smart city
-
జహీరాబాద్లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్పూర్ ఇండ్రస్టియల్ కారిడార్లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్కు 19 కిలోమీటర్లు, మెటల్కుంట రైల్వేస్టేషన్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..
ఢిల్లీ : దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.28,602 కోట్ల నిధుల్ని కేటాయించింది.నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏర్పాటు కానున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్కు 2 కేటాయించింది. కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక తెలంగాణ జహీరాబాద్లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. #WATCH | After the cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "...Cabinet today approved 12 Industrial Smart Cities under National Industrial Corridor Development Programme. The government will invest Rs 28,602 crore for this project..." pic.twitter.com/KxNYqNZ5dT— ANI (@ANI) August 28, 2024 -
ఇలా ఉంటే .. అవార్డులెలా వస్తాయి..
పేరుకు స్మార్ట్ సిటీ.. కానీ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం. అందుకేనేమో.. ఇటీవల పారిశుద్ధ్య విభాగంలో ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డ్స్–2022లో వరంగల్ నగరం అడ్రస్ గల్లంతైంది. పారిశుద్ధ్య విభాగంలో చేపట్టిన సంస్కరణల్లో నగరం ఫెయిల్ కావడంతో అవార్డు దక్కకుండా పోయింది. ఇందుకు నిదర్శనమే ఇలాంటి దృశ్యాలు. వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిలిచి తీవ్ర దుర్గంధం వెలువడుతూ దోమలు, ఈగలు, పందులకు ఆవాసంగా మారింది. కమిషనర్ గారూ దీనివైపు కూడా ఒకసారి చూడండి అంటూ నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, వరంగల్ -
విశాఖ సిగలో కలికితురాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరానికి ఐకానిక్గా నిలిచే భవన నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల్లో సరికొత్తగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక సహాయంతో ప్రజలకు సేవలందిస్తున్న స్మార్ట్ సిటీ కార్పొరేషన్.. మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం సంపత్ వినాయక రోడ్డు మార్గంలో ఆశీలమెట్ట ప్రాంతంలో జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాలను నగర అభివృద్ధికి చిహ్నంగా(ఐకానిక్) మార్చేందుకు ప్రతిపాదనలు ఆహా్వనించింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై ఈ నెల 12లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల(ఈవోఐ)ను కోరింది. మొత్తం 2.7 ఎకరాల్లో ఏకంగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్తో పాటు రిక్రియేషన్ సెంటర్ అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రూ.265 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పేర్కొంటూ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ఆశీలమెట్ట.. నగరంలో వాణిజ్య ప్రాంతం. ఇక్కడ జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతంలో 6.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంది. 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయంతో పాటు మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్, అర్బన్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రతిపాదనలతో సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్కు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో ఈ భూమిని కేటాయించేందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీనిని సబ్లీజుకు ఇవ్వడం కానీ, స్థలాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది. డీఎఫ్బీవోటీ పద్ధతిలో..! వాణిజ్యానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 2.7 ఎకరాల్లో వాణిజ్య భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఈ భూమిలో వాణిజ్య భవనాల ద్వారా వచ్చే ఆదాయంలో జీవీఎంసీకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాటా ఇచ్చే శాతంతో పాటు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని సంస్థ ఎంపిక ఉండనుంది. అంతేకాకుండా స్థలాన్ని కేవలం లీజు పద్ధతిలో 33 ఏళ్ల పాటు అప్పగించనున్నారు. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీఎఫ్బీవోటీ) పద్ధతిలో చివరకు 33 ఏళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ సిటీ కార్పొరేషన్కు అప్పగించాల్సి ఉంటుంది. దీని అభివృద్దికి సుమారు రూ.265 కోట్ల మేర వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రతిపాదనలతో ఆయా సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చేందుకు ఈ నెల 12వ తేదీ నాటికి ఈవోఐలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం.. ఒక మంచి ప్రతిపాదనను ఓకే చేసి సంస్థ ఎంపిక ప్రక్రియ తర్వాత నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలోనే ఐకానిక్ భవనం అందుబాటులోకి తీసుకురావాలన్నదే అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. -
ఎన్నెన్నో ‘ఏఐ’ సేవలు.. మనిషి జీవితంలో ఊహించని మార్పులు
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో మనిషి జీవితంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ మనకు అందని చందమామలు నట్టింట దిగుతున్నాయి. చక్రం కనిపెట్టడంతో జీవన గమనంలో పెరిగిన వేగం పారిశ్రామిక విప్లవంతో ఎన్నో సౌకర్యాలను అందించింది. ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇప్పుడు మనిషికి చిటికెలో అమరుతున్నాయి. మన రోజువారీ జీవితాన్ని మలుపు తిప్పుతున్న సరికొత్త పరిజ్ఞానం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’(ఐవోటీ) కాగా దానికి దన్నుగా నిలుస్తున్న శక్తి ‘కృత్రిమ మేధ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). మన ఫిట్నెస్ స్థాయిని చూపించడం మొదలు పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం వరకు ఏఐ, ఐవోటీ మేలు కలయికతో మన కళ్లెదుటే ఆవిష్కృతమవుతున్నాయి. అద్భుత భవిష్యత్కు బాట ఎంతోదూరంలో లేదని అర్థమవుతోంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 వేల కోట్ల ఉపకరణాలు (డివైస్) ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటాయని అంచనా. ఇవి మన ఆన్లైన్ కార్యకలాపాలను సేకరించడం, సమాచారం పరస్పరం మార్చుకోవడం, ఏఐ ద్వారా ఇచ్చే కమాండ్స్ను ప్రాసెస్ చేస్తాయి. ఇంటర్నెట్ అనుసంధానానికి శక్తిని, యుక్తిని ఏఐ అందిస్తోంది. వేరియబుల్స్ (ధరించే ఉపకరణాలు) స్మార్ట్వాచ్ లాంటి వేరియబుల్స్ నిరంతరాయంగా మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ట్రాక్ చేయగలవు. హార్ట్బీట్, ఆక్సిజన్ లెవల్, వేస్తున్న అడుగులు, ఖర్చవుతున్న శక్తి, నిద్రలో నాణ్యత.. ఇవన్నీ రికార్డు చేయగలవు. మధుమేహాన్ని కచ్చితంగా అంచనా వేసే డివైస్లు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. గంట గంటకూ షుగర్ లెవల్ను రికార్డు చేస్తున్నాయి. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేస్తోంది. మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వ్యక్తిగత వైద్యులకు చేరవేయడంతో పాటు స్ట్రోక్ లాంటి ప్రమాదాలను ముందుగా హెచ్చరించే పరిజ్ఞానం త్వరలో సాకారం కానుంది. స్పోర్ట్స్, ఫిట్నెస్కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘గాట్నర్’ అంచనా ప్రకారం ప్రపంచ వేరియబుల్ డివైస్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. స్మార్ట్ హోమ్ మనం ఇచ్చే వాయిస్ కమాండ్కు ఇంట్లో వస్తువులు ప్రతిస్పందించడం గతంలో సైన్స్ ఫిక్షన్కు పరిమితం. ఇప్పుడది వాస్తవం. ఇంటి యజమాని అవసరాలు, అలవాట్లను గుర్తెరిగి ప్రవ ర్తించే డివైస్లతో ఇంటిని నింపేయడం సమీప భవిష్యత్లో సాకారమయ్యే విషయమే. ‘అలెక్సా’ ఇప్పటికే మన నట్టింట్లోకి వచ్చేసి వాయిస్ కమాండ్కు ప్రతిస్పందిస్తుంది. మనుషుల వ్యక్తిగత రక్షణ, ఇంటి భద్రతకు హెచ్చరికలను సంబంధిత వ్యవస్థలు/వ్యక్తులకు చేరవేసే టెక్నాలజీ కూడా రానుంది. స్మార్ట్హోమ్ గ్లోబల్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని ‘గాట్నర్’ అంచనా. స్మార్ట్ సిటీ ఇది పట్టణీకరణ యుగం. నగరా లకు వలసలు పెద్ద ఎత్తున పెరుగు తున్నాయి. పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇంధన సామర్థ్యం వృద్ధి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల ముందున్న సవాళ్లు. ఢిల్లీలో ట్రాఫిక్ మెరుగైన నియంత్రణకు ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా రియల్టైమ్లో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఇందులో వాడుతున్నది కృత్రిమ మేధస్సే. స్మార్ట్ ఇండస్ట్రీ మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి మైనింగ్ వరకు.. ప్రతి పరిశ్రమలో సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి, మానవ తప్పిదాలను పూర్తిగా నివారించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో డిజిటల్ రూపాంతరీకరణ ఇప్పటికే మొదలైంది. వచ్చే రెండు మూడేళ్లలో 80 శాతం పరిశ్రమల్లో ఏఐ వినియోగం మొదలవుతుందని అంచనా. రియల్ టైమ్ డేటా విశ్లేషణ నుంచి సప్లైచైన్ సెన్సార్ల వరకు పారిశ్రామిక రంగంలో ‘ఖరీదైన తప్పుల’ను నివారించడానికి ఏఐ దోహదం చేస్తుంది. రవాణా డ్రైవర్ అవసరంలేని వాహనాల రూపకల్పనకు పునాది వేసింది కృత్రిమ మేధ. మనిషి తరహాలో ఆలోచనను ప్రాసెస్ చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం చేస్తున్న పనులను ఏఐ ద్వారా ఉపకరణాలు చేసేస్తున్నాయి. అటానమస్ వాహనాలు మాత్రమే రోడ్డు మీద కనిపించే రోజు సమీప భవిష్యత్లో ఉంది. -
ఎడారిలో స్మార్ట్ సిటీ... ఊహకందని మాయం ప్రపంచం...
ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్ ఛానల్స్లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్ను చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్ సిటీని రూపొందిస్తుంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు, అర్బన్ స్పేస్పోర్ట్, డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. His Royal Highness Mohammed bin Salman, Crown Prince and Chairman of the NEOM Company Board of Directors, has announced the establishment of #TROJENA – the new global destination for mountain tourism, part of #NEOM's plan to support and develop the tourism sector in the region. pic.twitter.com/ZNa4JsamKy — NEOM (@NEOM) March 3, 2022 (చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్) -
Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తీరు గురివింద గింజను గుర్తుచేస్తోంది.. గత టీడీపీ పాలనలో పెట్టుబడుల సదస్సుల పేరుతో లక్షల కోట్లు తీసుకొచ్చామని బాకా కొట్టి బూటకపు ప్రచారం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వస్తున్న పరిశ్రమల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. విశాఖ వేదికగా నాలుగేళ్లపాటు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల ద్వారా నగరాభివృద్ధికి 20 అమెరికా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించినా.. ఒక్క కంపెనీ సహకారం తప్ప.. మిగిలిన ఎంవోయూలన్నీ.. డొల్లవేనని స్పష్టమవుతున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఆయా కంపెనీలు పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి వెళ్లిపోయాయన్నది హాస్యాస్పద ప్రశ్నగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన సమయంలో ఏటా విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో నాలుగేళ్ల పాటు అట్టహాసం చేశారు. రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనేక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిన కాకి లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్లలో ఏడాదికి రూ.14 లక్షల చొప్పున గణిస్తే.. రమారమి రూ.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల వరద ఆంధ్రప్రదేశ్ని ముంచెత్తి ఉండాలి. వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో అందరికీ తెలిసిందే. పైగా పెట్టుబడుల సదస్సుల పేరుతో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. 20 అమెరికా సంస్థల్లో ఒక్కటైనా..? దేశంలోనే నంబర్ వన్ స్మార్ట్సిటీగా విశాఖను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమంటూ 2016లో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు బీరాలు పలికారు. అమెరికా అందించే ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలను సమర్థంగా అమలు చేసేందుకు భాగస్వామ్య సదస్సులకు హాజరైన అమెరికా బృందంతో చర్చించినట్టు ప్రకటించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా తన పిలుపు మేరకు వైజాగ్లో 4వ పారిశ్రామిక విప్లవం తీసుకొస్తోందని మీడియా సమక్షంలో హడావిడి చేశారు. విశాఖపట్నం స్మార్ట్సిటీ ప్రాజెక్టుకు అమెరికాకు చెందిన 20 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లుగా అమెరికన్లతో ఫొటోలు దిగారు. ఇందులో ఒక్క సంస్థ కూడా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోవడం శోచనీయం. చదవండి: (CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..) అయికాం సంస్థది సహకారమే.. యూఎస్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ చేస్తున్నట్లుగా చంద్రబాబు అండ్ కో సంతకాల కోసం ఫోజులిచ్చి.. మీడియాకు విడుదల చేశారు. అమెరికా ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ తరపున స్మార్ట్సిటీగా వైజాగ్ని అభివృద్ధి చేసేందుకు రూ.వేల కోట్లు నిధులు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు చెందిన అయికాం, కేపీఎంజీ, ఐబీఎం కంపెనీలు విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రణాళికను రూపొందిస్తాయని సదస్సులో ప్రకటించారు. ఈ ప్రణాళికల్ని అదే ఏడాది(2016)లోనే అమల్లోకి తెస్తామంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. ఇ–గవర్నెస్, కాలుష్య నియంత్రణ, భద్రత, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాల్లో విశాఖను స్మార్ట్సిటీగా రూపుదిద్దే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2019 వరకూ ఒక్క రూపాయీ ఏ ఒక్క అమెరికా సంస్థ పెట్టుబడి పెట్టలేదు. ఎంవోయూ చేసుకున్న తర్వాత.. ఏ ఒక్క సంస్థతోనూ చర్చించినట్లు దాఖలాలు లేవు. ఒక్క అయికాం సంస్థ ప్రతినిధులు మాత్రం పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి.. జీవీఎంసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. స్మార్ట్సిటీ అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అందించారే తప్ప.. ఒక్క రూపాయీ విదిలించలేదు. ఇలా.. 20 అమెరికా కంపెనీలు వైజాగ్ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయంటూ చంద్రబాబు నమ్మించి మోసం చేశారని నగర ప్రజలతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి. -
AP: ఆధ్యాత్మిక నగర అమ్ములపొదిలో మరో ఆణిముత్యం
ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరాన్ని అధికారులు స్మార్ట్సిటీగా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మార్చేలా పక్కా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. తిరుపతిలోని వినాయకసాగర్ ఆధునీకరణతో సరికొత్త హంగులతో సందర్శన కేంద్రం అందుబాటులోకి రానుంది. కళ్లు జిగేల్మనిపించే అత్యాధునిక విద్యుత్ వెలుగులు, పచ్చదనం పరవశించే గార్డెన్లు, చుట్టూ నీటి అలల మధ్య అందమైన ఐర్లాండ్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్జిమ్, యోగా సెంటర్లు, ఖరీదైన పూల మొక్కలతో గ్లో గార్డెన్, సాగర్లో చక్కర్లు కొట్టే బోటింగ్, ఘుమఘుమలాడే వంటకాలతో ప్రత్యేక రెస్టారెంట్, పిల్లలను ఆకట్టుకునే బొమ్మలతో వినాయకసాగర్ కొత్త రూపును సంతరించుకోనుంది. 2022 ఏప్రిల్ నాటికి లేక్ వ్యూను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ఆధునీకరణ పనులు సాగుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, తిరుపతి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుపతిలో సరైన విహార స్థలం లేకపోవడం నగర వాసుల్ని వేధించే అంశం. రోజుకు లక్షలాది మంది యాత్రికులు వచ్చే తిరుపతిలో పర్యాటక స్థలాలు లేకపోవడం వల్ల శ్రీవారి దర్శనానంతరం భక్తులు మరో ప్రత్యామ్నాయం లేక నేరుగా తిరుగు ప్రయాణమవుతున్నారు. యాత్రికులు తిరుపతిలో ఒకటిరెండు రోజులు పర్యటించే అవకాశం లేకపోవడం వల్ల వ్యాపార, వాణిజ్య పరంగా తీవ్ర నష్టమని గుర్తించారు. అలానే సెలవు రోజుల్లో స్థానికులు కుటుంబ సమేతంగా కొంతసేపు గడిపే సరైన సందర్శనా స్థలాలు లేకపోవడం శాపంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష 2020 జూలై 4వ తేదీన వినాయకసాగర్ ట్యాంక్బండ్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. తిరుపతి నగర ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వినాయకసాగర్ను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపట్టారు. అత్యాధునిక డిజైన్లతో వినాయకసాగర్ను ప్రత్యేక సందర్శనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు లేక్వ్యూ డిజైన్లను పరిశీలించి అందులో అత్యుత్తమ్మ డిజైన్లను ఎంపిక చేశారు. వాటికి తుదిమెరుగులు దిద్ది మరింత మార్పులతో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ఆకృతులతో, సౌకర్యాలతో ట్యాంక్బండ్ను అభివృద్ధి చేస్తున్నారు. వినాయకసాగర్ ప్రాముఖ్యతను చాటేలా ముఖ ద్వారం వద్ద భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. కట్ట పొడవునా కిడ్స్పార్కు, ఓపెన్ గ్యాలరీలు, యోగాసెంటర్, లాన్, గ్రీనరీ, గ్లో గార్డెన్ను వేర్వేరుగా అభివృద్ధి చేస్తున్నారు. సాయంత్రం వేళ ఆహ్లాదాన్ని పెంచే లా ఆధునిక హంగులతో కూడిన విద్యుత్ వెలుగులు వెదజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఐలాండ్ వినాయకసాగర్లో ఐలాండ్ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఐలాండ్ కొత్త లోకంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగించేలా ఉండబోతోంది. ఇక్కడే బర్త్డే వంటి పార్టీలను జరుపుకునేందుకు అద్దెకు ఇవ్వనున్నారు. ఎల్ఈడీ భారీ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నారు. బోటింగ్ పాయింట్ సాగర్లో పడమట వైపు తక్కువ ఎత్తులో నీరు ఉన్న ప్రదేశంలో పది బోట్లు విహరించేలా కౌంటర్ను నిర్మిస్తున్నారు. కుటుంబ సమేతంగా బోటింగ్లో వెళ్లి సేద తీరేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. స్విమ్మింగ్ఫూల్, మూడు అంతస్తుల రెస్టారెంట్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. వాకింగ్ ట్రాక్ వినాయకసాగర్ కట్టపై 2.5 కి.మీల పొడవుతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను వేర్వేరుగా నిర్మిస్తున్నారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. నిపుణుల సలహా మేరకు వాకింగ్ట్రాక్ను తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి 60 మందికి యోగాను నేర్పించేలా ఓపెన్ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. అత్యవసరమైతే మరో గేటు అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్నారు. పిల్లల ప్లే గ్రౌండ్లో రబ్బర్ ప్లోరింగ్ నిర్మిస్తున్నారు. నిమజ్జనానికి వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఒకకొలను తీర్చిదిద్దుతున్నారు. ఐదు అడుగుల లోపు ఉన్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఆ«ధునిక సదుపాయాలతో కొలను తీర్చిదిద్దుతున్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు అవసరమైన గ్యాలరీని నిర్మిస్తున్నారు. 200 మంది ఒకేసారి సాగర్ వ్యూ పాయింట్ను కట్ట మధ్యలో ఉండేలా శరవేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి. తిరుపతికి ప్రత్యేక ఆకర్షణ వినాయకసాగర్ తిరుపతి నగరానికి తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్న స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఈ లేక్వ్యూ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్థానికులు, యాత్రికులు రోజంతా ఒకేచోట గడిపేంత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పిల్లల ప్రత్యేక ఆటవిడుపు కేంద్రాలు, బోటింగ్, స్విమ్మింగ్, ఐలాండ్ వంటివి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఏప్రిల్ నాటికి సందర్శకులను అనుమతించేలా శరవేగంగా పనులు చేపట్టాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. – పీఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాగర్ విస్తీర్ణం- 60 ఎకరాలు సాగర్ అభివృద్ధికి చేస్తున్న ఖర్చు- రూ. 21.26 కోట్లు ఐలాండ్ ఏర్పాటుకు ఖర్చు - రూ.89 లక్షలు స్విమ్మింగ్ఫూల్, రెస్టారెంట్కు రూ.4 కోట్లు మొత్తం ఖర్చు 26.15 కోట్లు -
కాకినాడ మళ్లీ కేక.. అరుదైన గుర్తింపు..
కాకినాడ(తూర్పుగోదావరి): స్మార్ట్సిటీ కాకినాడ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే కార్యకలాపాల నిర్వహణకు గాను ఈ గుర్తింపు దక్కింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మంచి వాతావరణాన్ని కల్పించడం, పిల్లల్లో పోటీతత్వాన్నిపెంచడం, సామాజిక అంశాలపై యువతలో చైతన్యం పెంపొందించడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి కాకినాడ స్మార్ట్సిటీకి మంగళవారం సమాచారం అందింది. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు ఈ ప్రక్రియకు దేశంలోని పలు నగరాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కాకినాడకు మాత్రమే చోటు లభించింది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల తినుబండారాలను హైజనిక్గా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో విద్యార్థుల మధ్యపోటీ పెట్టడం, సైకత శిల్పాల తయారీ, డ్రాయింగ్ పోటీలు సహా అనేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కాకినాడ స్మార్ట్సిటీ ప్రత్యేక గుర్తింపును సాధించగలిగింది. ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించి అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచేలా చేసిన కృషికి ఈ గౌరవాన్ని దక్కించుకోగలిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంమరోసారి కాకినాడ స్మార్ట్సిటీని మంచిస్థానంలో నిలబెట్టిందని కమిషనర్ స్వప్నిల్దినకర్పుండ్కర్ చెప్పారు. -
దుబాయ్ దూకుడు.. సాహసోపేత అడుగులు
Dubai Sucessfully Deployed AI Tech In Govt Sectors: ఆయిల్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నగరం దుబాయ్.. గత ఏడాది కాలంగా అరుదైన ప్రయోగాలతో ప్రపంచాన్ని అచ్చెరువుకు గురి చేస్తోంది. ఆవిష్కరణల భాండాగారంగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. విప్లవాత్మక సంస్కరణలతో దూసుకుపోతున్న దుబాయ్.. ఇప్పుడు సాహసోపేతమైన అడుగులకు సైతం వెనకాడడం లేదు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో అవసరం పడుతోంది. మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కూడా!. ప్రైవేట్ రంగాల్లో దాదాపు ఏఐ సహకారం లేకుండా ముందుకు సాగడం లేదు. అయితే ప్రభుత్వ రంగాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించుకునేందుకు తటపటాయిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం.. భద్రత. ఈ తరుణంలో దుబాయ్ సర్కార్ ఏమాత్రం బెణుకు ప్రదర్శించకుండా ముందుకు సాగుతోంది. ప్రమాదం లేకపోలేదు AI టెక్నాలజీ వాడకం ఇప్పుడు ఎంత ఉధృతంగా నడుస్తోందో.. సమీప-కాలంలో అంతే ఆందోళనను రేకెత్తిస్తోంది. గోప్యత, పారదర్శకత, అసమానత, భద్రత.. ఈ అంశాలు పెను సవాల్గా మారాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో పుట్టుకొస్తున్న బెదిరింపులు, ఇతర పోకడలను సైతం గుర్తించింది CSER పరిశోధన. అంతేకాదు AI, డిజిటలైజేషన్, న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్ల తరపున ఎదురయ్యే ముప్పును సైతం ప్రస్తావించింది. ప్రధానమైన అంశాలు కావడం వల్లే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం ఏఐను రక్షణ రంగంలో అన్వయింపజేసేందుకు ముందు వెనకా ఆలోచిస్తుంటుంది. అయితే.. ఎలా అధిగమిస్తోందంటే.. వనరులను, మేధస్సును వాడుకోవడంలో దుబాయ్ నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అసలే టెక్నాలజీ కొత్తైన ఈ సిటీ.. అవసరం మేర మాత్రమే ఏఐను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేసింది. ఆరోగ్యభద్రత, విద్య, రవాణా, ప్రజా భద్రత విషయంలో ఏఐ సంబంధిత టెక్నాలజీనే ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టింది. ప్రజల దైనందిన జీవితంలోకి జొప్పించి.. అలవాటు చేయిస్తోంది. స్మార్ట్దుబాయ్ ఆఫీస్ల సహకారంతో ఎన్నో వ్యూహాల నడుమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏఐ, బ్లాక్కెయిన్ ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించడమే కాకుండా.. జనాల ఫీడ్బ్యాక్ను సైతం తీసుకుంటోంది. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు ఎథికల్ టూల్ కిట్స్ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. హైలెవల్ సర్వీసులు కావడంతో ఏఐ అల్గారిథమ్ పొరపచ్చాలతో తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు. ఇందుకోసం భారీగా ఇంజినీర్లను నియమించుకుంటోంది కూడా. 2030 నాటికి ఏఐ సంబంధిత వ్యవస్థ కోసం 320 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టే యోచనలో ఉన్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది దుబాయ్ మహానగరం. దుబాయ్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కానీ, ఆనందం అంటే కేవలం ఎక్కువ డబ్బును కలిగి ఉండడం కాదు. గ్లోబలైజ్డ్ వరల్డ్లో కమ్యూనిటీతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? సామాజిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలా పని చేయాలి? అనే విషయాలపైనే దుబాయ్ ఫోకస్ పెట్టింది. అలా దుబాయ్.. ఈ భూమిపై అత్యంత సంతోషకరమైన నగరంగా స్థానం సంపాదించుకునే మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక మేధావులు ఒక అంచనాకి వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్లో దూసుకుపోతున్న హైదరాబాద్ -
స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖ
-
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
వరంగల్: గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి
చారిత్రక, వారసత్వ సంపద, వైద్య, విద్య, సాంస్కృతిక రెండో రాజధాని.. ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు స్మార్ట్సిటీలో చెబితే ఇంతేనా అనిపించినా వాస్తవంగా ఇదో పెద్ద సమస్య. ఆదేనండి కనీస సదుపాయమైన మూత్రశాలలు లేకపోవడం. మూత్ర విసర్జన కోసం పురుషులు రహదారుల వెంబడి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మరుగు దొరికితే అక్కడే కానిచ్చేస్తున్నారు. మహిళల పరిస్థితి దయనీయం. బయటికి వెళ్లిన వారు మరుగుదొడ్డి దొరికితేనో లేక తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. – వరంగల్ అర్బన్ చాటు దొరికితే చాలు.... పురుషులు మూత్రశాలలు దొరకక గత్యంతరం లేక చాటు దొరికితే చాలు కళ్లు మూసుకొని కానిచ్చేస్తున్నారు. ఆ సమయంలో మహిళలు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సాముహిక మూత్రశాల ఉండాలి.. అలా ఉంటేనే అనుమతులు ఇస్తారు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయల, పండ్ల, మార్కెట్లలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. పది లక్షల యాబై వేల జనాభా ఉండగా, నిత్యం చుట్టుపక్కల జిల్లాలనుంచి 2లక్షల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మహా నగరంలో కనీస సదుపాయాలు కల్పించడంలో గ్రేటర్ వరంగల్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్లో భాగంగా వరంగల్ నగరం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. కానీ బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియా బదిలీ కమిషనర్లు వీపీ గౌతమ్, పమేలా సత్పతిలు ప్రత్యేక చొరవ తీసుకొని నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో 888 మంది మరుగుదొడ్డి ఉపయోగించుకునేలా ప్రజా, కమ్యూనిటీ, లగ్జరీలు, కేఫ్లను నిర్మించారు. కొన్ని మరుగుదొడ్లలోనే మూత్రశాలలు నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్లు ప్రజలు రద్దీగా ఉన్న రహదారుల్లో లేవు. స్థల లేమితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అక్కడక్కడ రహదారుల్లో నిర్మించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో మూత్రశాలలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వసూలు మహా నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో చాలామేరకు మూత్రశాలలు లేవు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్రశాల ఉంటే ఉపయోగించినందుకు ఒక్కరినుంచి రూ.3 నుంచి 5 చొప్పన చొప్పన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మూత్రశాల ఉపయోగించినందుకు డబ్బులు తీసుకోకూడదు. కానీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహకులు అడ్డంగా బాదేస్తున్నారు. దీంతో ప్రజలు వాటిలోకి వేళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఎక్కడైనా ఖాళీ స్థలం, సందు దొరికితే చాలు బహిరంగంగా మూత్ర విసర్జన అనివార్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఆస్కీ ఆధ్వర్యంలో మూత్రశాలలపై ప్రణాళికలు రూపొందించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పాలక వర్గం పెద్దలు, అధికారులు బహిరంగ మూత్ర విసర్జనపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి విరివిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
యమహా నగరి.. విశాఖ పురి
సాక్షి, విశాఖపట్నం: స్మార్ట్ సిటీగా కొత్త రూపు దిద్దుకుంటున్న విశాఖ.. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతోంది. అవార్డులు, ర్యాంకింగ్లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. క్లైమేట్ స్మార్ట్సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0 ర్యాకింగ్స్లో మొత్తం 123 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు మాత్రమే 4 స్టార్ రేటింగ్ దక్కగా.. అందులో విశాఖ స్థానం సంపాదించుకుంది. అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంతో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సత్తా చాటి ఏకంగా 5 స్టార్ రేటింగ్ సాధించింది. మురుగునీటి నిర్వహణలో వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్న జీవీఎంసీ.. ఆ విభాగంలో 3 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా 2019–20 నుంచి స్మార్ట్సిటీ ర్యాంకింగ్స్ ప్రకటిస్తున్నారు. పట్టణ ప్రణాళిక, జీవవైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్బిల్డింగ్, ఎయిర్క్వాలిటీ, వాటర్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. గతేడాది 9వ ర్యాంకు సాధించిన విశాఖ నగరం.. 2020–21లో మాత్రం సత్తా చాటింది. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0 ఓవరాల్ ర్యాంకింగ్స్లో మొత్తం 9 నగరాలకు 4 స్టార్ రేటింగ్ ఇవ్వగా అందులో విశాఖపట్నం కూడా నిలిచింది. ఇక వివిధ విభాగాల్లో ప్రకటించిన ర్యాంకుల్లో విశాఖ నగరం సత్తా చాటింది. అర్బన్ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంలో ఇండోర్, సూరత్తో కలిసి వైజాగ్ 5 స్టార్ రేటింగ్ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలో 5 స్టార్, ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో, మొబిలిటీ అండ్ ఎయిర్క్వాలిటీ విభాగంలో, మురుగునీటి నిర్వహణలోనూ 3 స్టార్ రేటింగ్ సాధించింది. రెండేళ్ల కాలంలో విశాఖ నగరంలో వచ్చిన వినూత్న మార్పులతో ‘స్టార్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. వ్యర్థాల నిర్వహణలోనూ స్టారే.. జీవీఎంసీ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో 2018–19లో 23వ ర్యాంక్కు పడిపోవడంతో.. పటిష్ట చర్యలకు అమలు చేసింది. బయోమైనింగ్, ఘన వ్యర్థాల నిర్వహణని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల్ని 25 ఎకరాల్లో ఆధునిక బయోమైనింగ్ పద్ధతు ల్లో తొలగిస్తున్నారు. అదేవిధంగా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేపడుతోంది. అందుకే ఈ విభాగంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. పర్యావరణహిత నగరంగా... నగరంలో రెండేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. సీడ్బాల్స్ రూపంలో లక్షకు పైగా విత్తనాలు, 58,456 మొక్కలు నాటింది. దీనికితోడు మియావాకీ చిట్టడవులు, పార్కులు ఏర్పాటు చేయడంతో.. ఈ విభాగంలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. దీని ద్వారా జీవవైవిధ్యానికి జీవీఎంసీ పెద్దపీట వేసింది. ►జీవీఎంసీ విస్తీర్ణం-625.47 చ.కిమీ ►పచ్చదనం పరచుకున్న విస్తీర్ణం 222.53 చ.కిమీ మురుగు నీటిని శుద్ధి చేస్తూ.. నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీటి వ్యర్థాల నిర్వహణలోనూ జీవీఎంసీ ప్రత్యేక చర్యలు అవలంబిస్తోంది. మురుగునీటిని శుద్ధి చేసేందుకు బయోరెమిడేషన్ పద్ధతుల్ని అవలంబిస్తోంది. ఈ కారణంగా ఈ విభాగంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. ►నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీరు 78 ఎంఎల్డీ ►సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్(ఎస్టీపీ) 04 ►మినీ ఎస్టీపీలు 13 ►సివరేజ్లైన్ పొడవు 771 కి.మీ స్టార్ రేటింగ్ బాధ్యత పెంచింది స్మార్ట్ సిటీ స్టార్ రేటింగ్స్లో విశాఖ నగరం మంచి రేటింగ్ సాధించడం ఆనందంగా ఉంది. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించేందుకు జీవీఎంసీ నిరంతరం శ్రమిస్తోంది. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై మరింత దృష్టిసారిస్తున్నాం. థీమ్పార్కులు, మియావాకీ అడవుల నిర్మాణం చేపడుతున్నాం. నరవలో 108 ఎంఎల్డీ ఎస్టీపీ సిద్ధం చేస్తున్నాం. స్టార్ రేటింగ్ జీవీఎంసీ అధికారులపై బాధ్యతని మరింత పెంచింది. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విషయంలో జీవీఎంసీ రాజీపడటం లేదు. కమిషనర్ సూచనల్ని అనుసరించి.. ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రధాన దృష్టిసారించాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ గ్రీన్ సిటీగా విశాఖని తీర్చదిద్దుతున్నాం. – వినయ్కుమార్, జీవీఎంసీ స్మార్ట్సిటీ ఎస్ఈ -
ఫోర్ స్టార్ నగరాలుగా విశాఖ, బెజవాడ
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం/తిరుపతి తుడా: స్మార్ట్ సిటీల్లో విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ దక్కింది. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0 ర్యాంకింగ్స్లో రాష్ట్రం నుంచి ఈ రెండు నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 120 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులో రాష్ట్రం నుంచి విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ దక్కింది. పట్టణ ప్రణాళిక, జీవ వైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్, ఎయిర్ క్వాలిటీ, వాటర్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై 2019–2020 నుంచి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. తిరునగరికి ఐదు అవార్డులు స్మార్ట్ తిరుపతి జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్, లివింగ్ సిటీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తిరుపతి నగరానికి జాతీయ గుర్తింపు లభించింది. సోషల్ యాస్పెక్ట్లో తిరుపతి తొలి స్థానం దక్కించుకుంది. అర్బన్ డెవలప్మెంట్లో మూడో స్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి విభాగంలో ఈ స్థానం దక్కింది. శానిటేషన్ విభాగంలో ఇండోర్తో కలిపి తిరుపతి తొలి స్థానంలో నిలిచింది. ఎకానమీ అంశంలో బూస్ట్ లోకల్ ఐడెంటిటీ, డిజైన్ స్టూడియోలో ఎకానమీ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. సిటీల విభాగంలో రెండో రౌండ్లో రెండో స్థానంలో నిలిచింది. తిరుపతి నగరం మొత్తం ఐదు జాతీయ అవార్డులను దక్కించుకున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ వెల్లడించారు. కాకినాడ, అమరావతి ఇలా.. డాటా మెచ్యూరిటీ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ సైకిల్–2 డ్యాష్బోర్డు ఫలితాల ప్రకారం 80 పాయింట్లకు గానూ 56 పాయింట్లతో 14 వ స్థానంలో విశాఖపట్నం, 53 పాయింట్లతో కాకినాడ 19వ స్థానంలో, 41 పాయింట్లతో 27వ స్థానంలో అమరావతి, 14 పాయింట్లతో 84వ స్థానంలో తిరుపతి నిలిచాయి. అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్లో విశాఖకు ‘ఫైవ్స్టార్’ అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయో డైవర్సిటీ విభాగంలో దేశవ్యాప్తంగా కేవలం 3 నగరాలకు మాత్రమే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులోనూ విశాఖపట్నం సత్తా చాటింది. ఇండోర్, సూరత్తో కలిసి వైజాగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలోనూ విశాఖ సత్తా చాటింది. ఈ విభాగంలోనూ ఫైవ్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో త్రీ స్టార్ రేటింగ్ని విశాఖ దక్కించుకుంది. మొబిలిటీ అండ్ ఎయిర్ క్వాలిటీ విభాగంలోనూ త్రీ స్టార్ రేటింగ్ సాధించింది. మురుగు నీటి నిర్వహణ విభాగంలో త్రీ స్టార్ రేటింగ్లో నిలిచింది. -
తిరుపతి నగరానికి 5 ప్రతిష్టాత్మక అవార్డులు
సాక్షి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే స్మార్ట్ సిటీ అవార్డుల కాంటెస్ట్లో తిరుపతి నగరానికి ఏకంగా ఐదు అవార్డులు లభించాయి. దేశంలో ఇండోర్, సూరత్ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతి కావడం విశేషం. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్ విభాగాల్లో ఈ నగరానికి దేశంలోనే మొదటి స్థానం లభించగా.. బెస్ట్ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానం.. అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మూడో స్థానం దక్కింది. మొత్తంగా తిరుపతి నగరానికి ఐదు స్మార్ట్ సిటీ అవార్డులు లభించాయి. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ -
వారు మాతృమూర్తులతో సమానం..
సాక్షి, విశాఖ: పరిసారలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నపారిశుధ్య కార్మికులపై మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్య నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. స్వచ్చభారత్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు వారు పేరుపేరునా ధన్యవాదాలుతెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా శుక్రవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు. పారిశుధ్య కార్మికులు మాతృ మూర్తులతో సమానమని, వారి సేవలకు గుర్తుంపుగా అవార్డులు ప్రధానం చేయడం చాలా సంతోషకరమన్నారు. స్మార్ట్ సిటీ విశాఖను మరింత సుందర నగరంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ.. పారిశుద్యం అంటే కేవలం శానిటైజేషన్ మాత్రమే కాదని, పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడమేని అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి 25 మందికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర్చిడిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. దేశంలో అత్యంత సుందర నగరాలలో విశాఖకు 9వ స్థానం లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్కి నిధులు విడుదల చేసి మరింత స్వచ్చత సాధిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆధారబాదరగా పనులు చేపట్టి మధ్యలో వదిలేసారని, తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. -
విశాఖకు అంతర్జాతీయ ఘనత
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ‘లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డు’ కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా.. విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్ ఎబిలిటీ పార్క్’ లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. ఏడు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం ఈ ఎక్స్పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్పోలో బుధవారం ఆయా కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. తొలి స్థానంలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్ విజేతగా నిలవగా, అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించేప్రాజెక్టుతో టరీ్క దేశంలోని ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే తొలి ఎబిలిటీ పార్క్ బీచ్ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా రూ.3.50 కోట్లతో ఆల్ ఎబిలిటీ పార్క్ తీర్చిదిద్దారు. సాధారణ ప్రజలు, పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ పార్కులో ఆటలాడుకొని ఎంజాయ్ చేసేలా పార్కు నిర్మించారు. పార్కులో క్లైంబింగ్ నెట్, పిల్లలు ఆటలాడుకునే ఎక్విప్మెంట్, షిప్ డెక్, మ్యూజికల్ పోల్స్, ప్లే గ్రౌండ్ డ్రమ్స్తో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్ స్కేప్లు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు సీట్ల మేరీ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు కూడా ఎంజాయ్ చేసేలా దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే కావడం విశేషం. ప్రజల ఆనందానికి, ఆహ్లాదానికి వినియోగించుకునేలా.. ముఖ్యంగా చిన్నారులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న ఈ పార్కుని యూకే అంబాసిడర్తో పాటు అమెరికన్ల ప్రశంసలందుకుంది. వచ్చే ఏడాది మొదటి స్థానం ఖాయం స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో జీవీఎంసీ ప్రాజెక్ట్ మొదటి స్థానం సాధించలేకపోయినందుకు బాధగా ఉన్నా.. దేశం నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్ ఆల్ ఎబిలిటీ పార్క్ కావడం గమనార్హం. అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుంది. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
మరింత స్మార్ట్గా..
స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు సరికొత్త విద్యాబోధన అందిస్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. మరిన్ని స్కూళ్లలో సేవలు విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ ల్యాబ్లు, ప్రొజెక్షన్ యూనిట్లు.. ఇలా స్మార్ట్ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు రూ.28.77 కోట్లతో పనులు చేపట్టింది. లాక్డౌన్ కారణంగా పనులు ఆలస్యం కావడంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు స్మార్ట్ పాఠాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్ బడి అంటే.. దుంపల బడి అనే ఆలోచన నుంచి.. డిజిటల్ బడి అనేలా తీర్చిదిద్దుతున్నారు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు అందే ప్రతి సౌకర్యం పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందాలనే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్నంగా ఆలోచనలు చేస్తోంది. విద్యార్థుల్లో ఆవిష్కరణ, పరిశోధన నైపుణ్యం, సామర్థ్యం పెరగాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయిలోనే వారికి సాంకేతికతను పరిచయం చేయాలని జీవీఎంసీ నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగానే స్మార్ట్ క్లాసులను 2017 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. మొదటి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ డిజిటల్ క్లాస్ రూమ్లు, స్మార్ట్ క్లాస్లు పరిచయం చేసిన జీవీఎంసీ ఇప్పుడు ఒకటి నుంచి 8 వరకూ స్మార్ట్ క్లాస్లనూ, 10వ తరగతి వరకూ డిజిటల్ తరగతులను బోధిస్తోంది. దీని ద్వారా పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, పాఠ్యాంశాలపై అవగాహన, ఆసక్తి, ఉత్సాహం పెరుగుతోంది. మూడు విభాగాలుగా తరగతులు స్మార్ట్ క్లాస్ రూమ్ అనేది మూడూ విభాగాలుగా అమలు చేస్తున్నారు. మొదటిది ప్రతి క్లాస్కు డిజిటల్ బోర్డును అమర్చుతారు. ఈ డిజిటల్ బోర్డును టీచర్స్ వినియోగించి.. పాఠాలను బోధిస్తారు. ఇలా బోధించడం వల్ల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. గణితం, సైన్స్ డయాగ్రామ్స్ విద్యార్థులు స్పష్టంగా 3డిలో వివరిస్తే ఆసక్తిగా ఉంటుంది. రెండో దశలో విద్యార్థులకు క్రోమ్ బుక్స్ (మినీ ల్యాప్టాప్స్) ఇచ్చి వారికి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పుతారు. ఇందులో ప్రత్యేకం గూగుల్ క్లాస్ రూమ్. ఇది విద్యా రంగంలో డిజిటల్ క్లాస్లకు ముఖ్య భూమిక పోషిస్తోంది. దీని గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నేర్పిస్తారు. మూడో దశలో గూగుల్ క్లాస్ రూమ్ గురించి నేర్చుకున్న తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్లో హోమ్ వర్క్స్ ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తారు. వారు చేసిన హోమ్ వర్క్స్, పరీక్షలకు ఫలితాలను వెంటనే వెల్లడవుతాయి. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయం ఆదాతో పాటు, బుక్స్లో లేని విషయాలను సైతం తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. స్మార్ట్ ల్యాబ్లు.. డిజిటల్ క్లాసులు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడమే కాదు.. ఆన్లైన్లోనే పరీక్షలూ నిర్వహించేలా 2019–20 విద్యా సంవత్సరంలో యూనిట్ పరీక్షలు పైలట్గా చేపట్టి సఫలీకృతులయ్యారు. ఆన్లైన్ ద్వారా రివిజన్ ఎగ్జామ్స్ సైతం నిర్వహించారు. ఇలా ప్రతి అడుగూ స్మార్ట్గా వేస్తున్న జీవీఎంసీ మిగిలిన స్కూళ్లలోనూ ప్రాజెక్టు విస్తరిస్తోంది. రూ.28.27 కోట్లతో స్మార్ట్ స్కూళ్లు పనులు చేపడుతోంది. హైస్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్లు, ప్రొజెక్షన్ యూనిట్లుతో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నింటినీ ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేసి, 2021–22 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. జీవీఎంసీ పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్లో నాలెడ్జ్ యంత్ర (కెయాన్) అప్లికేషన్ ద్వారా క్లాస్ వివరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కెయాన్ వినియోగిస్తున్నారు. కంప్యూటర్కు ప్రొజెక్టర్ అనుసంధానించి. ప్రొజెక్టర్ ఆన్ చేసి ఇంటెల్ స్పేస్ అనే స్మార్ట్ బోర్డును ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు. సుద్ద ముక్క లేకుండానే బోర్డుపై క్లాసులు చెప్పే సౌకర్యం ఉంది. అదే విధంగా ల్యాబ్లో కెయాన్తో పాటు 40 క్రోమ్బుక్స్ను విద్యార్థులకు ఇస్తారు. ఈ క్రోమ్బుక్స్లోనే పెన్ను పుస్తకాలతో సంబంధం లేకుండా విద్యార్థులు నోట్స్ ప్రిపేర్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. చురుగ్గా స్మార్ట్ స్కూళ్ల పనులు జీవీఎంసీ విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ స్మార్ట్ క్లాసులు మంచి మార్పులు తీసుకొచ్చింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల విద్యార్థులు రివిజన్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సైన్స్ వీడియోస్ ద్వారా విద్యార్థులకు పాఠాలపై పూర్తి అవగాహన కలుగుతోంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ వల్ల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు మంచి సహకారం లభిస్తోంది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్ క్లాసులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి తోడు విద్యార్థుల్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేస్తే భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షల్నీ సులువుగా అందిపుచ్చుకోగలరు. అందుకే పరీక్షలు కూడా ఆన్లైన్లో నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
త్రీస్టార్.. తిరుపతి వన్
స్మార్ట్ తిరుపతి మెరిసింది. త్రీస్టార్ రేటింగ్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నందుకు అత్యున్నత గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వ మినిస్టరీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అఫైర్స్శాఖ పర్యవేక్షణలో ఫైవ్, త్రీస్టార్ ర్యాంకింగ్లను మంగళవారం ప్రకటించారు. ఆశాఖ మంత్రి హర్దీప్సింగ్పూరీ ర్యాంకుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా ప్రకటించారు. త్రీస్టార్ రేటింగ్లో పోటీపడ్డ తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సాక్షి, తిరుపతి: గార్బేజ్ ఫ్రీసిటీ స్టార్ రేటింగ్లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2019లో నిర్వహించి రేటింగ్స్లో 51వ స్థానంలో ఉన్న తిరుపతి నగరం 2020 పోటీల్లో టాప్–1 ర్యాంకులో నిలిచి తన సత్తాను చాటుకుంది. గత ఏడాది విజయవాడ నగరం 50వ స్థానంలో ఉండగా ఈ సారి జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరింది. త్రీస్టార్ రేటింగ్లో టాప్–10లో ఉన్న నగరాలు మాత్రమే టాప్ 5 ర్యాంకింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. త్రీస్టార్ రేటింగ్లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి వచ్చే ఏడాది ఫైవ్ స్టార్ ర్యాంకింగ్లో పోటీపడనుంది. 1,435 నగరాలు పోటీ స్వచ్ఛతను పాటించే నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్టార్ రేటింగ్స్ పోటీ నిర్వహించింది. నిపుణులు నగరాల్లో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రజలకు మౌలిక వసతులు, వాటి నిర్వహణకు ఉపయోగిస్తున్న అత్యున్నత ప్రమాణాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ర్యాంకింగ్ను కేటాయించారు. దేశంలోని 1,435 నగరాలు పోటీడ్డాయి. ఫైవ్ స్టార్ రేటింగ్లో ఆరు నగరాలు సొంతం చేసుకోగా 63 నగరాలకు త్రీస్టార్, 70 నగరాలు ఒక స్టార్ రేటింగ్ను కేంద్రం ప్రకటించింది. మెరిసిన తిరుపతి కీర్తి పతాకం తిరుపతిలో స్వచ్ఛత, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెత్తను వంద శాతం సది్వనియోగం చేస్తున్నారు. ఇందుకోసం పీపీపీ పద్ధతిన కార్పొరేషన్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను స్వీకరిస్తున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో తూకివాకంలో నిర్మించిన బయో మెథనైజేషన్ ప్లాంట్కు తరలించి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో రామాపురం డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ద్వారా 5 లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను తూకివాకంలో నిర్వహిస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో పొడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టారు. ఇలా శాశ్వత ప్రతిపాదికన చెత్త నిర్వహణను నిర్వహిస్తున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తుండడంతో తిరుపతి ఈ ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి కృషితోనే సాధ్యం నగర ప్రజలకు పరిశుభ్రత, స్వచ్ఛతను అందించేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక వసతులు కలి్పస్తున్నాం. చెత్త నిర్వహణ కోసం కోట్లు వె చ్చించి పలు ప్లాంట్లు నిర్వహిస్తున్నాం. ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టం, అధికారుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధించాం. – పీఎస్ గిరీషా, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
‘స్మార్ట్’ విశాఖ: 24 గంటలు డేగకన్నుతో..
సాక్షి, విశాఖపట్నం: మహమ్మారి కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని మహానగరం విశాఖపట్నం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన వెంటనే అప్రమత్తమైన అధికార బృందం యుద్దప్రాతిపదకన అనేక చర్యలు చేపట్టింది. నగరాన్ని 24 గంటలు డేగకన్నుతో పరిశీలిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా కరోనా కట్టడిలో యంత్రాంగం పనితీరుకు కితాబు ఇచ్చింది. మహమ్మారి కరోనాపై నగర ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా 90 ప్రాంతాల్లో బహిరంగ ప్రకటన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాఖ మొత్తం 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరి కదలికలపై దృష్టి సారించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో కరోనా గురించి తెలిపే 10 డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్యాలయంలో 24గంటలూ పనిచేసేలా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. 24 గంటలు షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ నిరంతరం అప్రమత్తతో ఉంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థతో ఇంటింటి సర్వే చేపట్టి కరోనా పాజిటివ్/అనుమానితులను వేగంగా గుర్తించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్ జోన్లుగా ప్రకటించి అంక్షలు విధించి అక్కడ వారిని బయటకు రానీయకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ చేశారు. దీంతో స్మార్ట్ సిటీ విశాఖలో కరోనా కొంత నియంత్రణలోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించడంతో విశాఖలో కరోనా వ్యాప్తి కొంత ఆగినట్లయింది. చదవండి: మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు ఆంధ్రప్రదేశ్లో రెడ్ జోన్లు ఇవే -
కరోనా నియంత్రణ చర్యలు చాలా 'స్మార్ట్'!
సాక్షి, అమరావతి: స్మార్ట్ సిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయ్.. మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయ్.. అంటూ స్మార్ట్ సిటీ మిషన్ కితాబిచ్చింది. ఈ మేరకు ఓ నివేదిక ఇచ్చింది. తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్టు పేర్కొంది. స్మార్ట్ నగరాల పనితీరును బట్టి సాధారణం, బాగా చే స్తున్నవి, అద్భుతంగా చేస్తున్నవి.. ఇలా మూడు గ్రేడ్లుగా విభజించి, అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్సిటీ మిషన్ ర్యాంకులిచ్చింది. మన రాష్ట్రంలో విశాఖ, అమరావతి, కాకినాడ, తిరుపతిలు స్మార్ట్ నగరాలు. ఈ నాలుగింటిలో తిరుపతికి మొదటి ర్యాంకు వచ్చింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ బాగున్నట్టు తన నివేదికలో తేల్చింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. - తిరుపతికి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్ల వద్ద మార్కింగ్ వేశారు. క్వారంటైన్ పర్యవేక్షణ బాగుంది. - ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు, కిరాణా సరుకులు అందజేస్తున్నారు - వార్డు సెక్రటరీలు, సిబ్బంది ఆయా వార్డుల్లో పటిష్టంగా, ప్రజలను నొప్పించకుండా సేవలందిస్తున్నారు. - విశాఖపట్నంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం చాలా బావుంది - అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ చక్కగా పనిచేస్తోంది - కాకినాడలో 24 గంటల హెల్ప్ డెస్క్లు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్ను ఏర్పాటు చేశారు - అమరావతిలో పబ్లిక్ అవేర్నెస్ బ్యానర్లు విరివిగా ఏర్పాటు చేయడంతో పాటు హోమియో మందులు సరఫరా చేస్తున్నారు. -
ఏపీలో మరో 13 స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరులతో కలిపి మొత్తం 13 పట్టణాలను ఎంపిక చేసుకుంది. వచ్చే పదేళ్లలో ఈ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించింది. మొదటి దశలో ఆరు పట్టణాలను అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం సుమారుగా రూ. 5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతిలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్రంలో 17 పట్టణాలు స్మార్ట్గా మారనున్నాయి. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి.. రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా పదేళ్లలో ఇది 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే పదేళ్లలో రూ. 3.55 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఒక్క పట్టణ రవాణా రంగంలోనే రూ. 89,034 కోట్లు అవసరమవుతాయని లెక్కకట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు, రహదారులు, పోర్టుల అభివృద్ధి వంటి రంగాల్లో బీవోటీ, పీపీపీ విధానాల్లో విదేశీ పెట్టుబడులకు ఆహా్వనం పలుకుతోంది. ఈ మధ్య రాష్ట్ర పర్యటనకు వచి్చన కొరియా, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తల బృందాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, ఉన్నతాధికారులు మౌలిక వసతుల కల్పనలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విశాఖ మెట్రో రైలు, బకింగ్హాం కెనాల్ పునరుద్ధరణ, అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు దేశాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో రాష్ట్ర జీడీపీలో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేస్తున్నట్లు బుగ్గన పేర్కొంటున్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి ఇలా... 1రాష్ట్రం మొదటి దశలో చేపట్టేవి శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు 2రెండో దశలో చేపట్టేవి విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, కడప, చిత్తూరు కేంద్రం అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ సిటీలు విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతి -
చెత్త కనబడకుండా ’స్మార్ట్’ ఐడియా!
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణలో కొత్త విధానం చేపట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. నగరాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్థాయికి తగ్గట్టుగా నగరంలో చెత్త నిర్వహణను చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధాన రహదారులపై చెత్త కనబడకుండా ఉండేందుకు అండర్గ్రౌండ్ డస్ట్బిన్స్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రోడ్లపై బహిరంగంగానే చెత్త డబ్బాలు ఏర్పాటు చేస్తుండగా... చెత్త డబ్బాలు నిండిపోయి రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేస్తుండడంతో పరిసరాలన్నీ అధ్వానంగా మారుతున్నాయి. స్మార్ట్సిటీగా అవతరించి యేడాది గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీంతో నగరపాలక సంస్థ చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి విడతలో స్మార్ట్సిటీ హోదా దక్కించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్న నగరాలకు ధీటుగా కరీంనగర్ స్మార్ట్సిటీని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నరగపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో నగరాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నిదులు కేటాయిస్తున్నారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తగ్గించడం, తడి, పొడి, చెత్తను వేరు చేసి తీసుకెళ్లాలనే నిబంధనలు అమలుపై దృష్టిసారించారు. ఇప్పటికే వీధుల్లో సేకరించిన చెత్తను కుదించడం కోసం కొత్తగా కంప్యాక్టర్ డబ్బాలు, వాహనాలు కొనుగోలు చేశారు. వీటిని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయగా అందులో చెత్తను వేసి, ప్రత్యేక వాహనాల్లో డంప్యార్డుకు తరలిస్తున్నారు. స్మార్ట్గా కనబడేందుకు... కరీంనగర్ను స్మార్ట్గా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. స్మార్ట్సిటీ నగరంలోని ప్రధాన రహదారులను, రద్దీ ప్రాంతాల రోడ్లను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు టెండర్లు నిర్వహించే పనిలో ఉన్నారు. మూడు ప్యాకేజీల కింద రహదారుల నిర్మాణానికి టెండర్లు నిర్వహించగా వాటికి సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని తిరిగి టెండర్లు పిలిచారు. వాటిని కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అదే విధంగా పేస్–2లో అంతర్గత రోడ్లను వేయనున్నారు. రోడ్డు వేయడానికంటే ముందే అండర్గ్రౌండ్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. చెత్త కనబడకుండా... నగర వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీంతో వీధులన్నీ అధ్వానంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులపై చెత్త కనిపించకుండా అండర్ గ్రౌండ్లో స్మార్ట్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన రహదారులపై చెత్త బహిరంగంగా కన్పించకుండా నూతన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. అండర్గ్రౌండ్ చెత్త డబ్బాలను 14 ప్రాంతాల్లో 20 డబ్బాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. వీటికి స్మార్ట్సిటీలో రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. స్థలాల ఎంపిక.. స్మార్ట్బిన్స్ ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు స్థలాలను సైతం ఎంపిక చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుకబాగంలో, ఎస్సారార్ కళాశాల వద్ద నున్న మార్కెట్లో, సర్కస్గ్రౌండ్లో, సాయినగర్లో, ఆదర్శనగర్లో, అన్నపూర్ణకాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో, వారసంతలో, మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో, మార్కెట్ రిజర్వాయర్ ఎదురుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక, ప్రభుత్వాసుపత్రి వెనుక భాగంలో మొదట వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అండర్గ్రౌండ్ డస్ట్బిన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ డస్ట్బిన్ల ఏర్పాటు పూర్తయితే రోడ్ల వెంట చెత్త ఇక కనబడదని అధికారులు భావిస్తున్నారు. -
స్మార్ట్ స్ట్రీట్
నగరంలో ఓ మార్గం. వినోద్ రోడ్డు మీద నడుస్తున్నాడు. రోడ్డంటే రోడ్డనుకునేరు.. ఇప్పటి ఫుట్పాత్కు భిన్నంగా భేషుగ్గా ఉన్న పాదచారుల మార్గంలో అతడు అడుగేస్తున్నాడు. గమ్యానికి వేగంగా చేరాలనిపించింది. బస్టాప్లో నిల్చున్నాడు.. అది కూడా మామూలుగా లేదు. వైఫై ఈజీగా అందుబాటులో ఉంది. హంగు చాలానే ఉంది. జీపీఎస్ కారణంగా ఆ దారిలో బస్సులు ఏవేవి ఎక్కడున్నాయో కళ్లెదురుగా స్క్రీన్ మీద కనిపిస్తోంది. దాన్ని చూస్తే బస్సులు దరిదాపుల్లో లేవని అర్థమైపోయంది. ఇంకెందుకు ఆలస్యం? అని వినోద్ రెండడుగులు వేసి అక్కడే ఉన్న బైక్ షేరింగ్ ఐలండ్కు వెళ్లి వివరాలు తెలిపి స్మార్ట్గా ఉన్న సైకిల్ తీసుకున్నాడు. సైక్లింగ్ ట్రాక్లో హుషారుగా సైకిల్ తొక్కుతూ గమ్యానికి ముందే చేరుకున్నాడు. సైకిల్ అక్కడే వదిలేసి నాలుగడుగుల్లో ఆఫీసుకు ఎంచక్కా వెళ్లాడు. దారంతా పచ్చని మొక్కల మధ్యలో ప్రయాణించి, కనువిందైన హరిత ఐలెండ్లు దాటుకుంటూ రావడంతో విసుగన్నదే లేకుండా హుషారుగా పనిలో మునిగిపోయాడు... ఇదంతా ఏ దేశంలోనో అనుకుని నిట్టూరుస్తున్నారా.. ఆగండాగండి.. ఈ హంగులన్నీ వేరే చోట కాదు.. మన వైజాగ్లోనే. దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఇవన్నీ మన వీధుల్లోనే వాస్తవాలు కాబోతున్నాయి. ఈ స్మార్ట్ స్ట్రీట్స్ కోసం జీవీఎంసీ ఉత్తుత్తి మాటలు చెప్పడం లేదు. గట్టి ప్రయత్నాలే చేస్తోంది. విశాఖసిటీ: మహా నగరం మరింతగా స్మార్ట్ హంగుల్ని సంతరించుకోబోతోంది. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా వీధుల్ని ఆకర్షణీయంగా మార్చేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నాలుగు ప్రాజెక్టులుగా విభజించి 19.43 కిలోమీటర్ల మేర వీధుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆకట్టుకునే ఐలాండ్స్, సైక్లింగ్ ట్రాక్లతో పాటు వైఫై స్పాట్లతో కూడిన అనేక మౌలిక సదుపాయాలతో ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. విశాల విశాఖ నగర వీధులు జిగేల్మననున్నాయి. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేశాయి. ఈ నిధులకు సంబంధించిన పనులు పూర్తయిన వెంటనే.. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకునేందుకు జీవీఎంసీ చకచకా ప్రణాళికలు సిద్ధం చేసేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 23నæ 9 స్మార్ట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది స్మార్ట్ స్ట్రీట్స్ పథకం. మహా నగరంలో వీధులు తళుక్కుమనేలా.. రూపొందించేందుకు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ఆకట్టుకునేలా ఉంది. దీనికోసం ఆయా శాఖల సమన్వయం అవసరమైనందున ఇప్పటికే వీఎంఆర్డీఏ, ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు, ఈపీడీసీఎల్ సిబ్బంది, బీఎస్ఎన్ఎల్ అధికారులతో జీవీఎంసీ పలు దఫాలుగా సమావేశం నిర్వహించింది. రూ.164 కోట్లతో ఏబీడీ ప్రాంతంలో 19.43 కిలోమీటర్ల విస్తీర్ణంలో 20 రహదారుల్ని స్మార్ట్ స్ట్రీట్స్గా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. షాపూర్జీ పల్లాన్జీ సంస్థ ఈ పనుల టెండర్ను దక్కించుకుంది. రూపాంతరమిలా.. ♦ స్మార్ట్ వీధుల్ని రహదారులకు ఇరువైపులా అభివృద్ధి చేస్తారు. సుమారు 6.4 మీటర్ల వెడల్పు వంతున వీటిని తీర్చిదిద్దుతారు. ♦ రోడ్డుకు ఇరువైపులా సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు. ♦ 1.5 మీటర్ల సైకిల్ ట్రాక్, 2.5 మీటర్ల వాకింగ్ ట్రాక్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ♦ పాదచారులకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు కానుంది. ♦ రహదారికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్లలో బఫర్ ప్రాంతాల్లో పచ్చదనం పరచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ♦ అక్కడక్కడా వైఫై స్పాట్లను ఏర్పాటు చేయనున్నారు. ♦ బీచ్రోడ్డులో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ బైక్ షేరింగ్ ప్రాజెక్టును స్మార్ట్ స్ట్రీట్స్కు విస్తరించనున్నారు. మొత్తం 80 పబ్లిక్ బైక్ షేరింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ♦ ఈ ప్రాజెక్టులో మొత్తం 8 జంక్షన్లు వస్తాయి. ప్రతి జంక్షన్లోనూ స్మార్ట్ ఐలాండ్ ఏర్పాటు కానుంది. ♦ ఈ ఐలాండ్స్లో ల్యాండ్ స్కేపింగ్ చేసి, మొక్కలు, రంగులు వేసి ఆకర్షణీయంగా మారుస్తారు. మరికొన్ని ఐలాండ్స్ను ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నారు. ♦ హరిత రహదారి విస్తరణకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనున్నారు. ♦ వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ♦ బస్టాపులో భద్రత, సౌకర్యం, పూర్తిస్థాయి బస్సు సమాచారం ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ♦ ఈ బస్టాపులు సోలార్ వ్యవస్థతో రూపుదిద్దుకోనున్నాయి. ♦ రహదారి మధ్యలో సేదతీరేందుకు వసతి స్థలాలు, విశ్రాంతి తీసుకునే షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. 20 రహదారులు.. 19.43 కి.మీ. నగరంలోని 20 రహదారుల్ని స్మార్ట్ వీధులుగా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 19.43 కిలోమీటర్ల పరిధిలో ఈ వీధులు స్మార్ట్ కానున్నాయి. కేజీహెచ్ డౌన్రోడ్లో 1.08 కిలోమీటర్లు, కేజీహెచ్ అప్లో 0.45 కి.మీ. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి నోవాటెల్ డౌన్ వరకూ 1.96 కి.మీ., కలెక్టర్ ఆఫీస్ నుంచి నౌరోజీ రోడ్ వరకూ 0.93 కి.మీ., నౌరోజీ రోడ్లో 1.37 కి.మీ., హార్బర్రోడ్లో 3.2 కి.మీ., వాల్తేర్ మెయిన్రోడ్లో 4.91 కి.మీ., చినవాల్తేర్ రోడ్లో 2.07 కి.మీ., నౌరోజీ రోడ్ నుంచి ఆలిండియా రేడియో దారిలో 0.98 కి.మీ., దసపల్లా హిల్స్ రెసిడెన్షియల్ రోడ్లో 0.87 కి.మీ. మేర స్మార్ట్ స్ట్రీట్స్గా అభివృద్ధి చెందనున్నాయి. రెండేళ్లలో పూర్తి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా విశాఖ నగర వీధుల్ని ఆకర్షణీయమైన వీధులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నాం. స్మార్ట్ స్ట్రీట్స్కు సంబంధించిన డిజైన్ల రూపకల్పన ప్రారంభించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. 18 నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేసి స్మార్ట్ వీధుల్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. జీవనశైలి సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతున్న నేపథ్యంలో.. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ తరహా స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్. -
ప్రధాని మోదీ సభకు రూ.7.23 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు జైపూర్లో పాల్గొననున్న సభకు కేవలం జనాన్ని సమీకరించడం కోసమే రాజస్థాన్ ప్రభుత్వం 7.23 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నది. ఆహారం, వసతి ఏర్పాటు చేయడానికి ఇంతకన్నా ఎక్కువ సొమ్మును వెచ్చించనున్నట్లు తెల్సింది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి మీడియాకు చిక్కడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలను ప్రధాని సభకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. వీరందరికి రవాణా సౌకర్యంతోపాటు ఆహారం, వసతి సౌకర్యాలు జైపూర్లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకరావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,579 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పథకాల లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించడంతోపాటు స్మార్ట్సిటీ కార్యక్రమం పేరట ఓ ర్యాలీని కూడా ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి సభకు మరో ఐదువేల మంది లబ్ధిదారులను పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతూ బర్మర్ జిల్లా యంత్రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 24 లక్షల రూపాయల చెక్కును పంపించింది. ఇక ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మహిళలను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇచ్చింది. ప్రధానితోని ప్రశాంతంగా సానుకూలంగా మాట్లాడాలని కోరారు. వారిలో మంజూదేవి కూడా ఉన్నారు. ‘నాకు కూతురు పుట్టినందుకు రాజ్శ్రీ యోజన కింద రెండున్నర వేల రూపాయల చొప్పున రెండు వాయిదాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకున్న నేను 50 వేల రూపాయలు తీసుకున్నానని ఎలా చెబుతాన’ని ఆమె స్పష్టం చేయడంతో గురువారం నాడు ఆమెను ప్రధానితో మాట్లాడే వారి జాబితా నుంచి తొలగించారు. ప్రధానితో మాట్లాడే ఐదుగురికి తర్ఫీదు ఇచ్చినట్లు రాజస్థాన్ సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ సత్యనారాయణ చౌహాన్ అంగీకరించారు. ప్రధానితో మాట్లాడేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి కూడా విద్యార్థినులను ఎంపిక చేస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధి పొందిన రాజస్థాన్ వాసుల్లో 90 శాతం మంది బీజేపీ కార్యకర్తలే ఉన్నారని, రానున్న రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
సుందర నగరానికి సహకరించాలి
కరీంనగర్కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను సోమవారం కోర్టు చౌరస్తాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే నగరానికి స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేయడం ద్వారా నైట్ స్వీపింగ్ కార్మికులకు భారం తగ్గుతుందని, ప్రధాన రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. రహదారులు పరిశుభ్రంగా ఉంటే నగరం సుందరంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ సుందర నగరం కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టనున్న రూ.2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత చిన్న సుందర నగరంగా కరీంనగర్కు గుర్తింపు ఉందని, కరీంనగర్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్సింగ్, కార్పొరేటర్ కవితబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరాశ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులకు నిరాశ కలిగించింది. సాధారణ ఎన్నికలకుముందు ఈ దఫా చివరి బడ్జెట్గా జనరంజకంగా ఉంటుందని, జిల్లాలవారీగా కూ డా ప్రాధాన్యత దక్కుతుందని ఆందరూ ఆశించినా.. ఆ మేరకు కేటా యింపులు జరగలేదన్న అభిప్రాయం అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులపై వరాల జల్లు... ఉద్యోగాలు, ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి పేద్దపీట వేసినట్లు కనిస్తుండగా.. అత్యధిక శాతం ప్రజలకు లాభం చేకూరే ఆదాయ పరిమితి పెంపును విస్మరించడంపై పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక సాగునీటి వనరు.. తెలంగాణలోని ఏడు జిల్లాలకు ప్రయోజనం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈసారి కూడా జాతీయ హోదా దక్కలేదు. మెడికల్ కాలేజ్తోపాటు జిల్లాలో రైల్వేస్టేషన్లు, రైల్వేలైన్లకు అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించ లేదు. గత బడ్జెట్లో పేర్కొన్న బల్లార్షా – కాజీపేట మార్గంలో మూడో రైల్వేలైన్కు మాత్రం రూ.100 కోట్లు అదనంగా కేటాయించారు. కొత్తపల్లి–మనోహర్బాద్ రైల్వేలైన్ను గత బడ్జెట్లోనే ఆమోదించగా.. నిధులు వెచ్చించి శరవేగంగా పనులు పూర్తి చేస్తామంటూ.. పెద్దపల్లి–నిజామాబాద్ రైలుమార్గంలో పెద్దపల్లి నుంచి లింగంపేట వరకు 83 కిలోమీటర్లు రైల్వేలైన్ను విద్యుద్దీకరించనున్నట్లు ప్రకటించారు. ‘స్మార్ట్ సిటీ’గా కరీంనగర్కు నిధులు రైతుల సంక్షేమం, వ్యవసాయానికి ఎన్నడూ లేనివిధంగా ఈసారి రూ.11లక్షల కోట్లు కేటాయించారు. నాబార్డుతో సహకార బ్యాంకులను అనుసంధానం చేసి రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 12,00,781 కుటుంబాలు ఉంటే 4,32,189 రైతు కుటుంబాలు ఉన్నాయి. పంటల బీమా లెక్కల ప్రకారం 7.33 లక్షల మంది రైతులుండగా వీరికి రుణ సౌకర్యం కలిగే అవకాశం ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా భారీ నిధులు కేటాయించిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాబ్కార్డులు పొందిన 6,59,173 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇదివరకే దేశంలోని 99 నగరాలను స్మార్ట్సిటీలుగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఈబడ్జెట్లో రూ.2.04 లక్షల కోట్లు కేటాయించింది. దీంతో స్మార్ట్సిటీ జాబితాలో ఉన్న కరీంనగర్ నగర అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు విడుదల కానున్నాయి. సుమారు 3.50 లక్షల మంది నివసించే నగరానికి మహర్దశ రానుంది. పరిశ్రమలకు దక్కని ప్రోత్సాహం.. రైల్వే కేటాయింపులు పాతవే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం చేసిన సాయం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, జగి త్యాల, తిమ్మాపూర్ ప్రాంతాల్లో గతంలో చేసిన ప్రతిపాదనల ఊసే లేదు. మెగా ఫుడ్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సుముఖత తెలిపిన కేంద్రం.. ఈసారి కూడా మొండిచేయి చూపింది. ఇవేకాక ఇతర ఏ ఒక్క కొత్త పరిశ్రమ జిల్లాలో ఏర్పాటుకు కేంద్రం మొగ్గుచూపలేదు. దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా రూ.2500కోట్ల పన్నులు కేంద్రానికి చెల్లిస్తుండగా.. ఈ బడ్జెట్లో రూ.2000కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో పనిచేస్తున్న వేలాది మంది సింగరేణి సంస్థ కార్మికులకు ఆదాయపన్ను మినహాయిస్తారని భావించినా కేంద్రం దానిపై దృష్టి సారించలేదు. ఈ బడ్జెట్లో రైల్వేకోసం రూ.1,74,000 కోట్లు కేటాయించగా.. స్టేషన్ల పునరుద్ధరణ, హైటెక్ హంగులు కల్పించడం కోసం పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్కు స్థానం దక్కనుంది. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ వేగం పెంచడంతోపా టు పెద్దపల్లి–లింగంపేట మధ్య 83 కిలోమీటర్ల రైల్వేలైన్ విద్యుద్ధీకరణ, కాజీపేట–బల్లార్షా మధ్య మూడో రైల్వేలైన్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో పూర్తిగా భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల నిఘాకు నిధులు కేటాయించగా పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, జగిత్యాల తదితర రైల్వేస్టేషన్లకు స్థానం దక్కనుంది. బడ్జెట్ నేపథ్యంలో జిల్లా గణాంకాలు ఉమ్మడి జిల్లాలో కుటుంబాలు 927865 గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు 751791 నగర/పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు 176074 భూమిలేని నిరుపేద కుటుంబాలు 468950 ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు 31531 రోజుకూలీపై ఆధారపడుతున్న కుటుంబాలు 467959 మొబైల్ఫోన్లు వాడుతున్న కుటుంబాలు 630619 ల్యాండ్లైన్ ఫోన్ వాడుతున్న కుటుంబాలు 6476 మొబైల్ ఫోన్లు లేని కుటుంబాల సంఖ్య 108451 వాహనాలు వాడుతున్న కుటుంబాలు 177052 ధూమపానం, సెల్ఫోన్లు ప్రియం బడ్జెట్లో ఆదాయ పరిమితిని పెంచుతారని ఆందరూ భావించినా.. ప్రభుత్వం ఆ అంశాన్నే ప్రస్తావించలేదు. బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంచుతారని ఆశించిన వారికి ఆశాభంగం కలగింది. నిరుద్యోగులను ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లలో పెరిగిన వేతనాలను పరిశీ లిస్తే అంతకంటే ఎక్కువగా ధరలు పెరిగాయి. పరోక్షపన్నులు భారీగానే చెల్లిస్తున్న ఉద్యోగులపై ప్రత్యక్ష పన్ను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆదాయం రూ.5 లక్షల వర కు పన్ను పూర్తిగా మినహాయించాలన్న వాదన వేతనజీవుల నుంచి వినిపిస్తోంది. రూ.5లక్షలు పైబడి రూ.10 లక్షల వరకు 10 శాతం పన్నురేటు నిర్ణయించాలని, పొదుపు మొత్తాలపై పన్నురాయితీని రూ.3 లక్షలకు పెంచాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బడ్జెట్ ధూమపానప్రియులు, సెల్ఫోన్ వాడకందారులకు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, పాదరక్షలు, పాన్మసాల, టూత్పేస్టులు, బంగా>రం, వెండి, సిల్క్వస్త్రాలు సహా దిగుమతి చేసుకున్న కూరగాయలపైనా పన్నులు విధించారు. దేశీయ కంపెనీలు మినహా ఇతర కంపెనీలకు చెందిన సెల్ఫోన్లపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతో మొబైల్ ఫోన్ల కొనుగోలుదార్లపై భారం పడనుంది. కార్లు, బైక్లతోపాటు టైర్లపైనా ధరలు పెరిగాయి. ఆశించిన రీతిలో లేదు కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం మిగతా విషయాల్లో ఆశించిన రీతిలో మోడీ ప్రభుత్వం స్పందించలేదు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో ఆర్థిక కేటాయింపులు చేయకపోవడం బాధాకరం. ఎలక్షన్కు పోయేముందు అరుణ్జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ జనరంజకంగా లేదు. మోడీకేర్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఆరోగ్యభద్రతను 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తామని చెప్పి రూ.2 లక్షల కోట్లు ఖర్చయ్యే స్కీంకు, రూ.20 వేల కోట్లు కేటాయించడం చూస్తే అమలు ప్రశ్నార్థకంగా ఉంది. రైల్వేలు, భారత్మాల జాతీయ రహదారులపై దష్టిపెట్టలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు బడ్జెట్లో కేటాయింపులు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలను డిజిన్వెస్ట్మెంట్ పేరుతో నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.– బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీ పేదల పక్షం ఉంటే బాగుండేది బడ్జెట్లో కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరం. కనీస మద్దతు ధరలను 50 శాతం పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. బడ్జెట్ పేదల పక్షాన ఉండి ఉంటే బాగుండేది. గ్రామీణ ప్రజల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టామని చెప్పినా పెద్దగా కేటాయింపులు లేవు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ వైఖరి విచిత్రంగా ఉంది. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరం. పెద్దపెద్ద కంపెనీలను వదిలి, మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై ట్యాక్స్ వేయడం సరికాదు.– కల్వకుంట్ల కవిత, ఎంపీ -
‘స్మార్ట్’ వైపు.. దేశాల చూపు
కరీంనగర్కార్పొరేషన్/కరీంనగర్సిటీ: ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన స్మార్ట్ సిటీలపై ఇతర దేశాల దృష్టి పడింది. దేశంలోని వంద నగరాల జాబితాలో తెలంగాణ నుంచి స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్లో శనివారం బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పర్యటించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ఫ్లెమింగ్కు మేయర్ రవీందర్సింగ్, కమిషనర్ శశాంక స్వాగతం పలికారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. నగరపాలక సంస్థలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగర అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్రణాళికలపై వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన నగరాల నుంచి ఎంతో నేర్చుకునేది ఉంటుందని, కరీంనగర్ను సిస్టర్సిటీగా భావించి ఎక్స్చేంజ్ ప్రోగ్రాంల నిర్వహణకు సహకరించాలని ఫ్లెమింగ్ను కోరారు. కమిషనర్ ప్రజెంటేషన్తో సంతృప్తి చెందిన ఫ్లెమింగ్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నగర పరిసరాలు, అభివృద్ధిని బట్టి చూస్తే కరీంనగర్ అందమైన నగరంగా త్వరలోనే అవతరించబోతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కమలాకర్, సతీష్బాబు, ఎమ్మెల్సీ లక్ష్మణ్రావు, మేయర్ రవీందర్సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, కమిషనర్ శశాంక, ట్రేడ్ కోఆర్డినేటర్ ప్రవళిక, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన అండ్రూ ఫ్లెమింగ్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యేలు కమలాకర్, సతీష్బాబును ఫ్లెమింగ్ కలిశా రు. స్మార్ట్ సిటీ ఉద్దేశాలు, కరీంనగర్ వనరులు, వాణిజ్య పెట్టుబడుల అవకాశాల పై అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ కార్యాలయానికి చేరుకొని మహిళా రాజకీయ నా యకుల ప్రాతినిథ్యం, చదువుకు దూరంగా ఉన్న పిల్లలు, బాల్య వి వాహాల గురిం చి జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీటీసీ లు శరత్రావు, అన్నపూర్ణ, కోఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్, సీఈవో పద్మజారాణి పాల్గొన్నారు. -
స్మార్ట్సిటీ పథకంతో పర్యావరణానికి ముప్పు
లండన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్మార్ట్సిటీ’ పథకం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015లో భారత ప్రభుత్వం ‘స్మార్ట్సిటీ’పథకానికి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ లింకోల్న్కు చెందిన పరిశో ధకులు ఈ అధ్యయనం చేపట్టారు. స్మార్ట్సిటీ పథకంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతంలో ఉన్న మూడు నుంచి ఐదంతస్తుల భవనాల స్థానంలో 40 అంతస్తులకు మించి భవన నిర్మాణాలు చేపడతామని భారత ప్రభుత్వం పేర్కొందని పరిశోధకుల తెలిపారు. -
టీఆర్ఎస్తోనే సర్వతోముఖాభివృద్ధి
-టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మెల్ బోర్న్ : దేశవ్యాప్తంగా ఎంపికైన 30 ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ కు స్థానం దక్కడం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ మెల్ బోర్న్లో సమావేశమై హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ కు చోటు దక్కడానికి మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. రెండేళ్లుగా కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి చేపడుతున్న అనేక కార్యక్రమాలు, కేంద్రానికి చేసిన విజ్ఞప్తులకు నేడు ఫలితం దక్కిందన్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వినోద్ తమను కలిసినప్పడు స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తున్నప్పటి నుండి చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి తమతో చర్చించారని నాగేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ ఆండ్ అర్బన్ డెవలప్మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి కరీంనగర్ నగరాన్ని ఇందులో చేర్చడానికి ఎంపీ వినోద్ ఎంతో శ్రమించారని దీనికి అనుగుణంగానే నగర పాలక సంస్థలో సాంకేతిక విజ్ఞానాన్ని అనుసంధానం చేశారన్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న వినూత్న పథకాలతో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిబింబిస్తూ తెలంగాణలోని జిల్లాలు ఆకర్షణీయ నగరాలుగా ఎంపికవ్వడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు డా అనిల్ రావు చీటీ, విక్టోరియా ఇంచార్జి సాయి రామ్ ఉప్పు , యూత్ వింగ్ ఇంచార్జి సనీల్ రెడ్డి బాసిరెడ్డి, అధికార ప్రతినిధి రాకేష్ లక్కారసులతోపాటూ వేణునాథ్, సాయి యాదవ్, అరవింద్ ,శరన్, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ కరీంనగర్
మూడో దశలో దక్కిన ‘స్మార్ట్’హోదా - తెలంగాణలో కరీంనగర్కు దక్కిన స్థానం - హైదరాబాద్ స్థానంలో కరీంనగర్.. - స్మార్ట్ సిటీలను ప్రకటించిన కేంద్రం - రూ.1,852 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు సాక్షి, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్సిటీల జాబితాలో ఎట్టకేలకు కరీంనగర్ చోటు దక్కించుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్మార్ట్సిటీ మిషన్ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మార్ట్ సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదాను ప్రకటించారు. స్మార్ట్ సిటీ ప్రకటనతో కరీంనగర్కు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యి ంది. అంతేకాకుండా రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. హైదరాబాద్ స్థానంలో కరీంనగర్.. తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల కోసం ప్రమోట్ చేసింది. అయితే.. తెలంగాణ రెండింటిని మాత్రమే ఎంపిక చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్కు స్మార్ట్సిటీ హోదా ద్వారా వచ్చే రూ.500 కోట్లు ఏ మూలన సరిపోవని భావించి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ను స్మార్ట్ జాబితాలోకి తీసుకోవాలని స్మార్ట్ సిటీ మిషన్కు లేఖ రాశారు. అలాగే, 2017 మార్చి 31న ఎంపీ వినోద్కుమార్తో కలిసి మేయర్ రవీందర్సింగ్, కమిషనర్ శశాంక స్మార్ట్సిటీ మిషన్కు డీపీఆర్ను సమర్పించారు. సుమారు 10 నుంచి 50 లక్షల జనాభా ఉన్న నగరాలకే ‘స్మార్ట్’హోదా దక్కగా, 3.15 లక్షల జనాభా ఉన్న కరీంనగర్ను ఆ స్థానంలో నిలబెట్టేందుకు ఎంపీ వినోద్కుమార్ చేసిన లాబీయింగ్ ఫలించింది. టవర్సర్కిల్ కేంద్రంగా అభివృద్ధి స్మార్ట్సిటీ కేంద్రంగా కరీంనగర్కు చారిత్రాత్మకమైన టవర్సర్కిల్ను ఎంపిక చేశారు. టవర్సర్కిల్ చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. సుమారు 60 శాతం నగరం రిట్రోఫిటింగ్ కిందకు రానుంది. ఇందులో 29 డివిజన్లు వస్తున్నట్లు తెలిసింది. 2వ డివిజన్ నుంచి 24వ డివిజన్ వరకు, 28, 29, 31, 38, 39, 45 డివిజన్లు ఇందులో చేరగా, మిగతా డివిజన్లను పాన్సిటీ కింద అభివృద్ధి చేయనున్నారు. దీనికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. అభివృద్ధి జరిగే ముఖ్య ప్రాంతాలు.. టవర్సర్కిల్లోని ప్రధాన వ్యాపార కూడలి, ప్రధాన కూరగాయల మార్కెట్, కోల్డ్స్టోరేజీ, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణాలు, వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు, పార్కులు, బస్టాండ్, కలెక్టరేట్, మున్సిపల్ కార్పొరేషన్, అంబేడ్కర్ స్టేడియం, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, పాత బజార్ కూడలి, సర్కస్ గ్రౌండ్, సైన్స్వింగ్ కాలేజ్, రైల్వే స్టేషన్, జిల్లా జైలు, మ్యూజియం, తెలంగాణచౌక్, సీఎస్ఐ చర్చి ఉన్నాయి. వీటితో పాటు పర్యాటక సమాచార కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. స్మార్ హోదా దక్కితే వచ్చే నిధులు స్మార్ట్ సిటీ మిషన్ కింద రూ. 1,000 కోట్లు రూ. కోట్లలో రాష్ట్ర వాటా 500 కేంద్ర వాటా 500 విస్తీర్ణం : 24 చ. కిలోమీటర్లు మున్సిపాలిటీగా : 1958 గ్రేడ్–1 మున్సిపల్గా : 1985 కార్పొరేషన్గా : 2005 నివాసగృహాలు : 53,000 నగర జనాభా : 3,15,000 నగర ఓటర్లు : 2,26,000 అమృత్ హోదా : 2015 కుటుంబాలు : 79,000 నగర డివిజన్లు : 50 స్లమ్లు : 41 రూ. కోట్లలో మొత్తం ప్రతిపాదనలు 1,852 రిట్రోఫిటింగ్ 267 వినోదం, పర్యాటకం 76 ప్రజా రవాణా 337 సదుపాయాలు 540 కరెంట్ కోసం 83 ఇతర అవసరాలకు 132 రవాణాకు 226 నీటి సరఫరాకు 140 విద్యావిధానానికి 15 స్మార్ట్ గవర్నెన్స్కు 36 -
గృహ, స్మార్ట్ సిటీల నిర్మాణానికి దన్ను
హడ్కో సీఎండీ మేడిది రవికాంత్ • మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తున్నాయి • మా నికర ఎన్పీఏ కేవలం 1.51 శాతమే • ప్రభుత్వ రుణాల్లో కేవలం 0.75% ఎన్పీఏ • తెలుగు వ్యక్తి సారథ్యంలో హడ్కో కాంతులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు 2022 నాటికి అందరికీ ఇళ్లు, 100 స్మార్ట్ సిటీల నిర్మాణం.. ఈ రెండు లక్ష్యాలను సాధించేందుకు చేయూతనిస్తానంటోంది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో). ఇటీవలే స్టాక్మార్కెట్లో లిస్టయిన హడ్కో బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందంటున్నారు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మేడిది రవికాంత్. కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అయిన రవికాంత్ తెలుగు వారే కావడం విశేషం. మూడేళ్లుగా హడ్కోకు సారథ్యం వహిస్తున్న రవికాంత్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆ సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణను పంచుకున్నారు. ముఖ్యాంశాలు... ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్రు రెవెన్యూ పరిధిలోని మైజారుగుంట అనే ఓ కుగ్రామం మాది. విద్యాభ్యాసం అంతా పంచాయతీ పాఠశాలల్లోనే సాగింది. ఆ తరువాత నర్సాపూర్లో చదువుకున్నా. ఆంధ్రాయూనివర్సిటీలో ఎకనమిక్స్లో పీజీ, పీహెచ్డీ చదివా. ఆ తరువాత 1986లో ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యా. కేరళ క్యాడర్లో పనిచేశా. ఆ తరువాత ఢిల్లీలో ఎక్కువ కాలం ఉన్నాను. ఆటమిక్ ఎనర్జీ, కార్మిక శాఖ, అపెడా, విద్యుత్తు శాఖ, సామాజిక న్యాయ శాఖ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేశా. సాక్షి, న్యూఢిల్లీ హడ్కో ఇటీవలే స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. హడ్కో ఐపీవో దాదాపు 80 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ స్పందన మీపై మరింత బాధ్యతను పెంచిందనొచ్చా? ధన్యవాదాలు. హడ్కో పనితీరుకు ఇది అద్దంపడుతుంది. ఐపీఓ చాలా గొప్ప విజయం. దీని కోసం చాలా శ్రమించాం. 2016 మధ్యకాలంలో సీసీఈఏ అనుమతి లభించినప్పటి నుంచి మా కృషి ప్రారంభించాం. మదుపరుల విశ్వాసం చూరగలిగాం. మరింత బాధ్యతగా భావించి ముందు ముందు మరింత కృషితో సంస్థను ముందుకు తీసుకెళతాం. ఇంత స్పందనకు కారణమేంటి? గృహ నిర్మాణ రంగానికి, పట్టణ మౌలిక సదుపాయాల కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. గృహ నిర్మాణానికి 35 శాతం, మిగిలినది పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుత్తు సరఫరా, మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాజెక్టులకు రుణాలు ఇస్తాం. అలాగే నీటి సరఫరా ప్రాజెక్టులకు, పాఠశాలలు, వైద్య కళాశాలలు, రహదారులు, వంతెనలకు కూడా రుణాలు ఇస్తున్నాం. మిషన్ భగీరథ, సీఆర్డీఏ వంటి ప్రాజెక్టులకు ఇచ్చాం. ఇచ్చిన రుణం తిరిగి రావడం కూడా మా విజయానికి కారణంగా చెప్పొచ్చు. రూ. 11 లక్షల లాభంతో ప్రారంభమైన హడ్కో ఇప్పుడు రూ. 1000 కోట్ల లాభాలు ప్రకటించింది. ఈ స్పందనను నిలబెట్టుకోవడానికి మీ ప్రణాళికలు ఏంటి? మాకు ఆథరైజ్ క్యాపిటల్ రూ. 2,500 కోట్లు ఉంది. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ. 2,002 కోట్లు ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ కంపెనీ. వాటాలో పట్టణ పేదరిక నిర్మూలన శాఖ(హుపా) 70 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ 20 శాతం, పట్టణాభివృద్ధి శాఖ 10 శాతం చొప్పున కలిగి ఉన్నాయి. హుపాకు చెందిన 70 శాతం నుంచి 10 శాతం ఉపసంహరించుకోవడం ద్వారా రూ. 1,200 కోట్ల సమీకరణకు ఐపీఓకు వెళ్లాం. ఈ నిధులు కేంద్రానికి సమకూరుతాయి. మా కంపెనీకి తగినంత ఈక్విటీ ఉంది. ఆ నిధులు మాకు అవసరం లేదు. అయితే తాజా స్పందన చూసిన తరువాత మాపై బాధ్యత పెరిగినట్టయింది. ఈ బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. రుణ మంజూరు, బట్వాడా వేగం పెంచుతాం. ఫలానా రంగానికే రుణాలు ఇవ్వాలన్న ఆంక్షలు లేవు. పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణ రంగానికి సంబంధించి ఏ అంశానిౖ కైనా ప్రాధాన్యత ఇస్తాం. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చడంలో హడ్కో పాత్ర ఎలా ఉండబోతోంది? 2022 నాటికి అందరికీ గృహాలు సమకూర్చాలన్న మిషన్ ఊపందుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్, అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లకు సబ్సిడీ, వ్యక్తిగతంగా ఇంటి నిర్మాణం లేదా అభివృద్ధి తదితర విభాగాల్లో కేంద్రం లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తోంది. వీటిల్లో రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.3 లక్షల వరకు సబ్సిడీ అందుతుంది. సొంతింటి కలను నెరవేర్చడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. దీనికి నోడల్ ఏజెన్సీగా ఉన్న మేం ఈ సబ్సిడీ లబ్ధిదారుకు అందేలా చూస్తాం. రాష్ట్రాల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలు అందిస్తాం. 2022 నాటికి అందరికీ ఇల్లు మిషన్ విజయవంతానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి? ఏపీ, తెలంగాణలో ప్రగతి ఎలా ఉంది? ఏ విధానంలోనైనా నిబంధనలకు లోబడి పనిచేయాలి. ఆయా పథకాల్లో లబ్ధి పొందాలంటే సంబంధిత రుణం మహిళ పేరు మీదగానీ, జాయింట్గా గానీ తీసుకోవాలి. భూమి టైటిల్ క్లియర్గా ఉండాలి. కొన్ని నిబంధనలకు లోబడి నిర్మాణాలు ఉండాలి. టైటిల్ డీడ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకం అమలులో చొరవ తీసుకుంటున్నాయి. తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ దిశగా చర్యలు ఊపందుకున్నాయి. హడ్కో నేరుగా ప్రజలకు హౌసింగ్ లోన్లు ఇస్తుందా? అవును. దానికి మావద్ద హడ్కో నివాస్ అనే ఒక పథకం ఉంది. ఈ పేరు మీద రిటైల్ హౌసింగ్ లోన్లు ఇస్తాం. రీచింగ్ అన్రీచ్డ్ అన్న నినాదంతో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, మైనారిటీలు ఉన్న ఆవాసాలకు చేరడానికి ఈ రిటైల్ హౌసింగ్ ఫైనాన్స్ చేస్తున్నాం. హడ్కో నివాస్ విస్తరణకు కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలను సరళీకృతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు వడ్డీ తక్కువగా ఉండేలా చూస్తున్నాం. మా రుణాల్లో 96 శాతం తక్కువ ఆదాయం కలిగిన వారికే ప్రయోజనం చేకూరుస్తున్నాయి. పట్టణ వసతుల అభివృద్ధిలో, స్మార్ట్ సిటీస్ మిషన్లో మీ పాత్ర ఏంటి? ఒకరకంగా మాది టెక్నో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సివిల్ ఇంజనీరింగ్ తదితర అన్ని బ్రాంచీల్లో మాకు నిపుణులు ఉన్నారు. 47 ఏళ్ల అనుభవం ఉంది. మేం రుణ వితరణ పెంచుకునేందుకు స్మార్ట్ సిటీస్ మిషన్ దోహదపడుతుంది. ఈ మిషన్లో ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్స్తో మేం ఒప్పందాలు కుదుర్చుకుంటాం. తద్వారా వాటిలో మేం భాగం తీసుకుంటాం. గృహ నిర్మాణానికి, పట్టణాభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. నీటి సరఫరా, రహదారుల అభివృద్ధికి రుణాలిస్తాం. ఇప్పటికే కొచ్చిన్ ఎయిర్పోర్టు అభివృద్ధికి రుణం ఇచ్చాం. కాలికట్ ఎయిర్పోర్టుకు ఇచ్చాం. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు? హడ్కో మొదట్లో ఒకటే ఉండేది. ఇప్పుడు గృహ నిర్మాణాలకు రుణాలు ఇచ్చే సంస్థలు దాదాపు 70 ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉంది. బ్యాంకులు కూడా మాకు పోటీయే. డీమానిటైజేషన్ వల్ల వాళ్లకు డిపాజిట్లు ఉన్నాయి. వాళ్లు కూడా చౌకగా రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేం మరింత కష్టపడాలి. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల చొరవ మాకు కలిసొస్తుంది. హడ్కోకు వాటితో ఉన్న సత్సంబంధాలు కలిసొస్తాయి. భవిష్యత్తు ప్రాజెక్టులు ఏంటి? ప్రత్యేకించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా భోగాపురం తదితర విమానాశ్రయాలు రానున్నాయి. అలాగే అమరావతి ప్రాజెక్టు రానుంది. వాటికి రుణాలు అవసరం. అలాగే ఏపీలో టూరిజం ప్రాజెక్టులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మౌలికవసతుల స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో మిషన్ భగీరథకు గణనీయమైన స్థాయిలో రుణం ఇచ్చాం. హైదరాబాద్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దేశంలో మొండి బకాయిలు పేరుకుపోయిన పరిస్థితిలో బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి. హడ్కో పరిస్థితి ఏంటి? బ్యాంకులతో పోలిస్తే హడ్కో పరిస్థితి బాధాకరంగా ఏమీ లేదు. 6.8% స్థూల ఎన్పీఏ ఉండగా.. 1.51% నికర ఎన్పీఏ ఉంది. ప్రభుత్వంతో చేసిన బిజినెస్లో 0.75% ఎన్పీఏ. ఇది చాలా తక్కువనే చెప్పాలి. గత దశాబ్దంలో పవర్ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు 5–10% వాటిలో పెట్టుబడి పెట్టాం. రకరకాల కారణాల వల్ల ఆలస్యం కావడంతో అవి ఎన్పీఏలుగా పరిగణనలోకి వచ్చాయి. అది సాంకేతికమే. అంతేతప్ప అవి రావని కాదు. అప్పటివే ఇప్పుడు బాధించాయి. 2013 నుంచి మాత్రం ప్రైవేటు సంస్థలకు రుణాలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటి ఏజెన్సీలకు మాత్రమే ఇస్తూ వచ్చాం. సామాజిక బాధ్యత కింద హడ్కో చేస్తున్న పథకాలు ఏంటి? విశాఖలో నైట్ షెల్టర్లు నిర్మించేందుకు సాయం చేశాం. ఒక పూట భోజన వసతికి సాయం చేశాం. సిక్కింలో ఎయిడ్స్ బాధిత చిన్నారులకు భవనాలు నిర్మించాం. అనేక ప్రాంతాల్లో స్వచ్ఛభారత్, డిజిటల్ లిటరసీ తదితర పథకాలకు సాయం చేశాం. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు డ్రైవింగ్, టైలరింగ్, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇస్తున్నాం. -
గొంతెండుతున్నా.. పట్టించుకోరా!
– ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు – కర్నూలులో నీటి ఎద్దడిపై కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన – ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే కర్నూలులో తాగునీటి సంక్షోభం – హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని అనంతపురానికి తరలించడంపై మండిపాటు – తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలును స్మార్ట్ సిటీగా మార్చుతామని ప్రగల్బాలు పలికిన టీడీపీ నాయకులు...వేసవిలో మాత్రం ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మండిపడ్డారు. కర్నూలు నగరంలోని 51 డివిజన్లతోపాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చలనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నీటి ఎద్దడిపై సోమవారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ప పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలతు కలెక్టరేట్ను ముట్టడించారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో గౌరు, బీవై రామయ్య మాట్లాడుతూ..కర్నూలులో చాలా వార్డుల్లో రాత్రి పూట వచ్చే నీళ్ల కోసం మహిళలు జాగారం చేయాల్సి వస్తోందన్నారు. కనీసం పది బిందెలు కూడా నిండకుండానే నీటి సరఫరా బంద్ అవుతుండడంతో వారి బాధలు వర్ణనాతీతమన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఒట్టి పోయిందన్నారు. హంద్రీనీవా నీటిని జీడీపీ ద్వారా కర్నూలుకు తీసుకువస్తే జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడిని నివారించవచ్చన్నారు. అయితే అధికారులకు ఇక్కడ ముందుచూపు లేకపోవడంతో హెచ్ఎన్ఎస్ఎస్కు కేటాయించిన 37 టీఎంసీల నీటిలో అనంతపురం జిల్లాకు 30 టీఎంసీలను తరలించుకుపోతున్నారన్నారు. దీంతో ఏడు టీఎంసీల నీటిలో జీడీపీకి కేవలం 0.7 టీఎంసీల నీటినే కేటాయించారన్నారు. జీడీపీ కనీస నీటి మట్టం 4.5 టీఎంసీలు కాగా కనీసం 2.5 టీఎంసీల నీటితో నింపి ఉంటే కర్నూలుకు నీటి ముప్పు తప్పేదన్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నా తాగునీటి ఎద్డడి నివారణ కోసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. సమస్య పరిష్కరించడం చేతకాకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జీ మురళీకృష్ణ, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది రోజులకొకసారి నీళ్లు వదులుతున్నారు: గౌరు చరితారెడ్డి కర్నూలు కార్పొరేషన్ పరిధిలో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 14 డివిజన్లలో పది రోజలకొకసారి నీళ్లు వదులుతున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. ట్యాంకర్లు పంపాలని అడిగినా మునిసిపల్ అధికారులు కనీసం స్పందించడం లేదన్నారు. ఇక్కడి ప్రజలు ఇంటి పన్నులు కట్టడం లేదా? నీటి పన్ను కట్టడంలేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. కర్నూలుతో పోల్చుకుంటే పాణ్యం వార్డుల్లో ఎక్కువ నీటి ఎద్దడి ఉందన్నారు. అంతేకాక వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దోమలపై దండయాత్ర పేరుతో కోట్లాది రూపాయలను వృథా చేశారని ఆరోపించారు. బుదర నీటిని సరఫరా చేస్తున్నారు: హఫీజ్ఖాన్ ఎస్ఎస్ ట్యాంకు ఒట్టిపోవడంతో నగర ప్రజలకు బుదర నీటిని సరఫరా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్ఖాన్ మండిపడ్డారు. కనీసం నీటిని క్లోరినేషన్ చేయకుండా వదులుతుండడంతో వాటినే తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఏ ఆసుపత్రిలో చూసిన పచ్చ, తెల్ల కామెర్లతో బాధపడుతున్నా చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉన్నారన్నారు. కర్నూలు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు.. మినరల్ వాటర్ పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో నాలుగైదు రోజులకు ఒకసారి కూడా సక్రమంగా నీళ్లు వచ్చే దాఖలాలు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఎస్ఎస్ ట్యాంక్ అవసరం కర్నూలులో నీటి ఎద్దడి నివారణ కోసం మునగాలపాడు సమీపంలో మరో ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణానికి కావాల్సిన 200 ఎకరాల భూమి ఉన్నా పాలకులు ఆ ఊసే మరచారని నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ విమర్శించారు. ఈ విషయం మునిసిపల్ ఇంజినీర్లకు తెలిసినా దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, నాగరాజుయాదవ్, సురేందర్రెడ్డి, సీహెచ్ మద్దయ్య, అబ్దుల్ రెహ్మన్, రాజా విష్ణువర్దన్రెడ్డి, ఫిరోజ్ఖాన్, సలోమి, ఉమాభాయ్, కటారిసురేష్, రవిబాబు, సాంబా, జాన్, మాలిక్, కిశోర్, మంగప్ప, విజయలక్ష్మి, చెన్నమ్మ, వెంకటేశ్వరమ్మ, ఖాదామియా, రిజ్వాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణుడు కరుణించలేదు
► సిక్కోలుపై శీతకన్ను! ► నదుల అనుసంధానం, ఆఫ్షోర్ ప్రాజెక్టుల ఊసే లేదు ► చంద్రబాబు హామీలకూ బడ్జెట్లో దక్కని నిధులు ► పారిశ్రామిక అభివృద్ధికి కేటాయింపుల కొరత ► వంశధార ప్రాజెక్టుకు అరకొర నిధులే ► రిమ్స్కు మొండిచేయి... ► ఈసారైనాగూడు దక్కేనా? ► ఎన్నికల హామీలు నెరవేరేనా? ►4వ బడ్జెట్లోనూ జిల్లాకు చోటు కరువు వెనుకబడిన జిల్లాగా గుర్తించామని ప్రభుత్వం చెబుతుంటే నిధుల కేటాయింపులో పెద్దపీట వేస్తారని జిల్లాప్రజలు ఆశించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమని రాష్ట్ర బడ్జెట్ మరోసారి రుజువు చేసింది. గత మూడు బడ్జెట్ల్లోనూ జిల్లాకు మొండిచేయి ఎదురైనా కనీసం నాలుగో బడ్జెట్లోనైనా జిల్లాకు మేలు జరుగుతుందనుకుంటే... ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశలే మిగిల్చింది. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలో అత్యంత ప్రధానమైన వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, వంశధార–నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని జనచైతన్య సదస్సు (10.12.2015)లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వంశధార నిర్వాసితులకు రూ.5 లక్షల చొప్పున యూత్ ప్యాకేజీ ఇవ్వడానికి ఇటీవల ప్రభుత్వం రూ.421.80 కోట్లు కేటాయించింది. హిరమండలం రిజర్వాయర్ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని సీఎం, మంత్రి అచ్చెన్న ఇస్తున్న వాగ్దానాలు కార్యారూపం దాల్చాలంటే నిర్వాసితుల సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు పూర్తిస్థాయిలో కేటాయింపులు జరగాలి. కానీ వంశధార స్టేజీ–1కు 2014–15 బడ్జెట్లో రూ.3 కోట్లు, 2015–16లో రూ.18 కోట్లు, 2016–17లో రూ.9.57 కోట్లు కేటాయించారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా పెంచుతారనుకుంటే మళ్లీ రూ.9.57 కోట్లతోనే సరిపెట్టారు. ప్రాజెక్టు స్టేజీ–2కి 2014–15 బడ్జెట్లో రూ.32.93 కోట్లు, 2014–15లో రూ.32.81 కోట్లు, 2016–17లో రూ.56.77 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో మాత్రం రూ.54.82 కోట్లు మాత్రమే విదిల్చారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతుల డిమాండ్లను పరిష్కరించాలంటే ఈ నిధులు ఏమూలకూ సరిపోవు. అలాగే టెక్కలి డివిజన్లోని ఆఫ్షోర్ ప్రాజెక్టుకు కానీ, నాగావళి–వంశధాన నదుల అనుసంధానం గురించి కానీ ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు. ట్రిఫుల్ ఐటీ అంతేసంగతులా...: శ్రీకాకుళం ట్రిఫుల్ఐటీ వచ్చే విద్యాసంవత్సరానికి కూడా జిల్లాకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురంలో తొలుత 340 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం తర్వాత ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఈ బడ్జెట్లోనైనా స్పష్టత వస్తుందేమో ఆశించినా నిధుల కేటాయింపే జరగలేదు. కవిటి మండలంలో ఉద్యాన కళాశాల, ఎచ్చెర్లలో వరి పరిశోధన కేంద్రం, మెరైన్ యూనివర్సిటీ, పొందూరు డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం గతంలో సీఎం హామీలిచ్చినా ఈ బడ్జెట్లోనూ వాటి ప్రస్తావన లేదు. మరోవైపు సంక్షేమ శాఖ హాస్టళ్లను ఎత్తివేసి గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదు. ‘స్మార్ట్’ ఎప్పటికో...: శ్రీకాకుళం సహా రాష్ట్రంలో మరో పది నగరాలకు కలిపి స్మార్ట్సిటీ ప్రాజెక్టు కింద కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించారు. వాటిని పంచితే శ్రీకాకుళానికి దక్కేది నాలుగైదు కోట్లకు మించవు. ఇక శ్రీకాకుళం నగరంలో వరద ముంపు సమస్య ఏర్పడకుండా రూ.119 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, నగరం చుట్టూ 19.20 కి.మీ. పొడవున రూ.150 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామని రెండేళ్ల క్రితమే సీఎం హామీ ఇచ్చినా ఈ బడ్జెట్లోనూ వాటి ఊసు లేదు. పారిశ్రామిక ప్రగతి అథోగతే...: జిల్లాలోని కళింగపట్నం, భావనపాడు రేవుల్లో ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తామని రైతు సదస్సు (14.02.2015)లో సీఎం ప్రకటించారు. భావనపాడు పోర్టును ఆదానీ గ్రూపుకు అప్పగించామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. పారిశ్రామిక రంగానికి రూ.2086 కోట్లు కేటాయించినప్పటికీ ఈ నిధుల్లో జిల్లా వాటా ఎంతో స్పష్టం చేయలేదు. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణ అని పేర్కొన్నప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదు. జిల్లాలో ఫుడ్పార్కు ఏర్పాటుచేస్తామని ప్రకటించినా అది ఎప్పటి నుంచో నలుగుతోంది. చెన్నై–విశాఖ పారిశ్రామిక కారిడార్ను శ్రీకాకుళం వరకూ పొడిగింపు ప్రస్తావనే లేదు. ఈసారైనా గూడు దక్కేనా?: నియోజకవర్గానికి 1200 చొప్పున పక్కాఇళ్లు నిర్మిస్తామన్న సీఎం హామీ నెరవేర్చేందుకు 2016–17 బడ్జెట్లో కేటాయింపులు జరిగినా జిల్లాకు మాత్రం నిధులు రాలేదు. ఈ బడ్జెట్లో రూ.1456 కోట్లు కేటాయించినా అందులో రెవెన్యూ వ్యయం పోతే మిగిలేది రూ.200 కోట్లు మాత్రమే. దీన్ని అన్ని జిల్లాలకు పంచితే వచ్చే నిధులు కేవలం పునాదుల నిర్మాణానికే సరిపోతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేరేనా?: రైతురుణ మాఫీకి ఈ బడ్జెట్లో రూ.11వేల కోట్లు కేటాయించినా ఇప్పటికే రైతులకు అందజేసిన రుణవిముక్తి పత్రాల మేరకు మాఫీ చేయడానికే ఆ నిధులు సరిపోవు. తదుపరి వాయిదాల రుణమాఫీకి రూ.3,600 కోట్లు కేటాయించారు. కానీ ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగం మంది రైతులకు కూడా సరిపోని పరిస్థితి. డ్వాక్రా రుణాల మాఫీ విషయానికొస్తే ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. జిల్లాలో మూడు లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఆ సంఖ్య కోటి వరకూ ఉండవచ్చు. మూడేళ్ల తర్వాత కొత్తగా ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ అవి ఏ మూలకు సరిపోతాయని నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. రిమ్స్కు మొండిచేయి...: జిల్లాకు ఆరోగ్య ప్రదాయిని రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో అసంపూర్తిగానున్న బ్లాక్ల నిర్మాణానికి రూ.20 కోట్లు, పీజీ కోర్సుల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయిస్తామని సీఎం రైతుసదస్సు (14.02.2015)లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ వాటికి నిధుల కేటాయింపు జరగలేదు. ఇక ఎన్టీఆర్ వైద్యసేవకు ఈ బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బకాయిల చెల్లింపునకే సరిపోవనే వాదనలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా గాలిలో కలిసిపోయినట్లే. వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్న ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ బడ్జెట్లో ఎలాంటి భరోసా దక్కలేదు. ప్రజలపై బాదుడు బడ్జెట్: బడ్జెట్ ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బాదుడు వేసేలా ఉంది. లోటు బడ్జెట్ విడుదల చేసినప్పటికీ లోటును పూడ్చే మార్గాలు ఎక్కడా ప్రస్తావించలేదు. స్వాతంత్య్ర భారత దేశం వచ్చిన తరువాత ఇంత లోటు బడ్జెట్ ఎన్నడూ చూడలేదు. నిరుద్యోగలుకు మరోసారి వెన్ను పోటు పొడిచారు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకుండా నిరుద్యోగులకు ఆర్ధిక సహాయం అనిప్రస్తావించారు. ఎన్నికల హామీలో ఏడాదికి లక్ష ఇళ్లు చొప్పున దు లక్షల గృహాలు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణశాఖకు విడుదల చేసిన బడ్జెట్ పాత ఇళ్ల బిల్లులు చెల్లించేందుకు చాలవు. ఆరోగ్యశ్రీని మంట కలిపేందుకు మరో మారు శ్రీకారం చుట్టారు. వైద్య రంగాన్ని విస్మరించారు. పాత హామీలు విడిచారు. కొత్త పథకాలు ఊసేలేదు. – తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు -
స్మార్ట్ సిటీలకు రూ.198 కోట్లు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 6 స్మార్ట్ సిటీలకు నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రభుత్వం రూ.198 కోట్లు విడుదల చేసింది. ఒక్కో నగరానికి రూ. 33 కోట్ల చొప్పున విడుదల చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం లను ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. వీటికి గాను ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. -
‘స్మార్ట్’ సూచనలకు ఆహ్వానం
– కర్నూలు అభివృద్ధికి ప్రతి ఏటా రూ.33 కోట్లు విడుదల – ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కో–ఆర్డినేటర్ స్మిత కర్నూలు(టౌన్): కర్నూలు స్మార్ట్ సిటీగా ఎంపికైనందున..నగర అభివృద్ధికి పౌరులు, బిల్డర్లు తగిన సూచనలు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ కోఆర్డినేటర్ స్మిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ సమావేశ భవనంలో బిల్డర్లు, వివిధ సంస్థల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలన్నారు. ప్రతి ఏడాది కర్నూలు నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.33 కోట్లు నిధులు విడుదలవుతాయన్నారు. ఈ నిధులను వెచ్చించి ప్రాధాన్య క్రమంలో మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, తాగునీరు, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించేందుకు వీలు ఉంటుందన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ శివరామిరెడ్డి, బిల్డర్లు ఎంఎస్–9 మధుసూదన్రెడ్డి, సోమిశెట్టి వెంకటరామయ్య, గోరంట్ల రమణయ్య, కృష్ణకాంత్ బిల్డర్స్ వెంకటసుబ్బయ్య, సూపరింటెండెంట్లు ఇశ్రాయేల్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సొమ్మే పెట్టుబడిగా
నిధుల సమీకరణకు కొత్త ప్రతిపాదన ప్రభుత్వ హామీతో బాండ్లు జారీ స్మార్ట్ కాకినాడకు ట్రిఫుల్–బి గ్రేడ్ విధి విధానాలపై అధికారుల అధ్యయనం కాకినాడ : ప్రజల సొమ్మే పెట్టుబడిగా నిధుల సమీకరణకు ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఇందుకోసం స్మార్ట్సిటీ కాకినాడలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి బాండ్లు ఇచ్చే దిశగా కార్పొరేష¯ŒS కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి గతవారం ఢిల్లీలో జరిగిన స్మార్ట్సిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చారు. దీంతో డిపాజిట్ల సేకరణ, బాండ్లు జారీ విధివిధానాలపై కార్పొరేష¯ŒS యంత్రాంగం దృష్టి సారించింది. స్మార్ట్సిటీగా ఎంపికైన కాకినాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా రూ.300–400 కోట్లు వరకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు వేగవంతం చేశారు. మరో వైపు స్మార్ట్సిటీ పరిధిలో లేదా, జిల్లా కేంద్రంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే వాటికి అవసరమయ్యే రూ.కోట్ల నిధులను ప్రజల నుంచి సేకరించే దిశగా ఆలోచన చేశారు. అయితే ప్రజల నుంచి ఈ తరహాలో సొమ్ములురాబట్టి బాండ్లు జారీ చేయాలంటే కొన్ని అర్హతలు అవసరం కావడంతో ప్రస్తుతం ఆ దిశగా దృష్టి సారించారు. కాకినాడకు అర్హత... బాండ్లు జారీ ద్వారా నిధులు సేకరించే విధానానికి కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాథమికంగా అర్హత సాధించింది. దేశ వ్యాప్తంగా ఈ విధానంలో ఎనిమిది నగరాలకు అవకాశం ఉందని కేంద్ర స్థాయిలో నిర్ధారణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ, విశాఖ నగరాల్లో ఈ విధానం ద్వారా నిధులు సమీకరించనున్నారు. రేటింగ్లో ట్రిఫుల్–బి... స్మార్ట్సిటీ కార్పొరేష¯ŒS తరుపున ప్రజల నుంచి నిధులు సేకరించాలంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ద్వారా గ్రేడింగ్ను నిర్ణయిస్తారు. కాకినాడకు వచ్చే ఆదాయం, ఖర్చు, ఆడిటింగ్ ద్వారా ఈ రేటింగ్ను నిర్ధారిస్తారు. అర్హత కలిగిన ఎంపేనల్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కార్పొరేష¯ŒS అధికారుల సమాచారం మేరకు విశాఖకు ట్రిఫుల్–ఎ, కాకినాడకు ట్రిఫుల్–బి రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ మరింత పెంచడం ద్వారా నూరుశాతం అర్హత సాధించే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు నుంచి వచ్చే నిధులకు పూర్తి సెక్యూరిటీ ఉండే విధంగా ప్రభుత్వం మధ్యలో హమీగా ఉండి ఈ బాండ్లను జారీ చేస్తారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో వచ్చిన నిధులను వినియోగంలోకి తెస్తారు. విధి విధానాలపై కసరత్తు... బాండ్లు జారీకి విధానాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే డిపాజిట్లకు బాండ్లు జారీ చేసి ఆ సొమ్ముకు ప్రాజెక్టులో వచ్చే వాటా? లేదా వడ్డీ రూపంలో ఇవ్వాలా? తదితర అంశాలపై కూడా కేంద్రం నుంచి వచ్చే సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. కసరత్తు చేస్తున్నాం... స్మార్ట్సిటీ సమావేశంలో బాండ్లు జారీ ద్వారా నిధులు సమీకరణ అంశంపై సూచనలిచ్చారు. అయితే క్రెడిట్రేటింగ్ ఏజెన్సీ ద్వారా కాకినాడకు ట్రిఫుల్–బి వచ్చి కొంత మేరకు అర్హత సాధించగలిగాం. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేశాక విధివిధానాలు ప్రకటిస్తాం. – ఎస్.అలీమ్భాషా, కాకినాడ కార్పొరేష¯ŒS కమిషనర్ -
’స్మార్ట్ ఏలూరు’కు ఓకే
స్విస్ చాలెంజ్ తరహాలోనే పనులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, ఏలూరు : స్విస్ చాలెంజ్ తరహాలోనే ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికరవలన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ’ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ కార్పొరేషన్ పేరుతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్ఫూర్తితో రాష్ట్ర్ర ప్రభుత్వం దీనిని చేపట్టిందన్నారు. ఏలూరు నగరపాలక సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయడంతోపాటు నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా పేర్కొన్నారు. 2029కి మన రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా చేయడంలో భాగంగా ఈ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఆ ఉత్తర్వుల్లో వివరించారు. నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాజెక్టులను రూపొందించి అమలు చేయడం, సమగ్ర అభివృద్ధి దిశగా నడపడం లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆదాయమంతా స్మార్ట్కే.. ఈ ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. స్మార్ట్ సిటీ పేరిట ప్రైవేటుపబ్లిక్ పార్టనర్ షిప్ పద్ధతిలో నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. నగరపాలక సంస్థకు వచ్చే అద్దెలు, పన్నులు, లైసెన్స్ ఫీజులు, యూజర్ చార్జీలు, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా వచ్చే గ్రాంట్లు, రుణాలను పూర్తిగా ఇందుకే వినియోగిస్తారు. ఇంకా అవసరమైతే అప్పులు తెస్తారు. బయటి నుంచి తెచ్చిన రుణాలను 1015 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అమృత్, స్వచ్ఛభారత్ మిషన్, సోలార్ సిటీ మిషన్, డిజిటల్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఐపీడీఎస్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, స్కిల్ ఇండియా తదితర ప్రాజెక్టుల ద్వారా వచ్చే నిధులను సైతం దీనికి మళ్లిస్తారు. దీని కోసం స్విస్ చాలెంజ్ తరహా విధానాన్ని అవలంబించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ఏలూరు అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేసిన షాపూర్జీ పల్లంజీ కంపెనీ లిమిటెడ్ పరిస్థితిని పరిశీలించి ఆమోదించాలని కోరింది. ఇప్పటికే ఎస్పీవీ ఒప్పందం కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్గా, నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా ఎస్పీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తులు డైరెక్టర్లుగా ఉంటారు. -
నగరాల రూపురేఖలు మార్చేస్తున్నాం
జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్ సదస్సులో వెంకయ్యనాయుడు భవిష్యత్తుకు స్పేషియల్ టెక్నాలజీలే దన్ను నిర్మాణ అనుమతుల జారీ సరళతరం జియో ట్యాగింగ్తో వృథాకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వం లో దేశంలోని నగర ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నా యని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మొద లుకొని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అమృత్ వంటి అనేక పథకాలు నగర ప్రాంతా ల రూపురేఖలను మార్చేస్తున్నా యన్నారు. సోమవారం హైదరాబాద్లో జియోస్పేషియ ల్ వరల్డ్ ఫోరమ్ అంతర్జా తీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రతి నగరం స్మార్ట్ సిటీగా మారేందుకు పోటీపడుతోం దని.. పట్టణ, నగర ప్రాంతాల్లో తిష్టవేసిన అనేక సమస్యలకు జియోస్పేషియల్ టెక్నాల జీలు వేగంగా పరిష్కారం చూపగలవని ఆయన చెప్పారు. ఈ రంగంలో దేశానికి రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు జియోట్యాగింగ్.. మున్సిపాలిటీలు తమ ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు గమనించేందుకు జియో ట్యాగింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని, తద్వారా సిబ్బంది పనిచేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా కేంద్రం స్పాట్ యువర్ టాయిలెట్ పేరుతో ఓ యాప్ను అందుబాటు లోకి తేనుందని, దాని ద్వారా నగర ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఎక్కడెక్కడ అందు బాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపా రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు జియోట్యాగింగ్ చేస్తున్నామని, తద్వారా ఇంటి నిర్మాణం నిజంగా జరిగిందీ లేనిదీ స్పష్టమవుతుందని చెప్పారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా కొత్త ఇళ్ల ఫొటోలను భువన్ సర్వర్తో అనుసం ధానించామని, తద్వారా ఎక్కడ ఏ ఇల్లు ఉందో స్పష్టంగా తెలిసిపోతుందని పేర్కొన్నా రు. నగరాల్లో భవన నిర్మాణాలు, ఇతర పనులకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు పౌర విమానయాన, రైల్వే, పర్యావరణ తదితర ఏడు శాఖలతో సంప్రదింపులు జరిపి ఏకీకృత విధానాన్ని తీసుకువస్తున్నామని వెంకయ్య వెల్లడించారు. నగరాల మ్యాపుల్లోనే నిర్మాణానికి అనుమ తుల అవసరం లేని ప్రాంతాలను స్పష్టంగా గుర్తిస్తామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నిర్ణీత సమయం తరువాత అనుమతి పొందినట్టుగానే భావించి నిర్మాణాలు చేపట్టవచ్చునని వివరించారు. రైతులకు తోడ్పాటు అవసరం.. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలకు తమ భూములున్న సర్వే నంబర్లు కూడా తెలియవని, ఈ పరిస్థితి మారాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నామమాత్ర రుసు ము, ఆన్లైన్ దరఖాస్తుల తోనే భూమి రికార్డు లు రైతులకు అందు బాటులో ఉండేలా చేసేలా, వాటి ఆధారంగా బ్యాంకులు రుణా లు మంజూరు చేసేలా ప్రధాని మోదీ ప్రయ త్నం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ స్వర్ణ సుబ్బా రావు, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం అధ్యక్షుడు స్టీఫెన్ ష్వెనిఫెస్ట్ పాల్గొన్నారు. -
కర్నూలు స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు
– చైర్మన్గా జిల్లా కలెక్టర్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ కర్నూలు (టౌన్): స్మార్ట్సిటీ పేరుతో కర్నూలు నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కర్నూలు స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. విధి విధానాలు రూపొందించి కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నగర పరిధిలో ప్రజల జీవన పరిస్థితుల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు వచ్చే మూడేళ్ల వ్యవధిలో రూ. 33 కోట్లు మంజూరు చేయనుంది. చైర్మన్గా కలెక్టర్ వ్యవహరించే ఈ కార్పొరేషన్ లిమిటెడ్కు డైరెక్టర్లుగా నగరపాలక కమిషనర్, జిల్లా ఎస్పీ ఉంటారు. షేర్హోల్డర్లుగా ప్రిన్సిపల్ ప్రత్యేక కార్యదర్శి, మున్సిపల్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ సీఈ టౌన్ప్లానింగ్ డైరెక్టర్, అడిషనల్ కమిషనర్, ఎగ్జామినర్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎస్ఈలు వ్యవహరిస్తారు. రూ. 5 లక్షలు విలువ చేసే షేర్లను రూ. 10 ప్రకారం 50 వేల షేర్లను రూపొందించారు. -
సామాజిక శక్తులు ఏకం కావాలి: సీపీఎం
మానకొండూర్: సీఎం కేసీఆర్ నియం తృత్వ, అప్రజాస్వామిక పాలనను ప్రజల్లో ఎండగట్టడానికి సామాజిక శక్తులన్నీ ఏకం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజక వర్గంలో కొనసాగింది. అల్గునూరు, మానకొండూర్, అన్నారం, దేవంపల్లి, కొండపల్కలల్లో ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి కేసీఆర్ చట్టవిరుద్ధంగా పాలన కొనసా గిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరెపల్లి మోహన్ పాల్గొని మద్దతు తెలిపారు. కనీస సదుపాయాలు కల్పించాలి సాక్షి, హైదరాబాద్: కరీంనగర్కు స్మార్ట్ సిటీ అర్హతకు కావాల్సిన అర్హతల విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కరీంనగర్కు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
జనవరి 27,28న స్మార్ట్ సిటీస్పై జాతీయ సదస్సు
స్మార్ట్ సిటీల ఆవశ్యకత, వాటి నిర్మాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, అభివృద్ధి చెందిన దేశాల్లో స్మార్ట్సిటీల పాత్ర, తదితర అంశాలపై చర్చిచేందుకు ’స్మార్ట్ సిటీస్ ఫర్ స్మార్ట్ పీపుల్’ అనే పేరుతో సంస్కృతీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కళాశాలలో జనవరి 27, 28న జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు చైర్మన్ విజయభాస్కర్రెడ్డి తెలిపారు. సోమవారం కళాశాలలో డైరెక్టర్ డాక్టర్ నారాయణరెడ్డి తో కలసి సదస్సు బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సదస్సుకు జపాన్ కు చెందిన ప్రఖ్యాత నిర్మాణ రంగ నిపుణుడు అజీబ్రౌన్, వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన క్లోయి జిమ్మర్మన్, ఆస్ట్రియాకు చెందిన శ్రీపాల్ అతిథులుగా, దేశీయంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థల నుంచి వంద మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారన్నారు. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు కూడా సదస్సుకు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సెంథిల్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి జాడేది?
ప్రచార ఆర్భాటంగానే స్మార్ట్ సిటీ ప్రజలపై దండయాత్ర చేస్తున్న దోమలు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అవసరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కమిషనర్కు పార్టీ నేతల వినతి పత్రం కాకినాడ : స్మార్ట్ సిటీగా ఎంపికయిందన్న ప్రచారమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడంలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఆకర్షణీయ నగరంగా ఎంపికయ్యాక ఏడాది ఉత్సవాలు కూడా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు తీరు కేవలం ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోందన్నారు. భూగర్భ డ్రెయినేజీ, స్మార్ట్ సిటీ, నగరంలోని ప్రధాన సమస్యలపై వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం కమిషనర్ అలీమ్బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలంతా సమావేశమై సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న డ్రెయినేజీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్సిటీని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు. నగరంలో అభివృద్ధి కుంటుపడింది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో హంగామా చేస్తున్నప్పటికీ వాస్తవానికి దోమలే ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయన్నారు. ఎక్కడా ఫ్యాగింగ్ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదన్నారు. సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని ప్రాతిపదికగా తీసుకుని అభివృద్ధి చేయడంలేదని విమర్శించారు. కేవలం మెయిన్రోడ్డు, సినిమారోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లోనే పనులు చేపట్టడం ద్వారా మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రెయినేజీ రోడ్డుకన్నా ఎత్తులో చేపట్టారని, దీనివల్ల ముంపు సమస్య యథావిధిగానే కొనసాగుతుందన్నారు. సరైన ప్రణాళికతో డ్రెయినేజీ పనులు చేపట్టాలని సూచించారు. వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ర్యాలి రాంబాబు, మాజీ కౌన్సిలర్ బొట్టా కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చాట్ల చైతన్య, బెజవాడ బాబి, చిలుకూరి మనోజ్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రసాదరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్వరాజ్య మైదానం ప్రైవేట్కు
►పీపీపీ విధానంలో సిటీ స్క్వేర్ ప్రాజెక్టుకు అనుమతి ►స్మార్ట్ సిటీలుగా ఆరు నగరాలు ►జక్కంపూడిలో ఎకనామిక్ సిటీ ►విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ►రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో సిటీ స్క్వేర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందులో ఉన్న రైతు బజార్, ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లను తొలగించి మిగిలిన గ్రౌండ్తో కలిపి పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో మల్టీ పర్పస్ రిక్రియేషన్ అండ్ కమర్షియల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీతో ఈ సిటీ స్క్వేర్ డిజైన్ తయారు చేయించిన ప్రభుత్వం దాన్ని ఆమోదించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ (సవివర నివేదిక)ను ఆమోదించే బాధ్యతను పట్టణీకరణపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీపీపీ విధానంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతోపాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి, నారాయణ మీడియాకు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి... ♦ విజయవాడ స్వరాజ్య మైదానం, దానికి ఆనుకుని ఉన్న 27.5 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో విజయవాడ సిటీ స్క్వేర్ ఏర్పాటుకు అనుమతి. అందులో షాపింగ్ కాంప్లెక్స్, థీమ్ పార్క్, ఎగ్జిబిషన్ కాంప్లెక్స్, మినీ ఇండోర్ స్టేడియం, పబ్లిక్ ప్లేస్ తదితరాలు ఏర్పాటు. ♦ విశాఖపట్నంలో 11 ఎకరాల్లో పీపీపీ విధానంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం. ♦ విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో మౌలిక వసతుల ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు గుంటూరు–విజయవాడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) ఏర్పాటుకు ఆమోదం. ♦ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు స్మార్ట్ సిటీలు కాకుండా కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం. ♦ విజయవాడలోని జక్కంపూడిలో 256 ఎకరాల్లో పీపీపీ విధానంలో ఎకానమిక్ టౌన్షిప్ ఏర్పాటుకు అనుమతి. ♦ మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సర్వీసు నిబంధలను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం. ♦ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 35 శాతం వేతనాల పెంపునకు ఆమోదం. ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా మరో పది శాతం ప్రోత్సాహకం అదనంగా చెల్లింపు. భారీగా భూకేటాయింపులు ♦ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం సర్వే నెంబర్ 1604లోని 9.74 ఎకరాలను ఎకరం రూ.8 లక్షల చొప్పున ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయింపు. ♦ అగ్రిగోల్డ్కు సంబంధించి విజయవాడలో రూ.90 కోట్ల విలువైన 13 ఆస్తులు, కృష్ణాజిల్లా కీసరలో రూ.200 కోట్ల విలువైన 341 ఎకరాల వేలానికి 26వ తేదీ వరకూ బిడ్ల స్వీకరణ. 27వ తేదీన బిడ్లు తెరవాలని నిర్ణయం. బ్యాంకులపై నెట్టేయండి... పెద్ద నోట్ల రద్దు అంశం మంత్రివర్గ , తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పటివరకూ పెద్ద నోట్ల రద్దుకు కర్త, కర్మ, క్రియ తానేనని చెప్తూ వచ్చిన సీఎం చంద్రబాబు ఇక నుంచి ఆ అంశంపై సాధ్యమైనంత తక్కువగా మాట్లాడటంతో పాటు ప్రస్తావించకూడదని నిర్ణయించారు. గురువారం బాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బాబు నోట్ల రద్దు పరిణామాల తప్పిదాన్ని బ్యాంకులపై నెట్టేయాలని సూచించారు. ♦ కేబినెట్ భేటీకి సెల్ఫోన్లు తీసుకురావొద్దు సీఎంవో కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే మంత్రులు తమ సెల్ఫోన్లను బయటే డిపాజిట్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్మార్ట్ సిటీ ‘పీఎంసీ’ టెండర్ల రద్దు
కొత్త టెండర్లు పిలిచిన కార్పొరేషన్ కాకినాడ : వివాదానికి దారితీసిన కాకినాడ స్మార్ట్ సిటీ పనుల పర్యవేక్షణకు సంబంధించి గతంలో పిలిచిన ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ) టెండర్లను రద్దు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల క్రితం జరిగిన స్మార్ట్ సిటీ ఎవాల్యుయేష¯ŒS కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఆర్వీ అసోసియేట్స్కు టెండర్ ఖరారు కాగా, రెండో స్థానంలో నిలిచిన వాడియా సంస్థ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు పీఎంసీ నియామకంపై స్టే ఇచ్చింది.అనంతరం వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా కోర్టు ఆదేశించడంతో ఎవాల్యుయేష¯ŒS కమిటీ మూడు రోజుల క్రితం సమావేశమై ఇరువర్గాల వాదనలు, ఆయా సంస్థలు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించింది. అనంతరం స్మార్ట్ సిటీ ఎండీ, కమిషనర్ అలీమ్బాషా, కలెక్టర్ అరుణ్కుమార్, ఇతర కమిటీ సభ్యులు ఈ అంశంపై చర్చించి చివరకు టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త టెండర్లను కూడా పిలిచారు. ఇందుకు సంబంధించి బుధవారం ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించి టెండర్ ప్రకటన కూడా ప్రచురితమైంది. దీంతో దాదాపు 4, 5 నెలలుగా స్తంభించిన పనులకు మళ్ళీ కదలిక వచ్చినట్లయింది. -
చతుర్ముఖుడు!
బాబూరావునాయుడుకు తాత్కాలికంగా మూడు కీలక బాధ్యతలు వుడా వీసీతో పాటు కలెక్టర్, జేసీ, జీవీఎంసీ కమిషనర్గా ఇన్చార్జి కిరీటాలు పది రోజులపాటు అన్నీ ఆయనే విశాఖపట్నం : ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఒక బాధ్యత నిర్వహించడమే కత్తి మీద సాములా ఉంటుంది.. అలాంటిది ఏకంగా నాలుగు బాధ్యతలు.. అవి కూడా అత్యంత కీలకమైనవే అయితే ఇంకెలా ఉంటుందో ఊహించండి.. ఇప్పుడు అదే పరిస్థితి జిల్లాలో ఓ ఉన్నతాధికారికి ఎదురైంది.. ఆ ఒక్కడు.. వుడా వైస్ చైర్మన్ బాబూరావునాయుడు. జిల్లా పాలనాపగ్గాలతోపాటు మరో మూడు కీలక బాధ్యతలను నెత్తికెత్తుకున్న ఆయన సుమారు పది రోజులపాటు ఆయన చతుర్ముఖ పాలన సాగించనున్నారు. అయ్యవార్లెవరూ లేకపోవడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలన్నింటినీ ఆయనకు కట్టబెట్టింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్లు స్మార్ట్సిటీ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. మరోపక్క జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక్కటై రాజకీయ పైరవీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ను బదిలీ పేరుతో సాగనంపారు. దీంతో కీలకమైన మూడు పోస్టులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. మూడో తేదీ వరకు స్మార్ట్ సిటీ సదస్సులో పాల్గొననున్న కలెక్టర్, కమిషనర్లు.. అనంతరం ఈ నెల 10వ తేదీ వరకు సెలవు పెట్టారు. దీంతో సీనియర్ ఐఏఎస్గా ఉన్న వుడా ఉపాధ్యక్షుడు బాబూరావు నాయుడుకు ఈ బాధ్యతలన్నీ చుట్టుకున్నాయి. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్తోపాటు జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఇన్ చార్జి కలెక్టర్, కమిషనర్గా వ్యవహరించనున్న బాబూరావునాయుడు.. ఆ తర్వాత కొత్త జేసీ వచ్చే వరకు ఇన్చార్జి జేసీ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ జీవోఆర్టీ నెం.2231ను జారీ చేశారు. దీంతో వుడా వీసీతో పాటు కీలకమైన కలెక్టర్, జేసీ, జీవీఎంసీ కమిషనర్గా చతుర్ముఖ పాలన సాగించనున్నారు. సోమవారం ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన గ్రీవెన్స్ను నిర్వహించారు. -
కార్పొరేషన్ దిశగా పాలమూరు
వడివడిగా పడుతున్న అడుగులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ అధికారులు ఇప్పటికే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం..ప్రభుత్వానికి నివేదిక కార్యరూపం దాల్చిన ఔటర్రింగ్రోడ్డు అన్నీ సక్రమంగా జరిగితే స్మార్ట్ సిటీగా మహబూబ్నగర్ సాక్షి, మహబూబ్నగర్ : మహబూబ్నగర్ పట్టణం కొత్తరూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం గ్రేడ్–1 మున్సిపాలిటీగా, దాదాపు 3లక్షల జనాభాతో కొనసాగుతున్న పాలమూరు మున్సిపాలిటీ త్వరలో కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. గతంలో కేవలం 28 చ.కి.మీ మాత్రమే ఉన్న మహబూబ్నగర్ పట్టణం ప్రస్తుతం 98.82 చ.కి.మీలకు విస్తరించింది. రోజు రోజుకూ జనాభా విస్తరిస్తుండటంతో మెరుగైన సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. పట్టణాలను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు బృహత్ ప్రణాళిక రూపొందించాలన్నా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు.. కార్పొరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. 2011 జనగణన ప్రకారం 2.53 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 41వార్డులు ఉండగా... గతేడాది పది గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. దీంతో పట్టణ విస్తీర్ణం పెరగడంతోపాటు జనాభా కూడా మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ మున్సిపాలిటీని.. కార్పొరేషన్ చేయాలంటూ రెండు నెలల క్రితమే మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. స్మార్ట్సిటీగా వడివడి అడుగులు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్పై ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు సమీప పట్టణాలను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రాజధానికి అత్యంత చేరువలో పాలమూరు ఉండడం... సీఎం కేసీఆర్కు ఈ పట్టణంపై ప్రత్యేక అభిమానం ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు కేవలం గంట వ్యవధిలో హైదరాబాద్కు చేరుకోవచ్చు. జిల్లా కేంద్రం నుంచి రవాణాకు డోకాలేదు. ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు 24 గంటలపాటు బస్సు, రైళ్లు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్సిటీగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మణిహారంగా ఔటర్ రింగ్రోడ్డు రాయిచూరు రహదారి కారణంగా పట్టణంలో ట్రాఫిక్కు తీవ్ర అటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణం చుట్టూ మణిహారంలా ఔటర్ రింగ్రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అందుకు రూ.96 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. స్వయంగా ముఖ్యమంత్రి సంక్షేమనిధి నుంచి రహదారి నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దాదాపు దశాబ్ధకాలంగా మాటలకే పరిమితమవుతూ ఔటర్ రింగ్రోడ్డు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ రహదారి వల్ల ముఖ్యంగా జడ్చర్ల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే మార్గంలో అప్పనపల్లికి ముందు హౌసింగ్బోర్డు నుంచి ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేయనున్నారు. హౌసింగ్బోర్డు కాలనీ నుంచి బండమీదపల్లి వెనక నుంచి అలీపూర్ రోడ్డును తాకుతూ పాలమూరు విశ్వవిద్యాలయం వెనకనుంచి రాయిచూరు ప్రధాన రహదారికి అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాయిచూరుకు వెళ్లే వాహనాలు పట్టణం మీదుగా వెళ్తుండడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం భారీ వాహనాలు రాత్రివేళ పట్టణం మధ్యలోనుంచి వెళ్తుండగా... ఉదయం వన్టౌన్ పోలీస్స్టేషన్ పక్కనుంచి భూత్పూరు జాతీయరహదారి గుండా వెళ్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇరుకుగా మారిపోయిన రహదారులకు... ఔటర్ రింగ్రోడ్డు వల్ల వాహనదారులకు ఉపశమనం చేకూరనుంది. పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే, మున్సిపల్చైర్పర్సన్ ప్రత్యేక దృష్టి.. మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దశాబ్ధ కాలంగా ఎదురు చూస్తున్న ఔటర్ రింగ్రోడ్డును సీఎం కేసీఆర్ వద్ద గట్టిగా ప్రస్తావించి రహదారికి గ్రీన్సిగ్నల్ ఇప్పించగలిగారు. అంతేకాదు సీఎం ప్రత్యేక సంక్షేమనిధి నుంచి నిధులు కూడా మంజూరు చేయించారు. రహదారి కోసం భూసర్వే పనులు శరవేగంగా చేయిస్తున్నారు. అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ తనదైన వ్యూహ రచనతో అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన మహబూబ్నగర్ కార్పొరేషన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నట్లు పేర్కొంటూ ఏకంగా కౌన్సిల్ చేత ఏకగ్రీవ తీర్మాణం చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఔటర్రింగ్రోడ్డు ఇలా.. జడ్చర్లనుంచి జిల్లా కేంద్రానికి వచ్చే మార్గంలో అప్పన్నపల్లికి ముందు హౌసింగ్బోర్డునుంచి ప్రత్యేక రహదారిని నిర్మిస్తారు. ఈ రోడ్డును హౌసింగ్బోర్డు కాలనీ మీదుగా బండమీదిపల్లి.. అల్లీపూర్ రోడ్డును తాకుతూ పాలమూరు విశ్వవిద్యాలయం వెనుకనుంచి రాయిచూరు ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తారు. రింగ్రోడ్డుకు ప్రభుత్వం రూ.96కోట్లు నిధులు కూడా ఇచ్చింది. -
స్మార్ట్గా రూ.9 కోట్లకు ఎసరు
రూ.2000 కోట్లపై ‘దేశం’ పెద్దల కన్ను వ్యూహాత్మకంగా చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు కోర్టు స్టేతో బెడిసికొట్టిన వైనం అవినీతి మరకలతో స్మార్ట్సిటీపై నీలినీడలు గొడ్డు పడిందంటే రాబందులకు సందడే సందడి. ఆ రాబందులు తపనలో ఓ అర్థం ఉంది . కానీ ఈ ‘పచ్చ’ రాబందులకు మాత్రం కాసులు గలగలలు వినిపిస్తే చాలు రెక్కలను విదిల్చుకుంటూ వాలిపోతాయి. తుని నియోజకవర్గంలో పనులు చేపట్టాలంటే కమీషన్ కింద రూ.9 కోట్లు ఇస్తేనే అని అక్కడి టీడీపీ బడా నేతలు ‘పంచాయితీ’ పెట్టడంతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోయిన విషయం ‘సాక్షి’ బయటపెట్టింది. ఇక కాకినాడ కార్పొరేషన్ విషయానికి వద్దాం. దీన్ని స్మార్ట్ సిటీగా గుర్తించి అభివృద్ధి పనుల కోసం రూ.2 వేల కోట్లను ప్రకటించగానే అభివృద్ధి ముసుగులో తలో కొంత పంచుకోడానికి సమాయత్తమవుతున్నారు. ఓ వైపు తామంతా ‘నిప్పు’లమంటూనే వాటాలేసుకోవడానికి ప్రయత్ని స్తున్నారు. ఇలాంటి వారికి కార్పొరేషన్ పీఠం అప్పగిస్తే సర్వం స్వాహా చేసేస్తారని నగర ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ స్మార్ట్ సిటీకి వచ్చే రూ.2 వేల కోట్లపై అధికార పార్టీ పెద్దల కన్నుపడింది. రాబోయే నాలుగేళ్లలో ఈ నిధులతో చేపట్టే పనులపై పెత్తనం కోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు స్మార్ట్ సిటీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. స్మార్ట్ సిటీలో చేపట్టే పనులన్నీ తమ గుప్పెట్లోకి రావాలంటే కీలకమైన ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ)ని తమ వారికి కట్టబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తక్కువ మొత్తానికి కోడ్చేసిన కంపెనీని పక్కనబెట్టి అయినవాళ్ల కోసం ఖజానాకు రూ.9 కోట్లు నష్టం తెచ్చేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. ఇందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వత్తాసు పలకడం వివాదాస్పదమై చివరకు న్యాయస్థానం గడపతొక్కింది. ఈ కన్సల్టెన్సీ టెండర్ల బాగోతానికి సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ ఎంపికలో భాగంగా మొదటి విడతలో కాకినాడ ఎంపికైంది. ఎంపికైన వెంటనే తొలి విడతగా కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.382 కోట్లు విడుదలయ్యాయి. నిధులు విడుదలకావడంతో పనులు, డిజైనింగ్, పర్యవేక్షణ, బిల్లులు మంజూరు తదితర అంశాల పర్యవేక్షణకు పీఎంసీ ఎంపిక కోసం టెండర్లు పిలిచారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. కన్సల్టెన్సీ హక్కుల కోసం దేశంలో పలు ప్రాంతాల నుంచి వాడియా టెక్నాలజీస్, ఆర్వీ అసోసియేట్స్, ఎపిటీసా, లీ అసోసియేట్స్, రామబల్, ఫీడ్బ్యాక్ తదితర ఆరు కంపెనీలు పోటీపడ్డాయి. వీటిలో నాలుగు కంపెనీలను పలు కారణాలతో తిరస్కరించారు. చివరకు ఆర్వీ అసోసియేట్స్, వాడియా సంస్థల మధ్య పోటీ నెలకొంది. చక్రం తిప్పిన టీడీపీ ముఖ్యనేతలు... పీఎంసీ కోసం ప్రధాన పోటీదారులైన వాడియా టెక్నాలజీస్ రూ.19 కోట్లకు, ఆర్వీ అసోసియేట్స్ రూ.28 కోట్లకు కోడ్ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలుండి తక్కువకు కోడ్చేసిన కంపెనీకే కాంట్రాక్టు ఖరారు చేయాలి. కానీ కాకినాడ స్మార్ట్ సిటీలో మాత్రం అందుకు భిన్నంగా ఎక్కువకు కోడ్ చేసిన కంపెనీని ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఈ రెండు కంపెనీల్లో తమకు అనుకూలురైన ఆర్వీ అసోసియేట్స్కు కట్టబెట్టేందుకు అధికార పార్టీ పెద్దలు చక్రం తిప్పారు. పీఎంసీ ఎంపిక తుది దశకు చేరిన సమయంలో తూర్పు గోదావరి నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న ఒక మంత్రి, ఒక పార్లమెంటు సభ్యుడు ఈ వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పారు. ఫలితంగా రూ.9 కోట్లు ప్రజాధనం అదనంగా ఎందుకు వెచ్చించాల్సి వస్తుందోనని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు విమర్శలు వస్తున్నా ఆర్వీ అసోసియేట్స్కు కట్టబెట్టేలా అధికార పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఒప్పించగలిగారు. పీఎంసీని దక్కించుకునేందుకు ఆర్వీ అసోసియేట్స్ నగరపాలక సంస్థకు తప్పుడు డాక్యుమెంట్లు దాఖలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్వీ అసోసియేట్స్కు టీమ్ లీడర్ పునీత్సేథీ టెండర్ఫారంలో జతచేసిన సమాచారమంతా మోసపూరితమైందంటూ పలు ఫిర్యాదులు కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్గా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ అలీంభాషాకు వెళ్లాయి. అడుగడుగునా తప్పతోవే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలోని ‘భూమి ఫోర్లైన్ హైవే సంస్థ’ ద్వారా 1994–2000 మధ్యలో జలంధర్ నుంచి పఠాన్ కోట్ హైవే పనులను పునీత్సేథీ పర్యవేక్షించినట్టు టెండర్ ఫారంలో అనుభవ పత్రాన్ని జత చేశారు. వాస్తవానికి ఆ హైవే పనులను 2001–2003 మధ్యన ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్పొరేషన్ దృష్టికి వాడియా టెక్నాలజీస్ తీసుకువెళ్లింది. ఇదే పునీత్ సేథీ దుబాయ్ టవర్స్ నిర్మాణం 2003లోనే పూర్తయ్యాయి. అటువంటి టవర్స్ పనులను 2004–2008 మధ్యలో ఇదే పునీత్సేధీ చేసినట్టు ఇచ్చిన సమాచారం కూడా పూర్తిగా అవాస్త విరుద్ధమని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంస్థ టెండర్ దాఖలు చేసినా ఆయా సంస్థల టీమ్ లీడర్కు ఉండే అనుభవం ఆధారంగానే మార్కులు వేస్తారు. కోడ్ చేసిన మెుత్తం, సాంకేతిక పరిజ్ఞానం, టర్నోవర్ ఇలా అన్ని అంశాలకూ కలిపి 100 మార్కులు నిర్ణయించారు. అందులో భాగంగా వేసిన మార్కుల్లో ఎపిటీసాకు 80,వాడియా టెక్నాలజీస్ 81, ఆర్వీ అసోసియేట్స్కు 82, ఫీడ్బ్యాక్ 78 లీ అసోసియేట్స్కు 71, రామబల్కు 65 మార్కులు వేశారు. పాయింట్ల ప్రకారం చూసుకుంటే వాడియా టెక్నాలజీస్ కంటే ఆర్వీ అసోసియేట్స్కు ఒక మార్కు అదనంగా వేశారు. కానీ ఇక్కడకొచ్చే సరికి ఇన్ని అసత్యపు అనుభవ పత్రాలు దాఖలు చేసిన పునీత్సేథీ వాస్తవ పరిస్థితిని ఎంపిక కమిటీ కనీసం పరిశీలించ లేదు. పైపెచ్చు వాటి ఆధారంగానే ఆర్వీ అసోసియేట్స్కు ఒక మార్కు ఎక్కువ వేసిన అధికారుల అత్యు త్సాహం తేటతెల్లమవుతోంది. అధికారపార్టీ పెద్దల జోక్యంతో తొమ్మిది కోట్లు అదనంగా కోడ్ చేసినప్పటికీ ఆర్వీ అసోసియేట్స్కు పీఎంసీ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు... అధికారపార్టీ పెద్దలు ఆ సంస్థ ఎంపిక చేయడం వెనుక పెద్ద వ్యూహమే నడిచింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఆర్డీఏకు చెందిన ఒక ముఖ్యమైన అధికారితోపాటు మంత్రితో సాన్నిహిత్యం ఉన్న కాకినాడ కార్పొరేషన్లో ఓ ఇంజినీరింగ్ అధికారి అధికార పార్టీ పెద్దలు చెప్పినట్టుగా చక్రం తిప్పి ఆర్వీ అసోసియేట్స్ను ఎంపిక చేశారనే విమర్శలున్నాయి. ఈ విషయాలన్నీ స్మార్ట్ సిటీ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో వాడియా టెక్నాలజీస్ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. ఫలితంగా కాకినాడ స్మార్ట్సిటీకి పీఎంసీ ఎంపిక నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. వచ్చే ఐదేళ్లలో స్మార్ట్ సిటీ అభివృద్ధికి వందల కోట్లు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిని కాసుల వేటలోపడి అధికారపార్టీ ముఖ్యనేతలు ఆదిలోనే మోకాలడ్డుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. -
స్మార్ట్సిటీల్లో ఆర్కిటెక్చర్లదే కీలకపాత్ర
– కేంద్రమంత్రి సుజన పిలుపు – దేశానికి ప్రపంచస్థాయి నగరాలు కావాలి – ఘనంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ స్నాతకోత్సవం పెనమలూరు: అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో స్మార్ట్ సిటీలు నిర్మించటానికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని కేంద్ర సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రి వై.సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం కానూరు అన్నే కల్యాణమండపంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ విద్యార్థుల 2వ స్నాత్సకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాలు, పట్టణాల రూపకల్పన జరిగి నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. స్మార్టు సిటీలతో మెరుగైన మౌలిక సదుసాయాలు, చెత్త నిర్వహణ, ఆరోగ్య భద్రత కల్పించవచ్చని అన్నారు. చెన్నై నగరం గత ఏడాది విపరీతమైన వర్షాల వల్ల మునిగిపోయిందని అన్నారు. భవిష్యత్తులో విపత్తులు ఎదురైనప్పుడు నగరాల్లో, పట్టణాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది రాకుండా నగరాలకు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. అర్బన్ గ్రోత్ సెంటర్లుగా ఆ నగరాలు అమరావతి గ్రీన్ ఫీల్డు రాజధాని నిర్మాణంలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించి సత్తాచాటాలని సుజన అన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హిందూపురంలను అర్బన్ గ్రోత్ సెంటర్లుగా అభివృద్ది చేయనున్నామన్నారు. నగరాల అభివృద్దిలో విద్యార్థులు భవిష్యత్తులో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. 138 మంది విద్యార్థులకు పట్టాలు స్నాత్సకోత్సవంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆండ్ ఆర్క్టెక్చర్లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పొందిన 138 మంది విద్యార్థులకు మంత్రి సుజనాచౌదరి పట్టాలు ప్రధానం చేశారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎన్ఎస్.గాయత్రీ,ఎం.మిచలీ, ఎస్.గణేష్, ఆశనా జైన్, గరీమాలకు బంగరు పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడెప్రసాద్, స్కూల్ డెరెక్టర్లు రాజీవ్మిశ్రా, డాక్టర్ రమేష్, రోహిత్జైన్ తదితరులు పాల్గొన్నారు. మిన్నంటిన సందోహం ఈ సందర్భంగా విద్యార్థుల సందడి మిన్నంటింది. తలపై ఉన్న టోపీలు గాలిలోకి ఎగురవేసి కేరింతలు కొట్టారు. ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు గ్రూప్ ఫోటోలు దిగారు. -
తిరుపతికి.. స్మార్ట్ కిరీటం
– 62.63 పాయింట్లతో నాలుగో స్థానం –రెండో జాబితాలో ఏపీలో దక్కిన ఏకైక నగరం – మారనున్న ఆధ్యాత్మిక నగర రూపురేఖలు – రూ.1,610 కోట్లతో ప్రణాళికలు – ఇంటర్నేషనల్ ఏజెన్సీల సహకారం తిరుపతి తుడా : స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతి ఎట్టకేలకు చోటుదక్కింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ రెండో జాబితాలో 62.63 పాయింట్లతో ఈ ఆధ్యాత్మిక నగరం టాప్–4లో నిలిచింది. స్మార్ట్సిటీ దక్కడంతో తిరుపతిలో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా పేలుళ్లు, నత్యాలతో కార్పొరేషన్ సిబ్బంది సందడి చేశారు. కమిషనర్ భారీ కేక్ కట్చేసి ఉద్యోగులకు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ రెండో జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు. ఆయా నగరాల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఆధారంగా ర్యాంకింగ్లను కేటాయించారు. టాప్లో నిలిచిన 27 నగరాలను వరుసక్రమంలో ప్రకటించారు. మొత్తం 66 నగరాలు పోటీపడ్డ ఈ రౌండ్లో తిరుపతి నగరం 62.63 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. ముందే ఊహించిన కమిషనర్ ఈ ఏడాది జనవరిలో స్మార్ట్ సిటీ తొలి జాబితాను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, కాకినాడ నగరాలు మాత్రమే ఎంపికయ్యాయి. తిరుపతి స్మార్ట్ కిరీటం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కమిషనర్ ప్రణాళికా బద్ధంగా డీపీఆర్ను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. అనంతరం తిరుపతి టాప్ 5లో నిలుస్తుందని ముందే ఊహించారు. ఆయన చెప్పినట్టే తిరుపతి టాప్–4లో నిలిచింది. నిధుల వరద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని భావించింది. అందులో భాగంగానే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. స్మార్ట్ సిటీగా ఎంపికైన ఒక్కో నగరానికి రూ.500 కోట్లు కేటాయిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతే స్థాయిలో మరో రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో స్మార్ట్ సిటీకి రూ.వెయ్యి కోట్లు సమకూరుతాయి. అయితే తిరుపతి నగరపాకల అధికారులు రూ.1,610 కోట్లతో భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.1000 కోట్లతో పాటు మరికొన్ని పథకాల ద్వారా రూ.280 కోట్లు రాబట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పబ్లిక్, ప్రై యివేట్ భాగస్వామ్యం నుంచి మరో రూ.330 కోట్లు వచ్చేవిధంగా డీపీఆర్ను రూపొందించారు. ఈ నేపథ్యంలో తిరుపతికి నిధుల వరద పారడం, భారీ ప్రాజెక్టు చేజిక్కించుకోడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఇక స్మార్ట్గా.. స్మార్ట్ సిటీ మిషన్తో తిరుపతి రూపురేఖలు మారనున్నాయి. రూ.1,610 కోట్ల భారీ ప్రాజెక్టుతో నగరాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. రెట్రోఫిటింగ్ (ఇప్పుడున్న నిర్మాణాలు ఉన్నచోటనే) అభివృద్ధి చేసేలా డీపీఆర్ను రూపొందించారు. రైల్వే స్టేషన్, గోవిందరాజస్వామి ఆలయం, బస్టాండు ప్రాంతం నుంచి తిరుమల బైపాస్ రోడ్డు మీదుగా నందీ సర్కిల్ వరకు ఉన్న 700 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలు, వసతులు, ప్రభుత్వ, ప్రయివేట్ భవనాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రీనరీ, ఆధునిక అండర్ డ్రై నేజీ, కేబుల్ సిస్టమ్, రవాణా, 24 గంటలూ తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇది ప్రజల విజయం నగర ప్రజల విజయం. సహకరించిన అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు. నగర అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం తీసుకుంటాం. ఇప్పటికే ఫ్రాన్స్ సహకారం కోరాం. స్మార్ట్ సిటీ ప్రణాళికలను నగరంలో అమలు చేస్తున్నాం. ఈ–స్కూల్స్, పార్కుల అభివృద్ధి, సిటీ బ్యూటిఫికేషన్, హౌసింగ్, జియోగ్రఫీ ఇన్ఫర్మేషన్ సిస్టం, స్కోడా, ఇజ్రాయిల్ టెక్నాలజీ నీటి సరఫరా వంటి వాటిని అమలు చేస్తున్నాం. స్మార్ట్సిటీ రూ.1,610 కోట్లు, స్కోడా ప్రాజెక్టు రూ.1,500 కోట్లు, జనరల్ ఫండ్, అమృత్ పథకం, 14, 15 ఆర్థిక సంఘాల నుంచి మరో రూ.211 కోట్లతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. – వాడరేపు వినయ్చంద్, కమిషనర్, తిరుపతి నగరపాలక సంస్థ -
స్మార్ట్సిటీకి ‘బ్రేక్’
కన్సల్టెన్సీ నియామకంపై హైకోర్టు స్టే కాకినాడలో ఎక్కడిపనులు అక్కడే కాకినాడ: స్మార్ట్సిటీ పనులకు బ్రేక్ పడింది. కన్సల్టెన్సీ నియామకంలో ఎదురైన అభ్యంతరాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కాకినాడ స్మార్ట్సిటీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముంబాయికి చెందిన వాడియా టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. రానున్న నాలుగేళ్ళలో రూ.1500 కోట్ల విలువైన పనులకు సంబంధించి అన్ని ప్రక్రియలకు అవాంతరం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... స్మార్ట్సిటీ నిధులతో జరిగే పనులకు సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టు, అంచనాల తయారీ, పనుల్లో లోటుపాట్లు, సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. ఇందుకు ఆర్థిక, సాంకేతిక పరమైన అంశాల్లో అనుభవం కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ కొద్ది రోజుల క్రితం స్మార్ట్సిటీ పేరిట టెండర్ పిలిచారు. సుమారు ఏడు సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి. వీటిలో ఆరు సంస్థలు అర్హత కలిగినవిగా గుర్తించి ఇందులో హైదరాబాద్కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థను పరిగణనలోకి తీసుకోవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కలెక్టర్ అధ్యక్షతన కార్పొరేషన్ కమిషనర్తోపాటు వివిధశాఖలకు చెందిన తొమ్మిది మంది సీనియర్ అధికారులతో కూడిన కమిటీ ముందు ప్రతిపాదనలు ఉంచారు. కన్సల్టెన్సీ నియామకంపై తుది నిర్ణయం తీసుకునేలోపు వాడియా సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం కన్సల్టెన్సీ నియామకానికి ఖరారవుతున్న ఆర్వీ అసోసియేట్స్పై సాంకేతికపరమైన అభ్యంతరాలను లేవనెత్తింది. దీంతో కన్సల్టెన్సీ నియామకంపై స్టే ఇస్తూ రాష్ట్ర హైకోర్టు కాకినాడ నగరపాలక సంస్థకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తొలి విడతగా విడుదలైన రూ.382 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో కోర్టు ఉత్తర్వులు అందడంతో ప్రస్తుతం స్మార్ట్సిటీ పనులకు బ్రేక్ పడింది. స్మార్ట్సిటీ పనులు ముందుకు సాగాలంటే ప్రతిపాదిత పనులన్నీ కన్సల్టెన్సీ ద్వారా మాత్రమే జరగాల్సి ఉంది. ఈ నియామకానికి బ్రేక్ పడడంతో స్మార్ట్సిటీ పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే దీనిపై నగరపాలక సంస్థ రాష్ట్ర హైకోర్టుకు తన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప స్మార్ట్సిటీ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడంలేదు. -
పాలకులు ‘స్మార్ట్’గా ఉంటేనే అభివృద్ధి: వెంకయ్య
- స్మార్ట్ సిటీల్లో పెట్టబడులు పెట్టేందుకు 34 దేశాల ఆసక్తి - తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన స్మార్ట్ నగరాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలకు సూత్రప్రాయ అనుమతి - ముగిసిన మీడియా సంపాదకుల ప్రాంతీయ సదస్సు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ‘స్మార్ట్ సిటీల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద లభించే నిధులతో సమీకృతం చేసుకుంటే, ఆ తరువాత వాటి ప్రగతికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి 34 దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తొలి విడతలో పెట్టుబడుల ఆమోదానికి ఎంపికైన 20 నగరాలకుతోడు మరో 40 నగరాల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ జాబితా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ నగరాలకు ఒక్కొక్కదానికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల చొప్పున ఇవ్వనుంది. మొదట 200 కోట్లు, వాటిని సవ్యంగా వినియోగించి రాష్ట్రాలు చేసే పనితీరును బట్టి మిగతా నిధుల్ని విడుదల చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలివిడతలో ఎంపికైన నగరాల్లో పెట్టుబడులకై వచ్చిన ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా కేంద్రం అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు రూ.1,602 కోట్లకు, కాకినాడకు రూ.1,993 కోట్లకు, తెలంగాణలోని వరంగల్కు రూ. 2,860 కోట్ల పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. అటల్ మిషన్ (ఏఎమ్ఆర్యూటీ), స్వచ్ఛభారత్ మిషన్, హెరిటేజ్ డెవలప్మెంట్ (హృదయ్), పీఎం ఆవాస్ యోజన తదితర పథకాల కింద లభించే నిధుల్ని సవ్యంగా వినియోగించుకొని దేశంలోని నగరాల్ని స్థానిక-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పరచుకోవాలి’అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో రెండు రోజుల పాటు జరిగిన మీడియా సంపాదకుల ప్రాంతీయ సదస్సు సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ పలు విషయాలు ఆయన వెల్లడించారు. స్మార్ట్సిటీలు సుందర, ఆవాసయోగ్య నగరాలుగా అభివృద్ధి చెందాలంటే స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలంగా ఉండటంతో పాటు వాటి పాలకులైన కమిషనర్లు, మేయర్లు కూడా స్మార్ట్గా ఉండాలన్నారు. నగరాల్లో ముఖ్యంగా గృహనిర్మాణం, డిజిటలైజేషన్, తాగునీరు-మురుగునీటి నిర్వహణ, తడి-పొడి చెత్త తొలగింపు, రవాణా ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. ఆయా అంశాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతికి ఆస్కారముందని చెప్పారు. ఒక దశ దాటిన తర్వాత సౌకర్యాలు కల్పించి, అందులోంచే వనరులు సమీకరించుకోవడం పెద్ద కష్టం కాదన్నారు. నగరాల్లో చెత్త తొలగింపు (వేస్ట్ మేనేజ్మెంట్) విషయంలో నిర్మాణాత్మక ప్రత్యామ్నాయాలు సూచించాలని మద్రాస్ ఐఐటీని కోరానన్నారు. ముగిసిన రెండు రోజుల సదస్సు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన ‘సంపాదకుల ప్రాంతీయ సదస్సు‘ శుక్రవారం ముగిసింది. మొదటి సదస్సు జైపూర్లో నిర్వహించగా రెండోది చెన్నైలో జరిగింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు లక్షద్వీప్కు చెందిన మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్తోపాటు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన, విపత్తుల నివారణ, తీర రక్షణ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద గడిచిన రెండున్నరేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వెల్లడించడంతో పాటు ప్రశ్నోత్తరాల ప్రక్రియ ద్వారా మీడియా ప్రతినిధుల నుంచి స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఈ సదస్సు నిర్వహించినట్టు చెప్పారు. -
1200 ఉచిత వై-ఫై స్పాట్లు
దేశానికి వాణిజ్యనగరంగా పేరున్న ముంబాయి ఇక స్మార్ట్సిటీగా రూపుదిద్దుకోనుంది. ముంబాయి నగరంలో 1200 ఉచిత వై-ఫై హాట్స్పాట్లు ఏర్పాటుచేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రముఖ ప్రదేశాల్లో 2017 మే కల్లా 1200 ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ఏర్పాటుచేసి, ముంబాయిని వై-ఫై నగరంగా మార్చుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్పై జరిగిన చర్చలో కూడా ఫడ్నవీస్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. సీసీటీవీ ప్రాజెక్టు అనంతరం ముంబాయిని స్మార్ట్సిటీగా రూపొందించడంలో ఇది మరో కీలక అడుగని పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా 500 హాట్స్పాట్లను 2016 నవంబర్ కల్లా కల్పిస్తామని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన ఆక్షన్ తేదీలను ఇంకా తెలుపలేదు. ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ప్రజలకు అందించడంలో ఢిల్లీ మొదటి నగరంగా ఉంటోంది. మెట్రో నగరాల్లో ప్రజలు ఫీచర్ ఫోన్లకంటే స్మార్ట్ఫోన్ల వాడకంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే డేటా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్నెట్ వినియోగానికి ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉచిత వై-ఫై స్పాట్లను ఏర్పాటుచేయడం ప్రజలకు ఉపయుక్తమని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. మెట్రో నగరాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మరోవైపు టెక్ కంపెనీలు సైతం ఉచిత వై-ఫై సౌకర్యాలు అందించడంలో భాగస్వాములుగా మారుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్, దేశమంతటా గల ఇండియన్ రైల్వే ప్లాట్ఫామ్స్లో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ప్యాసెంజర్లకు అందిస్తుండగా.. మైక్రోసాప్ట్ 5 లక్షల గ్రామాలకు తక్కువ ధరకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ను అందించాలని ప్లాన్ చేస్తోంది. వైట్ స్పేస్ టెక్నాలజీతో గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందించడంలో మైక్రోసాప్టే మొదటి కంపెనీ. -
స్మార్ట్ సిటీలకు ఎంతో దూరంలో ఉన్నాం
♦ ఇంజనీర్లు పెద్ద పట్టణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు ♦ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ముంబై: స్మార్ట్సిటీల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం (దేశం) చాలా, చాలా దూరంలో ఉన్నామని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యమిస్తున్నారని పట్టణీకరణపై ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మూర్తి వెల్లడించారు. స్మార్ట్సిటీలకు ఆమడ దూరంలో ఉన్నందున దీనిపై తాను మాట్లాడబోనన్నారు. ‘ఇంజనీర్లు పెద్ద పట్టణాల్లోనే పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ, 50 శాతం సీట్లు కూడా నిండలేదు. అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ముంబై, పుణె, బెంగళూరు హైదరాబాద్, నోయిడాల్లోనే ఉండాలనుకుంటున్నారు’ అని మూర్తి వివరించారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దేశంలోని మారుమూల పట్టణాలకు విస్తరించడం ద్వారా ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా... ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ అయిన నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సామూహిక వలసలు ఇకముందూ కొనసాగుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్సిటీలపై పనిచేయాలని మూర్తి సూచించారు. అధిక ఆదాయం గల దేశాల్లో ఏదీ కూడా పట్టణీకరణ లేకుండా ప్రగతి సాధించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తే సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్ను ఒకసారి సందర్శించాలని సభికులకు నారాయణమూర్తి సూచించారు. -
‘స్మార్ట్ సిటీలకు చాలా దూరంలో ఉన్నాం’
స్మార్ట్సిటీల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం (దేశం) చాలా, చాలా దూరంలో ఉన్నామని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యమిస్తున్నారని పట్టణీకరణపై ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మూర్తి వెల్లడించారు. స్మార్ట్సిటీలకు ఆమడ దూరంలో ఉన్నందున దీనిపై తాను మాట్లాడబోనన్నారు. ‘ఇంజనీర్లు పెద్ద పట్టణాల్లోనే పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ, 50 శాతం సీట్లు కూడా నిండలేదు. అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ముంబై, పుణె, బెంగళూరు హైదరాబాద్, నోయిడాల్లోనే ఉండాలనుకుంటున్నారు’ అని మూర్తి వివరించారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దేశంలోని మారుమూల పట్టణాలకు విస్తరించడం ద్వారా ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా... ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ అయినా నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సామూహిక వలసలు ఇకముందూ కొనసాగుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్సిటీలపై పనిచేయాలని మూర్తి సూచించారు. అధిక ఆదాయం గల దేశాల్లో ఏదీ కూడా పట్టణీకరణ లేకుండా ప్రగతి సాధించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తే సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్ను ఒకసారి సందర్శించాలని సభికులకు నారాయణమూర్తి సూచించారు. -
పందులను తరలించాల్సిందే
స్మార్ట్సిటీకి అవరోధం కలిగించొద్దు పందుల పెంపకందార్లతో మేయర్ కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలోని పందులను తరలించాల్సిందేనని నగర మేయర్ రవీందర్సింగ్ పందుల పెంపకందారులకు సూచించారు. తన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పందులను రోడ్లపై వదలడం సరికాదని, గొర్రెలు, ఆవులు, కోళ్లకు ఏర్పాటు చేసినట్లే ఫాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్మార్ట్సిటీ హోదా దక్కించుకోవాలంటే పందుల తరిలింపు ఒక్కటే మార్గమన్నారు. పందులు సంరక్షణకు ఇతర మార్గాలను ఆలోచించుకోవాలని తెలిపారు. ఊరిబయటకు పందులను తరలించాలని సూచించారు. పందులను తీసివేయాలంటే తమకు ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఊరు బయట స్థలాలు చూపించి షెడ్లు వేసివ్వాలని పందుల పెంపకందారులు కోరారు. స్థలం కోసం ఎమ్మెల్యే, కలెక్టర్తో మాట్లాడతామని మేయర్ వెల్లడించారు. కార్పొరేటర్లు ఆరిఫ్, పిట్టల శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, వై.సునీల్రావు, నాయకులు కట్ల సతీష్, ఎడ్ల అశోక్, సాదవేని శ్రీనివాస్, అదనపు కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు. పారిశుధ్య పనులు పరిశీలన 5వ డివిజన్లో పారిశుధ్య పనులను శుక్రవారం మేయర్ రవీందర్సింగ్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. పనులను గ్యాంగ్లుగా విడిపోయి చేయాలని సిబ్బందికి సూచించారు. ఒక్కో ఏరియాను శుభ్రం చేసి మళ్లీ అక్కడ పని ఉండకుండా చూసుకోవాలన్నారు. -
వెంకయ్యా..దయచూపయ్యా!
స్మార్ట్ సిటీ పోటీలో తిరుపతి 15లోపు రెండో జాబితా ప్రకటన 27 నగరాలను ప్రకటించనున్న కేంద్రం ఉత్కంఠంగా నగర వాసులు స్మార్ట్ సిటీ కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి. మొదటి దఫాలో తిరుపతికి చోటు దక్కకపోవడంతో రెండో జాబితాలోనైనా అవకాశం వస్తుందోలేదోనని నగర వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వెంకయ్యా..దయచూపయ్యా అంటూ పలువురు వేడుకునే పనిలో నిమగ్నమయ్యారు. తిరుపతి తుడా : రెండో దఫా స్మార్ట్ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘స్మార్ట్’గా ప్రతిపాదనలు వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కమిషనర్ వినయ్చంద్ రెండో జాబితాలో టాప్–1లో నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేసి నివేదికను కేంద్రానికి అందజేశారు. గత లోపాలను సరిదిద్ది భారీ మార్పులతో స్మార్ట్ ప్రణాళికలను రూపొందించారు. రూ.1,610 కోట్లతో స్మార్ట్ ప్రణాళిక రెండో జాబితాలో తిరుపతిని స్మార్ట్ సిటీగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కమిషనర్ తీవ్రంగానే శ్రమించారు. ఇందులో భాగంగా ఇప్పుడున్న నిర్మాణాలను ఉన్నచోటే(వెట్రోఫిట్టింగ్) అభివృద్ధిచేసేలా తీర్మాణం చేశారు. అందుకనుగుణంగా డీపీఆర్ను సిద్ధం చేశారు. తొలి విడత పోటీలో రూ.2,650 కోట్ల వ్యయంతో ప్రణాళికలను రూపొందించారు. దీనిపై కేంద్రం నుంచి నిధులు ఎలా సమకూర్చుకుంటారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలాంటి లోపాలు లేకుండా రెండు డీపీఆర్లో మార్పుచేస్తూ రూ.1,610 కోట్లకు పరిమితం చేశారు. స్మార్ట్ సిటీమిషన్ నుంచి రూ.1,010 కోట్లు, కేంద్ర, రాష్ట్ర పథకాల నుంచి మరో రూ.300 కోట్లు, పీపీపీ పద్ధతిన చేపట్టనున్న మరో 300 కోట్లు వెరసి రూ.1,610 కోట్లు సమకూర్చుకుంటాయనే అంచనాతో డీపీఆర్ను సిద్ధం చేశారు. –ఫ్రాన్స్ సహకారంతో ఫ్రాన్స్లో అద్భుతమైన టౌన్ప్లానింగ్, శానిటేషన్, టెక్నాలజీ అమల్లో ఉంది. ఆ టెక్నాలజీ, ప్లానింగ్ను తిరుపతికి అనుకరిస్తూ అభివృద్ధి చేసేలా అక్కడి ఓ సంస్థతో కార్పొరేషన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. స్మార్ట్ కిరీటం దక్కించుకొని అభివృద్ధికి అడుగులు పడితే తిరుపతికి ఫ్రాన్స్ టెక్నాలజీ దోహదపడనుంది. -
ఇండోర్ ‘స్మార్ట్’ టూర్
కరీంనగర్ కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్సిటీల అభివృద్ధి పథకంలో ప్రథమ స్థానంలో నిలిచి మొదటి విడతలోనే స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర సందర్శనకు ప్రజాప్రతినిధులు Ðð ళ్లనున్నారు. ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, కమిషనర్ కష్ణభాస్కర్తో కూడిన బృందం శుక్రవారం బయలుదేరి వెళ్లనుంది. శని, ఆదివారాలలో అక్కడ పర్యటించి స్మార్ట్ సిటీ సాధన కోసం వారు చేపట్టిన డీపీఆర్ను పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న అభివద్ధిని పర్యవేక్షించనున్నారు. కరీంనగర్ స్మార్ట్సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్నప్పటికీ డీపీఆర్ తయారీలో ఇప్పటికీ ఒక స్పష్టతరాలేదు. స్మార్ట్సిటీ జాబితాలో స్కోరుబోర్డును పెంచుకుని మూడో జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఇండోర్ అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరముఉంది. కాగా ఇండోర్ జిల్లా కలెక్టర్గా కరీంనగర్ జిల్లాకు చెందిన నరహరి ఉండడం.. ఇప్పటికే ఆయన పలుమార్లు వీరిని ఆహ్వానించారు. ఇండోర్ పర్యటన నగరం స్మార్ట్ హోదా దక్కించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
స్మార్ట్సిటీ లపై దిశానిర్దేశం చేసిన ప్రధాని
వెబ్కాస్టింగ్ ద్వారా బల్దియాలో ప్రసారం కరీంనగర్కార్పొరేషన్ : పట్టణ ప్రజల జీవన విధానంలో మార్పు తేవడమే స్మార్ట్సిటీల ల క్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శని వారం మహారాష్ట్రలోని పుణే స్మార్ట్సిటీ ప్రా రంభోత్సవం, అమృత్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని వెబ్కాస్టింగ్ ద్వారా ప్రసారం చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వెబ్స్క్రీన్ ఏ ర్పాటుచేసి పాలకవర్గ సభ్యులు, అధికారు లు వీక్షించారు. స్మార్ట్సిటీ, అమృత్ పథకంలో చేరిన నగరాల పాలకవర్గాలు, అధికారులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సాధ్యమన్నారు. 24 గంటల నీటిసరఫరా, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వే యాలని సూచించారు. ఈ-ఆఫీస్ల ద్వారా అన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టాల న్నారు. మేయర్ రవీందర్సింగ్, కమిషనర్ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు, అధికారులు పా ల్గొన్నారు. కాగా ఇంటర్నెట్లో ఏర్పడ్డ సాంకేతికలోపంతో కొంత నిరాశకు గురయ్యూరు. కార్యక్రమానికి ముందే అన్ని సరిచూసుకోవాల్సిన సిబ్బంది తీరా సమయానికి హడావిడి పడడం కనిపించింది. -
సమగ్ర అభివృద్ధి మా బాధ్యత
► యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్ సాధ్యం ► యూజీడీ పనిచేయకపోతే మూసేయండి ► మహిళల హక్కులు కాలరాయొద్దు ► మంత్రి ఈటల, ఎంపీ వినోద్ కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే.. సమగ్ర అభివృద్ధి మా బాధ్యతని.. స్మార్ట్తో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్సిటీ సాధన, డీపీఆర్ తయారీపై మేయర్ రవీందర్సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగర అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగరంపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉందని, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారని, వడ్డించే ఆర్థిక మంత్రిగా నేనే ఉన్నప్పుడు నిధుల గురించి బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయమంటే ధర్మంగా, న్యాయంగా ప్రజల జఠిల సమస్యలు పరిష్కరిస్తూ, సమాజ అభివృద్ధి, క్షేమమే ఎజెండాగా బతకడమన్నారు. నగరంలో యూజీడీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనికి రాదనిపిస్తే మూసివేయాలని మేయర్కు సూచించారు. రోడ్లు తవ్వడం, వేయడం ద్వారా జేబులు నింపుకునే పనిగా ప్రజలు అభివర్ణిస్తున్నారని, రోడ్లు వేస్తే 40 నుంచి 50 ఏళ్ల వరకు తవ్వకుండా ఉండాలన్నారు. నగరాన్ని హైదరాబాద్ కంటే ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. కౌన్సిల్లో సగానికి పైగా మహిళా కార్పొరేటర్లు ఉండగా పది మంది మాత్రమే హాజరవడాన్ని చూసిన మంత్రి మహిళా కార్పొరేటర్ల హక్కులు హరించొద్దని, కనీసం సమావేశాల్లోనైనా పాల్గొనేలా చూడాలని వారి కుటుంబికులకు చురకలంటించారు. యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్ : ఎంపీ స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చే వరకు మా బాద్యత తీరిందని, పాలక వర్గం, అధికారులు రానున్న 45 రోజుల పాటు యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్సిటీ సాధ్యమని ఎంపీ వినోద్కుమార్ సూచించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ను మెట్రోస్మార్ట్ సిటీగా మార్చాలని, దానికి బదులుగా కరీంనగర్ను చేర్చాలని లేఖ రాసినప్పుడు మళ్లీ కే ంద్ర కేబినేట్ ఆమోదం కావాలని చెప్పినట్లు తెలిపారు. ఐదేళ్లలో రూ.500 కోట్లే కాదు రూ.5వేల కోట్లయినా తీసుకునే అవకాశముందన్నారు. జిల్లాకు చెందిన ఇండోర్ కలెక్టర్ నరహరితో సమావేశమై డీపీఆర్ తయారీకి సలహాలు తీసుకుంటామని తెలిపారు. తిమ్మాపూర్లో 300 ఎకరాల్లో హైటెక్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్కు ముగ్గురు గ్రూప్-1 ఆఫీసర్లను కేటాయించాలని మంత్రిని కోరారు. మొదటి మెట్టులోఉన్నాం : ఎమ్మెల్యే స్మార్ట్ జాబితా మొదటి మెట్టులోనే ఉన్నామని, మెరుగైన సౌకర్యాలు, ఆర్థిక పరమైన సంస్కరణలతో వచ్చే విడతలో స్మార్ట్ సాధించుకోవాలన్నారు. స్మార్ట్ సిటీల్లో ముందు వరుసలో ఉన్న ఇండోర్, పుణే నగరాలను సందర్శించి డీపీఆర్ను తయారు చేయూలన్నారు. ధృడచిత్తంతో పనిచేయాలి : ఎమ్మెల్సీ స్మార్ట్ సాధించాలంటే పాలకవర్గం, అధికారులు ధృఢచిత్తంతో పనిచేయాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ చొరవతో స్మార్ట్ జాబితాలో చేరిందని, దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సర్వాంగ సుందరంగా అభివృద్ధి : కలెక్టర్ స్మార్ట్సిటీతో నగరం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. డీపీఆర్ బాగా తయారు చేయాలని తెలిపారు. స్మార్ట్ డీపీఆర్ పనుల కోసం డ్వామా ఏపీడీ శ్రీనివాస్ను డెప్యూటేషన్పై పంపిస్తామని, అనుమతి ఇప్పించాలని మంత్రిని కోరారు. లక్ష గొంతులను ఢిల్లీదాకా తీసుకెళ్లాలి: కమిషనర్ స్మార్ట్సిటీ ప్రజలు భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ప్రతి కార్పొరేటర్ సహకారంతో మీడియా, మెస్సేజ్, మెయిల్స్, వాట్సాప్ ఎలా వీలైతే అలా లక్ష గొంతులను ఢిల్లీదాకా తీసుకెళ్లాలని కమిషనర్ కృష్ణభాస్కర్ కోరారు. డీపీఆర్ గ్రౌండ్ నుంచే మొదలు పెట్టాలని, 67 సిటీలకు 73 నగరాలు పోటీపడుతున్నాయని, ఒక్క సారి ఫెయిల్ అయితే మళ్లీ మొదటికి వస్తామన్నారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఘన సన్మానం నగరం స్మార్ట్సిటీ జాబితాలో నగరం చేరడంపై మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు ఘనంగా సన్మానించారు. స్మార్ట్ కోసం శ్రమిస్తున్న కమిషనర్ కృష్ణభాస్కర్ను ఎంపీ వినోద్ శాలువాతో సత్కరించారు. అంతకు ముందు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే స్మార్ట్ సిటీ సాధ్యమేనా
► పందుల సమస్య తీవ్రం అంతటా పారిశుద్ధ్య లోపం ► కల్లూరును విస్మరిస్తున్నారు మున్సిపల్ అధికారులపై ► ఎంపీ బుట్టా, ఎమ్మెల్యే గౌరు చరిత ఆగ్రహం కర్నూలు(టౌన్): ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది.. పందుల నిర్మూలన అధికార యంత్రాంగానికి పట్టడం లేదు.. ఎక్కడా చూసినా పారిశుద్ధ్య లోపమే.. ఇక స్మార్ట్ సిటీ ఎలా సాధ్యం’ అంటూ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక నగరపాలక కమిషనర్ చాంబర్ లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి మున్సిపల్ అధికారులు, వివిధ విభాగాల సెక్షన్ సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బుట్టా అధికారుల తీరును ఎండగ్టారు. ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది. మనుషుల ప్రాణాలు ముఖ్యం. సమస్యను లైట్గా తీసుకున్నారు. నేను ఉన్న ప్రాంతంలో వాణిజ్య నగర్ పార్కు అభివృద్ధి చేయాలని ఒకటిన్నర సంవత్సరం క్రితం చెప్పా.. అయినా పట్టించుకోలేదు. ఎంపీ చెప్పినా పనులు కాకపోతే ఇక ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి’ అంటూ మండిపడ్డారు. వివిధ పథకాలు, స్కీమ్ల ద్వారా నగరపాలక సంస్థకు రూ. 200 కోట్లు వచ్చాయని, ఈ నిధులతో చేస్తున్న అభివృద్ధి వివరాలను తెలియజేయాలన్నారు. పనులు వేగవంతం చేయాలని, జాప్యం తగదన్నారు. -
స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్కు చోటు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్కు చోటు దక్కింది.ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కేంద్రాన్ని కోరారు. దీంతో కేసీఆర్ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం అందుకు అంగీకారం తెలిపింది. కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుముఖత వ్యక్తం చేసింది. దీంతో స్మార్ట్ సిటీల జాబితా నుంచి హైదరాబాదును తొలగించి ఆ స్థానంలో కరీంనగర్ ను చేర్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయి. అయితే రూ.100 కోట్ల నిధులు హైదరాబాద్కు సరిపోవని, స్మార్ట్ సిటీ బదులు హైదరాబాద్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
స్మార్ట్ కు సన్నద్దం
► కరీంనగర్కు అన్ని అర్హతలున్నారుు ► కేంద్రం సూచన మేరకు సంస్కరణలు చేపడుతున్నాం.. ► మూడో విడతలో మన కల నెరవేరుతుంది.. ► కరీంనగర్ మేయర్ రవీందర్సింగ్ కరీంనగర్ కార్పొరేషన్ : స్మార్ట్సిటీ కరీంనగర్ ప్రజల కల.. ఆ కలను నెరవేర్చేందుకు, జిల్లా కేంద్రానికి స్మార్ట్హోదా సాధించి పెట్టేందుకు అధికార యంత్రాంగం, పాలకవర్గం తీవ్రం గా శ్రమించింది. తెలంగాణలో మూడు పట్టణాలను స్మార్ట్సిటీలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. అప్పటి నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం నిర్విరామ కృషిచేసి నివేదిక తయారుచేసి కేంద్రానికి అందజేశారు. 87మార్కులు సాధించినా రాజకీయ సమీకరణాలు వరంగల్ వైపే మొగ్గుచూపాయి. అయినా నిరాశ చెందకుండా ప్రతి అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్మార్ట్ హోదాకు తమ ప్రయత్నాలను కొనసాగించారు. అరుుతే రెండు సిటీలకే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్కు బదులుగా కరీంనగర్ పేరును జాబితాలో చేర్చడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ మూడో జాబితాలో స్మార్ట్ సిటీని కచ్చితంగా సాధించి తీరుతామని మేయర్ రవీందర్సింగ్ చెబుతున్నారు. స్మార్ట్ సిటీ హోదా కోసం బల్దియా చేసిన ప్రయత్నాలు, చేయబోయే కార్యక్రమాలు ఆయన మాటల్లోనే... ముందు వరుసలో ఉన్నాం.. ఇప్పటివరకు రెండు విడతల్లో 33నగరాలు స్మార్ట్ హోదా దక్కించుకున్నారుు. వాటికి కరీంనగర్ ఏ మాత్రం తీసిపోదు. ఏడాదిన్నరగా స్మార్ట్హోదా దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం మార్కుల పట్టికలో ముందువరుసలో ఉన్నాం. తెలంగాణకు రెండు స్మార్ట్ నగరాలకే పరిమితం చేయడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్కు బదులు కరీంనగర్ను జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేశారు. అప్పటినుంచి ఎంపీ వినోద్కుమార్ స్మార్ట్ హోదా కల్పించేందుకు కృషిచేస్తున్నారు. అన్ని అర్హతలున్నాయి.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్తర్వాత అన్ని అర్హతలు కలిగిన మూడో పెద్ద నగరం కరీంనగరే. వరంగల్కు స్మార్ట్ హోదా దక్కడంతో మిగిలింది కరీంనగరం మాత్రమే. పోటీకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. మార్కుల పట్టికలో ఏడాదిన్నర క్రితం తొలి ప్రయత్నంలోనే 85 మార్కులు సాధించాం. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. హోదాకు సరిపడా 90మార్కులు ఇప్పుడు ఉన్నాయి. సాంకేతిక అంశాల విషయంలో కొంత ముందుకు వెళ్లాల్సి ఉంది. కేంద్ర మంత్రి సూచనతో.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్మార్ట్ హోదా ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. చిన్నచిన్న మార్పులు చేసుకోవాలని ఫోన్లో సూచించారు. ఆయన సూచనల మేరకు పనిచేస్తున్నాం. ఆదాయ వనరుల పెంపు, ప్రజలకు జవాబుదారీతనం, స్వచ్ఛభారత్ వంటి అంశాల్లో మెరుగుపరుచుకున్నాం. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్కుమార్ స్మార్ట్ హోదా కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆదాయ వనరుల పెంపునకు చర్యలు ఆదాయ వనరుల పెంపు కోసం ఒక్క రూపాయికే నల్లాను ప్రవేశపెట్టాం. ఇప్పటివరకు వెరుు్య కనె ్షకన్లు ఇచ్చాం. నల్లాపన్ను ద్వారా నెలకు రూ.10లక్షల ఆదాయం పెరిగింది. రోజు 50నల్లాకనెక్షన్లకు దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టిసారించాం. స్వచ్ఛభారత్లో భాగంగా ఒక్క రోజే 50వేల మందితో నగరాన్ని శుభ్రం చేశాం. స్వచ్ఛ కరీంనగర్ కోసం కృషిచేస్తాం. సింగిల్విండో విధానం పౌరసేవలు పకడ్బందీగా అమలు చేసి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నాం. పూర్తిగా ఆన్లైన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. దరఖాస్తుదారుడు పౌరసేవా కేంద్రంలో దరఖాస్తు చేసి అక్కడి నుంచే ధ్రువీకరణ పొందేలా ఏర్పాట్లు చేశాం. మూడో విడతలో ఖాయం కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా మూడో విడతలో రావడం ఖాయం. కేంద్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. గత నెలలో కమిషనర్కు కృష్ణభాస్కర్ ఢిల్లీలో జరిగిన స్మార్ట్ సిటీల సమావేశానికి ఆహ్వానం అందుకుని హాజరయ్యారు. కేంద్ర కేబినెట్ ప్రొసీడింగ్ ఇస్తే స్మార్ట్ హోదా వచ్చినట్లే. -
కరీంనగర్ను స్మార్ట్సిటీగా ఎంపిక చేయండి
వెంకయ్యనాయుడుకు ఎంపీ వినోద్కుమార్ వినతి కరీంనగర్ : కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలోకి చేర్చాలని ఎంపీ బి.వినోద్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్చాలని సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్రావు, ఎంపీ వినోద్కుమార్, మేయర్ రవీందర్సింగ్తోపాటు బీజేపీ నాయకులు పూర్తి వివరాలతో తనకు నివేదిక అందజేశారన్నారు. దేశావ్యాప్తంగా ఎంపిక చేసిన వంద స్మార్ట్సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయని, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ను ఎంపిక చేయనున్నామని తెలిపారు. మార్గదర్శకాల్లో స్వల్పమైన మార్పులు చేసి, విధానపరమైన నిర్ణయం తీసుకొని, త్వరలోనే కరీంనగర్ను స్మార్ట్సిటీగా ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా.. కరీంనగర్ స్మార్ట్సిటీగా ఎంపిక అయిపోయినట్లేనని, విధానపరమైన ప్రకటన వెలువడడానికి కొంత సమయం పడుతుందని ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిని, అదనపు కార్యదర్శిని, స్మార్ట్సిటీస్ మిషన్ డెరైక్టర్ను కలిసి అవసరమైన నివేదిక అందజేశామన్నారు. -
మళ్లీ నిరాశే
స్మార్ట్గా వెనుకడుగు రెండో జాబితాలోనూ తిరుపతికి దక్కని చోటు తిరుపతితుడా : స్మార్ట్ జాబితాలో తిరుపతికి మళ్లీ నిరాశే ఎదురైంది. గత ఏడాది జనవరిలో విడుదల చేసిన టాప్-20 స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతికి చోటు దక్కలేదు. తాజాగా మంగళవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేసిన రెండో విడత స్మార్ట్ జాబితాలోనూ నిరాశే ఎదురైంది. రెండో జాబితాలో 40 నగరాలను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం 13 నగరాలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వరంగల్ నగరం మాత్రమే స్మార్ట్ సిటీలో చోటుదక్కించుకుంది. మరో 27 నగరాలను జూలైలో ప్రకటించనున్నారు. ఇందులో అయినా చోటు దక్కుతుందేమోనని నగర వాసులు మరింత ఆశగా చూస్తున్నారు. అయితే తిరుపతి కార్పొరేషన్ యంత్రాంగం మలివిడత జాబితాకు ఇంకా సిద్ధం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెండు రోజల క్రితం స్మార్ట్సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారు కోసం కన్సల్టెన్సీకి అప్పగించింది. అభిప్రాయ సేకరణలోను కార్పొరేషన్ యంత్రాంగం వెనుకంజలో ఉంది. మహానాడుకు తిరుపతి వేదిక కావడంతో నగరాన్ని త్వరితగతిన ముస్తాబు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటి వరకు చేపట్టిన అభిప్రాయసేకరణలో కమిషనర్ వినయ్చంద్ ఒక్కరోజు మాత్రమే పాల్గొనడం గమనార్హం. కింది స్థాయి అధికారులు అడపాదడపా అభిప్రాయ సేకరణ చేపట్టారు. పదిరోజులుగా నగరంలో అభివృద్ధిపనులపై దృష్టిపెట్టిన అధికారులు స్మార్ట్ సిటీ మాస్టర్ప్లాన్ రూపొందించడంలో నిర్లక్ష్యం వహించారు. మరో జాబితా ప్రకటనముందే మేల్కొని తగిన అభిప్రాయ సేకరణ చేసి మాస్టర్ప్లాన్ రూపొందించాల్సి ఉంది. -
ఇక 'స్మార్ట్' గా రాష్ట్రపతి భవనం
న్యూఢిల్లీ : ప్రకృతి రమణీయతకు మారుపేరుగా, అందమైన ఉద్యానవనాలతో ప్రధాన ఆకర్షణగా ఉండే అద్భుతమైన రాష్ట్రపతి భవనం, ఐబీఎమ్ స్మార్ట్ సిటీ సొల్యూషన్ సహకారంతో స్మార్ట్ టౌన్ షిప్ గా రూపొందనుంది. స్మార్ట్ సిటీ సొల్యూషన్ లో భాగంగా ప్రెసిడెన్సియల్ ఎస్టేట్ లో డిజిటల్ ట్రాన్సపర్ మేషన్ ను చేపట్టనున్నట్టు ఐబీఎమ్ గురువారం ప్రకటించింది. 330 ఎకరాల విస్తీర్ణాన్ని, 5వేల పైగా రెసిడెంట్లను, అధ్యక్ష ఎస్టేట్ ను భవిష్యత్తులో స్మార్ట్ గా రూపుదిద్దడానికి ఐబీఎమ్ టెక్నాలజీ సహాయపడనుంది. నీళ్ల సరఫరా, భద్రతా, విద్యుత్ అవస్థాపన, ఘన వ్యర్థాల నిర్వహణను సవాళ్లగా తీసుకుంటూ టౌన్ షిప్ ను అభివృద్ధి చేస్తామని ఐబీఎమ్ పేర్కొంది. ఇప్పటికే ఐబీఎమ్ ఇంటిలిజెన్స్ ఆపరేషన్ సెంటర్(ఐఓఎస్) సిటిజన్స్ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది. వెబ్, మొబైల్ ద్వారా సమస్యలను తెలియజేసేలా దీన్ని రూపొందించింది. డిజిటల్ యుగంలో రాష్ట్రపతి భవన్ కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఓ ఈవెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత స్మార్ట్ సిటీ విజన్ కు రాష్ట్రపతి భవనం సారుప్యంగా మారుస్తామని, ఈ స్మార్ట్ టౌన్ షిప్ గ్రేట్ జర్నీలో తాము భాగస్వామ్యమైనందుకు చాలా గర్వంగా భావిస్తున్నామని భారత ఐబీఎమ్ ఎండీ వనిత నారాయణన్ అన్నారు. -
అన్నీ కోతలే!
► వదలని విద్యుత్ కోతలు ► నీటి మూటలైన పాలకుల మాటలు ► కనీసం కోతల వేళలు తెలియక జనం ఇబ్బందులు వేసవిలో విద్యుత్ కోతలు ఉండవని, 24 గంటలూ సరఫరా ఇస్తామని చెప్పిన పాలకులు, అధికారుల మాటలు వట్టి ‘కోత’లేనని తేలిపోయింది. నాలుగు రోజులుగా జిల్లా ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బందులకు గురవుతున్నా పరిస్థితిని ఇప్పటికీ సాధారణ స్థితికి తీసుకురాలేకపోయారు. కనీసం కోతల వేళలను కూడా ప్రకటించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: జిల్లా ప్రజలను విద్యుత కష్టాలు వీడటం లేదు. నాలుగు రోజుల క్రితం కలపాకలోని 400 కేవీ ట్రాన్స్కో విద్యుత్ ఉప కేంద్రంలో బస్ బార్ దెబ్బతినడంతో మొదలైన విద్యుత్ కష్టాలు బుధవారం కూడా కొనసాగాయి. రెండో రోజు 220 కేవీ సబ్స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తింది. మూడో రోజు పవర్గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన 220 కేవీ సబ్స్టేషన్ పాడయింది. నాలుగో రోజు అదే సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ సరఫరా నిలిపివేశారు. దీంతో ఈ నాలుగు రోజులు విశాఖ, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పరిధి వరకూ అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ కోతలు అమలు చేశారు. కనీస సమాచారం కరువు నాలుగు రోజుల్లో దాదాపు 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ప్రజలకు ఒక్క మాట చెప్పడం లేదు. వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. దీంతో జనం రాత్రి పగలూ విద్యుత్ కోతలతో విసిగిపోతున్నారు. అర్ధరాత్రి తమ దగ్గర్లోని విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి విచారిస్తే తమకేమీ తెలియదని, గాజువాక వెళ్లి ట్రాన్స్కో వాళ్లని అడగండని ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది బదులిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పవర్గ్రిడ్ నిరా్వాహకులు ఎలాంటి సమాచారం ఇవ్వనందువల్ల తామేమీ చెప్పలేమని ఏపీ ట్రాన్స్కో అధికారులు అంటున్నారు. దీంతో ఎక్కడా ప్రజలకు కోతలకు సంబంధించినసమాచారం రావడం లేదు. ఎప్పటికి తీరేను? దేశంలోనే అత్యంత తక్కువగా 1.75 శాతం ట్రాన్స్మిషన్ నష్టాలు కలిగిన విశాఖ ఏపీ ట్రాన్స్కోను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో దీనికి ప్రస్తుతం 52 పవర్ ట్రాన్స్ఫార్మర్లున్నాయి. కానీ స్మార్ట్ సిటీగా, పారిశ్రామిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ జిల్లాకు ఇవేమీ సరిపోవు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో భాగంగా కాపులుప్పాడలో 132 కేవీ, ఓజోన్వేలి, అచ్యుతాపురంలో 220 కేవీ, నక్కపల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) కూడా సిద్ధమైంది. కానీ దీనికి ఏషియన్ బ్యాంకు నుంచి నిధులు రావాల్సి ఉంది. అవి ఎప్పుడు వస్తాయో, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో పాలకులకు, అధికారులకే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందా. ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను పెంచుకుంటే తప్ప విద్యుత్ కోతల నుంచి శాశ్వత విముక్తి దొరకదు. -
స్మార్ట్ డివిజన్లు... మళ్లీ తెరపైకి
► అధికారుల కసరత్తు ► టక్కర్ ఆదేశాలతో హైరానా ► తొలి విడత నాలుగు డివిజన్ల ఎంపిక! ► వెంటాడుతున్న నిధుల కొరత విజయవాడ సెంట్రల్ : రాజధాని నగరంలో స్మార్ట్ డివిజన్ల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకోసం నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెలైట్ ప్రాజెక్ట్గా నాలుగు డివిజన్లను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నారు. స్మార్ట్ సిటీల్లో స్థానం దక్కించుకోలేని విజయవాడపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది అక్టోబర్ 15న నగరంలో స్మార్ట్ డివిజన్లను ఎంపిక చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్ర టరీ టక్కర్ ఆదేశాలు జారీ చేశారు. నగ రపాలక సంస్థ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్మార్ట్ డివిజన్ల ఏర్పాటుపై ఎందుకు దృష్టిపెట్టలేదంటూ టక్కర్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో అధికారుల్లో హైరానా మొదలైంది. కమిషనర్ జి.వీరపాండియన్ స్మార్ట్ డివిజన్ల ఎంపిక బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించారు. స్మార్ట్ డివిజన్లు అంటే... ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి. తడి, పొడి చెత్త విభజన చేయాలి. ఆధునిక హంగులతో పార్కులను తీర్చిదిద్దాలి. పచ్చదనాన్ని పెంపొందించాలి. నిరంతర నీటి సరఫరా జరగాలి. కుళాయిలకు నీటి మీటర్లు అమర్చాలి. రహదారులు అభివృద్ధి చేయాలి. విద్యుత్ దీపాల వెలుగులు సక్రమంగా ఉండాలి. అప్పుడే ఆ డివిజన్ను స్మార్ట్ (ఆకర్షణీయమైనది)గా గుర్తిస్తారు. దీనిని సాధించేందుకు ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుంది. కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో స్మార్ట్ డివిజన్ల ఎంపిక బాధ్యతను చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, చీఫ్ ఇంజనీర్ ఎం.ఏ.షుకూర్, ఏడీహెచ్ జీపీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. తొలి విడతగా సర్కిల్-3లో రెండు, సర్కిల్-1, 2లలో ఒక్కోటి చొప్పున మొత్తం నాలుగు డివిజన్లను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అమలు సాధ్యమేనా! తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న నగరపాలక సంస్థలో ప్రతినెలా జీతాల కోసం వెతుకులాట సాగించాల్సిన దుస్థితి నెలకొంది. 59 డివిజన్ల పరిధిలో సుమారు 132 పార్కులు ఉన్నాయి. నిధుల లేమి కారణంగా 70 శాతం పార్కులు కళావిహీనంగా తయారయ్యాయి. రాజీవ్గాంధీ, కేఎల్రావు, రాఘవయ్య పార్కుల అభివృద్ధికి కోటి రూపాయల హడ్కో నిధులు ఇచ్చింది. డివిజన్లలో చిన్న పార్కుల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరినప్పటికీ స్పందన రాలేదు. ఇక పారిశుధ్య విషయానికి వస్తే ఇంటింటి చెత్త సేకరణ 70 శాతం మించి జరగడం లేదు. చెత్త విభజన కొన్ని డివిజన్లకే పరిమితమైంది. కృష్ణమ్మ చెంతనే ఉన్న నగరవాసులకు దాహం కేకలు తప్పడం లేదు. సర్కిల్-3 పరిధిలోని రామలింగేశ్వర నగర్ 10 ఎంజీడీ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంతో సర్కిల్-3లో అత్యధిక డివిజన్లలో మురుగునీరు సరఫరా అవుతోంది. కొండ, శివారు ప్రాంతాల్లో నీరు సక్రమంగా అందడం లేదు. కుళాయిలకు నీటి మీటర్లు ఏర్పాటు చేయలన్న ప్రతిపాదనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో స్మార్ట్ డివిజన్ల ఏర్పాటు సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
కేంద్రం పరిశీలనలో ‘స్మార్ట్’
► మరోసారి పోటీలో వరంగల్ ► మే 15లోపు ఫలితాల వెల్లడి ► రూ.2861 కోట్లతో సమగ్ర నివేదిక ► మొత్తం ఏడు థీమ్లు, 20 ప్రాజెక్టులు ► పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం స్మార్ట్సిటీ పథకం రెండో దశ అమలులో చోటు దక్కించుకునేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో లోపాలను సవరించి.. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. సాక్షి, హన్మకొండ: నగరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఈ వంద నగరాలకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్)లతో స్మార్ట్సిటీ చాలెంజ్ కాంపిటీషన్లో పాల్గొనాలి. ఈ కాంపిటీషన్లో వచ్చిన డీపీఆర్ల ఆధారంగా తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేశారు. వరంగల్తో పాటు మరో 23 నగరాలు తృటిలో ఈ అవకాశాన్ని చే జార్చుకున్నాయి.దీంతో ఈ 23 నగరాలకు మరో అవకాశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కల్పించింది. వీటికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ కాంపిటీషన్ ఏర్పాటుచేసి,ఈ ఏడాది ఏప్రిల్ 21 లోగా డీపీఆర్లను సమర్పించాల్సిం దిగా ఆదేశించింది. గ్రేటర్ వరంగల్ కొత్త కార్యవర్గం ఎ న్నికైన వెంటనే మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సవరించిన డీ పీఆర్ను ఆమోదించారు. ఈ నివేదికను ఈ నెల 20న న్యూఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించారు.ఫాస్ట్ట్రాక్ కాం పిటీషన్లో వచ్చిన నివేదికలను మే 15లోగా పరిశీలించి, ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. 86 ప్రాజెక్టులు.. స్మార్ట్సిటీ ఫాస్ట్ట్రాక్ కాంపిటీషన్ కోసం సమర్పించిన నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్సిటీ పథకం నిబంధనల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని (సెంట్రల్ సిటీ) అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ప్రధానం. దీనికి అదనంగా నగరం మొత్తానికి పనికి వచ్చేలా (పాన్సిటీ) ఎంపిక చేసిన విభాగాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయొచ్చు. సెంట్రల్సిటీ, పాన్సిటీల ద్వారా గ్రేటర్ వరంగల్లో రూ.2861 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. సెంట్రల్ సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ఏడు థీమ్లుగా విభజంచారు. ఈ ఏడు థీమ్ల ద్వారా మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 20 మేజర్ ప్రాజెక్టులు, 66 సబ్ మేజర్ ప్రాజెక్టులుగా విభజించారు. భద్రకాళీ చెరువును పర్యాటక ప్రాంతంగా మా ర్చడం, ఎంపిక చేసిన మురికి వాడల్లో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం, నగరంలో వాణిజ్యరంగం అభివృద్ధి చెందేలా మౌలిక సదుపాయల కల్పన, రవాణ వ్యవస్థ ఆధునీకరణ, పట్టణంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ పరిరక్షణ, నగరం మధ్యలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రధాన కార్యక్రమంగా సమగ్ర నివేదికలో పే ర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు రూ. 2707 కోట్లు ఖర్చు అవుతాయని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. పాన్సిటీ పథకం ద్వారా భద్రత, రవాణ వ్యవస్థ, సమాచార వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.153 కోట్ల వ్యయం అవుతుందని ప్రణాళికలో పేర్కొన్నారు. నగర అభివృద్ధి నమూనాలో తొలిసారిగా పర్యావరణానికి పెద్దపీఠ వేశారు. సెంట్రల్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో పచ్చదనం పెంచేందుకు రూ.163 కోట్లు కేటాయించారు. స్మార్ట్సిటీ ద్వారా రూ.989 కోట్లు స్మార్ట్సిటీ పథకం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.2861 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.989 కో ట్ల నిధులు మంజూరు కానున్నాయి. దీని తర్వా త ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రూ.906 కోట్లు సమీకరించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రూ.393,కేంద్ర ప్రా యోజిత కార్యక్రమాల ద్వారా రూ.370 కోట్లు, రుణాల ద్వారా రూ.203 కోట్లు సమీకరిస్తారించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. -
రూ.2681 కోట్లతో ‘స్మార్ట్’
సాంస్కృతిక రాజధానిగా ఓరుగల్లు పర్యాటకులను ఆకర్షించేలా పనులు పట్టణంలో పచ్చదనానికి ప్రాధాన్యం మారనున్న నగరం రూపురేఖలు స్మార్ట్సిటీ డీపీఆర్ లక్ష్యాలు ఇవే.. వరంగల్ నగరాన్ని రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్మార్ట్సిటీ సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నగరానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యాన్ని ఉపయోగించుకుని పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కేలా పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా భద్రకాళి, పద్మాక్షి ఆలయాల కేంద్రంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధమైంది. దీంతో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అదేవిధంగా బస్స్టేషన్, డ్రెరుునేజీల నిర్మాణం, సోలార్ విద్యుత్ దీపాలు, వర్షపు నీరు ఒడిసి పట్టడం వంటి పనులు ఉన్నాయి. ఈ పనులకు రూ.2681 కోట్లతో సిద్ధం చేసిన స్మార్ట్సిటీ ప్రతిపాదనల్లో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.. హన్మకొండ: నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్సిటీ పథకం తొలి దశ అమలులో వరంగల్ నగరానికి అవకాశం త్రుటిలో చేజారిపోయింది. మలిదశ అమలులో చోటు దక్కించుకునేందుకు లీ కంపెనీ నేతృత్వంలో సమగ్ర నివేదికను రూపొందించారు. మొత్తం రూ.2,681 కోట్ల వ్యయంతో నగరం రూపురేఖలు మార్చే విధంగా పనులు చేపట్టాలని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారా రూ.1686 కోట్ల నిధులు సమీకరించాలని సూచించారు. మిగిలిన రూ.995 కోట్లను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సేకరించాలని డీపీఆర్లో పేర్కొన్నారు. ఇలా సేకరించిన నిధులతో ఐదేళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యవిభాగాలు స్మార్ట్సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ప్రాంతాల వారీగా వర్గీకరించారు. ఇందులో రెట్రోఫిట్టింగ్ పేరుతో భద్రకాళీ చెరువు చుట్టూ 500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తారు. రీడెవలప్మెంట్ స్కీం కింద 50 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, ఆ ప్రాంతాన్ని అన్ని రకలా అధునాతన సదుపాయాలు ఉండేలా అభివృద్ధి పరుస్తారు. దీని తర్వాత 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి దీన్ని గ్రీన్ఫీల్డ్ సిటీగా రూపాంతరం చెందేలా పనులు చేపడుతారు. వీటితో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా మరికొన్ని కార్యక్రమాలు చేపడుతారు. ఈ విభాగంలో ఈ గవర్నెన్స్ సిటిజన్ సర్వీసెస్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనే జ్మెంట్, అర్బన్ మొబిలిటీ వంటి పనులు నిర్వహిస్తారు. -
అసెంబ్లీలో అరకు కాఫీ
ఎమ్మెల్యేలకు పంపిణీ సాక్షి, విశాఖపట్నం : ఇప్పటికే పలు ప్రత్యేకతలు చాటుకుంటున్న అరకు వేలీ కాఫీ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తయారు చేస్తున్న ఈ కాఫీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రత్యేకతను సాధించింది. విశాఖ ఏజెన్సీలో సహజసిద్ధంగా పండిన సేంద్రియ కాఫీ రుచిలో పెట్టింది పేరు. ఈ కాఫీ గింజలను పౌడరుగా చేసి జీసీసీ మార్కెట్లో విక్రయిస్తోంది. దీనికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల విశాఖలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు విదేశీ ప్రతినిధులు అరు కాఫీని రుచి చూసి మంత్రముగ్ధులయ్యారు. గత నెలలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లలో దీని పేరు మరింత ఇనుమడించింది. ఐఎఫ్ఆర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అరకు కాఫీని సేవించి రుచి అమోఘంగా ఉందని కితాబు నిచ్చారు. స్మార్ట్ సిటీలో భాగంగా అమెరికా నుంచి విశాఖ వచ్చిన ప్రతినిధుల బృందం కూడా అరకు కాఫీ తాగడమే కాదు.. రుచిని మెచ్చుకుని తమ వెంట తీసుకెళ్లారు కూడా. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఈ కాఫీని గిఫ్ట్గానూ ఇస్తున్నారు. ఇలావుండగా ఈ అరకు కాఫీని మన ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఆలోచన ఆ శాఖ ఉన్నతాధికారులకు వచ్చింది. దీంతో జీసీసీ ఉన్నతాధికారులు సుమారు 200 కాఫీ ప్యాకెట్లను (200 గ్రాముల ప్యాక్) గిఫ్ట్ ప్యాక్ చేసి బుధవారం అసెంబ్లీకి, శాసనమండలికి పంపించారు. వీటిని బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు పంపిణీ చేశారు. నేడో రేపో శాసనమండలిలో ఎమ్మెల్సీలకు అందజేయనున్నారు. అరకు కాఫీకి అనతికాలంలోనే అత్యంత ఆదరణ రావడం ఆనందంగా ఉందని జీసీసీ ఎండీ ఏఎస్పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. -
‘స్మార్ట్’పై ఆశలు
► రెండో జాబితాలో కరీంనగర్కు అవకాశం..! ► నేడు ఢిల్లీలో స్మార్ట్సిటీల సదస్సు ► హాజరవుతున్న కమిషనర్ కృష్ణభాస్కర్ కరీంనగర్ కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని వంద నగరాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన స్మార్ట్సిటీల రెండో జాబితాపై ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి జాబితాలో 20 నగరాలను ప్రకటించగా... అందులో కరీంనగర్ కార్పొరేషన్కు అవకాశం తృటిలో చేజారిన విషయం తెలిసిందే. రెండో విడతలో మరో 20 నగరాలకు చోటు కల్పించేందుకు స్మార్ట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో స్మార్ట్సిటీల జాబితాకు ఎంపికై పోటీలో ముందు వరుసలో ఉన్న నగరాల కమిషనర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ హాజరవుతున్నారు. స్మార్ట్ సిటీ హోదా కోసం చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందని సమాచారం. వడివడిగా అడుగులు తెలంగాణలో వరంగల్తోపాటు కరీంనగర్ స్మార్ట్సిటీ రేసులో వడివడిగా అడుగులు వేస్తోంది. స్మార్ట్సిటీకి కావాల్సిన హంగులు, ఆర్భాటాలను ఇప్పటికే సమకూర్చుకున్న నగరం ఆన్లైన్పై దృష్టి సారించింది. ప్రతీ అంశాన్ని ఆన్లైన్ చేయడం ద్వారా మరిన్ని మార్కులు సాధించే అవకాశముంది. దీంతో రెండో జాబితాలో 20 సిటీల్లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. రెండో జాబితాతోనే మూడో జాబితాను కూడా ప్రకటించేందుకు కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసినా కరీంనగర్కు స్మార్ట్ కిరీటం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క యూజీడీ మాత్రం మార్కుల జాబితాలో నగరాన్ని కాస్త వెనక్కి నెడుతోంది. మార్కుల్లో ముందు వరుసలో... కేంద్రం స్మార్ట్సిటీలుగా వంద నగరాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన నాటి నుంచే కరీంనగర్ నగరపాలక సంస్థ యంత్రాంగం, పాలకవర్గం చోటు దక్కించుకునేందుకు కృషిచేస్తోంది. తెలంగాణకు రెండు సిటీలను మాత్రమే కేటాయించడంతో.. మొదట హైదరాబాద్, వరంగల్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే హైదరాబాద్కు స్మార్ట్ హోదాతో పెద్దగా ఒరిగేదేమీ లేదని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ను తప్పించింది. ఆ స్థానంలో 100 మార్కులకు గాను 87.5 మార్కులతో ఉన్న కరీంనగర్ పేరును ప్రతిపాదించింది. మొదటి దశలో చోటు దక్కకపోవడంతో రెండో దశలోనైనా కచ్చితంగా చోటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషనర్ సదస్సుకు హాజరవుతుండడంతో తప్పకుండా ఫలితం కనబడుతుందనే ఆశ ప్రజలు, అధికారుల్లో ఉంది. నగర అభివృద్ధిపై ప్రజెంటేషన్ స్మార్ట్ సిటీకి కావాల్సిన అర్హతలన్నింటినీ సదస్సులో కమిషనర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. కొత్తగా చేపట్టనున్న వెహికిల్ ట్రాకింగ్ సిస్టం(జీపీఆర్ఎస్), సీసీ కెమెరాల ఏర్పాటు, ఈ-ఆఫీస్, ఆన్లైన్ కంప్లయింట్ సిస్టం తదితర అంశాలను వివరించనున్నారు. ఇప్పటికే అమలవుతున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ, పిన్పాయింట్ చెత్త సేకరణ, చెత్త రీసైక్లింగ్, చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ(వర్మీ కంపోస్ట్), ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వంటి పనులపై ప్రజెంటేషన్ చేయనున్నారు. -
స్మార్ట్ సిటీకి నిధులేవి..?
విశాఖపట్నం: హుద్హుద్ను జయించాం...విశాఖను పునర్నిర్మించాం..స్మార్ట్ సిటీగా ఎంపికైన విశాఖ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో మాత్రం విశాఖకు దక్కింది శూన్యహస్తమే. నిన్నటి కేంద్రబడ్జెట్లో స్మార్ట్ సిటీకి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు లభించక తీరని అన్యాయం జరగగా, నేటి రాష్ర్ట బడ్జెట్లో కూడా విశాఖకు నిరాశే ఎదురైంది. టాప్-20 స్మార్ట్సిటీల జాబితాలో జీవీఎంసీ టాప్-8లో నిలిచిన విశాఖ ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణన్ సర్వేలో ఐదో స్థానంలో నిలిచింది. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా 700 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జోన్-1 ప్రాంతమైన ఆర్కే బీచ్, రుషి కొండ తదితర ప్రాంతాలను రూ.1430 కోట్లతో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా రూ.వంద కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు సమకూర్చనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణ సాయం సమకూర్చుకోవల్సి ఉంది. గడిచిన రెండేళ్లకుగాను కేంద్రం నుంచి రూ. 200 కోట్లు, రాష్ర్టం నుంచి రూ.200 కోట్లు సమకూర్చాల్సి ఉంది. కానీ కేంద్ర బడ్జెట్లో స్మార్ట్ సిటీలన్నింటికి రూ.250 కోట్ల వరకు కేటాయింపులు జరపగా దీంట్లో జీవీఎంసీకి దక్కే మొత్తం అరకొరగానే ఉంటుంది. కాగా మంగళవారం రాష్ర్ట అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో విశాఖ, కాకినాడలు స్మార్ట్ సిటీగా ఎంపికయ్యాయంటూ ప్రకటనకే పరిమితమయ్యారే తప్ప బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన జీవీఎంసీ బృందం ప్రస్తుతం డీపీఆర్ తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. విస్కో ప్రాజెక్టుకు మాత్రం లక్ష రూపాయలు విదిలించారు. -
ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కులేదు
► స్మార్ట్ సిటీలో వరంగల్ను చేర్పించాం ► డీపీఆర్లో లోపాలతో ఎంపిక కాలేదు ► అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే మాపై నిందలు ► బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్రావు హన్మకొండ : డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీఆర్పీ) తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్రావు టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. సోమవారం హన్మకొండ హంటర్రోడ్డులోని నెక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో ఎంపిక చేయలేదని, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని వ్యాఖానించే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలన్నారు. స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడానికి తయారు చేయాల్సిన నివేదికను ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు సక్రమం గా తయారు చేయకపోవడంతోనే రావాల్సిన పాయింట్లు రాక స్మార్ట్ సిటీలో ఎంపిక కాలేదన్నారు. ఇదీ తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ మం త్రులు, నాయకులు బీజేపీపై నిందలు వేస్తుం దని ధ్వజమెత్తారు. జిల్లాలో బీజేపీ నుంచి ప్రజాప్రతినిధి లేకున్నా జిల్లా నాయకులం ఢిల్లీకి వెళ్లి వరంగల్ను స్మార్ట్ సిటీ జాబితాలో పెట్టించామన్నారు. దీంతో పాటు హెరిటేజీ సిటీ, అమృత్ పథకాలు, ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు మంజూరు చేయించామన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతుంటే వాటిని తమ గొప్పగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని దుయ్యబట్టారు. ఆహార భద్రతా పథకం, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం ఇళ్లు మంజూరు చేయిస్తే తామే నిర్మిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు వరంగల్ ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్లో ఆస్తి, నల్లా, విద్యుత్ పన్నులు మాఫీ చేసి, వరంగల్లో మాత్రం మాఫీ చేయలేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు వన్నాల శ్రీరాములు, కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, ఓంటేరు జయపాల్, రావు అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్ సిటీగా నెల్లూరు
ఆస్ట్రేలియా కాన్సులేట్ బృందంతో మంత్రి నారాయణ చర్చలు విజయవాడ బ్యూరో : నెల్లూరు నగరాన్ని స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ఆ స్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ చెప్పారు. చెన్నయ్లోని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సీన్ కెల్లీ బృందంతో ఆయన మంగళవారం సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణ నెల్లూరు నగరం ప్రత్యేకతలను వారికి వివరించారు. సముద్రానికి దగ్గరగా ఉండడం, కృష్ణపట్నరం పోర్టు, సమీపంలోనే చెన్నయ్ ఎయిర్పోర్టు ఉండడం, కావాల్సినంత భూమి కూడా అందుబాటులో ఉండడం వల్ల ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆస్ట్రేలియా బృందం సమ్మతించింది. తిరుపతి నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో మాస్టర్ప్లాన్, సిటీ ప్లానులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ నమూనాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు మున్సిపల్ శాఖ, ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం అంగీకరించాయి. విద్య, పర్యాటకం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో తాము ఏపీకి మద్ధతు ఇస్తామని కెల్లీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా బృందాన్ని నారాయణ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసి వివరాలు తెలిపారు. -
అద్భుత అవకాశంగా భావిస్తున్నా: చంద్రబాబు
విశాఖపట్నం : అమెరికా ప్రభుత్వంతోపాటు ఆ దేశ సంస్థలతో కలసి పని చేయడం అద్భుత అవకాశంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖపట్నం నగరంలోని గేట్ వే హోటల్లో యూఎస్ ప్రతినిధులతో జరిగిన యూఎస్ఐడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... హుద్హుద్ తుపాన్ నుంచి కోలుకున్న విశాఖ నగరంలో రెండు కీలక సదస్సులు జరగడం విశేషమని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 20 స్మార్ట్ సిటీల తొలి జాబితాను విడుదల చేసిందని... అందులో విశాఖ నగరం ఆ జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు. భారత్లో తొలిసారి ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఐఎఫ్ఆర్లో 50 దేశాలు పాల్గొన్నాయన్నారు. ఈసందర్భంగా ఆయాదేశాల ప్రతినిధులు విశాఖ నగరాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. విశాఖపట్నం నుంచి ముంబయి ఎక్స్ప్రెస్ వేపై కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడినట్లు చంద్రబాబు వెల్లడించారు. తీర ప్రాంత అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. చెన్నై నుంచి బెంగళూరుకు కృష్ణపట్నం పోర్ట్ మీదుగా జైకా పని చేస్తుందని... అలాగే విశాఖ నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్పై ఏడీబీ పని చేస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని... అలాగే త్వరలో గోదావరి, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు సమక్షంలో పలు కీలక ఒప్పందాలపై యూఎస్ అధికారులు, ఏపీ అధికారులు సంతకాలు చేశారు. -
సీమకు అన్యాయం చేస్తే సహించం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధన కోసం విద్యార్థి సంఘాలు గర్జించాయి. సీమకు అన్యాయం చేస్తే సహించమంటూ నినాదాలు చేశాయి. రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించాయి. సీమపై పాలకులు చూపుతున్న వివక్షపై దండెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోస్తా జపం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు హాజరై సీమ సమస్యలపై గళమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వీవీనాయుడు అధ్యక్షతన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ల శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 స్మార్ట్ సిటీలను ప్రకటించగా వెనుకబడిన రాయలసీమలో ఒక్కటి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో రాళ్ల సీమగా మారిన రాయలసీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు రావాల్సిన రాజాధాని అమరావతికి తరలించారని, హైకోర్టును అక్కడే స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో సీమకు రావాల్సిన పరిశ్రమలు కోస్తాకు తరలిపోతున్నాయని, అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుతుందన్నారు. అంతకుముందు రాజవిహార్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారావు, బాలసుందరం, అరుణ్శర్మ, రవికుమార్, నాగేశ్వరరెడ్డి, సుహాన్బాష, రాజునాయుడు, శివకుమార్, క్రాంతికుమార్, రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. -
పేదలకు రూ. 5లక్షల లోపే ఇళ్లు!
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ♦ దేశంలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువకు ఇల్లు కొనుక్కునేవారు ఒక్కశాతమే ♦ రూ. 5 లక్షలలోపు అందిస్తే 30 శాతం మందికి ఇళ్లు న్యూఢిల్లీ: పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. రూ.5 లక్షల కంటే తక్కువ ధరకే ఇళ్లను అందిస్తామని చెప్పారు. ‘తక్కువ ధరకు ఇళ్లు నిర్మించడం చాలా ముఖ్యమైన అంశం. మనదేశంలో రూ.10 లక్షల కన్నా ఎక్కువ వెచ్చించి ఇల్లు కొనుక్కునేవారు కేవలం ఒక్క శాతమే ఉన్నారు. రూ.5 లక్షల లోపు ఇళ్లను అందించగలిగితే దాదాపు 30 శాతం మంది వాటిని కొనుక్కోగలుగుతారు’ అని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ ‘స్మార్ట్ సిటీ’పై అసోచామ్ నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. స్మార్ట్సిటీల నిర్మాణంతోపాటు పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కేంద్రం అధికార ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాగ్పూర్లో ప్రయోగ ప్రాతిపదికన ఇలాంటి వెంచర్ ఒకటి చేపట్టినట్టు వివరించారు. నిర్మాణానికి ఒక చదరపు అడుగుకు రూ.వెయ్యి వెచ్చించినట్టు వివరించారు. ఈ లెక్కన 450 చదరపు అడుగుల ఇంటిని రూ.5 లక్షలలోపే నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 20న ఈ ఇళ్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. -
తిరుపతి.. లేదు పరపతి
టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదు గోడు వెళ్లబోసుకున్న తమ్ముళ్ల సమస్య ఇన్చార్జ్ మంత్రి నారాయణ దృష్టిక ఢిల్లీ నుంచి సీఎం వచ్చా మాట్లాడదామంటూ ఆయన దాటవేత‘అధికారులు మా మాట వినడంలేదు. చిన్నపని చెప్పినా చేయడంలేదు. ఇలాగే ఉంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా పనిచేసేది’ అంటూ తిరుపతి నగరంలోని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వెళ్లగక్కారు. అధికారుల తీరు మార్చాల్సిందేనంటూ సోమవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన విషయాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం ఢిల్లీలో ఉన్నారని.. ఆయన వచ్చాక మాట్లాడదామంటూ మంత్రి మాట దాట వేసినట్లు తెలిసింది. తిరుపతి: తిరుమల కొండపైన గదుల వేలం విషయమై టీటీడీ ఈవో తమను లెక్క చేయలేదంటూ పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. చర్చల కోసం వెళ్లిన తమను లోపలి నుంచి బయటకు వెళ్లమని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేకు కూడా తగిన గౌరవం లభించలేదని సమావేశంలో పలువురు నేతలు వాపోయినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్పైన కేటాయించడంలేదంటూ కార్యకర్తలు పేర్కొన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జన్మభూమి కమిటీలను పటిష్టంచేసి కార్యకర్తలకు పనులు అప్పగించకపోతే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని వాపోయినట్లు తెలిసింది. క్లబ్బులపై పోలీసుల దాడిని సైతం టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే బార్ల నిర్వహణ జరుగుతున్నా ఇబ్బడిముబ్బడిగా దాడులు చేయడం ఏమిటని కొందరు నేతలు వాపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైతం తీవ్ర మనస్తాపం చెందినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన భర్త ఈ పదవిని కానుకగా ఇచ్చినట్టుందని,నా మాట ఎవ్వరూ వినడం లేదని మంత్రి బొజ్జల, నారాయణతో పాటు పార్టీ అధ్యక్షుని ఎదుట వాపోయినట్లు దేశం వర్గాల్లో చర్చ సాగుతోంది. ముక్కు సూటిగా వ్యవహరించడమే తప్పా? తిరుమల కొండపై గదుల వేలం విషయంలో టీటీడీ ఈవో ముక్కుసూటిగా వ్యవహరించినట్టు సమాచారం. బాధితులెవ్వరికీ అన్యాయం జరగనివ్వననని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే రాజకీయ నాయకుల ప్రయేయం లేకుండా బాధితులు ఎవరైనా ఉంటే తనను నేరుగా కలవాలంటూ.. ఈవో చెప్పిన విషయాన్ని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. ఏడు ఏళ్లుగా గదులు ఖాళీగా ఉన్నాయని, వేలం వేయకపోతే ఎలా అని ఈవో తమను కలిసిన నేతలను సైతం ప్రశ్నించినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే విషయం తన దృష్టికి తేవాలని.. వెంటనే విచారించి వారికి న్యాయం చేస్తామని తెలిపినట్లు సమాచారం. రాజకీయ జోక్యాన్ని టీటీడీ ఈవో అంగీకరించక పోవడంపై నగరంలోని నేతలు కలత చెందినట్లు తెలిసింది. నగరపాలక కమిషనర్ సైతం రాత్రింబవళ్లు కష్టపడుతూ, స్మార్ట్ సిటీ పోటీకి అన్నీ సిద్ధం చేసుకుంటూనే, ఓ వైపు తుడా పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. ఆయన నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహారించడం పార్టీ నేతలకు మింగుడు పడనట్లు చర్చసాగుతోంది. అసాంఘిక కర్యకలాపాలపై ఎస్పీ దృష్టి సారించడాన్ని సైతం అధికార పార్టీనేతలకు ఇబ్బందికరంగా మారినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.