కంకణధారులై..
ఆత్మకూరురూరల్: సాగునీటి సాధన కోసం ఈ నెల 21వ తేదీ నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న జల చైతన్య సదస్సును విజయవంతం చేసేందుకు రైతులు కంకణధారులవుతున్నారు. బొజ్జా దశర«థ రామిరెడ్డి నాయకత్వంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి..రైతులను జాగృతం చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు, నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లెలో సన్నాహక సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల్లో రైతుల చేత హరిత కంకణధారణ చేయించారు. సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని, కృష్ణా నది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు.