబీన్ ధర పెరిగినా రూ.170 నుంచి రూ. 180 ఎంఆర్పీగా ఉన్నాయి. పామాయిల్ నూనె లీటర్కు రూ. 150 నుంచి రూ. 160కి విక్రయిస్తున్నారు. పామాయిల్ ధరలు నెల క్రితంతో పోలిస్తే 20 రూపాయల వరకు పెరగగా, దీని వినియోగం రాష్ట్రంలో పెరిగింది. సూపర్ మార్కెట్లు, హోల్సేల్ వ్యాపారులు కూడా నూనెలపై డిస్కౌంట్ సేల్ ఎత్తేసి ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. సన్ఫ్లవర్తో పోలిస్తే ఇతర నూనెల ధరలు అంతగా పెరగకపోవడంతో పల్లి నూనె, రైస్బ్రాన్, సోయాబీన్, పామాయిల్ నూనెల వైపు ప్రజలు మరలుతున్నారని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. దీంతో ఈ నూనెల ధరలు పెంచడంపైనా కంపెనీలు దృష్టిపెట్టాయి. ఇప్పటికే బ్లాక్ మార్కెట్కు తరలించిన ఏజెన్సీలు త్వరలోనే కొత్త ధరలను ప్రింట్ చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమచారం. స్టిక్కర్లు మార్చి... ఈ ఫొటోలో ఉన్న ఓ కంపెనీకి చెందిన సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్లు పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ సూపర్ మార్కెట్లోనివి. ఆ కంపెనీ నూనె ప్యాకెట్ ధర వారం రోజుల క్రితం ఎంఆర్పీ రూ.175 ఉండగా, ప్రస్తుతం 217కి చేరింది. అయితే ఆ సూపర్ మార్కెట్ యజమాని నిల్వ ఉన్న ప్యాకెట్లపై పాతరేట్లను తొలగించి రూ. 205 ధరతో కొత్త స్టిక్కర్లు వేసి విక్రయించాడు. ఇది పెద్దపల్లి జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దందా. -
వంటింటికి ఊరట.. రైతు బజార్లలో వంటనూనె విక్రయాలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది. కాగుతున్న నూనెల ధరలను నియంత్రించేందుకు కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సీఎస్ సమీర్శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. మరోవైపు ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్ఫెడ్ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు, టమాటాల రేట్లు భారీగా పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయాలు చేపట్టి వినియోగదారులకు ఊరట కల్పించడం తెలిసిందే. అది మరింత ‘ప్రియ’ం ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రభావం పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ రూ.170–175, పామాయిల్ రూ.158–160, వేరుశనగ నూనె రూ.170–173, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.170– 172 ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్తో సహా నూనెలన్నీ లీటర్ రూ.200 పైనే పలుకుతున్నాయి. మిగిలిన కంపెనీల ధరలతో పోలిస్తే ప్రియా నూనె ధరలు తారస్థాయిలో ఉన్నాయి. రైతు బజార్లలో ‘విజయ’ నూనెలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వంట నూనెలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఏపీ ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా విజయ డిస్ట్రిబ్యూటర్లను సమీప రైతుబజార్లతో అనుసంధానించారు. ధరల్లో వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ప్రత్యేకంగా బోర్డులను ప్రదర్శిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యమైన నూనె ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.200 నుంచి రూ.265 వరకు పలుకుతున్న పామాయిల్, సన్ఫ్లవర్, వేరు శనగ, రైస్బ్రాన్ నూనెలను రైతు బజార్లలో రూ.163 నుంచి రూ.178కే అందుబాటులో ఉంచారు. ఎలాంటి కోటా లేకుండా విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 61 ప్రధాన రైతుబజార్లలో విక్రయాలను ప్రారంభించారు. వీటిలో 27 చోట్ల విజయ ఆయిల్ అవుట్లెట్స్ ఉండగా మిగిలిన చోట్ల రైతుబజార్లలోని ఇతర దుకాణాల ద్వారా విక్రయిస్తు న్నారు. లీటర్ పామాయిల్ రూ.163, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్బ్రాన్ నూనెలు రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆయిల్ ఫెడ్ వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని నిల్వలు సేకరించైనా ప్రజలకు వంటనూనెలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు లభ్యం కావడంతోపాటు నాణ్యత బాగుందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో వంటనూనెలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు విక్రయిస్తున్నాం. బహిరంగ మార్కెట్తో పోలిస్తే లీటర్ రూ.37 నుంచి రూ.87 తక్కువ ధరకే విజయ నూనెలను అందుబాటులో ఉంచాం. ధరలు అదుపులోకి వచ్చేవరకు విక్రయాలు కొనసాగుతాయి. –చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇతర కంపెనీలను ప్రోత్సహిస్తే చర్యలు మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా వంట నూనెల విక్రయాలను ప్రారంభించాం. ధరల్లో వ్యత్యాసం తెలియచేసేలా రైతుబజార్లలో బోర్డులు ప్రదర్శిస్తున్నాం. విజయ నూనెలను కాకుండా అధిక ధరలు కలిగిన ఇతర కంపెనీల నూనెల విక్రయాలను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు నాణ్యత బాగుంది.. రోజురోజుకు పెరుగుతున్న వంట నూనెల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే విజయ నూనె విక్రయాలు చేపట్టటాన్ని స్వాగతిస్తున్నాం. భవానీపురం రైతు బజార్లో లీటర్ రూ.170 చొప్పున రెండు వేరుశనగ నూనె ప్యాకెట్లు కొనుగోలు చేశా. నాణ్యత చాలా బాగుంది. –వి.వెంకటలక్ష్మి, భవానీపురం, విజయవాడ ఎంతో ఊరట.. మార్కెట్లో నూనె ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం ఎంతో ఊరటనిస్తోంది. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. భవానీపురం రైతు బజార్లో ఆయిల్ చాలా బాగుంది. ఉల్లి, టమాటా ధరలు పెరిగిన ప్పుడు కూడా ఇదే రీతిలో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. –వన్నంరెడ్డి సురేష్, రామలింగేశ్వరనగర్, విజయవాడ -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు..!
ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సైనిక చర్య ప్రారంభించడంతో ఇప్పుడు ఆ ప్రభావం అన్నింటి మీద పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు బంగారం ధరలు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్, క్రీప్టో మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. అయితే, వాటితో పాటు ఇప్పడు ఉక్రెయిన్-రష్యా సంక్షోభ ప్రభావం వంటనూనె ధరల మీద కూడా పడనుంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో అంతరాయం కారణంగా ధరలు భారీగా పెరగనున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. 80 శాతం సన్-ఫ్లవర్ ఆయిల్ను మన దేశం మాజీ సోవియట్ రిపబ్లిక్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. గత ఏడాది నవంబర్-అక్టోబర్ మధ్య కాలంలో భారతదేశం మొత్తం 18.93 లక్షల టన్నుల ముడి సన్-ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది. ఇందులో 13.97 లక్షల టన్నులు ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోవడం గమనర్హం. ఇంకా, అర్జెంటీనా (2.24 లక్షల టన్నులు), రష్యా (2.22 లక్షల టన్నులు) నుంచి దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు పేర్కొంటునాయి. గణాంకాల ప్రకారం, ఉక్రెయిన్ సన్-ఫ్లవర్ ఆయిల్ను భారతదేశానికి ఎగుమతి చేసే ఏకైక ప్రధాన సరఫరాదారు. వంటనూనె తయారీదారుల అత్యున్నత సంస్థ సాల్వెంట్ అండ్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్(సీ) అధ్యక్షుడు అతుల్ చతుర్వేది మాట్లాడుతూ.. వంటనూనె ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. "ఉక్రెయిన్, రష్యా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా మనదేశానికి వస్తుంది. ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల దాని సరఫరాలో అంతరాయం కలిగితే ధరలు ఊహించని స్థాయిలో పేరుగుతాయని భావిస్తున్నారు. మేము నెలకు దాదాపు 2.0 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాము" అని చతుర్వేది అన్నారు. ఇప్పటికే దేశంలో వంటనూనె కొరత ఉన్న సమయంలో ఈ సంక్షోభం తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది అని ఆయన అన్నారు. రిటైల్ మార్కెట్లో శుద్ధి చేసిన సన్ ఫ్లవర్ ఆయిల్ ధర లీటరుకు రూ.145.03తో పోలిస్తే ప్రస్తుతం లీటరుకు రూ.161.94కు పెరిగిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రైస్ మానిటరింగ్ సెల్ తెలిపింది. సప్లై ఛైయిన్ అంతరాయం వల్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి అని కూడా పేర్కొంది. అర్జెంటీనా ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ తీర్చే సామర్ధ్యం ఆ దేశానికి లేదు అని చతుర్వేది అన్నారు. రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో ఒక ప్రధాన సమస్యగా మారింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకుంది. అలాగే, మన దేశంలో ఉత్పత్తి పడిపోవడంతో మహారాష్ట్రలోని లాతూర్ హోల్ సేల్ మార్కెట్ వద్ద సోయాబీన్ క్వింటాల్ ధర రూ.6,200గా ఉంటే గత రెండు రోజుల నుంచి క్వింటాల్'కు రూ.7,000/ చేరుకున్నాయి. ఇప్పటికే ఆయిల్ సరఫరాదారులు ఇండోనేషియా ఎగుమతుల ఆంక్షల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పామ్ ఆయిల్ ఎక్కువగా ఈ దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. దక్షిణ అమెరికాలో కరువు కారణంగా సోయా ఆయిల్ ఉత్పత్తి కూడా పడిపోయింది. దీని వల్ల ఇప్పటికే ఆయిల్ సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఈ రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల దెబ్బకి ఆయిల్ వంటనూనె ధరలు ఏ రేంజ్లో పెరుగుతాయో చూడాలి మరి. (చదవండి: బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!) -
సామాన్యులకు కేంద్రం గుడ్న్యూస్.. దిగుమతి సుంకంలో కోత.. దిగి రానున్న ధరలు
సామాన్యులకు ఊరటను కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామాయిల్ ధరలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలను నియంత్రిచడంతో పాటుగా, దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలకు మద్దతును అందిస్తోందని కేంద్రం పేర్కొంది. 8.25 శాతం నుంచి.. కేంద్ర ప్రభుత్వం శనివారం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. . ఇక ముడి పామాయిల్ (CPO)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం శూన్యం. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెస్ను ఫిబ్రవరి 13 నుండి 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. అగ్రి డెవలప్మెంట్ సెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ సెస్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత క్రూడ్ పామాయిల్పై ఎఫేక్టివ్ దిగుమతి సుంకం ఇప్పుడు 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గుతుంది. సీబీఐసీ ఒక నోటిఫికేషన్లో...క్రూడ్ పామాయిల్, ఇతర క్రూడ్ నూనెలపై తగ్గించిన దిగుమతి సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ మధ్య ప్రభావవంతమైన సుంకం వ్యత్యాసాన్ని పరిశ్రమల సంఘం ఎస్ఈఏ డిమాండ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం శుద్ధి చేసిన పామాయిల్పై ఎఫెక్టివ్ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది. డ్యూటీ వ్యత్యాసాన్ని మరింత పెంచాలి: ఎస్ఈఏ గత ఏడాది పొడవునా ఎడిబుల్ ఆయిల్ ధరలు అధికంగా ఉండటంతో..దేశీయ లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో పామాయిల్పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిబి మెహతా మాట్లాడుతూ...‘క్రూడ్ పామాయిల్పై అగ్రి సెస్ను 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. కాబట్టి క్రూడ్ పామాయిల్, ఆర్బీడీ పామోలిన్ మధ్య ప్రభావవంతమైన డ్యూటీ వ్యత్యాసం 8.25 శాతంగా ఉంటుంది. ప్రస్తుత సుంకం సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. క్రూడ్పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్పై డ్యూటీ 5.5 శాతం సెప్టెంబరు 30 వరకు ఉండనుంద’ని ఆయన చెప్పారు. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే..దేశీయ రిఫైనర్లు ఆర్థికంగా ఆయా రిఫైనర్లను నిర్వహించడానికి ఆయా నూనెల మధ్య కనీసం 11 శాతం డ్యూటీ వ్యత్యాసాన్ని ఉంచాలని ఎస్ఈఏ అభ్యరించిందని తెలిపారు. చదవండి: ‘అన్ని ఉద్యోగాలు నాన్ లోకల్స్కేనా..? మా పరిస్థితి ఏంటి..!’ చైనా కంపెనీకి భారీ షాక్..! -
భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంటనూనెపై రూ.5-20 వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రిటైల్ మార్కెట్లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో రూ.180, ఆవనూనె కిలో రూ.184.59, సోయా ఆయిల్ కిలో రూ.148.85, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162.4, పామాయిల్ కిలో ధర రూ.128.5గా ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ & ఆవనూనెల రిటైల్ ధరలు కిలోకు రూ.1.50-3 తగ్గాయి. సోయా & సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు రూ.7-8 తగ్గినట్లు కేంద్రం తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అదానీ విల్మార్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు రూ.15-20 ధరలను తగ్గించాయి. వంటనూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ మరియు సాల్వెంట్, విజయ్ సాల్వక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉన్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వాటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణం. వంటనూనెల విషయంలో దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటంతో.. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి సిద్దం అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్పామ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ మిషన్ ఆయిల్పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. (చదవండి: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్) -
మరింత తగ్గనున్న వంట నూనె ధరలు..!
సామాన్యులకు ఉపశమనం కల్పిస్తూ... ఆయా వంట నూనెల ధరలను రూ.7 నుంచి రూ.20 వరకు కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు భారీగా తగ్గడంతో వంట నూనె ధరలను భారీగా తగ్గాయి. రాబోయే రోజుల్లో వంటనూనె ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్ట్రాకర్స్ అసోసియేషన్ వెల్లడించింది. నూనె గింజల మెరుగైన దేశీయ ఉత్పత్తి, ప్రపంచ మార్కెట్లలోని అనుకూల అంశాలతో నూనె ధరలు కిలోకు రూ.3-4 రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నూనెలపై దిగ్గుమతి సుంకాలు తగ్గించడంతో ధరలు తగ్గాయని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ చతుర్వేది వెల్లడించారు. భారీ మొత్తంలో సాగు..! దేశ వ్యాప్తంగా నూనె గింజల సాగు గణనీయంగా ఉన్నట్లు అతుల్ పేర్కొన్నారు. దేశీయంగా సాగుచేస్తోన్న నూనె గింజలతో వంట నూనె ధరలు మరింత తగ్గనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు కొంతవరకు బేరిష్గా ఉండటంతో నూనె ధరలు రేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఎస్ఈఏ ప్రకారం... భారత్ సుమారు 65 శాతం మేర ఇంపోర్ట్పైనే ఆధారపడుతుంది. చదవండి: ‘అలా చేస్తే ఆర్బీఐకు ఇక్కట్లు తప్పవు..!’ -
అమెరికన్ ‘కార్గిల్’ చేతికి నెల్లూరు వంట నూనెల రిఫైనరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల రంగంలో ఉన్న యూఎస్ దిగ్గజం కార్గిల్ తాజాగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని వంట నూనెల శుద్ధి కేంద్రాన్ని కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్ట్ వద్ద ఉన్న ఈ రిఫైనరీని దక్కించుకోవడానికి, అలాగే ఆధునీకరణకు మొత్తం సుమారు రూ.262.5 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. 2022 మే నాటికి ఈ ఫెసిలిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. తద్వారా దక్షిణాదిన సంస్థ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుందని కార్గిల్ వంట నూనెల విభాగం భారత ఎండీ పియూష్ పట్నాయక్ తెలిపారు. 2001లో భారత్లో అడుగుపెట్టిన కార్గిల్ ప్రస్తుతం నేచుర్ఫ్రెష్, జెమిని, స్వీకార్, లియోనార్డో, సన్ఫ్లవర్ వంటి బ్రాండ్లలో వంట నూనెలు, కొవ్వుల వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశీయంగా 10 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. -
భారీగా తగ్గిన వంటనూనెల ధరలు
-
సామాన్యులకు శుభవార్త, వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం..ఎంతంటే
వంటనూనె వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో వంట నూనెల ధరల గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.7 నుంచి గరిష్ఠంగా రూ.20 వరకు తగ్గినట్లు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. Delhi | Edible oil prices have declined quite significantly, ranging from a decline of Rs 20, 18, 10, 7 at many places. Decline is witnessed on palm oil, groundnut, soybean, sunflower & all major oils: Sudhanshu Pandey, secretary of the Department of Food and Public Distribution pic.twitter.com/rmAdD2VO8t — ANI (@ANI) November 5, 2021 పామాయిల్,శనగ నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్రధానమైన నూనె రకాలపై ధరలు తగ్గినట్లు తెలిపారు.దేశంలోని ప్రాంతాల్ని బట్టి ధరలు రూ.20, రూ.18,రూ.10,రూ.7లు తగ్గనున్నట్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే కేంద్రం కీలక నిర్ణయం మార్కెట్లో మండిపోతున్న వంట నూనెల ధరలపై కేంద్రం అక్టోబర్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించినా వంట నూనె ధరలు తగ్గకపోవడంతో వినియోదారులపై భారాన్ని తగ్గించేలా వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై మార్చి 31, 2022 వరకు పరిమితి విధించింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. తాజాగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ స్టాక్ పరిమితులను అమల్లోకి తీసుకురావడంతో వంటనూనెలల ధరలు తగ్గాయి. -
పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించినట్లు పేర్కొంది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ సుంకం తగ్గింపు తర్వాత పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ముడి రకాలపై కస్టమ్స్ సుంకం వరుసగా 8.25 శాతం, 5.5 శాతం, 5.5 శాతంగా ఉంటుంది. అంతేగాకుండా, శుద్ధి చేసిన రకాల పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామోలిన్, పామాయిల్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు. "పండుగ సీజన్లో అధిక ధరల కారణంగా ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించింది" అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివీ మెహతా తెలిపారు.(చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం) -
కేంద్రం తాజా నిర్ణయంతో దిగిరానున్న వంటనూనెల ధరలు
న్యూఢిల్లీ: మార్కెట్లో మండిపోతున్న వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించినా వంట నూనె ధరలు తగ్గకపోవడంతో వినియోదారులపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై మార్చి 31, 2022 వరకు పరిమితి విధిస్తున్నట్లు వెల్లడించింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. కేంద్రం నిర్ణయంతో నూనెల ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార, వినియోగదారు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటికే ఎన్సీడీఈఎక్స్ ప్లాట్ఫామ్పై.. మస్టర్డ్ ఆయిల్ ట్రేడింగ్ను అక్టోబర్ 8 నుంచి నిలిపివేశారు. పన్నులు తగ్గించినా ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరంగా రెండు రోజుల క్రితం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో ఆవాల నూనె కాకుండా వంట నూనె ధరలు సుమారు 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. నూనె ధరల తగ్గింపునకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిల్వలపై పరిమితిని విధించాలని ఆదేశించింది. చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. (చదవండి: ఈ స్మార్ట్ హోమ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!) -
వంట నూనెల ధరలు తగ్గుముఖం... హోల్సేల్ మార్కెట్లో రేట్లు ఇలా..
గత ఏడాది కాలంగా సలసల మండిపోతున్న వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సుంకాలు తగ్గించడంతో హోల్సేల్ మార్కెట్లో వివిధ రకాల వంటనూనెల ధరలు కొద్ది మేరకు తగ్గాయి. ఈ మేరకు వివిధ నూనెలకు సంబంధించి ధరల తగ్గింపు వివరాలను కేంద్రం వెల్లడించింది. హోల్సేల్ మార్కెట్లో వివిధ వంట నూనెల ధరల తగ్గింపు వివరాలు ఇలా ఉన్నాయి.. - హోల్సేల్ మార్కెట్లో పామ్ ఆయిల్ ధరలు 2.5 శాతం తగ్గాయి. గత వారం టన్ను పామాయిల్ ధర రూ. 12,666 ఉండగా ప్రస్తుతం రూ. 12,349కి చేరుకుంది. - సీసమ్ ఆయిల్ 2.08 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 23,500లకు చేరుకుంది - కొబ్బరి నూనె ధరలు 1.72 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 17,100లుగా ఉంది - సన్ఫ్లవర్ నూనె ధరలు 1.30 శాతం తగ్గి టన్ను ధర రూ. 15,965లకు చేరుకుంది. అంతకు ముందు ఈ ధర రూ.16,176 - పల్లి నూనె ధరలు 1.28 శాతం తగ్గి హోల్ సేల్ మార్కెట్లో టన్ను నూనె ధర 16,839గా ట్రేడ్ అవుతోంది - వనస్పతి నూనె ధరలు 1 శాతం తగ్గి రూ. 12,508కి చేరుకుంది. - ఆవాల నూనె ధరలు సైతం 1 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 16,573 వద్ద ట్రేడవుతోంది. గతేడాది కంటే.. వంట నూనె ధరల్లో తగ్గుదల నమోదైనా గతేడాది ఇదే సమయానికి నమోదైన ధరలతో పోల్చితే ఇంకా అధికంగానే ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో నూనె ధరల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలంటూ వ్యాపారులను కేంద్రం ఆదేశించింది. చదవండి : వంట నూనె : పదకొండేళ్ల తర్వాత.. -
సలసలకాగుతున్న వంటనూనె ధరలు! మరోసారి షాక్ తప్పదా?
Edible Oil Prices: కరువుతో అమెరికా , బ్రెజిల్లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు ఇలా అంతర్జాతీయ కారణాలతో ఇంత కాలం వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడికి చుర్రుమనిపిస్తున్నాయి. ఇప్పుడు వాటికి మన దేశంలోని పరిస్థితులు కూడా తోడవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వంట నూనె ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గుజరాత్లో తగ్గిన ఉత్పత్తి దేశంలో వంట నూనె ఫ్యాక్టరీల్లో సింహభాగం గుజరాత్లోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా వెయ్యికి పైగా వంట నూనె తయారీ కర్మాగారాలు ఉండగా ఇందులో ఇప్పటికే 800లకు పైగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపుగా మూత పడ్డాయి. భారీ నూనె తయారీ పరిశ్రమల్లోనే ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ఫ్యాక్టరీల్లో కూడా మరో నెలకు సరిపడా ముడి పదార్థాలు ఉన్నాయి. మిల్లర్ల మొండిపట్టు వంటనూనె ముడి పదార్థాలైన వేరు శనగ, పత్తిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా పత్తికి సంబంధించి నాఫెడ్ దగ్గర సరిపడా నిల్వలు ఉన్నా.. ధర ఎక్కువగా ఉందనే కారణం చెబుతూ మిల్లర్లు కొనుగోల్లు మానేశారు. ధర తగ్గిన తర్వాతే ఉత్పత్తి మొదలు పెడతామంటూ భీష్మించుకున్నారు. పెరిగిన విదేశీ ఎగుమతులు గుజరాత్ నుంచి పత్తి, వేరు శనగల ఎగుమతులు విదేశాలకు పెరిగాయి. సాధారణంగా ప్రతీ ఏడు ఈ రాష్ట్రం నుంచి 30 లక్షల పత్తి బేళ్లు ఎగుమతి అవుతుండగా ఈ సారి మొత్తం 55 లక్షలకు చేరుకుంది. విదేశీ ఎగుమతులు పెరగడంతో గత పన్నెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కో బేల్ ధర రూ. 57,000లుగా పలుకుతోంది. దీంతో వీటిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ముందుకు రావడం లేదు. అప్పుడే వంద పెరిగింది గుజరాత్లో కాటన్ సీడ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వాటి ప్రభావం వంట నూనెల ధరలపై పడుతోంది. ఇప్పటికే 15 కేజీల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.100 వరకు పెరిగింది. 15 కేజీల గ్రౌండ్ నట్ ఆయిల్ ధర రూ. 2,550 నుంచి రూ. 2,560లకి చేరుకుంది. కాటన్ సీడ్ టిన్ ధర రూ. 2400 నుంచి రూ.2500కి చేరుకుంది. చదవండి: Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’! -
గుడ్న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు
సామాన్యులకు ఊరట కలుగనుందా? వంట నూనె ధరలు దిగిరానున్నాయా? అంటే అవును అని అంటున్నారు కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే. గత ఏడాది నుంచి 20 - 50 శాతం మధ్య పెరిగిన వంటనూనె ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ నుంచి వంట నూనెల ధరలు దిగిరావొచ్చన్నారు. కొత్త పంట మార్కెట్లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గే అంచనాలు ఉండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. "రాబోయే డిసెంబర్ నుంచి సోయాబీన్ ఆయిల్, పామాయిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది" అని ఆహార & ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.(చదవండి: నాలుగు నెలల్లో లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు) పాండే మాట్లాడుతూ.. "రాబోయే రోజుల్లో సోయాబీన్ పంట కోతకు వస్తుంది. ఆ నాలుగు నెలల తర్వాత రబీ ఆవాల పంట చేతికి వస్తుంది, కాబట్టి ధరలు నియంత్రణలో ఉండాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. అలాగే, కొత్త పంటల రాక, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ఆయిల్ ధరల ఇందుకు కారణం అని అన్నారు. ప్రస్తుతం 60 శాతం ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటుంది అని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే, అప్పుడు ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది అని పాండే అన్నారు. గత ఏడాది కాలంలో దేశంలో వంట నూనె ధరలు 64 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలను అరికట్టడం కోసం మిషన్ ఆయిల్పామ్ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్ను ప్రకటించింది. -
మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె
రోజు మీరు ఉపయోగించే వంటనూనె మీ ఆరోగ్యానికి మంచిదేనా? మీ గుండెకు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా ? ఆరోగ్యాన్ని కాపాడుతూ గుండెకు మేలు చేయడంలో రైస్బ్రాన్ వంట నూనెలు ముందున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొలెస్ట్రాల్ సమతుల్యత సాధించడంలో రైస్బ్రాన్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో పాటు అమెరికా హర్ట్ అసోసియేషన్లు ఇప్పటికే సూచించాయి. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది చుడటానికి చక్కని రంగులో కనిపించే రైస్బ్రాన్ ఆయిల్ వంటకు ఎంతో బాగుంటుంది. ఇందులో నాచురల్ యాంటీఆక్సిడెంట్ అయిన ఒరిజనోల్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దేశీయంగా తయారయ్యే రైస్బ్రాన్ ఆయిల్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వాడకం మాత్రం తక్కువగానే ఉంది. బియ్యపు పొట్టు నుంచి రైస్బ్రాన్ ఆయిల్ అంటే బియ్యంలోని పోషక పదార్థాల నుంచి నూనెను సేకరిస్తారనే అపోహ ఉంది. కానీ వాస్తవంలో అది నిజం కాదు. బియ్యం గింజ చుట్టూ ఉండే పొట్టు నుంచి ఆయిల్ని సేకరిస్తారు. ఈ బ్రౌన్ కలర్ పొట్టు వల్లనే బ్రౌన్ రైస్కు అనేక పోషక గుణాలు కలిగాయి. సాధారణ పాలిష్డ్ రైసుతో పోల్చితే బ్రౌన్ రైస్ ఎంతో మేలనే విషయం మనందరికీ తెలిసిందే. బియ్యపు పొట్టుకి ఉన్న ఔషధ గుణాలన్ని కలిసిన ఫ్రీడమ్ రైస్బ్రాన్ ఆయిల్ని మార్కెట్లో అందుబాటులో ఉంది. మ్యాజిక్ చేసే ఒరిజనోల్ గోధుమ రంగులో ఉండే బియ్యపు పొట్టు, ఒరిజనోల్ అనే సూక్ష్మమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఒరిజనోల్ అవసరమని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. ఫ్రీడమ్ రిఫైన్డ్ రైస్బ్రాన్ ఆయిల్లో 10,000 ప్లస్ పీపీఎం ఆఫ్ ఓరిజనోల్ ఉంటుంది. ఇది సహాజమైన యాంటాక్సిడెంట్గా పని చేస్తూ శరీరంలోని కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్ల సమాహారం రైస్బ్రాన్ ఆయిల్లో మోనో ఆన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ముఫా), ఒమెగా-6 పాలి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (పుఫా)లు ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో ఫ్యాట్ ప్రొఫైల్, టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్ వంటి యాంటియాక్సిడెంట్లన్లు బ్యాలెన్స్ చేస్తోంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో తోడ్పడుతాయి. అంతేకాదు రైస్బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఏ, డీలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైన అన్ని సుగుణాలతో ఫ్రీడమ్ రైస్బ్రాన్ ఆయిల్ మార్కెట్లో అందుబాటులో ఉంది, డీప్ ఫ్రైకి అనుకూలం భారతీయ వంటలకు అనువుగా దాదాపు 232 సెల్సియస్ డిగ్రీల దగ్గర కూడా రైస్బ్రాన్ అయిల్ వంటకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర డీప్ ఫ్రై సాధ్యమవుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు వేపుళ్లు తింటూ జిహ్యా చాపల్యాన్ని సంతృప్తి పరుస్తూనే ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు రైస్బ్రాన్ ఆయిల్ అనువుగా ఉంటుంది. అంతేకాదు వండినప్పుడు ఆహార పదార్థాలు రైస్బ్రాన్ ఆయిల్ను తక్కువగా శోచించుకుంటాయి. రైస్బ్రాన్ ఆయిల్కి ఉన్న మరో మంచి లక్షణం ఇది. కాస్మోటిక్స్ తయారీలో రైస్బ్రాన్ ఆయిల్కి ఇన్ని సుగుణాలు ఉండటం వల్లే సౌందర్య ఉత్పత్తుల తయారీలో రైస్బ్రాన్ ఆయిల్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సన్స్క్రీన్ లోషన్, డే క్రీముల్లో రైస్బ్రాన్ నుంచి తీసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం రైస్బ్రాన్ ఆయిల్తో ఎన్నో ఉపయోగాలు ఉండటంతో ఎంతో మంది భారతీయులు ఇతర కుకింగ్ ఆయిల్స్కి బదులుగా రైస్బ్రాన్ ఆయిల్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పినట్టు రైస్బ్రాన్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే ఆస్పత్రుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది, వైద్య ఖర్చులు తప్పుతాయి. అన్నింటికీ మించి రోగాల బారిన పడకుండా ఉంటాం.(అడ్వర్టోరియల్) -
గుడ్న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్ ఆయిల్ ఫామ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్పామ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. దిగుమతుల భారం వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. ఉత్పత్తి పెంపుకు ఇండియా ఎక్కువగా పామ్ఆయిల్ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్ను ప్రకటించింది. -
Edible oil: వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులుపడిన వినియోగదాడులకు ఊరట లభించింది. వంట నూనెల ఇంపోర్ట్స్పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు , కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్ను జారీ చేసింది. కొత్త రేట్లు 2021 జూన్ 17 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది. ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని టన్నుకు 87 డాలర్లు తగ్గి 1136 కు తగ్గించగా, ముడి సోయా చమురు దిగుమతి సుంకం టన్నుకు 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 1415 డాలర్లుగా ఉంది. అటు ఆర్బిడి పామాయిల్ పై టన్నుకు 1148 డాలర్లకు దిగివచ్చింది. తాజా తగ్గింపుతో దేశీయంగా ఆవాలు, సోయాబీన్, వేరుశనగల రేట్లు కూడా దిగిరానున్నాయి. వంట నూనెల ధరలు కిలోకు పామాయిల్ రూ.115, (పాత ధర142, 19 శాతం తగ్గింది) పొద్దుతిరుగుడు నూనె రూ. 157 (పాత ధర రూ .188, 16 శాతం తగ్గింది) సోయా నూనె రూ.138 ( పాత ధర రూ. 162 , 15 శాతం తగ్గింది) ఆవ నూనె రూ.157 (పాత ధర రూ. 175 , 10 శాతం తగ్గింపు) వేరుశనగ నూనె రూ. 174,(పాత ధరరూ.190, 8 శాతం తగ్గింపు) వనస్పతి రూ. 141 (పాత ధర 184, 8 శాతం తగ్గింపు) -
వంట నూనె : పదకొండేళ్ల తర్వాత..
సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనె సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖల లెక్కలు ధృవీకరిస్తున్నాయి. దశాబ్దకాలంగా ఎన్నడూ లేనంత వ్యత్సాలతో వంట నూనె అధిక ధరకు చేరుకుంది. కరోనా, లాక్డౌన్ ఎఫెక్ట్తో వంట నూనె ధరలు మరింత పెరగడానికి కారణాలని గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ఎక్కువగా వాడుతున్న ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్స్ ధర సగటున మే నెలలో బాగా పెరిగిందని, గత పదకొండేళ్లలో ఇదే ఎక్కువని తెలుస్తోంది. పల్లీ, ఆవ, వనస్పతి, సోయా, సన్ఫ్లవర్, పామ్.. ఇలా దాదాపు ప్రతీ ఆయిల్ మీద ప్రభావం పడిందని అఫీషియల్ డేటా వెల్లడించింది. ముఖ్యంగా కరోనా మధ్యకాలంలో లాక్డౌన్ల వల్ల రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవిలకు విఘాతం కలగడం కూడా వంట నూనె ధరలు పెరగడానికి ఒక కారణంగా ఆ డేటా వెల్లడించింది. ఎంతెంతంటే.. రాష్ట్రాల పౌర సరఫరా విభాగాలు సమర్పించిన డేటా ఆధారంగా ఆయిల్ ధరలు.. జనవరి 2010 తర్వాత ఇప్పుడు అధిక వ్యత్యాసాలతో పెరిగాయని తెలుస్తోంది. సాధారణ నూనె 2010లో 63 రూపాయలకు కేజీ ఉండగా, ఇప్పుడది 155 రూపాయలకు చేరుకుంది. ఆవ నూనె కేజీకి పోయినేది ఇదే టైంకి 118 రూపాయలు ఉండగా, 39 శాతం పెరిగి 164 రూపాయలకు చేరుకుంది. ఇక మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే పామ్ ఆయిల్ పిరం అయ్యింది. పోయినేడాది కేజీ పామ్ ఆయిల్ ధర 88 రూపాయలుగా ఉండగా, ఇప్పుడు అది 131 రూపాయలకు చేరుకుంది. అంటే 49 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇదే పామ్ ఆయిల్ ధర 2010లో 49 రూపాయలుగా ఉంది. మిగిలిన ఎడిబుల్ ఆయిల్స్ ప్రస్తుత పౌర సరఫరా శాఖల లెక్కల ప్రకారం.. వేరుశనగ నూనె(పల్లీ) కేజీ రూ.175.50, వనస్పతి 127 రూపాయలు, సోయా 148 రూపాయలు, సన్ఫ్లవర్ 170 రూపాయలకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ నాలుగు ఆయిల్స్ ధరలు 19 నుంచి 52 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. తక్షణ చర్యల కోసం.. కాగా, ఎడిబుల్ నూనెల ధరల పెరుగుదలను పదకొండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యల కోసం ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ సోమవారం స్టేక్హోల్డర్స్ అందరితో ఒక సమావేశమైంది. ఆయిల్ ధరలు తగ్గే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఈ మీటింగ్లో రాష్ట్రాలను కోరింది. అంతేకాదు కేంద్ర కూడా నిల్వలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. -
పొద్దుతిరుగుడు పువ్వు నూనె కొండెక్కి కూచుంది!
సాక్షి, న్యూఢిల్లీ: మెజారిటీ మధ్య తరగతి ప్రజలు వంట నూనెగా వినియోగించే పొద్దుతిరుగుడు పువ్వు నూనె కొండెక్కి కూచుంది. గడిచిన ఏడెనిమిది మాసాల్లో వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ ధర 70 శాతం వరకు పెరిగింది. ఉత్తరాదిన ఎక్కువగా వినియోగించి ఆవ నూనె, సోయాబీన్ నూనె ధరలు 50 శాతం వరకు, రైస్బ్రాన్ ఆయిల్ ధర 50 శాతం వరకు, పామాయిల్ ధర 55 శాతం వరకు పెరిగాయి. ఏడాది క్రితం కిలో సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 100 లకు లభించగా, ఇదే నూనె మార్చి 1 నాటికి కిలో ధర రూ. 150కి అటుఇటుగా ఉంది. తాజాగా ఈ నెల రోజుల్లో మరో పది శాతం పెరిగి రూ. 170కి చేరింది. మార్చి 28న ముంబై, భువనేశ్వర్ ప్రాంతాల్లో గరిష్టంగా కిలోకు రూ. 185 గా ఉంది. వేరుశనగ నూనె గరిష్టంగా తిరునల్వేలిలో కిలో ధర రూ. 194గా ఉంది. ఆవ నూనె గరిష్టంగా తిరుపతిలో కిలో ధర రూ. 200గా ఉంది. వనస్పతి గరిష్టంగా దర్బంగాలో కిలో రూ. 150గా ఉంది. ఇక పామాయిల్ గరిష్టంగా భువనేశ్వర్లో రూ. 143గా ఉంది. దిగుమతులపైనే ఆధారం.. మన దేశం పెట్రో ఉత్పత్తుల తరహాలోనే వంట నూనెల విషయంలో దిగుమతులపై ఆధారపడి ఉంది. దేశానికి అసవరమయ్యే వంట నూనెల్లో దాదాపు 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారా సమకూర్చకుంటోంది. 2015–16 సంవత్సరం నుంచి వరుసగా 14.85 మిలియన్ మెట్రిక్ టన్నులు, 15.32, 14.59, 15.57, 13.34 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర వంట నూనెలు దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా 2015–16 నుంచి ఇప్పటివరకు వరుసగా 8.63 మిలియన్ మెట్రిక్ టన్నులు, 10.09, 10.38, 10.35, 10.65 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర వంట నూనెల లభ్యత ఉంది. 2019–20లో సోయాబీన్ ఆయిల్ 3.38 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకుంది. సన్ఫ్లవర్ ఆయిల్ 2.52 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల నిల్వలు తగ్గి సరఫరా తగ్గడంతో వీటి ధరలు అమాంతం పెరుగుతూ వచ్చాయి. ధరల పెరుగుదల దెబ్బకు వంట నూనెల దిగుమతి తగ్గింది. అంతకుముందు ఏడాది ఫిబ్రవరిలో 10,89,661 టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనెలు దిగుమతి అయ్యింది. నవంబరు 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో సన్ఫ్లవర్ ఆయిల్ 7,70,364 టన్నులు దిగు మతి అయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 9,89,565 టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అయ్యింది. దిగుమతులు తగ్గి సరఫరా తగ్గడంతో మన దేశంలో వాటి ధర మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తుల తగ్గుముఖం ఉక్రెయిన్, రష్యా దేశాల్లో పొద్దు తిరుగుడు పంట ఉత్పత్తి భారీగా తగ్గడంతో ఈ వంట నూనెల ధరలపై ప్రభావం పడింది. మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పామాయిల్ ఉత్పత్తి భారీగా తగ్గింది. కూలీల కొరత వల్ల ఈ సమస్య ఏర్పడింది. అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాలు ఎల్నినో కారణంగా తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అర్జెంటీనా ఓడ రేవుల్లో సమ్మె నడవడంతో అక్కడి నుంచి కొద్ది రోజులపాటు ఎగుమతులకు ఆటంకం కలిగింది. ఈ కారణాలన్నీ వంట నూనెల పెరుగదలకు దారితీశాయి. ఈ పరిస్థితులన్నీ చక్కబడితే మార్చి, ఏప్రిల్ మాసాల వరకు వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుదని పరిశ్రమ వర్గాలు గతంలో అంచనా వేశాయి. కానీ మార్చి మాసంలో మరో 10 శాతం ధరలు పెరగడంతో నూనెల ధరల్లో పూర్వ స్థితి చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సన్ఫ్లవర్, సోయాబీన్ వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడంతో పామాయిల్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దిగుమతి సుంకం తగ్గాల్సిందేనా? గత నవంబరు 27న కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 37.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించింది. క్రూడ్ పామాయిల్పై 2013 జనవరి 23న 2.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం.. 24.12.2014న 7.5 శాతానికి పెరిగింది. 11.08.2017న 15 శాతంగా ఉంది. 17.11.2017న 30 శాతానికి పెరిగింది. మార్చి 1, 2018న ఇది 44 శాతానికి పెరిగింది. 01.01.2019న 40 శాతంగా, 01.01.2020న 37.5 శాతంగా, 27.11.2020న 27.5 శాతంగా ఉంది. ఇక రిఫైండ్ సన్ఫ్లవర్ నూనెపై 17.03.2012న 7.5 శాతం దిగుమతి సుంకం ఉండగా.. 20.01.14న 10 శాతంగా, 24.12.2014న 15 శాతంగా, 17.09.2015న 20 శాతంగా, 14.06.18న 45 శాతంగా ఉంది. దేశంలో రైతులు పండించే నూనె గింజల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేందుకు వీలుగా దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ.. ధరల పెరిగిన సందర్భంలో తగిన రీతిలో సడలింపులు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చదవండి: COVID-19: అక్టోబర్ 11 తర్వాత మళ్లీ... భవిష్యత్తులో భారత్ మంచి మార్కెట్ కానుంది: కేఎఫ్సీ -
ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమీక్ష
సాక్షి, కాకినాడ : నిత్యావసర వస్తువుల ఉత్పత్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఎడిబుల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రానున్న మూడు నెలలకు సరిపడ వంటనూనెల ఉత్పత్తులకు సంబంధించి ఈ సందర్భంగా వారు చర్చించారు. రాష్ట్రంలో వంటనూనెల రవాణాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆయిల్ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు సంబంధించి పూర్తి సంరక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని కంపెనీలను కోరినట్టు చెప్పారు. విధులకు హాజరయ్యే కార్మికులకు పోలీసుల నుంచి ఆటంకాలు రాకుండా పాసులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరల పెరుగుదలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని తెలిపారు. రాష్ట్రంలోని ఎడిబుల్ ఆయిల్ కంపెనీ వ్యవహారాలన్నీ ఆయిల్ ఫెడ్ ఎండీ శ్రీకాంత్రెడ్డికి అప్పగించామని మంత్రి తెలిపారు. రానున్న మూడు నెలల కాలంలో ప్రజలకు రేషన్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టకున్నామని అన్నారు. రేషన్ అందదేదోమోనన్న అభద్రతకు ప్రజలు గురి కావద్దని కోరారు. ప్రతి రేషన్కార్డు దారునికి సరుకులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రేపు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందజేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను రైతు నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని ఎగుమతి దారులను కోరామని అన్నారు. కరోనా వల్ల తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించలేదని గుర్తుచేశారు. కరోనాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. ప్రతి జిల్లాలో 5 వేల క్వారంటైన్ బెడ్లను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ప్రాణాలకు తెగించి కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వాలంటీర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని ఆయన హితవు పలికారు. చదవండి : ‘ఎల్లో వైరస్ కోరలు పీకే మందు ఉంది’ ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు -
వంటనూనెలపై దిగుమతి సుంకం భారీ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న వంట నూనెల ధరలనుకట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల దిగుమతులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంది. ఎడిబుల్ ఆయిల్స్పై దిగుమతి సుంకాన్ని 15 శాతంగా ప్రకటించింది స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. క్రూడ్ పామ్ ఆయిల్ఫై ఇంపోర్ట్ టాక్స్ను 30శాతానికి పెంచింది. ఇప్పటిదాకా ఇది 17.5 శాతంగా ఉంది. శుద్ధి చేసిన పామాయిల్పై దీన్ని 40 శాతంగా నిర్ణయించింది. ఇది గతంలో 25 శాతంగా ఉంది. కాగా ప్రపంచంలోనే వంట నూనె అతిపెద్ద దిగుమతిగా భారత్ ఉంది. పామాయిల్ దిగుమతుల్లో అత్యధిక భాగం ఇండోనేషియా, మలేషియా దేశాలది సోయా ఆయిల్ ఎక్కువగా అర్జెంటీనా , బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుంది. -
కల్తీ నూనే దందా గుట్టురట్టు
-
కాకినాడలో వంటనూనె కల్తీ గుట్టురట్టు
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వాకలపూడిలో ఉన్న లోహియా ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీపై అగ్మార్క్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఢిల్లీ, గుంటూరుల నుంచి వచ్చిన అగ్మార్క్ అధికారులు.. కాకినాడ ఫుడ్సేఫ్టీ అధికారులతో కలిసి ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా సన్ఫ్లవర్, వేరుశనగ నూనెల్లో పామాయిల్, ఇతర నూనెలు కలిపి అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన 13,423 కిలోల నూనెను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.13.42 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఆయిల్ను పోలీసులకు అప్పగించారు. ముందుగా అందిన సమాచారం మేరకు అధికారులు ఆకస్మికంగా ఫ్యాక్టరీకి చేరుకుని, ఆయిల్ టిన్నులను పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీలో గోల్డ్ప్లస్, గోల్డ్డ్రాప్ లేబుల్స్తో ఉన్న 15 లీటర్ల డబ్బాలు, ఒక లీటర్ నూనె ప్యాకెట్లు ఉన్న పెట్టెలను గుర్తించారు. గోల్డ్ప్లస్ డబ్బాల్లో ఆయిల్ను పరిశీలించారు. ఈ డబ్బాలపై అనుమతులు లేకుండా ఆగ్మార్క్ గుర్తు వేసినట్టు గుర్తించారు. రికార్డులు పరిశీలించగా, అసలు ఆగ్మార్క్ అనుమతులే లేవని తేల్చారు. అనంతరం గోల్డ్ప్లస్ బ్రాండ్తో అమ్మకానికి సిద్ధం చేసిన డబ్బాల్లో నూనెను పరిశీలించారు. అయితే పైన లేబుల్ ఒకలా.. లోపల నూనె మరోలా ఉన్నట్టు గమనించారు. గోల్డ్ప్లస్ డబ్బాల్లో 80 శాతం పామాయిల్, 20 శాతం మాత్రమే సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే వేరుశనగ నూనె లేబుల్తో ఉన్న డబ్బాల్లో కూడా 80 శాతం కాటన్ ఆయిల్, 20 శాతం మాత్రమే వేరుశనగ నూనె ఉన్నట్లు నిర్ధారించారు. లోహియా ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం, మేనేజర్ తదితరులపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత
మంచాల: కాలంచెల్లిన వంటనూనెతో చేసిన ఆహార పదార్థాలు తిని.. పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మంచాలలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నారెడ్డి విజయ్భాస్కర్ ఇంట్లో ఓ శుభకార్యం ఉండడంతో శ్రీగణేష్ సూపర్మార్కెట్లో దుకాణంలో గోల్డెన్ ప్యూర్ కంపెనీ పేరుతో ఉన్న మంచినూనె ప్యాకెట్లను ఆదివారం కొన్నాడు. వీటితో ఆహార పదార్ధాలు తయారుచేశారు. అయితే భోజనం చేస్తున్న సమయంలోనే ఓ రకమైన వాసన వచ్చిందని తెలిపారు. అప్పటికే అన్నం తిన్న ఐదారుగురు వాంతులు చేసుకోవడంతో.. ఇదేమిటా? అని పరిశీలించారు. తేదీ దాటిపోయిన నూనెను వాడడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకున్నారు. 2015 ఆగస్టు 8న ప్యాక్ చేసిన నూనెను 6 నెలలలోపే విక్రయించాలి. కానీ 10 నెలలు దాటిన నూనెను వ్యాపారి తమకు అంటగట్టాడని విజయ్భాస్కర్ మండిపడ్డారు. ఈ విషయమై దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మంచాల సీఐ గంగాధర్కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వచ్చి సూపర్మార్కెట్లో పరిశీలించగా పది నెలల కాలం దాటిన ఆయిల్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ తెలిపారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
డెయిరీ మార్కెట్లోకి ఐటీసీ!
ముంబై: సిగరెట్లు, వంటనూనెలు, సబ్బులు, బిస్కెట్లు వంటి తదితర ఉత్పత్తులను తయారుచేసే ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ డెయిరీ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. త్వరలో నెయ్యితో తమ తొలి డెయిరీ ప్రాడక్ట్ను మార్కెట్లోకి తీసుకువస్తామని ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తెలిపారు. నెయ్యి తర్వాత పాలు, వెన్న, జున్ను, చాక్లెట్స్ వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే డెయిరీ ప్రొడక్షన్ విస్తరణకు అనువైన ప్రాంతాలను గుర్తించామన్నారు. రానున్న కాలంలో ఐటీసీ ఫుడ్ ప్రాడక్ట్స్పై రూ.25,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుందని తెలిపారు. -
నూనెలు, పప్పుల నిల్వలపై పరిమితులు కొనసాగింపు
న్యూఢిల్లీ: కొన్ని నిత్యావసర ఉత్పత్తుల లభ్యతను మెరుగుపరచడం, ధరలను నియంత్రించడం లక్ష్యంగా కేంద్ర క్యాబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. పప్పుదినుసులు, వంటనూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులను మరో ఏడాది కాలానికి పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్రవేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కాల పరిమితి సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ విలేకరులకు ఈ విషయం తెలిపారు. ఈ నిర్ణయం స్టాక్ పరిమితులను నిర్దేశిస్తూ, అక్రమ నిల్వల సమస్యను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు దోహదపడుతుంది. ఎన్ఎఫ్ఎస్ఎంకు రూ.12,350 కోట్లు... కాగా 12వ ప్రణాళికా కాలానికి (2012-17) సంబంధించి జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)కు రూ.12,350 కోట్ల కేటాయింపుల ప్రణాళికకు పెట్టుబడుల వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. పెరుగుతున్న ఆహార డిమాండ్ను ఎదుర్కొనడానికి క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎఫ్ఎస్ఎం కింద 25 మిలియన్ టన్నులమేర ఆహార ఉత్పత్తుల వృద్ధి దీని ప్రధాన లక్ష్యం. హెచ్పీసీఎల్ రాజస్తాన్ ప్రాజెక్టుకు ఓకే కాగా రాజస్తాన్లో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) రూ.37,229 కోట్ల రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. మరో రెండురోజుల్లో ఈ ప్రాజెక్టుకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ శంకుస్థాపన చేయాల్సి ఉంది.