
'పులి'పై నాగార్జున సవారీ..
కింగ్ అక్కినేని నాగార్జున బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో సందడి చేశారు. విజయవాడ కల్యాణ్ జువెల్లర్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ ఆటో నగర్కు చెందిన ఐరన్ వ్యాపారి సురేష్...పులి ముఖాకృతితో ఉన్న రూ.20 లక్షల విలువైన విదేశీ బుల్లెట్ను విమానాశ్రయ ప్రాంగణంలో నాగార్జునతో నడిపించి తమ ముచ్చట తీర్చుకున్నాడు. కాగా నాగార్జునను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.