లేపాక్షి : లేపాక్షి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 2016 ఫిబ్రవరి 29 నుంచి జూలై 27వ తేదీ వరకు హుండీని లెక్కించగా రూ.62,802 ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామతులసి, మేనేజర్ నరసింహమూర్తి, గ్రామపెద్దలు రామాంజినేయులు, రవీంద్ర, అంజినరెడ్డి, అర్చకులు నరసింహశర్మ, సూర్యప్రకాష్రావు, పురావస్తు శాఖ సిబ్బంది రాము తదితరులు పాల్గొన్నారు.