4న లోక్‌సభ స్పీకర్‌ జిల్లా పర్యటన | Loksabha speaker to tour Nellore on 4th | Sakshi
Sakshi News home page

4న లోక్‌సభ స్పీకర్‌ జిల్లా పర్యటన

Published Wed, Aug 31 2016 11:37 PM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM

4న లోక్‌సభ స్పీకర్‌ జిల్లా పర్యటన - Sakshi

4న లోక్‌సభ స్పీకర్‌ జిల్లా పర్యటన

 
నెల్లూరు(పొగతోట) : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రమహాజన్‌ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. 4న ఉదయం 6.20 గంటలకు ఇన్‌డోర్‌లో ప్రత్యేక విమానంలో బయలుదేరి 7.50 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేణిగుంట నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 8.30 గంటలకు వెంకటాచలం చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు అక్షర విద్యాలయం, స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో రేణిగుంటకు బయలుదేరి వెళ్లతారు. 
మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ జిల్లా పర్యటన 
పెట్రోలియం, సహాజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. 4న ఉదయం చెన్నై నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9 గంటలకు వెంకటాచలం చేరుకుంటారు. అక్షర విద్యాలయం, స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు శ్రీసిటీకి బయలుదేరివెళ్లతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement