ఇండోర్‌ ‘స్మార్ట్‌’ టూర్‌ | indore smarth toour | Sakshi
Sakshi News home page

ఇండోర్‌ ‘స్మార్ట్‌’ టూర్‌

Published Thu, Jul 21 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

indore smarth toour

కరీంనగర్‌ కార్పొరేషన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీల అభివృద్ధి పథకంలో ప్రథమ స్థానంలో నిలిచి మొదటి విడతలోనే స్మార్ట్‌ సిటీ హోదా దక్కించుకున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ నగర సందర్శనకు ప్రజాప్రతినిధులు Ðð ళ్లనున్నారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్‌ గుగ్గిల్లపు రమేశ్, కమిషనర్‌ కష్ణభాస్కర్‌తో కూడిన బృందం శుక్రవారం బయలుదేరి వెళ్లనుంది. శని, ఆదివారాలలో అక్కడ పర్యటించి స్మార్ట్‌ సిటీ సాధన కోసం వారు చేపట్టిన డీపీఆర్‌ను పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న అభివద్ధిని పర్యవేక్షించనున్నారు. కరీంనగర్‌ స్మార్ట్‌సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్నప్పటికీ డీపీఆర్‌ తయారీలో ఇప్పటికీ ఒక స్పష్టతరాలేదు. స్మార్ట్‌సిటీ జాబితాలో స్కోరుబోర్డును పెంచుకుని మూడో జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఇండోర్‌ అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరముఉంది. కాగా ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌గా కరీంనగర్‌ జిల్లాకు చెందిన నరహరి ఉండడం.. ఇప్పటికే ఆయన పలుమార్లు వీరిని ఆహ్వానించారు. ఇండోర్‌ పర్యటన నగరం స్మార్ట్‌ హోదా దక్కించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement