పెరిగిన వేతనాలు అమలు చేయాలి | implement increasing salaries | Sakshi
Sakshi News home page

పెరిగిన వేతనాలు అమలు చేయాలి

Aug 9 2016 6:14 PM | Updated on Sep 4 2017 8:34 AM

ఏలూరు (సెంట్రల్‌) : కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 151 జీవో ప్రకారం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వర్తింప చేయాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనాల వెంకటరావు, బి.సోమయ్య డిమాండ్‌ చేశారు.

ఏలూరు (సెంట్రల్‌) : కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 151 జీవో ప్రకారం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వర్తింప చేయాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనాల వెంకటరావు, బి.సోమయ్య డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అన్ని విభాగాల కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి నెలకు రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నారని, దానిని ప్రస్తుత జీవోను అనుసరించి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేలు, ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న వారికి రూ.15 వేలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.17,500 పెంచాల్సి ఉందని, మునిసిపాలిటీలో జీవో అమలు కోసం డీఎంఏని కలిసి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతామని వారు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement