
గోదావరికి మహా నీరాజనం
కొవ్వూరు : గోష్పాదక్షేత్రంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గోదావరికి విశేష పూజలు నిర్వహించారు. 128వ మాసోత్సవం లో భాగంగా తెన్నేటి సూర్యనారాయణ మూర్తి, అయ్యపురాజు సత్యనారాయణ రాజు దంపతుల చేతులు మీదుగా గణపతిపూజ, గౌతముడు, గోవు పూజలతో గోదావరి మాత విగ్రహానికి అషో్టత్తర శతనామ కుంకుమార్చన చేశారు. అనంతరం నదీ మాతకు మహానీరాజనం సమర్పించారు. నదీలో మహిళలు దీపాలు వెలిగిలించి దీపోత్సవం నిర్వహించారు. నీరాజన సమితి అధ్యక్షుడు కలిగోట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు.