ప్రతి పంచాయతీలో వాతావరణ సమాచార కేంద్రం | NG Ranga Versity Incharge VC Press meet | Sakshi
Sakshi News home page

ప్రతి పంచాయతీలో వాతావరణ సమాచార కేంద్రం

Published Fri, Aug 26 2016 7:52 PM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

NG Ranga Versity Incharge VC Press meet

యూనివర్సిటీ క్యాంపస్: కరువు జిల్లాల్లో ప్రతి పంచాయతీలో వాతావరణ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ విజయకుమార్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరువు జిల్లాల్లో వాతావరణ సమాచారం రైతులకు అందించేందుకు వాతావరణ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటుచేస్తునట్లు వెల్లడించారు.

అదేవిధంగా ప్రతి జిల్లాలో ఆగ్రో మెట్రాలజీ యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 11 నుంచి 14వతేదీ వరకు సుభాష్ పాలేకర్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగే ఈ సదస్సుకు ఆరువేల మంది రైతులు హాజరుకానున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement