Acharya NG Ranga Agricultural University
-
సేంద్రియ పద్దతులపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు
-
డ్రోన్లతో వెదసాగు సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరిసాగులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ముందుకు సాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై రైతులకు, గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తూ, వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపును నిజం చేస్తోంది. ఇప్పటివరకు 10 ప్రధాన పంటల్లో డ్రోన్లతో పురుగుమందులు చల్లడానికి ప్రామాణికాలను తయారుచేసి, శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా వెదపద్ధతి(విత్తనాలు వెదజల్లడం)లో విత్తనాలు చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు సకాలంలో వరినాట్లు వేయలేకపోతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వెదసాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరిసాగులో 21 శాతం వరకు వెదపద్ధతిలోనే జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వెదపద్ధతిలో గత ఏడాది 100 ఎకరాల్లో వరి, మినుము, పచ్చి రొట్ట సాగుచేశారు. దుక్కి దున్నిన తరువాత నుంచి అన్ని పంటల్లో డ్రోన్లతో అన్ని రకాల పనులు చేసుకోవచ్చని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను జోడించి డ్రోన్లతో వరి విత్తనాలను వెదజల్లించాలని వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సమయం, డబ్బు ఆదా డ్రోన్లతో వెదపద్ధతిలో తక్కువ విత్తనాలు సరిపోతాయి. సమయం, డబ్బు ఆదా అవుతాయి. మొదటి ఏడాది ఫలితాలను విశే్లషించిన తర్వాత వెదపద్ధతిలో విత్తనాలను నాటడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గుర్తించారు. రెండో సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగా వస్తే దుక్కి నుంచి కోత వరకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, చేతితో చల్లే పద్ధతిలో ఎకరానికి 16 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు వినియోగిస్తున్నారు. అదే డ్రోన్ ద్వారా చల్లితే 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. గత ఏడాదిగా డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లడం, ఎరువులు (యూరియా, డీఏపీ) వేయడం, పురుగుమందుల పిచికారీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎకరం పొలంలో మూడు నిమిషాల్లో విత్తనాలు చల్లవచ్చు. 50 కిలోల రసాయనిక ఎరువును ఎనిమిది నిమిషాల్లో చల్లవచ్చు. ఎకరా విత్తనాలు విత్తుకునేందుకు రూ.400 నుంచి రూ.500 ఖర్చవుతుంది. విత్తనాల్లో 25 శాతం ఆదా అవుతాయి. పురుగుమందుల వ్యయం 25 శాతం తగ్గడమేగాక చల్లే ఖర్చులో రూ.400 ఆదా అవుతాయి. గత ఏడాది వెదపద్ధతిలో చేసిన సాగు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ఈ విధానంపై పరిశోధనలను ముమ్మరం చేసింది. డీజీసీఏ అనుమతితో శిక్షణ దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్లను వినియోగించడంతోపాటు డీజీసీఏ అనుమతి తీసు కుని వ్యవసాయ డ్రోన్ పైలట్లకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది. వర్సిటీలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 217 మంది రైతులు, గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు అందజేసింది. మరో వందమంది వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చింది. తిరుపతి, పులివెందులలో డ్రో¯Œ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అధునాతన సాంకేతికత ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రయోగాత్మంగా చేపట్టి మంచి ఫలితాలను సాధించాం. వెదపద్ధతిలో వరిసాగు, పురుగుమందులు, ఎరువుల పిచికారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మరికొంత సాంకేతికతను రైతులకు అందించేందుకు రోబో టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టాం. అధునాతన సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, వీసీ, ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ -
అరవై ఏళ్లు.. 239 రకాలు..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మందికి ఈ విశ్వవిద్యాలయం అన్నం పెడుతోంది. అంటే.. ఆ వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలనే దేశంలో మూడోవంతు ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అదే మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) ప్రత్యేకత. దేశంలోనే పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఈ వర్సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ వర్సిటీ సాధించిన విజయాలెన్నో.. ఎన్నెన్నో. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త వరి రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడమే కాదు.. సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ సృష్టించిన రకాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలో సాగయ్యే వరిలో మూడోవంతు.. దేశంలో వరి సాగవుతున్న 46 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ‘ఆంగ్రూ’ రకాలే సాగవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ వర్సిటీ రైతుల మన్ననలు చూరగొందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జాతీయ స్థాయి వరి ఉత్పత్తి (131 మిలియన్ టన్నులు)లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రకాలే కావడం గమనార్హం. సగటు దిగుబడి జాతీయ స్థాయిలో హెక్టార్కు 2,832 కిలోలు.. ఏపీలో హెక్టార్కు 5,048 కిలోలు ఉంటే, ఈ వర్సిటీ రూపొందించిన రకాలు ఏకంగా హెక్టార్కు 5,669 కిలోల దిగుబడినివ్వడమే కాదు జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. 60 ఏళ్లలో 239 రకాల సృష్టి.. 1964 జూన్ 12న ఏర్పాటైన ఈ వర్సిటీ.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడంలో నిరంతరం కృషిచేస్తోంది. 60 ఏళ్లలో 123 అధిక దిగుబడినిచ్చే వరి రకాలతో పాటు 47 రకాల పప్పు ధాన్యాలు, 29 రకాల నూనె గింజలు, 21 రకాల వాణిజ్య పంటలు, 19 రకాల చిరుధాన్యాలను ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసింది. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి. వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా, తెగుళ్లు, చీడపీడలు, కీటకాలను ఎదుర్కొనే రకాలను అభివృద్ధి చేయడంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబా మసూరి) వరి రకాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే మొట్టమొదటి బూజు తెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య)తో పాటు ప్రసిద్ధి చెందిన కే6, నారాయణి, లేపాక్షి వంటి వేరుశనగ రకాలు సైతం వర్సిటీ అభివృద్ధి చేసినవే. ఆంగ్రూ రకాలతో రూ.25వేల కోట్ల ఆదాయం.. ♦ ఆంధ్రలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో వర్సిటీ సృష్టించిన వరి రకాలే సాగవుతున్నాయి. ♦ సాగు విస్తీర్ణంలో 72.63 శాతం, ఉత్పత్తిలో 87.27 శాతం వర్సిటీ రకాలే. ♦ పప్పు ధాన్యాల సాగులో 35.63 శాతం, ఉత్పత్తిలో 32.16 శాతం వర్సిటీ రూపొందించినవే.. ♦ వేరుశనగ ఉత్పత్తిలో 94.03 శాతం వర్సిటీ రకాలే. ఒక్క కే6 రకమే 82 శాతం అందిస్తోంది. ♦ నువ్వుల సాగులో కూడా 87.50 శాతం ఆంగ్రూ రకాలదే కావడం విశేషం. ♦ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనెగింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి.. మొత్తం రూ.25వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాష్ట్ర రైతులు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.8వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం.. ఇక ఎగుమతుల్లో బాస్మతేతర బియ్యం రకాలదే సింహభాగం. వీటిలో మూడోవంతు ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసినవే. ఉదా.. దేశం నుంచి 2021–22లో బియ్యం ఎగుమతుల ద్వారా రూ.46,914.28 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చింది. ఈ బియ్యం ఎగుమతుల్లో 33 శాతం (రూ.15,481.71కోట్లు) ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలకు చెందిన బియ్యమే. అలాగే, మిగతా కాలంలో ఏటా ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా సగటున రూ.8,073 కోట్ల ఆదాయం సమకూరుతోందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతోంది. 12న మెగా సీడ్ మేళా.. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో ‘మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం’ అనే నినాదంతో విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగయ్యే, వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచుతూ రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెట్టుబడికి ఢోకాలేదు ఆంగ్రూ అభివృద్ధి చేసిన వివిధ రకాల సాగుతో పెట్టుబడికి ఢోకాలేదని నిరూపితమైంది. ఇటీవలే ఆంగ్రూ రకాల రాబడి–ఖర్చులను విశ్లేíÙంచాం. ఖరీఫ్ కంటే రబీలో నికర రాబడులు ఎక్కువగా ఉన్నాయి. సాగుకోసం రైతులు ఖర్చుచేసే ప్రతీ రూ.100కు, వరికి రూ.103, మినుముకి రూ.132, కందికి రూ.133, మిరపకి రూ.160, శనగకి రూ.102, వేరుశనగకి రూ. 124ల చొప్పున ఆదాయం వస్తోందని గుర్తించాం. – డాక్టర్ జి. రఘునాథరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ పరిశోధనా స్థానం, లాం సీజన్ ఏదైనా మన రకాలదే ఆధిపత్యం.. ప్రధాన పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేయడంలో ‘ఆంగ్రూ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ఆంగ్రూ’ వరి రకాలు హెక్టారుకు 5,669 కిలోల దిగుబడిని సాధిస్తుండగా, ఇది రాష్ట్ర సగటు దిగుబడి (హెక్టారుకు 5,048 కిలోలు) కంటే ఎక్కువ. వరిలోనే కాదు అపరాలు, నూనె గింజల సాగులో కూడా ఆంగ్రూ రకాలదే సింహభాగం. దాదాపు రెండు సీజన్లలోనూ వర్సిటీ రకాలకున్న డిమాండ్ ఇతర రకాలకు లేదనే చెప్పాలి. – డాక్టర్ ఎల్. ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు ఏటా రూ.2,967 కోట్ల లాభాలు.. జాతీయ స్థాయి వరి ఉత్పత్తిలో మూడో వంతు ఆంగ్రూ రకాలదే. అలాగే, జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఈ రకాలనే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ రైతు ఈ వర్సిటీ రకాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సంప్రదాయ వరి రకాల కంటే ఆంగ్రూ రకాల సాగువలన ఏటా రూ.2,967 కోట్ల లాభాలను రైతులు ఆర్జిస్తున్నారు. – డాక్టర్ ఆదాల విష్ణువర్థన్రెడ్డి, వైస్ చాన్సలర్ -
చిరుధాన్యాల సాగు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చిరుధాన్యాల సాగు విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం సోమవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తరించడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపికచేసి వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు వ్యవసాయ శాఖ సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్–2 (ఎస్డీజీ–2) 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం, ఆకలిని అంతం చేయడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తోందని, మిల్లెట్లు శీతోష్ణస్థితికి అనువుగా ఉండటమే కాకుండా పోషకాహారానికి గొప్ప మూలమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) జాతీయ, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలనే ప్రధాన నినాదంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు. మిల్లెట్ వినియోగం పోషకాహారం, ఆహారభద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమాల్లో పోషకాహార భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మొత్తం స్థూలవిలువ ఆధారిత వాటాలో 35 శాతం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో మన వర్సిటీ 7వ ర్యాంక్ సాధించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణపై మరింత దృష్టి సారించడం ద్వారా అన్ని టాప్ 5 ర్యాంకుల్లోకి చేరుకుంటుందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, మెడల్ విజేతలు, విశిష్టతలు, అవార్డులు, డిగ్రీ గ్రహీతలు, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. తొలుత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) చైర్మన్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా ముఖ్యఅతిథిగా పాల్గొని వర్సిటీ గౌరవ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయానికి చెందిన డాక్టర్ ఎబ్రహిమాలి అబూబకర్ సిద్ధిక్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ నాగేంద్రకుమార్ సింగ్లకు వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారు. రెండు జాతీయ అవార్డుల ఏర్పాటు మొదటిసారిగా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు పేర్లతో వ్యవసాయ పరిశోధనలో ఎక్సలెన్స్ కోసం రెండు జాతీయ అవార్డులను ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు రెండు మెగా రైస్ బీపీటీ 5204 (సాంబామసూరి), ఎంటీయూ 7029 (స్వర్ణ) రకాలను అభివృద్ధి చేశారు. (చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు
వ్యవసాయ రంగంలో 45 కిలోల వరకు బరువు గల ప్రైవేట్ డ్రోన్లు గతంలో సేవలందించేవి. ఆయిల్ ఇంజన్ సహాయంతో నడిచే ఈ డ్రోన్ల వల్ల ఎక్కువ శబ్దంతో పాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాటి బరువును 25 కేజీలకు కుదించిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధునిక సాంకేతికతను వినియోగించటం ద్వారా తాజాగా ఆ బరువును 250 గ్రాములకు తగ్గించగలిగింది. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయేలా కేవలం 10 గ్రాముల బరువుతో డ్రోన్లను తయారు చేయడంపై దృష్టి సారించింది. ఈ తరహా డ్రోన్ అందుబాటులోకి వస్తే షేడ్ నెట్, గ్రీన్ మ్యాట్ తరహా సాగు విధానంలో సమస్యగా మారిన పరపరాగ సంపర్యాన్ని విజయవంతంగా జరిపించవచ్చు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రోన్ అంటే ఒకప్పుడు పెళ్లిళ్లు, బహిరంగ సభలు, పాదయాత్రల వీడియో, ఫొటోలు తీయడానికి మాత్రమే పరిమితం. అదే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు అన్ని రంగాల్లో అడుగుపెట్టింది. సైనిక అవసరాలతో పాటు ఫుడ్ డెలివరీకి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేకి కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయే బుల్లి డ్రోన్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ తరహా డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగంలో వినియోగించేలా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో వినియోగించడంతోపాటు రైతులనే డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దే బాధ్యతను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భుజాన వేసుకుంది. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీని ఎరువులు, విత్తనాలను వెదజల్లేందుకు మాత్రమే వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నారు. రానున్న కాలంలో రోజుల్లో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి రైతులకు అన్ని దశల్లోనూ వ్యవసాయ పనులు చేసి పెట్టేలా డ్రోన్లను రూపొందించేందుకు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎరువులు, పురుగు మందులు చల్లేందుకే.. వ్యవసాయంలో డ్రోన్లను ప్రస్తుతం పురుగు మందులు పిచికారీ చేసేందుకు వాడుతున్నారు. దీనివల్ల 25 శాతం వరకూ పురుగు మందులు ఆదా కావడంతోపాటు పొలం మొత్తం సమానంగా పిచికారీ చేసే అవకాశం కలిగింది. మరోవైపు ఎరువుల్ని చల్లడం, వెద పద్ధతిలో విత్తనాలు వేయడానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతోంది. మరోవైపు డ్రోన్లను వినియోగించి నేల స్వభావం తెలుసుకోవడం ద్వారా నేలలో ఏయే పోషకాలు అవసరం, ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, ఉప్పు నేలలు, చౌడు, ఉరకెత్తు ప్రాంతాలను గుర్తించి వాటికి అనుగుణంగా యాజమాన్య పద్ధతులు చేపట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇదే సందర్భంలో డ్రోన్లను ఉపయోగించి అడవుల్లో మొక్కల సాంద్రత తెలుసుకుని అవసరమైన ప్రాంతాల్లో విత్తనాలు చల్లుకునే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, నదులు, జలపాతాల్లో నీటి పరిమాణం అంచనా వేయడానికి, నీటిని నిల్వచేయడానికి వాటర్షెడ్స్, చెక్డ్యామ్లు ఎక్కడ ఎలా కట్టుకోవాలనే అంశాన్ని డ్రోన్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయడం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా ఉంటుంది. అంగ్రూ తరపున డ్రోన్ వినియోగంపై శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో చిన్నపాటి డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోంది. – ఎ.సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, అంగ్రూ ఫోన్ కంటే స్మార్ట్గా.. కూలీల కొరత తీవ్రమవటం, ఎరువులు, పురుగు మందు ధరలు పెరిగిపోవటం వల్ల నష్టపోతున్న రైతులకు ఊరట కల్పించడమే కాకుండా యువతరాన్ని రాబోయే కాలంలో వ్యవసాయం వైపు మరల్చడానికి డ్రోన్ టెక్నాలజీ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్జీ రంగా యూనివర్సిటీ డ్రోన్ బరువును 45 కిలోల నుంచి 25 కిలోలకు తగ్గించింది. తాజాగా కేవలం 250 గ్రాముల బరువైన డ్రోన్లను సైతం రూపొందించింది. కాగా, కొన్ని ప్రైవేటు కంపెనీలు 45 కిలోల బరువున్న డ్రోన్లను ఆయిల్ ఇంజన్ సహాయంతో నడుపుతున్నాయి. వీటి నుంచి ఎక్కువ శబ్దం చేయడంతోపాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షేడ్నెట్స్, గ్రీన్మ్యాట్ వంటి పద్ధతుల్లో పంటలు పండించే చోట గాలి ఎక్కువగా తగలకపోవడం వల్ల పుప్పొడి ఒక పుష్పం నుంచి మరో పుష్పంపైకి చేరటం లేదు. ఈ కారణంగా మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అరచేతిలో ఇమిడిపోయేంత డ్రోన్లను ఆ మొక్కలపై తిప్పితే పరపరాగ సంపర్కం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం అతి చిన్న డ్రోన్లను తయారు చేయడానికి ఎన్జీ రంగా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా డ్రోన్లు విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా షేడ్ నెట్స్, గ్రీన్ మ్యాట్ సాగులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. -
సాగులో మార్పులు తేవాలి
సాక్షి, బాపట్ల: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, రైతుల సమస్యల పరిష్కారానికి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవం గురువారం నిర్వహించారు. వర్చువల్గా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక యూనివర్సిటీ శ్రీకారం చుట్టిందని, డ్రోన్ల వినియోగ పరిశోధనలో దేశంలోనే యూని వర్సిటీ ముందుండటం గర్వకారణమన్నారు. తలసరి ఆదాయంలో ఏపీ అగ్రగామి : ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో 38.6 శాతం అధికంగా నమోదైందని, ఇది రాష్ట్ర అరి్థక ప్రగతికి సూచికని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,07,771 కాగా, దేశ తలసరి ఆదాయం రూ.1,49,848 మాత్రమే అని తెలిపారు. 2011 నుంచి 2021 వరకు జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల 5.48 శాతం కాగా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.08 శాతం ఉందన్నారు. కేవలం వ్యవసాయ అనుబంధ రంగాలు 8 శాతం వృద్ధి నమోదు చేశాయని, ఇది భారతదేశ వృద్ధికి రెండు రెట్లు అధికంగా ఉందని వివరించారు. దేశ వృద్ధి రేటు 3.28 మాత్రమేనని వివరించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంపై నివేదిక సమర్పించారు. గిరిజన వ్యవసాయ విధానాలపై అత్యుత్తమ పరిశోధనలు చేసిన విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన ఫకృద్దీన్ అలీ అహ్మద్కు యూనివర్సిటీ పురస్కారం ప్రదానం చేసినట్లు తెలిపారు. 722 మందికి డిగ్రీ, 102 మందికి పీజీ, 40 మందికి పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. -
రైతుల ఆదాయం పెంచేలా కృషి జరగాలి
తిరుపతి (ఎడ్యుకేషన్): దేశానికి వెన్నెముక అయిన రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 52, 53వ స్నాతకోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గవర్నర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విజ్ఞానం అందించాలని సూచించారు. 2019–20లో జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17.8 శాతం నమోదు కాగా, 2021 సంవత్సరానికి 19.9 శాతం సాధించడంలో మన రైతులు చేసిన కృషి అభినందనీయమన్నారు. జాతీయ వరి ఉత్పత్తిలో మూడోవంతు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలు ఉండటం విశ్వవిద్యాలయం సాధించిన పరిశోధన ప్రగతికి లభించిన గౌరవమన్నారు. రాష్ట్రంలో పండించే వేరుశనగలో 95 శాతం వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు ఉండగా.. రాష్ట్ర వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో దీని వాటా 1.06 శాతంగా ఉండటం గర్వకారణమన్నారు. ఆర్బీకేల పనితీరు భేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల పనితీరు అమోఘమని గవర్నర్ అభినందించారు. ఆర్బీకేలకు సాంకేతికంగా సహకారం అందిస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడం అభినందనీయమన్నారు. యూనివర్సిటీ స్నాతకోత్సవాల సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు గౌరవ డాక్టరేట్ను వర్సిటీ ప్రకటించింది. 2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ (వ్యవసాయం) పూర్తి చేసిన 1,544 మందికి, పీజీ పూర్తి చేసిన 328 మందికి, 91 మంది పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. డాక్టర్ వి.రామచంద్ర రావు జాతీయ అవార్డును ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్, డాక్టర్ ఎన్వీ రెడ్డి జాతీయ అవార్డును రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, వైస్ చాన్సలర్ డాక్టర్ ఏ.విష్ణువర్ధన్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్కృష్ణ పాల్గొన్నారు. -
AP: రైతు ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు రూరల్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణల రూపకర్తలైన అభ్యుదయ రైతులకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ మరో తీపికబురు రైతులు తమకు సమీపం లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు పొందవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తులకు ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన రైతులకు పురస్కారంతో పాటుగా, రూ 5,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్’ను సంప్రదించాలని సూచించారు. -
పుస్తకమే కాదు పొలము కూడా వారికి పాఠాలు చెబుతుంది!
పాదాలకు అంటుకున్న మట్టి అక్కడ పాఠాలు చెబుతుంది. అరచేతికి పూసుకున్న బురద అక్షరమై వికసిస్తుంది. పుస్తకమే కాదు పొలము, హలము కూడా వారికి చదువు చెబుతుంది. పిల్లలంతా పట్టభద్రులై వ్యవసాయానికి దూరమైపోతున్న కాలంలో.. విద్యార్థి నికార్సయిన రైతుగా మారే అపురూప అవకాశం ఆ కోర్సు కల్పిస్తుంది. మట్టికి మనిషికి ఉన్న బాంధవ్యాన్ని అపూర్వ రీతిలో వివరిస్తుంది. సిలబస్, పరీక్షలతో పాటు పంట, మార్కెటింగ్లు కూడా ప్రత్యక్షంగా నేర్పుతుంది. ఆ చదువు ఎలా ‘సాగు’తుందంటే..? శ్రీకాకుళం రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ కళాశాల శ్రీకాకుళం జిల్లా నైరాలో విద్యార్థులు అన్నదాతలుగా మారుతున్నారు. పట్టాలు పొందే నాటికి మట్టిపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈఎల్పీ అనే ప్రొగ్రాంను అనుసరిస్తున్నారు. ఈఎల్పీ అంటే ఎక్స్పీరియన్సల్ లెర్నింగ్ ప్రొగ్రాం. అనుభవం ద్వారా నైపుణ్యాన్ని పెంచే ఈ కార్యక్రమం ద్వారా ఫైనల్ ఇయర్ విద్యార్థులు పంటలు పండిస్తున్నారు. దీనికి కావాల్సిన పెట్టుబడిని కాలేజీ యాజమాన్యమే అందిస్తుంది. ఇందులో రాబడి తీసుకురాగలిగితే 75 శాతం విద్యార్థులే తీసుకోవచ్చు. మిగిలిన డబ్బు ప్రాజెక్టు, గైడ్కు వెళ్తుంది. పంటలే కాదు వర్మీకంపోస్ట్, వర్మీటెక్, విత్తనోత్పత్తి, కూరగాయల పెంపకం, జీవ శిలీంద్రాలు, పుట్టగొడుగుల పెంపకంతో పాటు పూలు, పుచ్చకాయలు యూనిట్లు నెలకొల్పి వాటిని మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఈ కాలేజీలో పండించిన పంటలను దగ్గరలో గల పరిశోధన కేంద్రాలకు, రైతులకు, క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నారు. ప్రధానంగా వర్మీకంపోస్ట్, వర్మీటెక్ యూనిట్ల ద్వారా జీవన ఎరువులను తయారు చేసి రైతులకు, వినియోగదారులకు తక్కువ ధరకే ఈ కళాశాల నుంచి విక్రయిస్తున్నారు. వర్మీ కంపోస్టు.. ఎండిన ఆకులు, ఎండిన గడ్డి, కూరగాయల చెత్త, పశువుల గెత్తంతో దీన్ని తయారు చేస్తారు. దీన్ని కాలేజీ విద్యార్థులు తయారు చేసి కిలో రూ.12 చొప్పున అమ్ముతున్నారు. ఇందులో రెండో రకం వర్మీ వాస్ కూడా ఉంది. వానపాములు విడుదల చేసే సిలోమిక్ ఫ్లూయిడ్ను వర్మీవాస్గా వాడుతుంటారు. లీటర్ బాటిల్ రూ.100 చొప్పున విక్రయిస్తారు. పుట్టగొడుగులు.. పుట్టగొడుగు తయారీ, సంరక్షణ, ఎరువుతో పాటు మార్కెటింగ్పై కూడా విద్యార్థులకు క్షణ్ణంగా వివరిస్తున్నారు. ఈ విధానాల ద్వారా విద్యార్థులు సొంతంగా పుట్టగొడుగు సాగు చేసి మార్కెట్కు కేజీ రూ.220 చొప్పున అమ్ముతున్నారు. పుచ్చకాయలు.. నైరా కాలేజీలో 60 సెంట్లు విస్తీర్ణంలో పుచ్చకాయలు, 10 సెంట్లు విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలను విద్యార్థులు పండిస్తున్నారు. పంట చేతికి వచ్చినప్పుడు విద్యార్థులు స్వయంగా రోడ్డు మీదకు వచ్చి కూరగాయలు అమ్ముతుంటారు. పుచ్చకాయలకైతే పెట్టుబడి రూ.20వేలు పెడితే లాభం రూ.80వేలకు పైగా వస్తోంది. వీటిని కూడా విద్యార్థులే రోడ్డుకు ఇరువైపులా నించుని విక్రయిస్తున్నారు. విత్తనాలు కూడా.. ఇక్కడి విద్యార్థులు పంటలే కాదు నువ్వులు, పెసలు, ఉలవలు, రాగులు, కందులు, వరి విత్తనాలను తయారు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. విత్తనాలను కృషి విజ్ఞాన కేంద్రాలకు, రైతు భరోసా కేంద్రాలకు, రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తారు. కిలో రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.200 వరకూ అమ్ముతారు. పెట్టుబడి ఇస్తాం.. రకరకాల పంటలు పండించేందుకు విద్యార్థులకు కళాశాల యాజమాన్యం కేవలం పెట్టుబడి మాత్రమే అందిస్తుంది. పండిన పంటలో 75 శాతం విద్యార్థులే తీసుకుంటారు. ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఆరు నెలలు ఇలా శిక్షణ ఉంటుంది. – సురేష్కుమార్, అసోసియేట్ డీన్, నైరా రైతులతో మమేకం అగ్రి బీఎస్సీ నాలుగేళ్ల కోర్సు. ఆఖరి ఏడాది ఆరు నెలల్లో మేము రైతులతో మమేకమవుతాం. పండించిన పంటను అమ్ముతాం కూడా. గ్రామాల్లో తిరిగి రైతులతో మమేకమవుతూ కొత్త పద్ధతులు కూడా నేర్పుతున్నారు. – మహమ్మద్ అబ్దుల్ రఫీ, అగ్రి బీఎస్సీ ఫైనల్ ఇయర్ -
నిరంతరం.. కొత్త రకం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, ప్రకృతిపై దాడి చేస్తున్న చీడ పీడలను ఎదుర్కొనే విధంగా తక్కువ పెట్టుబడులతో అత్యధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలు సృష్టించడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు సఫలీకృతం అవుతున్నారు. తరతరాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ సేద్యం నుంచి సాంకేతిక సేద్యం వైపు రైతులను చైతన్య వంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): వరి సాగుకు ప్రసిద్ధిగాంచిన సింహపురి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం సహకారంతో సరికొత్త సీడ్స్తో హైస్పీడ్ దిగుబడులు సాధిస్తోంది. పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రదేశాలతో పాటు కార్తెలు, నక్షత్రాల పేరుతో అత్యంత జన్యుపరమైన సన్న రకాల వరి విత్తనాలు సృష్టించి రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి శాస్త్రవేత్తలు జిల్లా వాతావరణాన్నే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మంచి దిగుబడులు సాధించే విధంగా కొత్త రకం విత్తనాలను సృష్టించం ప్రత్యేకత. 28 రకాల వంగడాలు సృష్టి జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 రకాల కొత్త వరి వంగడాలను మార్కెట్లోకి తీసుకు వచ్చారు. ప్రధానంగా 1948 నుంచి కొత్త వంగడాల సృష్టిని శాస్త్రవేత్తలు ప్రారంభించారు. బీసీపీ 1, బీసీపీ 2 అనే రెండు రకాల కొత్త వంగడాలను 1948లో సృష్టించారు. బీసీపీ 3, బీసీపీ 4 రకాలను 1950లో, 1951లో బీసీపీ 5, 1965లో బీసీపీ 6, 1965లో బల్క్హెచ్ 9ను తయారు చేశారు. ఆ తర్వాత కొత్త మొలగొలకులు 72 అనే రకాన్ని 1977లో మార్కెట్లోకి తీసుకు వచ్చారు. 74 పేరుతో మరో కొత్త మొలగొలుకులు రకాన్ని 1977లో తీసుకు వచ్చారు. 1987లో పినాకిని ఎన్ఎల్ఆర్ 9672–96, 1988లో తిక్కన ఎన్ఎల్ఆర్ 27999, 1991లో సింహపురి ఎన్ఎల్ఆర్ 28600, శ్రీరంగ ఎన్ఎల్ఆర్ 28523, స్వర్ణముఖి ఎన్ఎల్ఆర్ 145 రకాలను, 1996లో భరణి ఎన్ఎల్ఆర్ 30491, శ్రావణి ఎన్ఎల్ఆర్ 33359, స్వాతి ఎన్ఎల్ఆర్ 33057, పెన్నా ఎన్ఎల్ఆర్ 33365 రకాలను, 1999లో సోమశిల ఎన్ఎల్ఆర్ 33358, వేదగిరి ఎన్ఎల్ఆర్ 33641, అపూర్వ ఎన్ఎల్ఆర్ 33654 రకాలను, 2002లో పర్తివ ఎన్ఎల్ఆర్ 33892, 2006లో నెల్లూరు మసూరి ఎన్ఎల్ఆర్ 34449 2009లో, స్వేత ఎన్ఎల్ఆర్ 40024 2012లో, నెల్లూరు ధాన్యరాశి ఎన్ఎల్ఆర్ 3354, నెల్లూరు సిరి ఎన్ఎల్ఆర్ 4001, నెల్లూరు సుగంధ ఎన్ఎల్ఆర్ 40054లను 2020లో సృష్టించారు. ఈ విధంగా 28 రకాల వరి కొత్త వంగడాలను జిల్లా శాస్త్రవేత్తలు జిల్లా వాసులకు అందించారు. రైతులను చైతన్య పరుస్తూ.. జిల్లాలోని రైతులను ఎప్పకప్పుడు శాస్త్రవేత్తలు చైతన్య పరుస్తూ కొత్త వంగడాలపై అవగాహన కల్పిస్తూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో పర్యటించడం కాకుండా, పరిశోధనా స్థానంలో రైతులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ఆ దిశగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొత్త వంగడాలు ఖరీఫ్లో, రబీలో ఏ విధంగా వేసుకుంటే పంట సాగు బాగుంటుంది, ఎంత మోతాదులో రసాయనాలు వాడాలి అనే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని విధాలుగా చేస్తున్నాం జిల్లాలోని రైతులకు అనుగుణంగా, వారికి అవసరమయ్యే విధంగా వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నాం. ఒక వంగడం పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు అని విధాలుగా శాస్త్రవేత్తలు పరిశీలన చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు. – వినీత, ప్రధాన శాస్త్రవేత్త అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పకప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. కొత్త వంగడాలను సృష్టించినప్పుడు రైతులు వెనకడుగు వేస్తారు. కానీ వాటిపై పూర్తి అవగాహన కల్పిస్తే మాత్రం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. – జి.చంద్రశేఖర్రెడ్డి, చాగణం రైతు,సైదాపురం మండలం సలహాలతో ఎంతో మేలు శాస్త్రవేత్తలు, సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు ఉంటుంది. మాకు తెలిసిన పరిజ్ఞానం కన్నా, శాస్త్రవేత్తల సాంకేతి పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబటి, వారి ప్రకారం నడుచుకుంటే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. – ఎస్ సుధాకర్రెడ్డి, ఖాన్సాహెబ్పేట రైతు, మర్రిపాడు మండలం -
చిన్న కమతాలకు పెద్ద అండ యాంత్రీకరణ
సాక్షి, అమరావతి: పవర్ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, కట్టె గానుగలు వంటి అనేక చిన్నా, పెద్ద యంత్రాల ప్రదర్శనకు గుంటూరు సమీపంలోని పుల్లడిగుంట వేదికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆదివారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు వందలాదిమంది రైతులు హాజరయ్యారు. పరికరాల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూసి, చేసి తెలుసుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల డీన్, అగ్రికల్చర్ ప్రొఫెసర్ జోసఫ్రెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రకృతి, సేంద్రియరంగ సేద్య నిపుణులు రైతులకు యంత్రపరికరాల వినియోగ అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో కమతాలు చిన్నవైనందున వాటికి తగిన యంత్రాలనే ఇక్కడ ప్రదర్శనకు పెట్టామని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వై.వెంకటేశ్వరరావు చెప్పారు. ఆకట్టుకున్న ప్రదర్శన పత్తి, మిరప వంటి పంటల్లో కలుపు తీసే యంత్రాలు, ట్రాక్టర్ సాయంతో పెద్దఎత్తున పిచికారీ చేసే పరికరాలు, తక్కువ ఖర్చుతో 10, 12 కిలోల కూరగాయలు నిల్వచేసుకునే థర్మోకోల్ రిఫ్రిజిరేటర్లు, అంతరసేద్యం చేసే బుల్లి గొర్రు, చిన్న నాగలి, మనిషి నిల్చొనే గడ్డి పీకేసే పరికరాలు వంటివి అనేకం రైతులను ఆకట్టుకున్నాయి. పలువురు వ్యవసాయ విద్యార్థులు సొంతంగా తయారుచేసిన పరికరాలను రైతులు ఆసక్తిగా పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. ఈ రైతు పేరు పి.సాంబశివరావు. గుంటూరు జిల్లా పసుమర్రు గ్రామం. తన మోపెడ్ వాహనాన్నే సోలార్ పవర్ స్ప్రేయర్గా మార్చుకున్నారు. ఎక్కడైనా చేలో మందు చల్లాల్సి వచ్చినప్పుడు మోపెడ్కు బిగించిన 20 లీటర్ల క్యాన్లో ద్రావణాలను కలిపి సోలార్ పవర్ ఆధారంగా నడిచే చిన్న మోటారు సాయంతో పిచికారీ చేస్తున్నారు. మోపెడ్ మీదనే పొలానికి వెళతారు. చేలో బండి ఆపి మందును పిచికారీ చేస్తారు. మీ పంట చేలో పడిన కోతులను తరమడం పెద్ద బెడదగా మారిందా? అయితే ఇదిగో పరిష్కారం. తక్కువ ఖర్చుతో పెద్ద శబ్దం వచ్చే చిన్నపాటి ప్లాస్టిక్ గన్ను ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. దీన్ని ఎలా వాడాలో రైతులకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదో పవర్ టిల్లర్. ఎద్దులు, దున్నపోతులతో పనిలేకుండా స్వయంగా రైతే పొలాన్ని దున్నుకునే చిన్నపాటి యంత్రం. దీనిసాయంతో ఎకరం, రెండెకరాల పొలాన్ని సునాయాసనంగా దున్నవచ్చు. లీటర్ పెట్రోలు పోసుకుంటే గంటన్నరకుపైగా నడుస్తుంది. తక్కువ ఖర్చుతో అటు సమయాన్ని, ఇటు శ్రమను ఆదా చేసుకోవచ్చు. -
మన విత్తనం దేశంలోనే ఉత్తమం
సాక్షి, అమరావతి : పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రధాన ఆహార పంట వరి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణం, నీరు, పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించుకోవాలి. ఇందుకు అనువైన వాతావరణంతో పాటు మేలైన విత్తనం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందునే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. మంచి విత్తనాలు అభివృద్ధి చేయాల్సిందిగా యూనివర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయించారు. రెండు నెలలకొకసారి జరిగే యూనివర్సిటీ అసోసియేట్ డీన్స్ సమావేశంలో ఇటీవల ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగు ► రాష్ట్రంలో సుమారు 59 లక్షల హెక్టార్ల మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. వ్యవసాయ రంగంలో వరి రెండంకెల వృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. అధిక ఆదాయాన్నిస్తోంది. ► 2018–19లో 123.52 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే హెక్టార్కు సగటు ఉత్పాదకత 5,593 కిలోలుగా ఉంది. సార్వాలో హెక్టార్కు 5,593 కిలోల ఉత్పాదకత ఉంటే దాళ్వాలో 6,973 కిలోలుగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో విత్తనాన్ని మార్చి సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి ► రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేస్తున్న వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలు గానీ, ప్రైవేటు విత్తన సంస్థలు గానీ సరఫరా చేయడం సాధ్యం కాదు. అందువల్ల రైతులే తమ పొలంలో విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. ► గుర్తించిన ఆర్బీకేల పరిధిలో రైతులకు మూల విత్తనాన్ని ఇచ్చి సొంతంగా విత్తనం తయారు చేసుకునే అవకాశం కల్పించింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకుంటే తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకూ విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వైస్ చాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. లక్ష్య సాధనకు అనుగుణంగా చర్యలు ► వరి సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక నుంచి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందన్న లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేస్తామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు. ► కొత్తవి కనుగొనేలోగా ఇప్పటికే యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు రూపొందించిన వంగడాలకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ► రాష్ట్రంలో సుమారు 43 రకాల వంగడాలు సార్వా, దాళ్వాలో సాగవుతున్నాయి. బాపట్ల, మార్టేరులో కనిపెట్టిన వరి వంగడాలైతే జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచాయి. -
రైతుల పాలిట ఆధునిక ఆలయాలు
తెనాలి: ఏ పంట సాగు చేయాలి? ఏ పంట వేస్తే మంచి రేటుకు అమ్ముకోవచ్చు? ఈ విషయం ఎవరిని అడగాలి? విత్తనాలు ఏ విధంగా సమకూర్చుకోవాలి? మందులు, ఎరువుల మాటేమిటి? పంట చేతికొచ్చే దశలో నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బీమా ఎలా చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఊరూరా రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను ప్రారంభించింది. ప్రస్తుతం రైతులందరికీ చక్కగా విత్తనాలు అందిస్తుండటం వినూత్నం. ప్రతి రైతుకూ తానుంటున్న ఊళ్లోనే ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్బీకేల పనితీరు ఎలా ఉందో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.గురవారెడ్డికి ప్రత్యక్షంగా చూడాలనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి బయలు దేరారు. వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లోని చుండూరు, అంగలకుదురు, పెదరావూరు, వల్లభా పురంలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ఆయన గమనించిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఇంతలో ఎంత మార్పు..! ► పల్లెటూళ్లలో ఒక్కో ఆర్బీకేను చూడగానే అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న కుటీరంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలిగింది. పల్లె వాతావర ణాన్ని తలపించే రంగులతో తీర్చిది ద్దడం ఆహ్లాదంగా అనిపించింది. ► అతి పెద్ద మొబైల్ ఫోన్ లాంటి డిజిటల్ కియోస్క్, స్మార్ట్ ఫోనుతో అనువుగా తీర్చిదిద్దారు. నేను వెళ్లే సరికే పలువురు రైతులు అక్కడున్న వ్యవసాయ సహాయకులతో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ► కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజనులో విస్తారంగా సాగుచేసే వరి విత్తనాల గురించి రైతులు చర్చించుకుంటున్నారు. కియోస్క్ పని తీరును స్వయంగా చూశాను. స్మార్ట్ మొబైల్ ఫోన్ను వినియోగించే రైతు ఎవరైనా, తానే సొంతంగా కియోస్క్లో కావాల్సిన విత్తన రకాన్ని బుక్ చేసుకోవచ్చు. సహాయకుల సహకారంతో కొందరు బుక్ చేసుకున్నారు. మరికొందరు సహాయకులతోనే బుక్ చేయించారు. ► విత్తనం బుక్ చేసిన 48 గంటల్లోపు డెలివరీ తీసుకొనేలా చర్యలు తీసుకున్నారు. విత్తనాలే కాదు, ఎరువులు, పురుగు మందులనూ ఇలాగే తీసుకోవచ్చని తెలిసి ఎంతో ఆనందం వేసింది. ► వ్యవసాయ రంగంలో ఇదొక నూతన అధ్యాయం.. దేశంలోనే వినూత్నమైన ముందడుగు.. ఇంతలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని రైతులు చర్చించుకోవడం కనిపించింది. ఇలా చేస్తే ఇంకా మేలు.. ► దుక్కి దున్నిన రైతులు, భూమి పదును తేలగానే విత్తనం కోసం వెతుకుతాడు. పంట వేశాక, వర్షం కురవగానే ఎరువుల కోసం దౌడుతీస్తాడు. తెగులు కనిపిం చగానే తగిన మందు కొట్టేందుకు ఆరాటపడతాడు. అలాంటి పరిస్థితుల్లో గ్రామ సచివాలయంలో డబ్బు చెల్లించి, చీటీ తీసుకురాగానే తగిన విత్తనం/ ఎరువు/ పురుగుమందు సిద్ధంగా ఉండే లా స్టాకు పాయింట్ ఏర్పాటు చేయాలని కొందరు రైతులు సూచించారు. ► వేర్వేరు చోట్ల స్థిరపడిన వారికి ఊళ్లో గల భూములను అనధికారికంగా కుటుంబ సభ్యులే కౌలు చేస్తుంటారు. ‘యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే’ అనే నిబంధన స్థానంలో ఎక్కడైనా రేషన్ తీసుకున్నట్టుగా ఓటీపీ/లెటర్/ఆధార్ సీడింగ్ ద్వారా సేవలందించగలిగితే ఎంతో మేలు. ఆధునిక పరిజ్ఞానంతో రైతులకు మేలే ► వ్యవసాయాన్నంతటినీ ఆర్బీకే అనే వ్యవస్థలోకి మళ్లించటం, సాంకేతిక పరిజ్ఞానా నికి అధిక ప్రాధా న్యత ఇవ్వటం వల్ల దళారుల ప్రాబల్యం తగ్గుతుం దన్న ఆశాభావాన్ని రైతులే వెలిబుచ్చారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకపోవటంతో పాటు రైతులకు మంచి జరుగుతుండటం కళ్లెదుటే కనిపించింది. ► నాడు నాగార్జునసాగర్ను ఆధునిక దేవాలయం అన్నారు. నేడు ఊరూరా ఉన్న రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట ఆధునిక దేవాలయాలుగా వర్ధిల్లుతాయన్న భావన కలిగింది. డీలర్ వద్దకు పరుగెత్తాల్సిన పనిలేదిక ► భూసార పరీక్షలకు తగిన సలహాలు, తోడ్పాటు, వరి విత్తే దశ నుంచి నారుమడి పెంపకం, వరి నాట్లు, ఎదిగిన పైరుకు కావాల్సిన ఎరువులు, చీడ పీడలు, దోమల నివారణకు అవసరమైన పురుగు మందు లపై తగిన సలహాలను ఇవ్వడానికి ఉద్యోగు లు సిద్ధంగా ఉండటం చూసి ముచ్చటేసింది. ► ఏదైనా పంటకు తెగులు ఆశించిందని తెలి యగానే ఇన్నాళ్లూ రైతులు పరుగెత్తుకుంటూ పురుగు మందుల డీలర్ దగ్గరకు ఇక వెళ్లాల్సిన అవసరం లేదే లేదనిపించింది. ► ఇన్నాళ్లూ ఆ వ్యాపారి తన పరిజ్ఞానంతో ఏదో ఒక మందు వాడాలని చెప్పడం.. అది సరిగా పని చేయక రైతులు నష్టపోవడం ఏటా చూశాం. ఇక ఈ పరిస్థితి ఉండదు. ఎరువుల విషయంలోనూ అంతే. వల్లభాపురంలో పలువురు రైతులు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు. రైతులకు విస్తృత ప్రయోజనాలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన కుటుంబం నాది. సొంతూరు వల్లభాపురంలో వ్యవసాయం చేస్తున్నాను. మండల కేంద్రానికి వెళ్లకుండా, అన్నీ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులకు వనరులు, సలహాలు, శిక్షణ లభించటం గొప్ప విషయం. – లంకిరెడ్డి రాజశేఖరరెడ్డి, రైతు, వల్లభాపురం కాన్సెప్ట్ అద్భుతం.. రైతు భరోసా కేంద్రాల కాన్సెప్ట్ అద్భుతం. చక్కని ముందడుగు. ఎంతోకాలంగా కష్టనష్టాలు పడుతూ వ్యవసాయాన్ని వదులుకోలేక, సాగు కొనసాగిస్తున్నాం. ఏవేవో రాయితీలంటూ ఇచ్చినా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు.. రైతుల అన్ని సమస్యలకు పరిష్కారంగా తోస్తోంది. – కాకర్ల వెంకట కృష్ణయ్య, రైతు, అంగలకుదురు -
ఖరీఫ్కు ఐదు కొత్త వరి వంగడాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్లో సాగు చేసేందుకు ఐదు కొత్త వరి వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. రాష్ట్ర పరిశోధనా కేంద్రాల నుంచి ఇటీవల కాలంలో 13 రకాల కొత్త వంగడాలను విడుదల చేసినప్పటికీ.. రాష్ట్రంలో సాగు చేసేందుకు ఆరు రకాలు మాత్రమే పనికొస్తాయని అంచనా వేసినట్టు విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఏఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో పనికొచ్చేవి ఐదు ► రాష్ట్ర పరిధిలో పండించేందుకు ఐదు వరి వంగడాలతోపాటు ఒకటి జొన్న వంగడం. ► వరికి సంబంధించిన ఐదు రకాల్లో ఎంటీయూ–1224 (మార్టేరు సాంబ), ఎంటీయూ–1262 (మార్టేరు మసూరి), ఎంటీయూ–1210 (సుజాత), బీపీటీ–2595 (తేజ), ఎన్ఎల్ఆర్–3354 (నెల్లూరు ధాన్యరాశి) ఉన్నాయి. ► జొన్నకు సంబంధించి వీఆర్–988 (సువర్ణ ముఖి) కొత్త వంగడం విడుదలైంది. ► దేశ పరిధిలో విడుదల చేసిన వాటిలో వరికి సంబంధించి ఎంటీయూ–1223 (వర్ష), ఎంటీయూ–1239 (శ్రావణి).. గోగు పంటకు సంబంధించి ఏఎంయూ–8, ఏఎంయూ–9 (ఆదిత్య), జొన్నకు సంబంధించి వీఆర్–929 (వేగవతి), సజ్జకు సంబంధించి ఏబీవీ–04, పత్తికి సంబంధించి ఎల్డీహెచ్పీ ఉన్నాయి. ► ఈ ఖరీఫ్లో కృష్ణా జోన్లోని రైతులు ఎంటీయూ–1061 (ఇంద్ర), బీపీటీ–5204, 2270 (భావపురి సన్నాలు), ఎంటీయూ–1075 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224 ఎంటీయూ–1262 కూడా సాగు చేసుకోవచ్చు. ► గోదావరి జోన్లోని రైతులు స్వర్ణ, ఇంద్ర, ఎంటీయూ–1064, పీఎల్ఏ–1100, కొత్తగా విడుదలైన ఎంటీయూ–1262, 1224 రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ► ఉత్తర కోస్తా రైతులు స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు, బీపీటీ–5204, ఎంటీయూ–1075, శ్రీధృతితో పాటు కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224, ఎంటీయూ–1210 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. ► దక్షిణ మండలంలో (సౌత్ జోన్) ఎన్ఎల్ఆర్–3354, 33892తో పాటు కొత్తదైన ఎన్ఎల్ఆర్–4001, ఎంటీయూ–1224 అనువైనవి. ► తక్కువ వర్షపాత ప్రాంతాల్లో బీపీటీ–5204, ఎన్డీఎల్ఆర్–7, 8తో పాటు కొత్తవైన ఎంటీయూ–1224, బీపీటీ–2782 రకాలను సాగు చేసుకోవచ్చు. ► గిరిజన మండలాలలో స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ–1153, 1156 అనువైనవి. ► ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఎల్ఏ–1100, ఎంటీయూ–1064 (అమర), ఎంటీయూ–1140 (భీమ) అనువైనవిగా సిఫార్సు చేశారు. చౌడు ప్రాంతాల్లో ఎంటీయూ–061తో పాటు కొత్తగా విడుదలైన ఎంసీఎం–100 వేసుకోవచ్చు. ► నాణ్యమైన విత్తనం కోసం ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీకృత సంస్థలను సంప్రదించడం మంచిది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నది. ► స్వయంగా రైతులు తయారు చేసుకున్న విత్తనాలను కూడా వాడుకోవచ్చు. ► విత్తనం సంచి లేబుల్ మీద కనీసం 80 శాతం మొలక శాతం వుందో లేదో చూసుకోవాలి. -
ఆచార్య ఎన్జీరంగా వర్సిటీలో కలకలం
సాక్షి, గుంటూరు రూరల్ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ వి.దామోదర్నాయుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు కావడం ఆదివారం కలకలం సృష్టించింది. ‘తాను చెప్పిందే వేదం. చేసిందే చట్టం. తనకు ఎదురులేదు. అడ్డొస్తే ఎవరైనా సరే బదిలీ, లేదా డెప్యూటేషన్పై శంకరగిరి మాన్యాలే’ అన్నంతగా వీసీ వ్యవహారం సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైస్ చాన్సలర్ డాక్టర్ వి.దామోదర్నాయుడును ఆదివారం సాయంత్రం తుళ్లూరు డీఎస్పీ వి.శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. వీసీని అరెస్ట్ చేశారన్న వార్త దావానంలా వ్యాపించి వర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. వీసీ అక్రమాలకు, అరాచకాలకు బలై డెప్యూటేషన్లు, బదిలీలపై వెళ్లిన, జరిమానాలు చెల్లించిన బాధితుల్లో ఒకింత ఆనందం వ్యక్తమైంది. అంతా ఏకపక్షం వీసీ దామోదర్నాయుడు ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ, మిగిలిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు లాం ఫాంలోని యూనివర్సిటీ కాంపౌండ్లో ఉండటానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసిన ఘటనలు ఉన్నాయని బాధితులు పేర్కొంటున్నారు. తనకు ఎదురు చెప్పిన ఎందరినో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆరు నెలల క్రితం వర్సిటీ సిబ్బంది 453 మంది వీసీ అరాచకాలకు బలయ్యామంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దేశ చరిత్రలో ఒక వీసీపై ఇంతటి భారీస్థాయిలో సిబ్బంది, ఉద్యోగులు ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉండి ఉండకపోవచ్చు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో అంతమంది సిబ్బంది ఫిర్యాదులు చేసినా వీసీపై కనీస చర్యలు కరువయ్యాయి. ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తనకు బాగా తెలుసని, ఆయనదీ, తనదీ ఒకే ఊరని, తనను ఎవరూ ఏమీ చేయలేరని వీసీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయటంతోపాటు బదిలీ చేశారన్న ఫిర్యాదులు అందాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నో అపాయింట్మెంట్ దామోదర్నాయుడు వీసీగా పనిచేసిన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. వీసీ పీఏ సైతం వచ్చిన వారు ఎవరో తెలుసుకుని ఓ సామాజికవర్గం వారు కాకుంటే అపాయింట్మెంట్ సిద్ధం చేసేవారు కాదని సిబ్బంది, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇతర వర్గాల వారు కలిసేందుకు వస్తే పీఏ కూడా అంగీకరించేవారు కాదన్న అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. పది రోజులకుపైగా విచారణ వీసీపై ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నతో సింగిల్మన్ కమిటీని నియమించి, విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 500 మందికిపైగా వీసీ బాధితులు సుమారు పది రోజులపాటు తమకు జరిగిన అన్యాయాలను ప్రద్యుమ్న ఎదుట ఏకరువుపెట్టారు. ఈ క్రమంలో బాధితులు రాష్ట్ర గవర్నర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఊరికి చెందిన ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అండ ఉండగా, తనను ఎవరూ ఏమీ చేయలేరని పలుమార్లు ఉన్నతాధికారులను వీసీ బెదిరించారని సమాచారం. అంతటా వీసీ అరెస్టుపై చర్చ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధలో ఉన్న కార్యాలయాలు, కళాశాలల్లో వీసీ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీసీ నిరంకుశత్వం, ఏకపక్ష వైఖరి, నిర్లక్ష్య «ధోరణి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. వీసీ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసేవారని అంతటా చెప్పుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులను సైతం మాజీ సీఎం చంద్రబాబు తన క్లాస్మెంట్, కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన జిల్లావాసి అంటూ వీసీ బెదిరించేవారని, ఎట్టకేలకు తగిన శాస్తి జరిగిందని పేర్కొంటున్నారు. -
రైతన్నకు అండగా..నంద్యాల బ్రాండ్ ఉండగా
వాతావరణ మార్పులు.. గతి తప్పుతున్న రుతుపవనాలు.. అకాల వర్షాలు.. ఉష్ణోగ్రతలు పెరగడం.. నీటి వనరులు తగ్గడం.. ఇలా ఎన్నో పరిణామాలతో కొన్నేళ్లుగా వ్యవసాయం తిరోగమనం దిశగా పయనిస్తోంది. పంటల సాగులో రైతులకు వరుసగా నష్టాలే. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులను ఎవరూ మార్చలేరు. ఆ పరిస్థితులను అధిగమించే నూతన వంగడాలను సృష్టించడమే వ్యవసాయ శాస్త్రవేత్తల లక్ష్యం. ఈ మేరకు నంద్యాల ( ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం) ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు నూతన వంగడాల ఆవిష్కరణలో ముందంజలో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా, తెగుళ్ల బారిన పడకుండా.. అధిక దిగుబడి వచ్చేలా నూతన వంగడాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయంలో రైతులు రాణించేలా మేలు రకం విత్తనాలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల పరిశోధన కేంద్రానికి మంచి గుర్తింపు తెస్తున్నారు. సాక్షి, నంద్యాల : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 1906లో నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 25 ఎకరాలలో భవనాలు ఉండగా మరో 100 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తూ పరిశోధనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పది పంటలపై పరిశోధన కొనసాగుతుంది. దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు ఇక్కడ పని చేస్తున్నారు. ఈ పరిశోధన కేంద్రానికి 2017లో గుంటూరు ఆచార్య విశ్వవిద్యాలయం నుంచి బెస్ట్ పరిశోధన సంస్థగా అవార్డు దక్కింది. ఇక్కడ ఆవిష్కరించిన పత్తి, నంద్యాల సోనా వంగడాలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరొందాయి. 1950లో పత్తి, 1980లో జొన్న, పొద్దుతిరుగుడు, శనగ, పొగాకు, తదితర పంటలపై పరిశోధనలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పంటలపై పరిశోధనలు చేయడం, వాటి గురించి రైతులకు అవగాహన కల్పించడం, ఆ మేరకు కొత్త వంగడాలను సృష్టించడంలో ఆర్ఏఆర్ఎస్కు మంచి గుర్తింపు వచ్చింది. పత్తి, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు, పొగాకు, శనగ, జొన్న, వరిలో అధిక దిగుబడులు వచ్చే నూతన వంగడాలను సృష్టించి అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. నంద్యాల శాస్త్రవేత్తలు రామారెడ్డి, విజయలక్ష్మి, గాయత్రి, జాఫర్బాషా తదితరులు నూతన వంగడాల ఆవిష్కరణలను వివరించారు. శనగకు నంద్యాల బ్రాండ్.. రాయలసీమలో శనగ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ పంటకు ఉన్న ప్రాము ఖ్యతను గుర్తించి 2009లో నంద్యాల పరిశోధన స్థానంలో అధిక దిగుబడి వచ్చే మేలైన విత్తనాల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. 2012లో నంద్యాల శనగ–1, 2015లో నంద్యాల ధీర, 2016న నంద్యాల గ్రామ్–49, 2015లో నంద్యాల గ్రామ్–119 శనగ విత్తనాలను ఆర్ఏఆర్ఎస్ నుంచి ఉత్పత్తి చేశారు. ఈ విత్తనాలను ఎక్కడ వాడినా నంద్యాల పేరు గుర్తుండాలనే ఉద్దేశంతో పేరుకు ముందుగా నంద్యాలను చేర్చినట్లు తెలుస్తోంది. శనగను ఇంగ్లిష్లో బెంగాల్ గ్రామ్ను అంటారు. అందుకే నంద్యాల గ్రామ్–119, నంద్యాల గ్రామ్–49 పెట్టారు. నూతన వంగడాలకు 1, 2 తడులు నీరు పెడితే చాలి. ఈ రకాలు దృఢమైన వేరువ్యవస్థ నీటి బెట్ట, ఎండ తెగులును తట్టుకుంటాయి. శనగ గింజ బరువు 38 నుంచి 40 గ్రాములు ఉంటుంది. వర్షాధారం నేలలు అయితే ఎకరాకు 10 నుంచి 11 క్వింటాళ్లు, మిగిలిన పొలాల్లో ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. వీటి పంట కాలం 90 నుంచి 105 రోజులు. వ్యవసాయ యాంత్రీకరణ.. కొత్త వంగడాలను సృష్టించడంతో పాటు రైతులకు అవసరమైన యంత్రాలను ఆర్ఏఆర్ఎస్లో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన 16హెచ్పీ ట్రాక్టర్తో అనుసంధానం చేసే పరికరాలు, రెండు చెక్కల నాగలి, ఆరు చెక్కల కల్టీవేటర్, ఐదు చెక్కల విత్తనం, ఎరువు వేసే పరికరం, పంట నూర్పిడి, క్రిమి సంహారక మందు పిచికారీ యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడు తున్నాయి. శిక్షణ.. అవగాహన ఈ కేంద్రంలో పని చేసే శాస్త్రవేత్తలు ప్రతి నెల రైతులకు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చీడ, పీడల యాజమాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాకుండా చుట్టుపక్కల రైతులు వేసిన పంట పొలాలను పరిశీలించి వాటికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మట్టి, నీటి నమూనాల పరీక్షలు నిర్వహించి అధిక దిబడులు సాధించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. పత్తికి పుణ్యక్షేత్రాల పేర్లు జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి, శనగ, పత్తి పంటలు సాగు చేస్తారు. ఈ మేరకు పత్తి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేసి నూతన వంగడాలను సృష్టించారు. 2012లో శివనంది, శ్రీరామ 2015–16లో ఉత్పత్తి చేశారు. వీటికి నరసింహ, శివనంది, యాగంటి, అరవింద, శ్రీనంది వంటి పేర్లు పెట్టడానికి ఇక్కడ ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఉండటం కారణం. అరవింద, శివనంది రకాలకు ఎర్రనేలలు, యాగంటి, నరసింహ, శ్రీరామ రకాలకు నల్లరేగడి నేలలు అనువైనవి. రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు, గులాబీ రంగు పురుగును ఈ వంగడాలు ఎదుర్కొంటాయి. ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శ్రీరామ రకం పంట విత్తనాలు ఏడు రాష్ట్రాలకు ఎగుమతి అయి ఆ రాష్ట్రాల్లో పంటలు పండిస్తున్నారు. సన్నని సోనాలు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2016లో విడుదలైన నంద్యాల సోనా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది. నంద్యాల సోనా కాలపరిమితి 130 నుంచి 140 రోజులు ఉంటుంది. గింజ చాలా సన్నగా ఉండి బియ్యం రుచిగా ఉంటుంది. ఈ బియ్యంలో ఇతర బియ్యాన్ని కల్తీ చేయడానికి సాధ్యం కాదు. వీటికి చీడపీడ తెగుళ్లు తక్కువ, అగ్గితెగులు, ముడత తెగులును తట్టుకుంటాయి. ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. కర్నూలు, కడప, గుంటూరు, నిజామాబాద్, రంగారెడ్డి, కర్ణాటక వంటి ప్రాంతాల్లో నంద్యాల సోనా బాగా ప్రాచుర్యం పొందింది. నాణ్యమైన పొగాకు 1992లో తూర్పుగోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం నుంచి అఖిత భారత పొగాకు సమన్వయ పథకం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి మార్చారు. నంద్యాల పొగాకు–1 2015లో ఉత్పత్తి చేశారు. మూడు కేజీల విత్తనాలు ఎకరాకు నారువేస్తే 150 నుంచి 200 ఎకరాలకు విత్తనాలు వస్తాయి. అదే విధంగా నాటు పొగాకు, బీడీ పొగాకులు పరిశోధనల సహకారంతో విడుదల చేశారు. ఈ పంటను సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 70 సెం.మీ దూరంలో మొక్క నాటుకోవడం వలన అధిక దిగుబడులు వస్తాయి. రసం పీల్చే పురుగు, లద్దెపురుగు వంటి వాటిని ఈ పంట తట్టుకుంటాయి. ఈ పంటలపై అధిక దిగుబడి, నాణ్యతలపై పరిశోధనలు పురోగతిలో ఉన్నాయి. బెస్ట్ పరిశోధన కేంద్రంగా అవార్డులు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 14 సంవత్సరాలు పని చేశాను. 12 సంవత్సరాలు శాస్త్రవేత్తగా, రెండు సంవత్సరాలు ఏడీఆర్గా పని చేశా. నా హయాంలో శనగలు నాలుగు రకాలు, కొర్రలు మూడు రకాలు, జొన్నలు రెండు రకాలు, పొగాకు ఒక రకం వంగడాలను విడుదల చేశాను. నా హయాంలో విడుదల చేసిన నంద్యాల సోనా బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో పది పంటలపై పరిశోధనలు చేసి కొత్త వంగడాలను సృష్టిస్తున్న ఒకే ఒక పరిశోధన స్థానం నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ప్రాంతీయ కేంద్రమే. – గోపాల్రెడ్డి, రిటైర్డు ఏడీఆర్ -
అగ్రికల్చర్ యూనివర్సిటీలో రోడ్డు ప్రమాదం
రాజేంద్రనగర్: ప్రొఫెసర్జయశంకర్ వ్యవసాయ వర్సిటీ క్యాంపస్లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న రాహుల్æ(22) తన సీనియర్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని తీసుకోని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బయటకు వెళ్లేందుకు బయల్దేరాడు. 90 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన ఎన్ ఫీల్డ్ వాహనం మూసి ఉన్న వర్సిటీ ప్రధాన గేట్ను బలంగా ఢీకొట్టింది. దీంతో రాహుల్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పక్కనే ఉన్న ఫుట్పాత్పై ఎగిరి పడ్డాడు. అదే సమయంలో దారి గుండా వెళ్తున్న యువకులు రక్తపు మడుగులో పడి ఉన్న రాహుల్ను గమనించి 108కు సమాచారం అందించారు. రాహుల్ సెల్కు వచ్చి న ఫోన్ను రిసీవ్ చేసి విషయాన్ని తెలపడంతో విద్యార్థులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది గాయపడిన రాహుల్కు ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు తరలించారు. ప్రమాదంలో ఎన్ఫీల్డ్ ముందుభాగం ధ్వంసం కాగా, గేటు సైతం విరిగిపోయింది. తోటి విద్యార్థులు రాజన్న జిల్లాకు చెందిన రాహుల్ తండ్రి నర్సింలుకు సమాచారం అందించడంతో బుధవారం తెల్లవారుజామున కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్త# చేస్తున్నారు. -
అన్యాయం.. ఆచార్యా!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వసతి గృహాల నిర్వహణ గందరగోళంగా మారింది. బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె తదితర వస్తువుల కొనుగోలు, వాటిధరలకు సంబంధించి రికార్డుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్ల నిర్వహణను నిరసిస్తూ విద్యార్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాలుర వసతి గృహాల వ్యవహా రాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. వసతి గృహాల నిర్వహణలో మితిమీరిన అవినీతి జరుగుతోందని విద్యార్థులు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. వసతుల కల్పన, అధిక బిల్లులు, వసతి గృహాలకు సంబంధించిన ఆహార పదార్థాల కొనుగోలు, వసతి గృహాల్లో భోజనం చేసే విద్యార్థుల సంఖ్య, వారికి వచ్చే మెస్ బిల్లులు, వీటికి సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిస్టర్ల నమోదు వంటి అంశాలపై స్పష్టత లేదనివిద్యార్థులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే తమకు ఇక్కడ అధికంగా వస్తున్న మెస్ బిల్లులు భారంగా మారాయని విద్యార్థులు వాపోతున్నారు. బాలుర వసతి గృహాల్లో అవినీతిని నిర్మూలించాలని, అధికంగా వస్తున్న మెస్ బిల్లులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఎన్యూ బాలుర వసతి గృహాల విద్యార్థులు సోమవారం వసతి గృహాల్లో ధర్నాకు దిగారు. ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి వసతి గృహాల కామన్ డైనింగ్ హాల్ ఎదుట బైఠాయించారు. కామన్ డైనింగ్ హాల్, వసతి గృహాలకు వెళ్ల ద్వారాల గేట్లకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. అధి కారుల అవినీతిని నిర్మూలించాలని, మెస్ బిల్లులు తగ్గించాలని నినాదాలు చేశారు.న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొనుగోళ్లు, మెస్ చార్జీలపై గందరగోళం వసతి గృహాల్లో విద్యార్థులకు వండే భోజన పదార్థాల కోసం బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె తదితర వస్తువుల కొనుగోలు, వాటి ధరలు, నాణ్యత సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏ రోజు ఎన్ని కిలోల బియ్యం వండారు? ఎన్ని కిలోల కూరగాయలు వాడారు? ఇతర పదార్థాలు ఎన్ని వాడారు? అసలు ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారు? అన్న అంశాలపై స్పష్టత ఉండటం లేదని, సంబంధిత రికార్డుల్లో సరిగా నమోదు చేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బిల్లులు వేసే సమయంలో సంబంధిత అధికారులు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వసతి గృహాల్లో లెక్కలు చూపాలని అడిగిన వారిపై చీఫ్ వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ బిల్లులు వేసి తగ్గిస్తారంట వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి రూ.3600 నుంచి రూ.4 వేల వరకు ఎక్కువ వేసి వసూలు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వసతి గృహాల్లో రెండు వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారని, వారి నుంచి ఇలా అధికంగా బిల్లులు వసూలు చేయడం పరి పాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇతర యూనివర్సిటీల్లో వారానికోసారి మాంసాహారం పెట్టినా బిల్లు నెలకు రూ.1600లకు మించడంలేదని ఇక్కడ శాఖాహార భోజనం పెట్టి నెలకు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. బిల్లులు అధికంగా రావడంతో సందేహం వచ్చిన విద్యార్థులు కొనుగోళ్లు, మెస్ చార్జీల రికార్డులను పరిశీలించగా కొనుగోళ్ల వివరాలు, నెలసరి చార్జీల నమోదులో లోపాలు ఉన్నాయని గుర్తించారు. ఈ లోపాలపై చీఫ్ వార్డెన్ తదితర అధికారులను నిలదీయగా బిల్లులు తగ్గిస్తామని బదులిచ్చారు. అవకతవకలను సరిచేయకుండా బిల్లులు తగ్గిస్తామనడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ పేరుతో నెలకు ప్రతి విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని, వాటిని విద్యుత్ దీపాలు, తదితర పరికరాల కొనుగోలుకు వాడుతున్నామంటూ హాస్టల్ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బల్బులు, ఇతర పరికరాల కొనుగోలుకు యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, తమ నుంచి వసూలు చేసిన మొత్తం కొందరి జేబుల్లోకి వెళ్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.36 లక్షల అవినీతి జరిగిందని కూడా విద్యార్థులు విమర్శిస్తున్నారు. వీటిన్నింటిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చనందునే సమస్య జటిలమవుతోందని వివరిస్తున్నారు. -
డిగ్రీకి క్లస్టర్ పజిల్!
ప్రకాశం, బేస్తవారిపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటున్న నిర్ణయాలతో డిగ్రీ కళాశాలల విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలో 6వ సెమిస్టర్కు క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైనల్ ఇయర్లో 5, 6 సెమిస్టర్లు విద్యార్థులు రాయాల్సి ఉంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక.. అక్టోబర్లో 6వ సెమిస్టర్లో భాగంగా సీబీసీఎస్ (ఛాయిస్ బేస్డు క్రెడిట్ సిస్టమ్) క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తృతీయ సంవత్సరంలో ఆరు పేపర్లుంటాయి. సైన్స్ (బీఎస్సీ, బీజెడ్సీ) విద్యార్థులు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్లలో ఎదైనా ఒక సబ్జెక్ట్లో మూడు పేపర్లను ఎంపిక చేసుకోవాలి, మిగిలిన మూడు పేపర్లు మూడు సబ్జెక్ట్ల్లో ఒక్కోటి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో లేని పుస్తకాలు ఆన్లైన్లో నవంబర్ నెలలో క్లస్టర్ పేపర్ల వివరాలు, సిలబస్ను యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టారు. సిలబస్ పూర్తిగా కొత్తగా, లోతైన టాపిక్లతో ఉంది. దీనిని బోధించేందుకు సరైన పుస్తకాలు లేకపోవడంతో అధ్యాపకులు కూడా తలలు పట్టుకున్నారు. అందుబాటులో ఉన్న టాపిక్లను చెప్పి పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. అకాడమీ పుస్తకాలు, ప్రైవేట్ పబ్లికేషన్స్ క్లస్టర్ సిలబస్ పుస్తకాలను నేటికీ విడుదల చేయలేదు. యూనివర్సిటీ అనాలోచితన నిర్ణయం ఏడాది ప్రారంభంలో కాని, వచ్చే ఏడాదికాని క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింటే విద్యార్థులకు, అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఫైనల్ ఇయర్ మధ్యలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంతో సిలబస్ చెప్పలేక అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలల వ్యవధి గడిచిపోయింది. ఏ ఒక్క సబ్జెక్ట్లో కనీసం సగం సిలబస్ పూర్తి చేసే పరిస్థితి లేదు. విద్యార్థుల పరిస్థితి ఇలా.. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న తృతీయ సంవత్సర విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి, రెండో సంవత్సరాల్లో సబ్జెక్ట్లు మిగిలినా పెద్ద నష్టం ఉండదు. కానీ ఫైనల్ ఇయర్లో సబ్జెక్ట్లు ఫెయిల్ అయితే పట్టా కోల్పోవాల్సిన వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్చిలో పరీక్షలు పెడితే తీవ్ర నష్టం ఇప్పటికి కూడా పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు పెడితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రాక్టిల్స్ ఉంటాయి. ఈనెల చివరికి ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేసిన సిలబస్ పూర్తి చేసేందుకు సరైన సమయంలేదు. హడావుడిగా అధ్యాపకులు సిలబస్ను పూర్తిచేసిన విద్యార్థులు చదువుకునేందుకు సమయం ఉండదు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను మార్చిలో నిర్వహించకుండ వాయిదావేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. -
‘అర్హత లేకున్నా వారసత్వ రాజకీయాలు..’
సాక్షి, నెల్లూరు: ప్రభుత్వం ప్రాజెక్టులపై శ్రద్ధపెట్టడం లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తే ఫలితాలు రైతులకు అందుతాయని ఆయన అన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో బుధవారం మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు తమ సంతానాన్ని అర్హత లేకున్నా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లభించటం లేదని చెప్పారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో.. ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. -
అగ్రిసెట్ ఫలితాలు విడుదల
చింతపల్లి విద్యార్థికి ప్రథమ ర్యాంకు... తెలంగాణ విద్యార్థికి మూడో ర్యాంకు సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్వహించిన అగ్రిసెట్–2017 పరీక్షా ఫలితాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ వల్లభనేని దామోదర నాయుడు శనివారం గుంటూరుకు సమీపంలోని లాంఫారంలో విడుదల చేశారు. 184 సీట్లకు (112 ప్రభుత్వ, 72 ప్రైవేటు) నిర్వహించిన పరీక్షకు తెలంగాణకు చెందిన 512 మంది సహా 2969 మంది విద్యార్థులు హాజరయ్యారు. వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అగ్రికల్చరల్ బీఎస్సీలో చేరేందుకు ఎంసెట్కు బదులుగా అగ్రిసెట్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 184 సీట్లలో 149 వ్యవసాయ డిప్లొమా విద్యార్థులకు, 35 విత్తన సాంకేతిక పరిజ్ఞాన డిప్లొమా విద్యార్థులకు కేటాయించారు. వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల్లో ప్ర«థమ ర్యాంకు చింతపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి కిల్లాడి గిరీశ్ కుమార్, రెండో ర్యాంకు అనకాపల్లికి చెందిన పి.వీరబాల రాజు, తృతీయ ర్యాంకు నంద్యాలకు చెందిన కె.ఉమేశ్ సాధించారు. విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో ప్ర«థమ ర్యాంకు జంగమేశ్వరపురం విద్యార్థిని కుమారి ఎం.సంధ్యారాణి, ద్వితీయ ర్యాంకు కె.గోవింద్, తృతీయ ర్యాంకు కె.స్రవంతి (రుద్రూరు, తెలంగాణ) సాధించారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.a nfrau.ac.in లో తెలుసుకోవచ్చు. ఫలితాల ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ, అగ్రిసెట్ కన్వీనర్ డాక్టర్ టీసీఎం నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అగ్రి విద్యార్థులు
► గుంటూరు జీటీ రోడ్డుపై రాస్తారోకో ► ప్రభుత్వ తీరుపై ధ్వజం కొరిటెపాడు(గుంటూరు): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం గుంటూరు జీటీ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. వ్యవసాయ కళాశాలల విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులంతా ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం లేనిపోని జీవోలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. వ్యవసాయ రంగంపై మక్కువతో బీఎస్సీ ఏజీ కోర్సు పూర్తి చేశామని, రాష్ట్రంలో తగినన్ని సీట్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూజీసీ గుర్తింపు ఉన్న విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నామన్నారు. యూజీసీ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలకు ఐసీఏఆర్ గుర్తింపు అవసరం లేదన్నారు. కానీ రాష్ట్రంలో ఏ ఉద్యోగానికి హాజరైనా ఐసీఏఆర్ గుర్తింపు లేని కళాశాలలో విద్యనభ్యసించారని అభ్యంతరాలు తెలుపుతున్నారన్నారు. తమను జీఆర్ఎస్, ఎస్ఆర్ఎఫ్, ఏఆర్ఎస్బీ, నీట్ వంటి పరీక్షలకు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఎప్పటికీ నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సిన పరస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో నెం 64పై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలెం పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి వారించడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనేక పరిణామాల తర్వాత రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయంలోని డీడీ అడ్మిన్ భగత్స్వరూప్కు విద్యార్థులు సమస్యలపై వినతిపత్రం అందించారు. -
కురుక్షేత్ర సభపై నిఘా
♦ ఎక్కడికక్కడే ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేసేందుకు సన్నద్ధం ♦ ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ♦ వివరాలు గోప్యంగా ఉంచుతున్న వైనం ♦ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ఏఎన్యూ పట్నంబజారు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నేడు తలపెట్టిన మాదిగ కురుక్షేత్ర మహాసభకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గుంటూరు నగరంతోపాటు అనేక ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారమే హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చిన జాతీయ కళాకారుల బృందానికి చెందిన ఆరుగురిని గుంటూరు నగరంలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంచినట్లు తెలిసింది. ఎమ్మార్పీఎస్ నేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), ఇంటిలిజెన్స్, కౌంటర్ ఇంటిలిజెన్స్, కిక్రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ) బృందాలను రంగంలో దింపినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి నుంచి సభా సమయం ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతలను నిలువరించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ నాయకులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణం వద్ద పోలీసు బలగాలు అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏపీఎస్పీ బెటాలియన్, ఆర్మ్డ్ రిజర్వుడుతోపాటు ఆయా స్టేషన్లకు చెందిన అధికారులు, వెయ్యి మందికిపైగా పోలీసులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ప్రతి వ్యక్తీ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను గురువారం గుంటూరు రేంజ్ డీఐజీ కే.వీ.వీ.గోపాలరావు, అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయారావు, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు పర్యవేక్షించారు. రాత్రి సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పోలీసుల బలగాలకు యూనివర్సిటీతోపాటు, పరిసర ప్రాంతాల్లో వసతి కల్పించారు. -
యుద్ధ ప్రాతిపదికన ప్లీనరీ ఏర్పాట్లు
► వర్షాలతో ఏర్పాట్లకు అంతరాయం ► సభా ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు ► గాలులతో కింద పడిన రేకులు ► శరవేగంగా పునరుద్ధరణ పనులు ► పనుల్లో నిమగ్నమైన కమిటీ సభ్యులు ► బుధవారానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడి ఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జరుగనున్న వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఏర్పాట్లలో స్వల్ప అంతరాయం ఏర్పడినప్పటికీ సమస్యలను అధిగమించి నాయకులు పనులు చేయిస్తున్నారు. వర్షంతో ప్లీనరీ సమావేశ మందిరం, భోజనశాల, వంటశాల ప్రాంగణాల్లో చేరిన నీటిని మంగళవారం కార్మికులు బయటకు తోడించారు. బలంగా వీచిన గాలులకు పైకప్పు రేకులు లేవడంతో సిబ్బందిని వాటిని సవరించారు. ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘరాం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షణలో కార్మికులు, సిబ్బంది ఏర్పాట్లను పునరుద్ధరిస్తున్నారు. సమావేశ మందిరం పైకప్పు లోపలి భాగంలో తిరిగి పార్టీ జెండా రంగు ఉన్న పతకాలతో అలంకరణ పనులు చేయిస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద కొత్త మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. రోలర్లతో సభా ప్రాంగణాన్ని చదును చేయిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుధవారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఏర్పాట్ల కమిటీ చైర్మన్ తలశిల రఘురాం తెలిపారు. ఉత్సాహంగా కార్యకర్తలు.. వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ ఏర్పాట్లలో పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. అలంకరణ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు, సేవాదళ్ కార్యకర్తలు రేయింబవళ్లూ పని చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు. కృష్ణా డెల్టా కమిటీ మాజీ చైర్మన్, పార్టీ నాయకుడు సతీష్రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు.. ప్లీనరీ ప్రాంగణంలో ప్రస్తుతం నిపుణులు, సిబ్బంది అలంకరణ పనులు చేస్తున్నారు. సమావేశ వేదిక పక్కనే ప్రత్యేక ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమైన చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ప్రధాన వేదికపై 60 అడుగుల ఎత్తుతో భారీ ఎల్ఈడీ తెర ఏర్పాటు చేస్తున్నారు. 600 అడుగుల దూరంలో కూర్చున్న వారు కూడా స్పష్టంగా వేదికపై జరుగుతున్న కార్యక్రమాలు చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, నాయకులు మామిడిరాము, అంగడి శ్రీను తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. -
ముమ్మరంగా ప్లీనరీ ఏర్పాట్లు
► పూర్తయిన హాల్ పనులు ► ఏర్పాట్లను పరిశీలించిన పలువురు నాయకులు ఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీకి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్లీనరీ సమావేశాల కోసం రెండు హాల్స్ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఒక హాల్ పనులు పూర్తయ్యాయి. హాల్స్లో పార్టీ నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు కూర్చొనేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భోజనాలకు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించారు. ప్లీనరీ ప్రాంగణంలో కేటగిరీల వారీగా బారిగేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం విడిగా స్థలాన్ని గుర్తించారు. ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వర్షాల వల్ల ప్లీనరీకి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు ప్లీనరీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివా రం పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రారావు, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు, విజయనగరం జిల్లా నాయకుడు చిన్న శ్రీను, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బూదాల శ్రీను, మదిర ప్రభాకర్, తోకల శ్యామ్కుమార్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ లాతర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తనుబుద్ధి చంద్రశేఖర రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ సోమవారం ప్రాంగణాన్ని సందర్శిస్తారని రఘురాం తెలిపారు. -
డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఏఎన్యూ: ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను రెక్టార్ ఆచార్య సాంబశివరావు విడుదల చేశారు. ఫలితాలను www.anu.ac.inవెబ్సైట్ ద్వారా పొందొచ్చని సూచించారు. రీవా ల్యుయేషన్కు డిగ్రీ మొదటి సెమిస్టర్లో అన్ని కోర్సుల నుంచి రెగ్యులర్ విద్యార్థు లు 4,756 మంది దరఖాస్తు చేసుకోగా 1,131 మంది ఉత్తీర్ణులయ్యారు. డిగ్రీ మొదటి సెమిస్టర్లో అన్ని కోర్సుల నుంచి సప్లిమెంటరీ విద్యార్థులు 1,222 మంది దరఖాస్తు చేసుకోగా 143 మంది.. మూడో సెమిస్టర్ రెగ్యులర్లో అన్ని కోర్సుల నుంచి 5,331 మంది దరఖాస్తు చేసుకోగా 1,377 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. డిసెంబర్లో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఎల్ఎల్ఎన్ కోర్సుల పరీక్షల జవాబు పత్రాల రీవాల్యు యేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆంజనేయరెడ్డి తెలిపారు. -
రంగా విగ్రహాలు మీరు తీసుకెళ్లండి
వ్యవసాయ వర్సిటీకి తెలంగాణ లేఖ సాక్షి, అమరావతి: హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాలను తీసు కెళ్లాల్సిందిగా ఏపీ వ్యవసాయ వర్సిటీకి ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లేఖ రాసింది. దీంతో గుంటూరులోని వ్యవ సాయ వర్సిటీ అధికారులు ఆ విగ్రహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడిగా ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఒకటి, పరిపాలనా భవనం వద్ద మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాటిని తరలించనున్నారు. -
ఏఎన్యూ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల
ఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2017–18 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్యూ పీజీ సెట్–2017 నోటిఫికేషన్ను మంగళవారం రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్పాల్ విడుదల చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రామిరెడ్డి మాట్లాడుతూ ఏఎన్యూ పీజీ సెట్కు బుధవారం నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకూ, తత్కాల్ విధానంలో రూ.1,000 ఫీజు చెల్లించి మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 5, 6, 7 తేదీల్లో గుంటూరు, ఒంగోలు, విజయవాడల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. వివరాలకు www.anudoa.in,www.anu.ac.in వెబ్సైట్లను చూడొచ్చన్నారు. ఏఎన్యూ దూరవిద్యాకేంద్రం గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన ఎంఈడీ, ఎల్ఎల్ఎం, డిప్లొమా ఇన్ యోగా కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు దూరవిద్య పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి తెలిపారు. ఫలితాలను www.anucde.info లో చూడవచ్చు. -
ప్రతి పంచాయతీలో వాతావరణ సమాచార కేంద్రం
యూనివర్సిటీ క్యాంపస్: కరువు జిల్లాల్లో ప్రతి పంచాయతీలో వాతావరణ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ విజయకుమార్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరువు జిల్లాల్లో వాతావరణ సమాచారం రైతులకు అందించేందుకు వాతావరణ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటుచేస్తునట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఆగ్రో మెట్రాలజీ యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 11 నుంచి 14వతేదీ వరకు సుభాష్ పాలేకర్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగే ఈ సదస్సుకు ఆరువేల మంది రైతులు హాజరుకానున్నట్లు తెలిపారు. -
'నాగార్జున వర్సిటీలో కుల రాజ్యం'
విజయవాడ: ఆచార్య నాగార్జున వర్సిటీని కులరాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు విమర్శించారు. విజయవాడలో శుక్రవారం కత్తి పద్మారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ సామ్రాజ్యవాదం, కులాధిపత్యం కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో కారంచేడు, చుండూరు జరిగిన దాడుల నేడు విశ్వవిద్యాలయాల్లో చోటు చేసుకుంటున్నాయిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే పరిస్థితులు లేకుండా వారిని అభద్రతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్న దళితుడిని తొలగించి... చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆధిపత్యం ఇచ్చారని గుర్తు చేశారు. లైబ్రేరియన్గా ఉన్న వ్యక్తిని కార్యనిర్వాహక కమిటీలో చేర్చి యూనివర్సిటీని కులరాజ్యంగా మార్చారని దుయ్యబట్టారు. ఏఎన్యూలో ఒకే కులానికి చెందిన ఐదుగురు వ్యక్తుల చేతుల్లో పాలన సాగుతోందన్నారు. ఏఎన్యూలో కుల, మత భావాలను ఆచరిస్తున్న రెక్టార్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.నరసింహారావు, దూరవిద్య కేంద్రం డెరైక్టర్ పి.శంకరపిచ్చయ్య, పాలకమండలి సభ్యుడు కె.వెంకట్రావులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. వీటపై ఆగస్టు 14న విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కత్తి పద్మారావు ప్రకటించారు. -
ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం
దోషులకు శిక్ష పడినప్పుడే ఆమె ఆత్మకు శాంతి సీనియర్ న్యాయవాది వైకే గుంటూరు (లక్ష్మీపురం) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ మహమ్మారికి బలైన ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి కేసులో దోషులకు శిక్ష పడినప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని సీనియర్ న్యాయవాది వై. కోటేశ్వరరావు (వైకే) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహ విద్యార్థుల అమానుష చర్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడి గురువారానికి ఏడాది పూర్తవుతున్న దృష్ట్యా ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థులు నిందితులుగా ఉన్న ఆ కేసు విచారణ ప్రక్రియ గుంటూరు 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ మహిళా న్యాయమూర్తి కమలాదేవి కోర్టులో ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానున్నదని వెల్లడించారు. ఈ మేరకు నలుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారని వివరించారు. యావజ్జీవ కారాగార శిక్ష పడే ర్యాగింగ్ నిరోధక చట్టం ఐపీసీలోని 306 తదితర సెక్షన్ల కింద కేసు విచారణ జరగనున్నదని తెలిపారు. కేసు విచారణ అసిస్టెంట్ సెషన్సు జడ్జి కాకుండా, సెషన్స్ జడ్జితో చేపట్టాలని కోరుతూ ఫిర్యాదిదారు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున కోర్టులో పిటిషన్ వేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. మృతురాలి తండ్రి మురళీకృష్ణ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఆర్కిటెక్చర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డిని కలిసి గురువారం రిషితేశ్వరి సంస్మరణను విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక దినంగా నిర్వహించాలని కోరారని తెలిపారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
నేడు ఏఎన్యూ పాలకమండలి సమావేశం
కీలక అంశాలపై నిర్ణయం ఏఎన్యూలో చర్చకు రానున్న క్యాస్ పదోన్నతుల అంశం పీజీ పరీక్షల కోఆర్డినేటర్ మార్పు! ఏఎన్యూ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి సమావేశం బుధవారం జరగనుంది. వీసీ ఆచార్య ఎ. రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యూనివర్సిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. యూనివర్సిటీలో చేపట్టనున్న పలు నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, పరిశోధన, అవగాహనా ఒప్పందాల అంశాలు చర్చకు రానున్నాయి. కమిటీల నివేదికలపై నిర్ణయం? యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షల విధుల్లో పాల్గొంటున్న ఒక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్కులు వేయిస్తానని చెప్పి విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తుకు వీసీ యూనివర్సిటీ అధికారులతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదికను సమర్పించింది. దీనిపై పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ఇటీవల యూనివర్సిటీలో చోటు చేసుకున్న పలు ఘటనలపై నియమించిన కమిటీల నివేదికలు కూడా పాలకమండలి పరిశీలన కోసం ఎదురు చూస్తున్నాయి. క్యాస్ పదోన్నతులు.. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా క్యాస్ పదోన్నతులు కల్పించేందుకు ఉన్నతాధికారులు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ల రికమెండేషన్లను పరిశీలించి దాని ఆధారంగా క్యాస్ పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై పాలక మండలి ఏం నిర్ణయం తీసుకుంటుందోనని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు యూనివర్సిటీ పీజీ పరీక్షల కోఆర్డినేటర్ పదవి మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ పదవి కోసం పలువురు అశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. యూనివర్సిటీ రెగ్యులర్, దూరవిద్య పరీక్ష విభాగంలో గతంలో కీలక విధులు నిర్వహించిన సైన్స్ కళాశాలకు చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఈ పదవి ఖరారైనట్లు సమాచారం. దీంతోపాటు యూజీ పరీక్షల కోఆర్డినేటర్ పదవికి కూడా గడువు తీరినప్పటికీ ప్రస్తుతం ఉన్న కోఆర్డినేటర్నే కొనసాగిస్తారా లేక కొత్తవారిని నియమిస్తారా అనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు పలు కీలక అంశాలను పాలకమండలి పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
సాగుకు 16,250 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ సమర్పించిన మంత్రి ప్రత్తిపాటి * వ్యవసాయం, అనుబంధ రంగాలు * ఒకే గొడుగు కిందకు తెస్తామని వెల్లడి * ప్రణాళికా వ్యయం 7,691.90 కోట్లు * ప్రణాళికేతర వ్యయం 8,558.68 కోట్లు సాక్షి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయం, నీటికుంటల తవ్వకం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్ను గురువారం రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. రైతును రాజుగా చేసే క్రమంలో ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్ని ‘రైతుకోసం’ పేరిట ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్టు వెల్లడించారు. గతేడాదికంటే రూ.రెండు వేల కోట్ల పెంపుతో 2016-17 సంవత్సరానికి రూ.16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి చేసే ప్రణాళిక వ్యయం రూ.7,691.90 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం రూ.8,558.68 కోట్లుగా మంత్రి పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి రూ.5,786.23 కోట్లను కేటాయించామన్నారు. ఇందులో 1,311.77 కోట్లు ప్రణాళికా వ్యయం, 4,474.46 కోట్లు ప్రణాళికేతర వ్యయమని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా 22 పేజీల ప్రసంగపాఠాన్ని చదివారు. కరువు వల్ల దిగుబడులు తగ్గాయి.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగ మిషన్ 8.4 శాతం అభివృద్ధి సాధించినప్పటికీ పంటల దిగుబడులు తిరోగమనంలో సాగాయని మంత్రి చెప్పారు. తీవ్ర కరువు పరిస్థితులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట ఉత్పత్తులు తగ్గాయన్నారు. అయితే ఉద్యానవన, ఆక్వా, పశు సంవర్థక రంగాలు గణనీయమైన ప్రగతి సాధించాయన్నారు. 2016-17లో వ్యవసాయం పురోగమనంలో సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధించినట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఎన్నో విజయాలు సాధించినట్టు చెబుతూ వాటిని ప్రస్తావించారు. రైతులకు 2015-16లో రూ.45,512 కోట్ల పంట రుణాలు, రూ.13,018 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, 95,299 మంది కౌలు రైతులకు రూ.218.81 కోట్ల పంట రుణాలను బ్యాంకులు అందజేశాయని తెలిపారు. గిర్, సాహివాల్ పశువుల రవాణా, బీమాకోసం ఒక్కో పశువుకు రూ.పదివేల సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఏపీని ఆక్వా హబ్గా తీర్చదిద్దనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మకమైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రణాళిక కేటాయింపులేవీ ఈ బడ్జెట్లో లేవు. కేంద్రప్రభుత్వమిచ్చిన రూ.81.40 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ వరి పరిశోధన కేంద్రం శాఖ ఏర్పాటు కానున్నదని తెలిపారు. కాగా శాసనమండలిలో 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను మంత్రి పి.నారాయణ, వ్యవసా య బడ్జెట్ను కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. -
అగ్రీవర్సిటీలో హడావుడీ ప్రమోషన్లకు బ్రేక్
-‘సాక్షి’ వార్తతో కదిలిన యంత్రాంగం -నేటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిపివేత -తక్షణమే జరపాలంటూ టీచర్ల డిమాండ్ -వర్శిటీ టీచర్ల అసోసియేషన్ అత్యవసర భేటీ హైదరాబాద్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకు బ్రేక్ పడింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగాల్సిన ప్రమోషన్ల ఇంటర్వ్యూలను వాయిదా వేయగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 'అగ్రీవర్శిటీలో హడావిడి ప్రమోషన్ల' శీర్షికన ఈనెల 23న ‘సాక్షి దినపత్రిక’లో వచ్చిన కథనానికి స్పందనగా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మరాజు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న వైస్ ఛాన్సలర్ ఇంత హడావిడిగా 18 మంది ప్రొఫెసర్లు, ఏడుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 70 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకు ఇంటర్వ్యూ తేదీలు ఖరారు చేయడాన్ని పలువురు తప్పుబట్టిన నేపథ్యంలో డాక్టర్ పద్మరాజు వాటిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. 2014 జనవరి నుంచి ప్రతి ఆరు నెలలకోసారి ఉపాధ్యాయులకు జరపాల్సిన మెరిట్ ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చేపట్టాలని అసోసియేషన్ యూనివర్శిటీ పాలకవర్గానికి విజ్ఞప్తి చేసింది. -
బాబురావు పాత్ర నాడే తేలింది!
ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన.. విచారణ కమిటీ నివేదికను పట్టించుకోని వైనం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజా, విద్యార్థి సంఘాల డిమాండ్ గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్, లైంగిక వేధింపులు తట్టుకోలేక మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో నియమించి కమిటీ పలువురిని విచారించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. ఈ నివేదికలో అప్పటి ప్రిన్సిపాల్ బాబురావు పాత్ర ఉందని స్పష్టం చేసింది. చినకాకానిలోని హాయ్లాండ్లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో బాబురావు ఉద్దేశపూర్వకంగానే రిషితేశ్వరిని వేధింపులకు గురిచేసే విద్యార్థులను ప్రోత్సహించాడని నివేదికలో తేల్చిచెప్పింది. అందరికీ బహుమతులు స్వయంగా అందజేసిన ఆయన రిషితేశ్వరికి మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడే విద్యార్థి శ్రీనివాస్తో బహుమతి ఇప్పించాడని పేర్కొంది. కళాశాలలో జరుగుతున్న వేధింపులు కూడా తన దృష్టికి వచ్చినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ర్యాగింగ్ శ్రుతి మించిందని కమిటీ పేర్కొంది. ఆయా అంశాల ఆధారంగా బాబురావుపై చర్యలు తీసుకోవాలని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆయన్ను రక్షించే క్రమంలో బాలసుబ్రహ్మణ్యం కమిటీ సూచనలు పక్కన బెడుతూ వచ్చాయి. తప్పులు సరిదిద్దే పనుల్లో పోలీసులు దీంతో ప్రభుత్వం, పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని భావించి అప్పటి ప్రిన్సిపాల్ పాత్రపై ఆధారాలు వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు ఆరు నెలల తరువాత దాఖలు చేసిన చార్జిషీట్లో బాబురావు పేరు చేర్చడం చూస్తుంటే ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. చార్జిషీటులో పేరు చేర్చడమే కాకుండా సంచలనాత్మక కేసు కావడంతో బాబురావును అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అతడ్ని అరెస్టు చేయకుండా చార్జిషీటులో పేరు చేర్చడం వల్ల ముందస్తు బెయిల్ పొందే అవకాశం పోలీసులే కల్పించినట్లుగా అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.. అప్పట్లో విద్యార్థి, మహిళాసంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదు. అతని పాత్రపై తమకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం, పోలీసులు కేసును మరుగున పెట్టేందుకు యత్నించారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో స్పందించి సోషల్ మీడియాలో సైతం రిషితేశ్వరి పేరుతో ఫేస్బుక్ అకౌంట్ను ఓపెన్ చేయడం, అందులో వేల మంది లైక్లు, కామెంట్లు పెట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబురావును శిక్షిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుంది ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబురావును శిక్షిస్తేనే రిషితేశ్వరి కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు. ప్రస్తుతం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో బాబురావును నాలుగో నింది తుడిగా చేర్చడం వల్ల కేసు న్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అతనిపై చర్యలు తీసుకోవాలి. - ఎం. మురళీకృష్ణ, రిషితేశ్వరి తండ్రి -
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
* రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు * ర్యాగింగ్ను ప్రోత్సహించాడని తేల్చిన పోలీసులు * వివిధ సెక్షన్ల కింద శిక్షించాలని కోర్టుకు నివేదన * చార్జిషీట్ వివరాలను గోప్యంగా ఉంచిన వైనం * జనవరి నాలుగో తేదీన తదుపరి విచారణ సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరు నెలలుగా కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు ఎట్టకేలకు బాబూరావు పాత్రపై నిగ్గు తేల్చగలిగారు. సుమారు 70 మందిని విచారించగా కళాశాలలో ర్యాగింగ్, హాయ్ల్యాండ్లో జరిగిన ఫ్రెషర్స్డే వేడుకల్లో రిషితేశ్వరిపై లైంగిక వేధింపులు జరిగినట్లు తెలి సినా ఆయన పట్టించుకోలేదని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిసింది. ర్యాగింగ్ విషయంలో బాబూరావు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనపై ర్యాగింగ్ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిసింది. అయితే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినప్పటికీ హాయ్ ల్యాండ్లో ఫ్రెషర్స్డే పార్టీ జరిగే సమయానికి ఆమె మైనర్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని సైతం పోలీసులు చార్జిషీట్లో ప్రస్తావించినట్లు తెలిసింది. 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఆరు నెలల సమగ్ర విచారణ తరువాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ర్యాగింగ్ను ప్రోత్సహించాడు... న్యాయవాది వై.కె. శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రిషితేశ్వరి కేసులో బాబూరావును 4వ నిందితుడిగా చేరుస్తూ మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారని చెప్పారు. ర్యాగింగ్ నేరాన్ని చూస్తూ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడమేకాక, నేరాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించాడని, దీనిపై విచారించి ఆయనను శిక్షించాలని పోలీసులు చార్జిషీట్లో కోరారని తెలిపారు. నిందితులపై గతంలో నమోదైన ఐపీసీ 306, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4తోపాటు, బాలికలపై లైంగిక అత్యాచారాల రక్షణ చట్టంలోని 7, 8, 11, 12 సెక్షన్ల కింద కూడా విచారించి శిక్షించాలని పోలీసులు చార్జిషీట్ ద్వారా కోర్టును కోరారని ఆయన చెప్పారు. దీనిపై కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించడానికి జనవరి 4వ తేదీకి కేసును వాయిదా వేసిందని తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున తానూ వాదనలు వినిపించనున్నట్లు చెప్పారు. బాబూరావును నిందితుడిగా చేర్చినప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని, చార్జిషీట్తో సంబంధం లేకుండానే నిందితులను అరెస్ట్ చేయవచ్చని వై.కె. అన్నారు. కాల్మనీ కేసులో నిందితుడు సత్యానందంలాగా బాబూరావు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం పోలీసులే ఇస్తున్నట్లు భావించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. బాబూరావును వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి ఆరోపణలకు తెరదించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. -
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
-
చేదు జ్ఞాపకాలుగా విద్యార్థుల బలవన్మరణాలు
విద్యాశాఖాధికారి సస్పెన్షన్ ఉపాధ్యాయుల బదిలీల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో ఆన్లైన్లో జాబితాలు ఉంచలేదనే కారణంతో కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి ఎం.నాగేశ్వరరావును ప్రభుత్వం నవంబర్ 10న సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రీజనల్ జాయింట్ డెరైక్టర్ సుబ్బారెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ నెల 24న నాగేశ్వరరావును మళ్లీ విధుల్లోకి తీసుకుని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా నియమించారు. విజయవాడ : ఈ ఏడాది ఎంసెట్ అనేక ఒత్తిళ్ల నడుమ జరిగింది. మే 8న ఇంజినీరింగ్, మెడిసిన్కు పరీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రెండు జిల్లాల్లో ప్రవేశ పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడకుండా వివిధ సంఘాలు, పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో దాదాపు 100 వరకూ పోలీస్ జీపులు, బ్లూకార్డ్స్ ద్విచక్ర వాహనాలు వినియోగించారు. ‘పది’లో 4, 10 స్థానాలు పదో తరగతి పరీక్షల్లో గుంటూరు జిల్లా రాష్ట్రస్థాయిలో నాలుగు, కృష్ణాజిల్లా పదో స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా 94.59 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 477 మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారు. కృష్ణాజిల్లా 91.36 శాతం ఉత్తీర్ణతతో పదో స్థానంలో నిలిచింది. రెండు జిల్లాల్లో బాలికలదే అగ్రస్థానం. అలాగే, మే 9 నుంచి 11వ తేదీ వరకూ టెట్కమ్ టీఆర్టీ-2014 పరీక్షలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో 28,996 మంది, కృష్ణాలో 26,470 మంది హాజరయ్యారు. ఇంటర్లో ‘కృష్ణా’ టాప్ ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల్లో రెండు జిల్లాల విద్యార్థులూ మెరిశారు. ప్రధానంగా మొదటి సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా వరుసగా 11వ సారి మొదటి స్థానంలో నిలిచింది. 66 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. రెండు జిల్లాల్లోనూ బాలికల ఉత్తీర్ణతా శాతమే ఎక్కువగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సర పరీక్షల్లో 83 శాతంతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలోనూ, 76 శాతంతో గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలిచి విద్యాకేంద్రాలు పేరును నిలబెట్టుకున్నాయి. కార్పొరేట్పై ‘గంటా’ ధ్వజం ఈ ఏడాది అక్టోబర్ 3న గుంటూరులో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్పొరేట్ కళాశాలలు చదువు పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచడం సరికాదని, అనుమతులు లేకుండా కార్పొరేట్ కళాశాలలు బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నాయని, పద్ధతి మార్చుకోవాలని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న వరంగల్కు చెందిన కె.రుషితేశ్వరి జులై 14న హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, లైంగిక వేధింపుల నేపథ్యంలో రుషితేశ్వరి మృతిచెందిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. విద్యార్థి సంఘాల నిరసనలు, ఆందోళనలు హోరెత్తాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. రుషితేశ్వరి డైరీలో రాసిన వివరాల ఆధారంగా ముగ్గురు సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం వర్శిటీలో పర్యటించి ప్రిన్సిపాల్ బాబూరావును తొలగించాలని డిమాండ్ చేసింది. విద్యార్థినుల పట్ల బాబూరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. ఈ క్రమంలో వర్శిటీ ఇన్చార్జి వీసీగా ఉన్న సాంబశివరావును రెక్టార్కే పరిమితంచేసి ఆయన స్థానంలో సాంకేతిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మిని నియమించారు. రుషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, రాజమండ్రిలో 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం పరిహారంగా ఇచ్చింది. ప్రిన్సిపాల్ బాబును తొలగించారు. అలాగే, సెప్టెంబర్ 25న పోరంకిలోని నారాయణ క్యాంపస్లో ఒత్తిడి తట్టుకోలేక ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందిన విద్యార్థి అఖిల్తేజ్ కుమార్రెడ్డి (16) ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నెల 21న మేరీ స్టెల్లా కాలేజీలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పంగిడిగూడెంకు చెందిన దొమ్మేటి భానుప్రీతి (16) కూడా ఆత్మహత్య చేసుకుంది. -
పారదర్శకంగా పని చేయిస్తా..
ఉన్నత స్థాయి అధికారులే వ్యవస్థకు ఆదర్శం నాగార్జున వర్సిటీతో 30 సంవత్సరాల అనుబంధం వృత్తి నైపుణ్యం, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీకి ఆన్లైన్ విధానం ఏఎన్యూ ఇన్చార్జి వీసీ ఆచార్య వీఎస్ఎస్ కుమార్ ఏఎన్యూ: ఏ వ్యవస్థకైనా ఉన్నత స్థాయి అధికారులే ఆదర్శమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) ఇన్చార్జి వీసీ ఆచార్య వెల్లంకి సాంబశివకుమార్ అన్నారు. ఏఎన్యూ ఇన్చార్జి వీసీగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వర్సిటీలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏమీ అవసరం లేదని తాను ఉన్నన్ని రోజులు పారదర్శకంగా పనిచేస్తూ కింది స్థాయి వారితో కూడా పని చేయిస్తానన్నారు. ఏఎన్యూతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. 1984 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం, వివిధ తనిఖీలు, ప్రత్యేక కమిటీలు తదితర విధులకు తాను ఏఎన్యూలో బాధ్యత వహించానన్నారు. ఏఎన్యూకు చెందిన అధికారులు, అధ్యాపకులతో మంచి పరిచయాలు ఉన్నాయని ఇతర యూనివర్సిటీకి ఇన్చార్జిగా వచ్చానన్న భావన తనకు లేదన్నారు. ఆర్ట్స్ కోర్సుల విద్యార్థులకు కూడా మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు దోహదం చేసే భాష, భావ వ్యక్తీకరణ అంశాలపై శిక్షణను వీలైనంత మేరకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏఎన్యూ నుంచి విద్యార్థులకు వివిధ సర్టిఫికెట్లు, పత్రాల పంపిణీలో ఆన్లైన్ డెలివరీ విధానాన్ని అతి త్వరలో ప్రవేశ పెడతానన్నారు. విద్యార్థులు యూనివర్సిటీకి రాకుండా ఇంటివద్ద నుంచే సర్టిఫికెట్లు పొందే విధంగా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తానని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు ఇస్తుందని ఏఎన్యూ అధ్యాపకులు మంచి ప్రాజెక్టు సిద్ధం చేస్తే ఢిల్లీలో ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. -
విద్యార్థిని వేధిస్తున్న ఉద్యోగిపై కేసు నమోదు
గుంటూరు : కాంట్రాక్ట్ ఉద్యోగి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చోటు చేసుకుంది. యూనివర్శిటీలోని విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి రమేష్... యూనివర్శిటీలో చదువుతున్న ఎంబీఏ విద్యార్థిని తనను పెళ్లి చేసుకోవాలని వెంట పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె పెదకాకాని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. -
కమిటీలతో కాలక్షేపం!
ఏఎన్యూలో విద్యార్థి సంఘాల మండిపాటు ర్యాగింగ్పై కఠిన చర్యలకు పూనుకోవడం లేదని ఆవేదన వ్యవస్థలో లోపాలు సరిదిద్దకుండా ర్యాగింగ్ను నిరోధించలేమని స్పష్టీకరణ ఇవే విషయాలపై మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించిన సంఘాల నేతలు గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్యూ)లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణంపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, తాజాగా అదే కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ద్విసభ్య కమిటీని వేస్తున్నట్టు ప్రకటించడాన్ని విద్యార్థి సంఘాలు ఆక్షేపించాయి. ఏఎన్యూ ఆర్కిటెక్చర్ కళాశాలలో తాజాగా సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి గంటా స్పందించి మంగళవారం వర్సిటీకి విచ్చేసి అధికారులతో సమావేశమ య్యారు. దీనిపై శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉదయలక్ష్మిలతో ద్విసభ్య కమిటీ వేస్తున్నట్టు చెప్పి, నివేదిక ఇవ్వాలంటూ మంత్రి ఆదేశించారు.అయితే , కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి, పదే పదే ర్యాగింగ్కు కారణాలు ఏమిటి? అనే విషయాలను పరిశీలించకుండా కేవలం కమిటీలు వేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. వీటివల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని, బాధ్యులపై కేసులు నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక మేరకు వర్సిటీలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సీసీ కెమెరాలు, విద్యార్థులకు ఐడీ కార్డులు, ర్యాగింగ్ నిరోధక బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప, వ్యవస్థలో ఉన్న లోపాలపై దృష్టి సారించలేదంటున్నారు. ఈ కారణంగానే ర్యాగింగ్ పునరావృతమవుతోందని చెపుతున్నారు. యూనివర్సిటీలో కనిపించని ఇన్చార్జి వీసీ విద్యార్థిని రిషితేశ్వరి ఘటన అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బి.ఉదయలక్ష్మిని ఇన్చార్జి వీసీగా నియమించారు. మొదట్లో రెండు, మూడు రోజులపాటు హడావుడి చేసిన ఆమె ఆ తరువాత వర్సిటీలో కనిపించ లేదు. వారంలో మూడు రోజులు ఏఎన్యూలో ఉండి ర్యాగింగ్ వంటి కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన ఆమె ఈ వంద రోజుల్లో పట్టుమని పది రోజులు కూడా వర్సిటీకి రాలేదు. ఇన్చార్జి వీసీ సక్రమంగా రావడం లేదని, కొత్త వీసీని నియమించాలని కొందరు విద్యార్థులు ఈ సందర్భంగా మంత్రి గంటా దృష్టికి తెచ్చారు. ర్యాగింగ్పై నోరు మెదపని మంత్రి ... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధికారులు, విద్యార్థులతో సమావేశమైన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ జరుగుతున్న ర్యాగింగ్పై మాత్రం నోరు మెదపలేదు. పైగా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగిందని, ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నేతలు కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ర్యాగింగ్ ఆగదని, వ్యవస్థలో లోపాలను సరిదిద్దకుండా ర్యాగింగ్ను ఎలా నిరోధిస్తారంటూ మంత్రిని ప్రశ్నించారు. ర్యాగింగ్ జరిగినప్పుడల్లా కమిటీల పేరిట కాలయాపనచేయడం మినహా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్సిటీ బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం
రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు: రాధా మోహన్సింగ్ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీకి శంకుస్థాపన సాక్షి, గుంటూరు: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా కల్పించి నిర్వహణ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని లాం ఫాంలో సోమవారం ఉదయం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాన్ని 500 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,505 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో పోస్టుగ్రాడ్యుయేట్ సెంటర్, సీడ్ అండ్ రీసెర్చ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, వాటర్ టెక్నాలజీ, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, పెస్టిసైడ్ రీసెర్చ్ లేబోరేటరీ, ఫుడ్ ప్రొసెసింగ్, ట్రైనింగ్ కమ్ ఇన్క్యూబేషన్ సెంటర్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చేనెలలో మంగళగిరి వద్ద ఎయిమ్స్కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. బీపీటీ వరి వంగడంతో ఘనకీర్తి.. కేంద్ర మంత్రి రాధామోహన్సింగ్ మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం బీపీటీ వరి వంగడాన్ని పరిశోధన ద్వారా రూపొందించి రైతాంగానికి అందించిన ఘనత ఈ వర్సిటీకే దక్కుతుందన్నారు. దేశంలో ఉన్న రైతులకు వారి భూమి స్వభావం తెలిపే సాయిల్ హెల్త్ కార్డు ప్రతిరైతు జేబులో ఉండేలా రూ.580 కోట్లతో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాలు చూసే సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు రాధామోహన్సింగ్ ప్రకటించారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న పలు ఇన్స్టిట్యూషన్స్ గురించి వాటికి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు. -
జాషువా పీఠం ఏర్పాటు చేయాలి
- గుర్రం జాషువా 120వ జయంతి సభలో జేడీ శీలం గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ)లో గుర్రం జాషువా పీఠం ఏర్పాటు చేయాలని ఎంపీ జేడీ శీలం కోరారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని చెప్పారు. జాషువా పీఠం ఏర్పాటుకు తన ఎంపీ కోటా నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఆదివారం మహాకవి గుర్రం జాషువా 120వ జయంతి ఉత్సవసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జాషువా తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపారని చెప్పారు. దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచం గర్వించదగ్గ బౌద్ధ సంస్కృతికి నెలవైన అమరావతి విదేశీయులు నిర్మించే వ్యాపార కేంద్రంగా మారకూడదని చెప్పారు. ధనవంతులకే పరిమితమై పేద, ధనిక అంతరాలను మరింతగా పెంచే వాణిజ్య రాజధాని తెలుగు ప్రజలకు అవసరం లేదని, అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి సంతోషంగా జీవించే ప్రజా రాజధాని కావాలని చెప్పారు. గుంటూరు జిల్లాలోని భూముల్లో 90 శాతం సీఎం చంద్రబాబునాయుడు వర్గానికి చెందిన అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయన్నారు. ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ అట్టడుగు వర్గాల జీవిత వ్యథలను తన రచనల్లో చొప్పించిన గుర్రం జాషువా ఎప్పటికీ అమరుడేనని చెప్పారు. -
ప్రిన్సిపాల్ ప్రోద్బలంతోనే ర్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది. దోషులెవరో తేల్చినా చర్యలకు సిద్ధంగా లేదు. రిషితేశ్వరి మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్యవహారశైలిని తప్పుపట్టింది. ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదించింది. బాబూరావు వల్లే విశ్వవిద్యాలయంలో సంస్కృతి చెడిపోయిందని, ర్యాగింగ్ వంటి అనేక దుస్సంఘటనలకు అతడే కారణమని తేల్చింది. కమిటీ తేల్చిన అంశాల్లో కొన్ని... వర్సిటీలో సంస్కృతిని చెడిపోవడానికి ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావు కారణం. బాబూరావు ర్యాగింగ్కు వీలుగా సీనియర్ విద్యార్థులను ప్రోత్సహించే వారు. బాబూరావు తమతో చనువుగా ఉండడం వల్లే సీనియర్ విద్యార్థులు జూనియర్లపై చెలరేగిపోయారు. దుస్తులు లేకుండా తమ ముందు డ్యాన్స్ చేయాలంటూ సీనియర్లు జూనియర్లను వేధించేవారు. జూనియర్ విద్యార్థినుల ఫోన్నంబర్లను సీనియర్ విద్యార్థినులు సహచర సీనియర్ విద్యార్థులకు ఇచ్చేవారు. రాత్రిపూట వారితో మాట్లాడాలంటూ జూనియర్లను వేధించేవారు. బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ర్యాగింగ్ పెచ్చుమీరింది. రిషితేశ్వరితో సహ ఆమె సహచర జూనియర్ విద్యార్థినులను సీనియర్ విద్యార్థినులు రూ ములు ఖాళీ చేయాలంటూ బయటకు గెంటేసి రాత్రి వేళల్లో ఆరుబయటే నిల్చోబెట్టేవారు. ఫ్రెషర్స్ డే (18-4-2015)ను వర్సిటీలో కాకుండా బయట హాయ్లాండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం సేవించి, విద్యార్థినులతో కలసి చిందులేశాడు. (కమిటీ వద్ద వీడియో ఫుటేజీని ఉంది) రిషితేశ్వరి ఆత్మహత్య గురించి ఉన్నతాధికారులకు తెలియచేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యత కాగా బాబూరావు వాటిని విస్మరించాడు. బాబూరావు ప్రవర్తనపై విచారణ జరపాలి. ఆయనపై ర్యాగింగ్ నిరోధక చట్టం పరిధిలో కేసు నమోదు చేసి విచారించాలి. ఈ కేసును ర్యాగింగ్ చట్టాల పరిధిలోనే కాకుండా క్రిమినల్ లా, మహిళా వేధింపుల చట్టాల కింద విచారణ చేపట్టాలి. ఈ కేసు ప్రాధాన్యత దష్ట్యా విచారణను త్వరితంగా పూర్తిచేసేందుకు ట్రయల్ కోర్టును, స్పెషల్ పీపీని నియమించాలి. -
ప్రిన్సిపల్ ప్రోద్బలంతోనే ర్యాగింగ్
-
మీ ఇల్లు ఇలాగే ఉంచుతారా?
ఏఎన్యూ వసతిగృహాల్లో పర్యటించిన మంత్రి గంటా పరిసరాలు శుభ్రం చేయాలని సూచన విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఏఎన్యూ : రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్సిటీలో సంస్కరణలు, చేపట్టాల్సిన చర్యలపై పరిపాలనాభవన్లోని కమిటీ హాలులో సమీక్ష జరిపారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహ ప్రాంగణంలో పరిసరాలను పరిశీలించారు. పనికిరాని వస్తువులను చిందరవందరగా పడవేయటం, ఆవరణలో చెట్లు పెరిగి ఉండటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మీ ఇల్లు ఇలాగే ఉంచుకుంటారా అని యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. వెంటనే శుభ్రం చేసి లాండ్స్కేపింగ్ చేయాలని సూచించారు. వసతిగృహం స్టోర్లో వస్తువులు, స్టాక్ రికార్డులను పరిశీలించారు. అనంతరం భోజనశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినినులను అడిగారు. కొన్నిసార్లు భోజనం బాగోవటంలేదని, పెరుగు బాగోవటం లేదని వారు సమాధానమిచ్చారు. బాలికల వసతి గృహాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించాలని ఇన్చార్జి వీసీకి సూచించారు. విద్యార్థినులు ఉండే గదులు, పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని మంత్రిని స్టూడెంట్స్ కోరారు. వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట ఇన్చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి, రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, వసతి గృహాల వార్డెన్ ఆచార్య ఎల్.ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నాగార్జున వర్శిటీని మోడ్రన్గా మారుస్తాం
గుంటూరు : నాగార్జున యూనివర్శిటీని మోడ్రన్ యూనివర్శిటీ మారుస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శనివారం ఆచార్య నాగార్జున నగర్లోని నాగార్జున యూనివర్శిటీలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... గతంతో పోల్చితే యూనివర్శిటీ అన్ని విధాల మెరుగుపడిందన్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలో పోలీస్ మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. యూనివర్శిటీలో ఏం జరిగిన వారు వెంటనే స్పందిస్తారని చెప్పారు. అభయ్ ఐక్లిక్ ని కూడా త్వరలో ఇక్కడ ప్రవేశపెడతామన్నారు. ర్యాగింగ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి కేసులో ఎవరిని వదిలేది లేదన్నారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని... చట్టానికి ఎవరు చుట్టాలు కారని మంత్రి మరో సారి స్పష్టం చేశారు. ర్యాగింగ్ నివారణకు బాలసుబ్రమణ్యం కమిటీ సూచనలు అమలు చేస్తామని మంత్రి గంటా ఈ సందర్భంగా చెప్పారు. -
దూర విద్యే..!
- కోర్సుల నిర్వహణ ప్రశ్నార్థకం ... - కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వని యూజీసీ - ఆన్లైన్ కోర్సులదీ ఇదే పరిస్థితి - వర్సిటీ అత్యుత్సాహం వల్లే ఈ దుస్థితి ఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం నిర్వహించే కొన్ని కోర్సులకు ఈ విడత ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ అనుమతి లభించక నోటిఫికేషన్ జారీలో జాప్యం జరిగింది. మరో వైపు దూరవిద్యా కేంద్రం నిర్వహించే కోర్సులకు అనుమతి ఇస్తూ యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ భరద్వాజ్ మూడు రోజుల క్రితం యూనివర్సిటీకి లేఖ పంపారు. అయితే 2010 వరకు ప్రవేశ పెట్టిన కోర్సులకు మాత్రమే ఈ ఏడాది నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని తరువాత ప్రవేశ పెట్టిన కోర్సులకు యూజీసీ అనుమతితోనే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2010 వరకు పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ విభాగాల్లో మొత్తం 65 కోర్సులను నిర్వహించింది. ఆ తరువాత కాలంలో ఉపాధి అనుబంధంగా ఉన్న 15కు పైగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది. వీటికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకుందా అనే విషయం స్పష్టం కాలేదు. దీంతో యూజీసీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో 2010 వరకు ఉన్న కోర్సులకే అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ కోర్సుల నిర్వహణకు లభించని అనుమతి ... ఏఎన్యూ ఇటీవల వివిధ ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తోంది. వీటి నిర్వహణకు లక్షల రూపాయలను వెచ్చించింది. ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అయితే నిర్వహణకు సంబంధించి విధివిధానాలు రూపొందించే వరకు ఈ కోర్సులను నిర్వహించవద్దని యూజీసీ నిబంధనలు విధించింది. దీంతో ఏఎన్యూ అట్టహాసంగా ప్రారంభించిన ఆన్లైన్ కోర్సుల భవిష్యత్పై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో పాటు దూరవిద్యాకేంద్రం ద్వారా నిర్వహించనున్న ఎంఈడీ తదితర కోర్సులదీ అదే పరిస్థితి. యూనివర్సిటీ హెడ్క్వార్టర్లో ఫుల్టైం ఫ్యాకల్టీ లేకుండా కోర్సులు నిర్వహించవద్దని కూడా యూజీసీ స్పష్టం చేసింది. దీంతో ఎడ్యుకేషన్, ఎంఏ హిందీ తదితర కోర్సులను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి ... అన్ని అనుమతులు తీసుకొని కొత్త కోర్సులు ప్రారంభించాల్సి ఉండగా హడావుడిగా దూరవిద్య కోర్సులను ప్రారంభించటం వల్లనే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా 2010 తరువాత ప్రవేశ పెట్టిన కోర్సులు చదివిన వారి పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా యూజీసీ అధికారు లు లేఖలో స్పష్టం చేయటం విశేషం. ఏఎన్యూ నుంచి యూజీసీకి అఫిడవిట్ తదితర పత్రాలను సకాలంలో సమర్పించలేదని ఇది సరికాదని బ్యూరో సెక్షన్ ఆఫీసర్ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రత్యేక నిబంధనలు పట్టించుకోకుండా కొందరు అధికారులు చేపట్టిన చర్యల వల్లే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ ఆచార్య ఎంవీ రాంకుమార్త్న్రంను వివరణ కోరగా అన్ని కోర్సులకు యూజీసీ అనుమతి ఉందని అన్ని కోర్సులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. -
హనీషా పాత్రపై ఆధారాలు పంపండి
రిషితేశ్వరి మృతికేసులో ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో విద్యార్థిని హనీషా పాత్రపై ఆధారాలుంటే తమకు పంపాలని జాతీయ మహిళా కమిషన్ నాలుగు రోజుల కిందట పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. దీంతో పోలీసు అధికారులు హనీషా పాత్రపై తమవద్ద ఉన్న ఆధారాలు పంపించారు. విద్యార్థిని భవిష్యత్తు దృష్ట్యా జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీంతో ఆమె పాత్రపై ఆధారాలు పంపాలని పోలీసుల్ని ఆదేశించింది. -
'రిషితేశ్వరి' నిందితులకు బెయిల్ నిరాకరణ
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఆయన అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు నివేదికలో వివరించింది. కాలేజీలోనే అమ్మాయిలు, అబ్బాయిలు కలసి మందుపార్టీలు చేసుకుంటున్నారని పేర్కొంది. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా లేదని, ఆయనఅండతో కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని వివరిం చింది. రిషితేశ్వరిని లై ంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ అండతోనే సాగాయని తెలిపింది. ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి మానసికంగా కుంగిపోయిందని, అవే కారణాలు ఆమె ఆత్మహత్యకు దారితీశాయని వివరించింది. -
రిషితేశ్వరి కేసులో ముగిసిన కమిటీ విచారణ
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ బుధవారంతో ముగిసింది. ఈ కమిటీ గత నెల 29, 30, 31 తేదీల్లో వర్సిటీలో విచారణ నిర్వహించిన విషయం విదితమే. విద్యార్థులకు సెలవులు ఇచ్చిన సమయంలో విచారణ జరపటంపై విమర్శలు వెల్లువెత్తటంతో.. సెలవులు ముగిసిన తర్వాత ఒక్కరోజు (ఈ నెల 5న) విచారణ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే నలుగురు సభ్యుల కమిటీ బుధవారం వర్సిటీలో విచారణ జరిపింది. ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సాగిన విచారణలో ఆర్కిటెక్చర్ విద్యార్థులకు కమిటీ అధిక సమయం కేటాయించింది. విద్యార్థులతో తరగతుల వారీగా సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించింది. రిషితేశ్వరి అన్నయ్య అని పిలిచే బీఆర్క్ విద్యార్థి జితేంద్రను కమిటీ సభ్యులు సుదీర్ఘంగా విచారించారు. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య జి.బాబురావు కూడా కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈనెల 10వ తేదీలోగా ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కమిటీ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. -
'నాగార్జున' లో విద్యార్థుల భారీ ర్యాలీ
గుంటూరు : ఆర్కిటెక్చర్ విద్యార్థి రుషితేశ్వరి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ బుధవారం డిమాండ్ చేసింది. అందుకోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. తీశారు. రుషితేశ్వరి ఆత్మహత్య ఆ తర్వాత క్యాంపస్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో యూనివర్శిటీలోని అన్ని కాలేజీలకు 10 రోజుల పాటు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్లీ తిరిగి బుధవారమే యూనివర్శిటీలోని అన్ని కాలేజీలు ప్రారంభమైనాయి. అయితే రుషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతున్న విషయం విదితమే. -
ముఖంలో చిరునవ్వు మాయమైంది..!
ఎన్నో ఆశలు, ఆశయాలతో కాలేజీకి వచ్చా.. నేను ఇడియట్ని.. అందుకే వీరినందరినీ నమ్మా.. ‘డైరీ’లో రాసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి గుంటూరు: ఆడుతూ పాడుతూ గడిపిన పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఊహలకు అందని ప్రపంచంలోకి వచ్చింది. అదీ విభిన్న మనస్తత్వాలు కలిగిన యూనివర్సిటీలోకి. అంతా గందరగోళం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోయింది. అమాయక నవ్వుల్ని అపార్థం చేసుకుంటారని తెలియని పసితనం. కొద్ది రోజుల్లోనే ఆశలన్నీ తలకిందులయ్యాయి. నమ్మిన వారే వెంటాడారు. అన్నీ చెప్పుకునే తండ్రికీ తన దురవస్థ చెప్పుకోలేని దుస్థితి. సరిగ్గా రెండు పదులూ నిండకుండానే నిరాశ.. నిస్పృహ.. అనిశ్చితి.. చివరికి ఆత్మహత్యను ఆసరాగా చేసుకుంది... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఒక్క సూసైడ్నోటే ఉందని భావించగా.. తాజాగా ఆమె డైరీలో రాసుకున్న మరికొన్ని సంఘట నలు బయటపడడం చర్చనీయాంశంగా మా రింది. ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన వ్య క్తులు, అందుకు కారణమైన వాటినీ స్పష్టంగా పేర్కొంది. డైరీ రాసే అలవాటు ఉన్న రిషితేశ్వరి కాలేజీలో చేరినప్పటి నుంచీ తనకు బాధ కలిగించిన అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వీటిలో కొన్ని పేజీలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. అయితే, అందులో కొన్ని పేర్లు కొట్టివేసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆ రోజుతోనే సగం చచ్చినట్లైంది... 2014 ఏప్రిల్లో మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న హాయ్ల్యాండ్లో ఫ్రెషర్స్డే పార్టీ జరిగింది. పార్టీలో స్టేజీపై ఉన్న సమయంలో సీనియర్..... (పేరు కొట్టేసి ఉంది) ఒకరు మద్యం సేవించి నా చెయ్యి పట్టుకుని ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. షాక్కు గురయ్యా. స్టేజి దిగి కిందకు వెళ్లబోతుండగా మరో సీనియర్..... (పేరు కొట్టేసి ఉంది) నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఆ సమయంలో అతడిని ప్రతిఘటించలేకపోయా. ఆ సంఘటనను ఊహించుకుంటే నాపై నాకే అసహ్యం వేస్తుంది. నాకేమైందో అర్థం కావడం లేదు. అన్ని విషయాలు నాన్నతో చెప్పుకునే నేను వీటిని చెప్పలేకపోయా. నేను సగం చచ్చినట్లైంది. ఈ రోజు చాలా బాధపడుతున్నా. కాలేజీలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ఆశలు, ఆశయాలతో వచ్చా. కానీ ఇప్పుడు చాలా భయాందోళనకు గురవుతున్నా. జీవితంపైన విరక్తి కలుగుతోంది. నమ్మిన అబ్బాయిలంతా మోసం చేశారు. అబ్బాయిలంతా ఇడియట్స్. ప్రతి ఒక్కరిని అసహ్యించుకుం టున్నా. మొదట...... (పేరు కొట్టేసి ఉంది) అతడిని మంచి స్నేహితుడని ఊహించా. మా నాన్న కూడా అతడిని నమ్మాడు. ఫిబ్రవరి 11న అతనితో వాట్సాప్లో ఉండగా అకస్మాత్తుగా ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు. అలా చెబుతాడని ఊహించలేదు. కాలేజీలో చేరిన తర్వాత ఇతను మొదటి స్నేహితుడు. ఆ తర్వాత అనేక ఫోన్నెంబర్ల నుంచి అస అసహ్యమైన మెసేజ్లు పంపాడు. అతడిని పూర్తిగా అసిహ్యించుకున్నా. మంచి స్నేహితుడిగా భావించిన...... (పేరు కొట్టేసి ఉంది) వాడు వెధవే. నేను నిద్రావస్థలో ఉన్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు. నా జీవితంలోనే ఇది అసహ్యమైన సందర్భం. నా జీవితం వృథా. ఎవరికిలేని విధంగా నాకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. అందుకే నన్ను నేను అసహ్యించుకుంటున్నా. నా సోదరుడు వంటి జితేంద్రకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. నేను కూతురునైనందుకు నాన్నకూ సమస్యలు తప్పడం లేదు. అందుకే చనిపోయినట్లుగా భావిస్తున్నా. ‘ ఐ లవ్యూ డాడ్’ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఉండటం మొదలు పెట్టినప్పటి నుంచి కొత్త స్నేహితులు పరిచయం అవుతుండటం ఎంతో ఆనందం కలిగించింది. నాది చిన్నపిల్లల మనస్తత్వం. అందరినీ నమ్ముతా. ఎవరినైతే నమ్మానో వాళ్లందరూ ఫూల్ని చేశారు. నేను ఒక ఇడియట్ని.. ఇడియట్లందరినీ నమ్మా. నా ముఖంలో చిరునవ్వు మాయమైంది. మా నాన్నను ఎంతగానో ప్రేమిస్తున్నా. ........ (పేరు కొట్టేసి ఉంది) నాలుగో సంవత్సరం చదివే సీనియర్ విద్యార్థి,.......( పేరు కొట్టేసి ఉంది), రెండో సంవత్సరం చదివే సీనియర్ విద్యార్థినులు మంచి చేస్తున్నట్లు నటిస్తూనే నన్ను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా సీనియర్ విద్యార్థిని ఎంతగానో సహకారం అందిస్తుందని భావించా. కానీ తను చాలా చెడ్డది. నా స మాచారాన్ని సీనియర్ విద్యార్థి శ్రీనివాస్కు చేరవేస్తుంది. అది తెలిసి షాక్కు గురయ్యా. నా ఫొటోలు, ప్రతిభ, కులం, మొదలగు సమాచారాన్నంతటిని అతనికి ఇచ్చింది. ఆమె అంత చెడ్డదని తెలిసి జీర్ణించుకోలేకపోయా. చాలా బాధపడ్డా. ఈ సంఘటన తర్వాత ఎవరినీ నమ్మలేదు. రిషితేశ్వరి డైరీలో ఏం రాసిందంటే..! ఈ డైరీ చదివిన వారి తల వెయ్యి వక్కలవుతుంది... అంటూ మొదలు పెట్టిన రిషితేశ్వరి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి, జీవితంలో ఉన్నతశిఖరాలు అధిరోహించాలంటే ఏం చేయాలనే అంశాలపై 250 వరకు కొటేషన్లు రాసుకుంది. ఆ తర్వాత భగవద్గీతలోని శ్లోకాలను ప్రస్తావించింది. తనకు నచ్చిన కథ పేరుతో తెలుగులో ఓ కథనూ రాసుకుంది. ఆ తర్వాత యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఆమెకు బాధకలిగించినప్రతి సంఘటననూ ఇంగ్లిష్లో పొందుపరిచింది. ఇతరుల డైరీ చదవకూడదు (ఇట్స్ ఏ క్రైమ్) అంటూ డైరీలో రాయడం ప్రారంభించింది. తాను ఆరోతరగతి చదువుతున్న సమయంలో సాయంత్రం 5గంటలకల్లా ఇంటికి చేరేదాన్ని. నాన్న ఉద్యోగరీత్యా రాత్రి 9.30 గంటలకు వచ్చేవారు. అమ్మ బ్యూటీపార్లర్ మూసివేసి వచ్చేసరికి 9గంటలయ్యేది. అప్పటివరకు టీవీ చూస్తూ ఒంటరిగా గడిపేదాన్ని. ఆ సమయంలో ఒంటరిగా ఫీలవుతూ తీవ్రంగా ఆలోచించేదాన్ని. మా నాన్నంటే చాలా ఇష్టం. -
వర్సిటీలో సంస్కరణలు
- ప్రవేశ ద్వారం వద్ద నుంచే ప్రారంభం - అమలులోకి మూడు రకాల పాస్ల విధానం - ఒకే వసతి గృహంలో..ప్రథమ సంవత్సం విద్యార్థులు - విద్యార్థుల నడుమ స్నేహభావం వెల్లివిరిసేలా చర్యలు - కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్గా ఆర్డీవో భాస్కరనాయుడు - వర్సిటీని సందర్శించి ఇన్చార్జి వీసీతో చర్చించిన ఐజీ, అర్బన్ జిల్లా ఎస్పీ ఏఎన్యూ/సాక్షి గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు సంస్కరణలకు ఉన్నతాధికారులు నాంది పలుకుతున్నారు. దీనిలో భాగంగా తొలుత వర్సిటీలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఈ మేరకు వర్సిటీలోని కళాశాలలు, కార్యాలయాలు, వసతి గృహాలపై యూనివర్సిటీ, రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి వర్సిటీ వ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన లోపాలే కారణమని విద్యార్థి సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీపై దృష్టి సారించిన ప్రభుత్వం వర్సిటీ, పోలీసు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులకు యూనివర్సిటీని సంస్కరించే బాధ్యతలను అప్పగించింది. ర్యాగింగ్ నిర్మూలనతోపాటు, విద్యార్థులకు కల్పించాల్సిన వసతి, సౌకర్యాలపై దృష్టి సారించారు. శుక్రవారం యూనివర్సిటీకి వచ్చిన గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్డీవో భాస్కర్ నాయుడులు ఇన్చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్లతో సుదీర్ఘంగా చర్చించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం, బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో తీసుకో వాల్సిన భద్రతాచర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలను పరిశీలించారు. మూడు రకాల పాస్ల విధానం అమలు ఇక మీదట యూనివర్సిటీలో మూడు రంగుల పాస్ల విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అధ్యాపకులు, సిబ్బందికి ఓ రకం, విద్యార్థులు, పరిశోధకులకు ఒక రకం, అతిథులకు ఒక రకం పాస్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఐజీ సంజయ్ పలు సూచనలు చేశారు. వర్సిటీలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి తన వాహనాన్ని ప్రధాన ద్వారం వద్ద కుడివైపున పార్కు చేసుకుని పాస్ చెక్ చేయించుకుని వాహనాన్ని తీసుకుని లోపలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ప్రధాన ద్వారం కుడివైపున ఉన్న చెట్టును తొలగించి పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్సిటీకి వచ్చే వివిధ విశ్వ విద్యాలయాల అధ్యాపకులు, అతిథులు, సాధారణ సందర్శకులకు కూడా తప్పనిసరిగా విజిటింగ్ పాస్ ఉండాల్సిందేనని ఐజీ సూచించారు. యూనివర్సిటీలో ప్రత్యేక కమిటీలు ... వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు స్నేహభావంతో మెలిగే విధంగా, విద్య, క్రీడ, సాంస్కృతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఐజీ సూచించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులంతా కోర్సులతో నిమిత్తం లేకుండా ఒకే వసతి గృహంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల విద్యార్థుల్లో విద్య, క్రీడ స్ఫూర్తిని పెంపొందించేందుకు కల్చరల్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కర్క్యూలర్ యాక్టివిటీస్ తదితర కమిటీలను నియమించి ఆయా అంశాల్లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ మ్యాప్ అందజేయండి బాలికల వసతి గృహాలను సందర్శించిన సందర్భంలో ఐజీ యూనివర్సిటీ అధికారులతో మాట్లాడుతూ వర్సిటీలో చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీకి గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు కన్వీనర్గా వ్యవహరిస్తారన్నారు. ప్రతిమూడు రోజులకొకసారి ఈ కమిటీ సమావేశమై యూనివర్సిటీలో చేపట్టిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. అనంతరం వర్సిటీ మ్యాప్ను అందజేయాలని ఐజీ సూచించారు. -
'రాత్రి 8 తర్వాత క్లాసులు వద్దు'
గుంటూరు: ర్యాంగింగ్ కారణంగా ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో మేలుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్డీవో భాస్కరనాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పోలీసు, రెవెన్యూ, యూనివర్సిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం సమావేశమైన ఈ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమిటీ నిర్ణయాలు * రాత్రి 8 తర్వాత యూనివర్సిటీలో ఎటువంటి క్లాసులు నిర్వహించకూడదు * క్యాంపస్ లో హైసెక్యురిటీ ఏర్పాటు చేయాలి * కుల సంఘాలు, రాజకీయ పార్టీల వారికి వర్సిటీలో అడుగుపెట్టనీయరాదు * వర్సిటీలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్వహించాలి * ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులకు చోటు కల్పించాలి -
'రిషితేశ్వరి' నిందితులకు రిమాండ్ పొడిగింపు
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల రిమాండ్ ను కోర్టు మరో 14 రోజుల పాటుకోర్టు పొడిగించింది. వారికి విధించిన రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు రిషితేశ్వరి మృతిపై నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ ముగిసింది. -
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే
-
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే
* మా బిడ్డ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి * రిషితేశ్వరి తల్లిదండ్రుల డిమాండ్ సాక్షి, గుంటూరు: తమ బిడ్డ మరణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి తల్లి దుర్గాబాయి డిమాండ్ చేశారు. మరే ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ముందు గురువారం వాదనలు వినిపించిన అనంతరం ఆమె తన భర్త మురళీకృష్ణతో కలసి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంకి తమ గోడు చెప్పుకుంటామని, న్యాయం జరగకపోతే నాగార్జున వర్సిటీ ముందు ఆత్మహత్య చేసుకుంటామని తేల్చిచెప్పారు. రిషితేశ్వరి మృతికి కారకులైన వారిని బతకనివ్వకూడదని, అమ్మాయిల జోలికి వెళ్లాలంటే భయపడేలా కఠినమైన శిక్ష వేయాలని పేర్కొన్నారు. వర్సిటీలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మీడియా సహకారంతో పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ర్యాగింగ్పైనే మా పోరాటం: ‘‘మా అమ్మాయిలా మరే ఆడపిల్లపై అఘాయిత్యాలు జరగకూడదనే ఉద్దేశంతో వర్సిటీలో ర్యాగింగ్ను లేకుండా చేసేందుకు పోరాడుతున్నాం’’ అని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ చెప్పారు. సీని యర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడుతున్నారంటూ తమ బిడ్డ జూన్ 18న ప్రిన్సిపల్ బాబూరావుకు ఫిర్యాదు చేిసినా పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందన్నారు. వర్సిటీ విద్యార్థులకు సెలవులు ప్రకటించి విచారణ చేపడితే సరైన ఆధారాలు లభించవని పేర్కొన్నారు. కళాశాలలు తెరిచిన తరువాత ఐదు రోజులపాటు విచారణ నిర్వహిస్తే కమిటీకి సరైన ఆధారాలు దొరుకుతాయన్నారు. కమిటీ ముందు 10 శాతం మంది విద్యార్థులు కూడా వాదన వినిపించలేదని, వర్సిటీలో బహిరంగ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్పై ఫిర్యాదు చేసిన అధ్యాపకులను సస్పెండ్ చేస్తున్నారని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కమిటీని కోరామన్నారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమేసి విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. నేడు కళాశాలల బంద్ రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణను విద్యార్థుల సమక్షంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కళాశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీ మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ బాబూరావు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిని కళాశాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలి సాక్షి, గుంటూరు: రిషితేశ్వరి మృతిపై ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ రెండోరోజు గురువారం ఏపీలోని ఆచార్య నాగార్జున వర్సిటీలో పలువురిని విచారించింది. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్యతోపాటు మరి కొంద రు విద్యార్థులు కమిటీ సభ్యులను కలిశారు. రిషితేశ్వరి మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం, ఆమె మృతిపై తమకున్న అనుమానాలు, వర్సిటీలోని ర్యాగింగ్ భూతం గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎవరైనా కలిస్తే వారి వాదనలు వినడంతోపాటు, మరోసారి పోలీసు, వర్సిటీ అధికారులతో భేటీ అవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. కీలక సమాచారం సేకరించాం ‘‘రెండు రోజులపాటు నిర్వహించిన విచారణలో అధికారులతోపాటు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి కీలకమైన సమాచారం సేకరించాం. వర్సిటీలో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. విద్యార్థిని మృతికి గల కారణాలు, వర్సిటీలో పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపాం. విచారణకు హాజరు కాని వారు balasubramanyamsarasa@yahoo.com, vsu.vc1@gmail.com, vvvbnaidu55@gmail.com, vbknaidu1956@gmail.com, registrarmahila@yahoo.com అనే ఈ-మెయిల్ అడ్రస్లకు తమ అభిప్రాయాలు పంపితే పరిగణనలోకి తీసుకుంటాం’’ - కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం -
'ర్యాగింగ్ చేయాలంటే భయపడేలా చర్యలు'
గుంటూరు: అమ్మాయిలను ర్యాగింగ్ చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీకి రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి విజ్ఞప్తి చేశారు. విచారణ కమిటీలో విద్యార్థి సంఘాల నేతలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ఉంటే బాగుందనేది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ఏవిధంగా ఉంటుందో చూడాలన్నారు. విద్యార్థులు లేకుండా విచారణ ఏంటో తమకు అర్థం కావడం లేదని వాపోయారు. యూనివర్సిటీని తెరిపించి విద్యార్థులు వచ్చిన తర్వాత మళ్లీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ తో మాట్లాడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. యూనివర్సిటీ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉందని కమిటీకి చెప్పామని తెలిపారు. -
రిషితేశ్వరి మృతి కేసులో విచారణ 6కు వాయిదా
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణను మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 6కు వాయిదా వేసింది. ఈ కేసులో శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు గుంటూరు సబ్ జైలులో ఉన్నారు. రిషితేశ్వరి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని నినదిస్తున్నారు. ఇందుకోసం ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. కాగా, వర్సిటీలో విచారణ కమిటీ ఎదుట హాజరైన రిషితేశ్వరి తల్లిదండ్రులు.. తమకు న్యాయం చేయాలని కోరారు. -
భయమే ఈ ప్రభుత్వ సందేశమా?
రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ ఉన్నా కేసును అటకెక్కించారు: జగన్ హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తంచేశారు. -
రిషితేశ్వరి కేసులో నిందితులను ఉపేక్షించం
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు వెస్ట్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి పై నియమించిన న్యాయ విచారణ కమిటీ నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. స్థానిక ఇ న్స్పెక్షన్ బంగళాలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడే వారిని వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా, వారిని రైతులు నమ్మరని తెలిపారు. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. పుష్కరాలలో అధికార యంత్రాంగం సేవలను మంత్రి కొనియాడారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చిట్టిబాబు, జీడీసీసీ బ్యాంక్ వైస్చైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'రిషితేశ్వరి కేసు నిందితులకు పెద్దల అండదండలు'
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారికి పెద్దల అండదండలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆ కేసులోని దోషులను శిక్షించి.. కఠినంగా చర్యలు తీసుకొని.. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధ్యులెంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అన్నారు. -
'సీఎం పాలన నియంతను తలపిస్తోంది'
-
నాగార్జున వర్సిటీ ఖాళీ!
నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చే నెల 4 వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఎట్టకేలకు తమ హాస్టల్ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. వర్సిటీలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు రెండు వేల మంది విద్యార్థులు వర్సిటీలోని హాస్టల్ గదుల్లో ఉంటూ చదువుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం లోగా హాస్టల్ గదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు హుకూం జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శనివారం కూడా నిరసనను కొనసాగించారు. అయితే చివరికి శనివారం సాయంత్రానికి వర్సిటీని విడిచిపెట్టి స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. దీంతో రాత్రి వేళ సిబ్బంది వర్సిటీలోని హాస్టల్ గదుల వద్ద ఉన్న విద్యార్థి సంఘాల ప్యానెళ్ల బోర్డులను తొలగించారు. అలాగే భద్రత దృష్ట్యా వర్సిటీలోని పలు చోట్ల సీసీ కెమెరాలను కూడా అమర్చారు. కాగా వర్సిటీకి సెలవులు ప్రకటించినప్పటికీ పాలన యథావిధిగా కొనసాగుతుంది. టీచింగ్, నాట్ టీచింగ్ సిబ్బంది విధులకు హాజరవుతారు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యతో తలెత్తిన ఆందోళలు సద్దుమణిగేందుకు వర్సిటీకి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. -
కేసుకు సెలవు!
♦ పక్కదారి పట్టించేందుకు వ్యూహం ♦ మరిన్ని అకృత్యాలు వెలుగులోకి వస్తాయనే భయం ♦ మిగిలిన విద్యార్థులు, ప్రిన్సిపల్ను కాపాడే యత్నం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పది రోజులు సెలవు ప్రకటించడం పట్ల వివిధ వర్గాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిషితేశ్వరి మృతి కేసులో మిగిలిన దోషులు, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును కాపాడేందుకు రిజిస్ట్రార్ వ్యూహాత్మకంగా సెలవులు ప్రకటించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిషితేశ్వరి ర్యాగింగ్లో పదిమందికిపైగానే విద్యార్థులు ఉన్నారని, ఇప్పటికి ముగ్గురు అరెస్టు కాగా, మిగిలిన వారిని ఈ కేసు నుంచి రక్షించేందుకు సెలవులు ప్రకటించారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారం లేకపోయినప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు వైస్ ఛాన్సలర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇదంతా కేసును నీరుగార్చేందుకేనని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. గతంలో ఇంత కంటే పెద్ద సంఘటనలు జరిగినప్పటికీ యూనివర్సిటీకీ సెలవులు ప్రకటించలేదు. రిషితేశ్వరి మృతి కేసులోని దోషులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఓ వైపున పోలీస్ దర్యాప్తు, మరోవైపు విశ్వవిద్యాలయం నియమించిన కమిటీ, ఇంకోవైపు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కృషి చేస్తున్నాయి. లైంగిక వేధింపులు బహిర్గతం అయ్యేవి.. విద్యార్థి సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉదృ్ధతం చేస్తూ వాస్తవాలు వెలుగులోకి వచ్చే వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు చేష్టలు, వ్యవహారశైలి బహిర్గతం అయ్యాయి. ప్రిన్సిపల్ వ్యవహారాన్ని విద్యార్థులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ ప్రిన్సిపల్తోపాటు మరికొందరు ప్రొఫెసర్ల అకృత్యాలు, లైంగిక వేధింపుల వివరాలు విద్యార్థుల వద్ద ఉన్నట్టు నిఘా సంస్థలు ప్రభుత్వానికి సమాచారం అందించాయి. గతంలో సైన్స్ కళాశాలలోని ఒక విభాగంలో పరిశోధనా పర్యవేక్షకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా పరిశోధకురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పొరుగు సేవల ఉద్యోగిని సంబంధిత విభాగ అధికారి తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసింది. ఇవన్నీ కొంతకాలానికి సద్దుమణిగిపోయాయి. విచారణ నిర్విరామంగా కొనసాగితే వీటిని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు బహిర్గతం చేసే అవకాశాలు ఉండటంతో ఆకస్మికంగా సెలవులు ప్రకటించారనే అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. నెల రోజుల క్రితం తరగతులు ప్రారంభమైనప్పటికీ, జూనియర్లకు సక్రమంగా క్లాసులు జరగడం లేదు. సీనియర్లకు గెస్ట్ ఫ్యాకల్టీ వివాదం నేపథ్యంలో పూర్తి స్థాయిలో తరగతులు జరగడం లేదు. వీరికి రెగ్యులర్, ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లాస్లు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈ నెల రోజుల్లో పూర్తిస్థాయిలో తరగతులు జరగలేదు. ఈ నేపథ్యంలోనే పది రోజులు సెలవులు ప్రకటించారు. అక్టోబరులో మరో పది రోజులు దసరా సెలవులు ఉన్నాయి. దీంతో విద్యాసంవత్సరం సక్రమంగా జరుగతుందా? సిలబస్ సకాలంలో పూర్తవుతుందాఅనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు కూడా శనివారం సాయంత్రం వైస్ఛాన్సలర్తోపాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి ప్రకటించిన సెలవులను రద్దు చేయాలని, యూనివర్సిటీలో విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనలో బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. -
'సీఎం పాలన నియంతను తలపిస్తోంది'
ఏఎన్యూ (గుంటూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన నియంతను తలపిస్తోందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యమం ఉధృతమవుతోందని భావించి యూనివర్సిటీ వసతి గృహాలు, కళాశాలల తరగతులకు పది రోజులు సెలవులు ఇవ్వటంపై శనివారం ఉదయం వర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహాలు, పరిపాలనాభవన్ వద్ద ధర్నా చేశారు. వసతి గృహాల నుంచి పరిపాలనాభవన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. రిషితేశ్వరి ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థి సంఘాలను అణచివేయటంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ మహిళలపై రక్షణ విషయంలో చూపాలన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాల బోర్డులను తొలగించటం రాజ్యాంగ విరుద్ధమని, ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటిని తొలగించవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారి హక్కులనే కాలరాసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. మంగళగిరి గుడికి అనేక సార్లు వస్తున్న రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్.. పక్కనే ఉన్న యూనివర్సిటీకి మాత్రం రావటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా యూనివర్సిటీని సందర్శించి, పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని కోరారు. బోర్డులు తొలగించటం లేదని ప్రకటించాలని రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్ను డిమాండ్ చేశారు. దీనికి రిజిస్ట్రార్ పి.రాజశేఖర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం అమలు చేస్తున్నామని, తొలగించనని హామీ ఇచ్చే అధికారం తనకు లేదని చెప్పారు. విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నిర్ణయం మాత్రం వారిదేనన్నారు. మధ్యాహ్నంలోగా క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశాలు ఉన్నాయని, వాటిని పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరికలతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. సాయంత్రానికల్లా యూనివర్సిటీ వసతి గృహాలను ఖాళీ చేయించి పోలీసు అధికారులు గేట్లకు తాళాలు వేశారు. -
విద్యార్థి ఉద్యమం
-
విద్యార్థి ఉద్యమం
- వర్సిటీలో ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడిన విద్యార్థి సంఘాలు - క్యాంపస్లో భారీ ర్యాలీ, ప్రధాన ద్వారం వద్ద ధర్నా - ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై న్యాయ విచారణకు డిమాండ్ - విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఇన్చార్జి వీసీకి వినతిపత్రం ఏఎన్యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై న్యాయ విచారణకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉద్యమం చేపట్టారు. ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడిన విద్యార్థి సంఘాలు శుక్రవారం వర్సిటీలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో దోషులను పట్టుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, వర్సిటీలో విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి వీసీకి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థినులకు యూనివర్సిటీలో రక్షణ లేదనటానికి, మితిమీరిన వేధింపులు ఉన్నాయనటానికి రిషితేశ్వరి ఆత్మహత్యే నిదర్శనమన్నారు. మరే విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వరకు తాము ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. ర్యాగింగ్ను యూనివర్సిటీ నుంచి తరిమి కొడతామని పేర్కొన్నారు. విద్యార్థిని మృతిపై న్యాయవిచారణ జరిపించాలని, ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ను అరెస్టు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు కు సమర్పించారు. దీనిపై ఇన్చార్జి వీసీ స్పందిస్తూ యూనివర్సిటీ వసతి గృహాల్లో భద్రతా చర్యలు ప్రారంభమయ్యాయని రెసిడెంట్ వార్డెన్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు, యూనివర్సిటీ సీనియర్ అధ్యాపకులు వారంలో మూడు రోజులు వసతి గృహాల్లో పర్యటిస్తారని తెలిపారు. రాత్రి పదిగంటల తరువాత తాను కూడా వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తానని తెలిపారు. ఘటనపై న్యాయ విచారణ జరపటం, కళాశాల ప్రిన్సిపాల్పై చర్యలకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తాననీ, వారు ఏవిధంగా చెబితే ఆవిధంగా నడుచుకుంటానన్నారు. దీనికి నిర్ణీత గడువు చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వంతో ఈ రోజే తాను మాట్లాడతానన్నారు. యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీలో ఉన్న ఓ అధ్యాపకుడు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ అసాంఘిక చర్యలను సమర్థిస్తూ మాట్లాడడం సమంజసమా అని ఎస్ఎఫ్ఐ నాయకురాలు జ్యోతి ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి వీసీ స్పందిస్తూ కమిటీ సభ్యుడు అలా మాట్లాడి ఉండకూడన్నారు. విద్యార్థుల దాడిపై పోలీసులకు ఫిర్యాదు.. యూనివర్సిటీలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ విచారణలో ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమపై దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. దీనికి వీసీ స్పందిస్తూ ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామనీ, పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. రిషితేశ్వరి కేసు దర్యాప్తుపై అర్బన్ ఎస్పీ ఆరా పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన రిషితేశ్వరి కేసులో అప్రమత్తంగా వ్యవహరించాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. పెదకాకాని పోలీసుస్టేషన్లో శుక్రవారం ఎస్పీ నాలుగుగంటల పాటు అధికారులతో చర్చించారు. మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ కమలాకర్రావు, సీఐలు కాకర్ల శేషారావు, కొంకా శ్రీనివాసరావు, ఎస్ఐలు పి.కృష్ణయ్యతో కేసు విషయం చర్చించారు. ప్రిన్సిపాల్ బాబూరావు పార్టీల పేరుతో విద్యార్థులతో కలిసి డాన్సులు వేస్తున్న దృశ్యాలు, మెసేజ్లు వంటివి క్షుణ్ణంగా పరిశీలించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి పోస్టుమార్టం, ఫోర్సెనిక్ రిపోర్ట్లకు సంబంధించిన నివేదిక అందాల్సి ఉందన్నారు. -
వ్యవసాయ కళాశాలల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభం
విద్యానగర్ (గుంటూరు) : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ కళాశాల్లో 2015-16 సంవత్సరానికిగానూ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల వ్యవసాయపరిశోధన క్షేత్రంలో కౌన్సెలింగ్ను యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ టి.వి.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 55 వ్యవసాయ కళాశాలల్లో బీటెక్ విభాగంలో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ పుడ్ టెక్నాలజీలకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. బీ.ఎస్సీలో అగ్రికల్చరల్ విభాగానికి చెందిన కమర్షియల్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్ మెంట్, హోమ్సైన్స్, పుడ్సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫ్యాషన్ టెక్నాజజీ విభాగాల్లో సీట్ల భర్తీకి మెరిట్ ప్రాతిపదికన మార్కుల జాబితా ప్రకారం కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీసీ విభాగంలోని రైతుల పిల్లలకు ప్రత్యేక కౌన్సెలింగ్ను నిర్వహించి ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులను అగ్రికల్చర్ బీ.ఎస్సీకి ఎంపిక చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రైతుల పిల్లల సౌకర్యార్థం ప్రత్యేకంగా 40 శాతం రిజర్వేషన్తో ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు. నాన్లోకల్ కేటగిరిలో ఒకొక్క కళాశాలలో 15 మంది విద్యార్థులకు మెరిట్ ఆధారంగా అగ్రికల్చరల్ విభాగంలో అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నెల 28 వరకూ పాలిటెక్నిక్ కళాశాలల్లోని అగ్రికల్చరల్ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ విభాగం డీన్ టి.రమేష్బాబు, హోమ్సైన్స్ విభాగం డీన్ డాక్టర్ ఆర్ వీరరాఘవయ్య, పరీక్షల కంట్రోలర్ డాక్టర్ శివశంకర్, పాలిటెక్నిక్ విభాగం కోఆర్డినేటర్ ఎస్.సునీల్ కుమార్ పరిశోధన క్షేత్రం ఏడీఆర్ ఈదర ఆదినారాయణ, శాస్త్రవేత్త ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీలో ఐబీఎస్ సెంటర్
ఏఎన్యూ: ఆంధ్రా సుగర్స్ సంస్థ ఆర్థిక సహకారంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ (ఐబీఎస్) సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం యూనివర్సిటీలో జరిగింది. కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీలోని విద్యావిషయక భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఐబీఎస్ శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం డైక్మెన్ ఆడిటోరియంలో మంత్రి విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రాబిర్లాగా పేరొందిన ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ పేరుతో నూతన రాజధానిలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమెరికాలో టాప్టెన్ డాక్టర్లలో ఐదుగురు మన దేశం వారైతే వారిలో సగం మంది తెలుగు వారు ఉంటున్నారని, ఇది మన మేధస్సుకు నిదర్శనమని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యాపారవేత్తలకు ఆదర్శం హరిశ్చంద్రప్రసాద్ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ హరిశ్చంద్ర ప్రసాద్ స్థాపించిన సంస్థల్లో ఒక్క రోజు కూడా బంద్ జరగలేదన్నారు. ఏఎన్యూ ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్కుమార్ ప్రసంగించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.నరసింహారావు, శాసనమండలి మాజీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, ఏఎన్యూ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.శివరాం ప్రసాద్, ఆంధ్రాసుగర్స్ జేడీ పి.అచ్యుతరామయ్య, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశేష్ఠ త్రిపాఠి, పలువురు ఏఎన్యూ అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రయోగపూర్వక అభ్యాసం అవసరం
♦ ఏఎన్యూ వీసీ ప్రొఫెసర్ సాంబశివరావు ♦ వీవీఐటీలో యువ నైపుణ్య దినోత్సవం నంబూరు(పెదకాకాని) : పాఠశాల స్థాయి నుండే విద్యార్ధులలో ప్రయోగపూర్వక అభ్యాసం అలవాటు చేయాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ఎస్ సాంబశివరావు అన్నారు. నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కళాశాలలను పరిసర ప్రాంతాలలో ఉండే పరిశ్రమలతో అవగాహన కుదుర్చుకొని విద్యార్ధులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు సంసిద్ధులను చేయాలన్నారు. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయటం కోసం ప్రభుత్వం కళాశాల విద్యార్ధులకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు విశ్వవిద్యాలయాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రప్రధమంగా వివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారని , పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇస్తున్న శిక్షణను విద్యార్దులు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జునరెడ్డి, పాలకవర్గం సభ్యులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. -
వేదన..రోదన !
♦ కళాశాలల్లో మళ్లీ ర్యాగింగ్ మహమ్మారి ♦ విద్యార్థిని రిషికేశ్వరి మృతితో బహిర్గతం ♦ కాగితాలకే పరిమితమైన యాంటీ ర్యాగింగ్ కమిటీలు ♦ ఉదాశీనంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ర్యాగింగ్ మహమ్మారి తిరిగి జడలు విప్పుతోంది. తాము చెప్పినట్టు వినాల్సిందేనంటూ సీనియర్లు వేధింపులకు దిగుతుండటంతో జూని యర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి వస్తున్న నిరుపేద విద్యార్థులు సీనియర్ల వేధింపులకు తట్టుకోలేకపోతున్నారు. సీనియర్ల చేష్టలు తమ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మానిపిస్తారనే భయంతో వారికి చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారు. సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడకుండా ప్రతి నెలా కళాశాలలో సమావేశమై దీనిపై చర్చించి చర్యలు తీసుకొనేందుకు యాంటీ ర్యాగింగ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. అయితే ఈ కమిటీలు నిర్వీర్యంగా మారాయని చెప్పవచ్చు. వీరి సమావేశాలు, తీసుకుంటున్న చర్యలు కాగితాలకే పరిమితమవుతుండటంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోతూ ర్యాగింగ్కు పాల్పడుతున్నాయి. ర్యాగింగ్ అనేది సీనియర్ విద్యార్థులకు సరదాగా, జూనియర్లకు ప్రాణ సంకటంగా మారుతోంది. విద్యార్థులపై చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశంతో పోలీస్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సున్నిత మనస్థత్వం ఉన్న విద్యార్థులు మనోస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే ర్యాగింగ్ భయంకర రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీలో వేధింపులు కొత్తేమీకాదు ... ఇప్పటి వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బయటకు పొక్కకుండా లోలోపల జరుగుతున్న ఈవ్టీజింగ్ వ్యవహారం రిషికేశ్వరి మృతితో బహిర్గతమైంది. వర్శిటీలో ర్యాగింగ్ జరగడం లేదనే భావన సరైంది కాదని, తనలా ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని మృతురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొనడంతో అధికారులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు. వేధింపులు తట్టుకోలేక, ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటే యూనివర్సిటీలో ఈవ్టీజింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులను వేధింపులకు గురిచేసే వారికి తన లేఖతోనైనా కనువిప్పు కలగాలని, ర్యాగింగ్ వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి రాకూడదంటూ రిషికేశ్వరి రాసిన సూసైడ్ నోట్ ఆమె మానసిక క్షోభకు అద్దం పట్టింది. ఈ సంఘటనకు ముందు మార్చి నెలలో మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని సైతం ఇలాంటి వేధింపులకు గురై హాస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనపై ఐదుగురు సీనియర్ విద్యార్థులు వేధింపులకు పాల్పడడమే కాకుండా దాడి చేసి కొట్టారని మార్చి 16న ఫిర్యాదు చేసింది. తాజాగా రిషికేశ్వరి ఉదంతంతోనైనా వర్సిటీ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు మేలుకొని ర్యాగింగ్పై పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉంది. -
రైతు బాంధవుడు రంగా
భారత రాజకీయాలలో ఆచార్య ఎన్జీ రంగా అనితర సాధ్యమైన వ్యక్తి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు, తరువాత ఆయన సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో పద హారు సంవత్సరాలు సభ్యులుగా పనిచేశారు. అలాగే 1991 వరకు పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక దానిలో సుదీర్ఘంగా 38 ఏళ్లపాటు సభ్యుడు. అయినా ఏ ప్రభుత్వ హోదానూ, మంత్రి పదవినీ ఆశించలేదు. ఏదో ఒక విధంగా అధికారం చేపట్టడానికి ఎలాంటి రాజీకైనా సిద్ధపడే వ్యక్తులు ఉన్న కాలంలో ఆచార్య రంగా ఎంతో విశిష్టంగా కనిపిస్తారు. జీవితాంతం కాంగ్రెస్వాదిగా ఉన్నప్పటికీ, రంగా రెండు సందర్భాలలో మాత్రం పార్టీని విడిచివెళ్లారు. కృషికార్ లోక్ పార్టీని స్థాపించడం కోసం 1951లో ఒకసారి, ఉమ్మడి సహకార వ్యవసాయం గురించి కాంగ్రెస్ తీర్మానించినందుకు నిరసనగా, స్వతం త్ర పార్టీని స్థాపించడానికి 1959లో రెండోసారి కాంగ్రెస్ ను వీడారు. 1972లో తిరిగి చేరి, 1995లో తుది శ్వాస విడిచే వరకు నిబద్ధతతో పనిచేశారు. రాజ్యసభలో ఆయ నతో కలసి పనిచేసే అరుదైన అవకాశం 1977-80 మధ్య నాకు లభించింది. 1920 దశకంలోనూ, 1930 దశకం ఆరంభంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో రైతాంగ పోరాటాలు విస్తారంగా జరిగాయి. రైత్వారీ విధానం అమలులో ఉన్న ప్రాంతంలో సర్దార్ పటేల్ నాయకత్వంలో 1928లో బార్డోలీ సత్యాగ్రహం జరిగింది. ఈ సమయంలోనే ఆచార్య రంగా తెలుగు రైతాం గం సమస్యల పరిష్కారం కోసం రాజకీయ కార్యకలాపా లను ప్రారంభించారు. 1929లో ఆచార్య రంగా, బిక్కిన వెంకటరత్నం, మాగంటి బాపి నీడు ఆంధ్ర జమిందారీ రైతు సంఘం సమావేశం నిర్వహిం చారు. దీనికి రంగాయే అధ్య క్షులు. అమెరికన్ ఫార్మర్స్ యూనియన్ బాటలో పని చేసిన ఈ రైతు సంఘం ఆదా యం, వ్యవసాయ రుణం, నిరు ద్యోగం, సంఘ సంస్కరణల ధ్యేయంగా పనిచేసింది. జమిం దారీ విధానాన్ని రద్దు చేయా లని 1931లో తీర్మానించింది. భూమి పన్ను తగ్గింపు కోసం రంగా నేతృత్వంలో తెలుగు ప్రాంతంలోని డెల్టాలో ఉద్యమం ఆరంభమైంది. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి రంగా కలెక్టర్ కార్యాలయాలకు రైతు యాత్ర లను నిర్వహించారు. ఆయన ఆందోళన అంతా రాజ్యాం గబద్ధ పంథాలోనే నడిచింది. ఆ సమయంలోనే తన స్వస్థలం నిడుబ్రోలు (గుంటూరు జిల్లా)లో రైతుల కోసం నెలకొల్పిన ఇనిస్టిట్యూట్ను ప్రారంభించేందుకు మహాత్మాగాంధీని రప్పించారు. ఈ ఉద్యమం విజయ వంతమై పన్ను తగ్గించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లకు సం బంధించి ఆచార్య రంగా కాం గ్రెస్ నాయకత్వం కంటే ఎంతో ముందు ఉండేవారు. ఆంధ్రతో పాటే, బిహార్ తదితర పరగ ణాలలో రాష్ట్ర స్థాయి కిసాన్ సం ఘాలు పని చేయడం ప్రారం భించాయి. తమ కోర్కెల గురిం చి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధా నం, కార్యక్రమాల పట్ల రైతాం గంలో అసంతృప్తి పెరగడంతో కిసాన్ సంఘాలు కూడా తమ స్వరాన్ని పెంచాయి. రైతాంగ సమస్యల పట్ల ఉన్న నిబద్ధతతోనూ, పార్లమెంటరీ పంథాలో అహింసా మార్గానికి కట్టుబడి ఉన్న కారణం గానూ స్వతంత్ర రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని రంగా అభిప్రాయపడ్డారు. అలా 1936లో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించింది. అదే సంవత్సరం జరిగిన ఆంధ్ర ప్రాంత రైతు సద స్సులో రంగా మాట్లాడుతూ, రైతులకు అండగా నిలవ డంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని విమర్శిం చారు (ఆధునిక భారత రైతాంగం: ఆచార్య రంగా ఉపన్యాసాల సంకలనం, 1936, పే. 31). మద్రాస్ ప్రెసిడెన్సీలో (ఆంధ్రప్రాంతం అప్పుడు అందులో భాగం) ఆచార్య రంగా నేతృత్వంలో జరిగిన రైతాంగ ఉద్యమం సాధించిన ఘన విజయం- 1938 నాటి రుణ విమోచన చట్టం అమలు. రైతు రుణ విమో చనకు సంబంధించి రంగాగారు జరుపుతున్న పోరాటం లో ఇది శిఖరాయమానమైనది. రంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యతిరేకించినప్ప టికీ స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన రైతు ఉద్యమాలలో కమ్యూనిస్టులతో సన్నిహితంగా కలసి పని చేశారు. ఆయన దృష్టి ప్రధానంగా చిన్న త రహా రైతుల సమస్యల మీద కేంద్రీకరించినప్పటికీ, రైతుకూలీల సమ స్యల గురించి కూడా ఆయన యోచించారు. ప్రముఖ కమ్యూనిస్టు బంకిమ్ ముఖర్జీకి జూలై 28, 1938న రంగా రాసిన లేఖలో ఈ విషయం వెల్లడైంది. తుది వరకు రైతు సమస్యల గురించి పోరాడినా, వారు తప్పు చేస్తే విమ ర్శించడానికి ఆయన ఏనాడూ వెనకాడలేదు. ఆంధ్ర దేశంలో కాంగ్రెస్కు ప్రజా మద్దతు తెచ్చిన నాయకుడు ఆచార్య రంగా. (ఆచార్య రంగా (1900-1995) శత జయంతి సం దర్భంగా 2000 సంవత్సరంలో ప్రచురించిన ప్రత్యేక సం చిక కోసం నాటి కాంగ్రెస్ ప్రముఖుడు, నేటి రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ ‘ఆచార్య రంగా రైతాంగ ఉద్య మం’ పేరుతో రాసిన వ్యాసమిది. రంగా 20వ వర్ధంతి సందర్భంగా (జూన్ 8) డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు ఈ వ్యాసాన్ని సేకరించి పంపారు.) -
మహాసంకల్పం.. సర్వం సిద్ధం
- నేడు ఏఎన్యూ ఎదుట టీడీపీ ప్రభుత్వ సభ - సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం - భారీ వేదిక సహా అన్ని ఏర్పాట్లు పూర్తి - రెండు లక్షల మంది కూర్చునేలా కుర్చీల ఏర్పాటు - సభాస్థలిలో ఎల్ఈడీ స్క్రీన్లు.. నిఘా కెమెరాలు సాక్షి, గుంటూరు : తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ‘మహాసంకల్పం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సభను నిర్వహించనుంది. ఈ సభకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన ప్రాంతంలోనే ఈ సభ నిర్వహించనుండటం విశేషం. మహా సంకల్పం సభను సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి మించి అధిక ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 40 ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాంగణాన్ని నిర్మించారు. సుమారు రెండు లక్షల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేదికపై ఆశీనులయ్యేందుకు వీలుగా 76/58 సైజులో 250 మంది సామర్థ్యంతో భారీ వేదిక నిర్మించారు. ఎక్కడికక్కడ మెష్, బారికేడ్లు ఏర్పాటుచేసి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్లు.. మంత్రులకు ఏఏ పాస్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏ1, ఐఏఎస్, ఐపీఎస్లకు ఏ2 పాస్లను ఇస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాయకులకు ఇచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్ల చొప్పున అందించారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలిపేలా ముందుగానే వారికి కేటాయించిన సీట్లను సూచిస్తూ బోర్డులు ఉంచారు. సభాస్థలిలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం... సభ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుండటంతో ప్రాంగణం మొత్తం ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు సీఎంకు ప్రత్యేక కాన్వాయ్ను ఏర్పాటు చేసి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఏర్పాట్లను వారం రోజులుగా అడిషనల్ డీజీ సురేంద్రబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, నగరపాలక సంస్థ కమిషనర్ కె.కన్నబాబు, రేంజి ఐజీ ఎన్.సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణనాయక్ పర్యవేక్షిస్తున్నారు. భారీగా బందోబస్తు మహా సంకల్ప సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ తెలిపారు. సభా ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సైతం ఎటువైపు మళ్లించాలనే విషయంపై ఆ రాష్ట్ర డీజీపీ ద్వారా ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించామన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయా మార్గాల్లో సభకు వచ్చే వాహనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2500 సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, సమాచారం అందరికీ తెలిసేలా చేస్తున్నామన్నారు. మూడు హెలీప్యాడ్లు ఏర్పాటుచేసి సీఎం, కేంద్రమంత్రులకు ప్రత్యేక కాన్వాయ్లు ఏర్పాటు చేశామన్నారు. భద్రత కోసం 20 మంది ఎస్పీలు, 80 మంది డీఎస్పీలు, 7,800 మంది ఇతర పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... ఉదయం 7 గంటల నుంచి బహిరంగ సభ ముగిసేవరకు విజయవాడ నుంచి గుంటూరు వరకు గల ఎన్హెచ్-16 రహదారిని వన్వేగా మార్చారు. ఈ దారిగుండా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. సభ వద్ద పార్కింగ్ ప్రదేశాలను వివిధ కేటగిరీల్లో విభజించి వాటికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. దారి వెంట ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను అనుసరించి వాహనాలను సరైన ప్రదేశాలకు చేరుకునేలా చూసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు కాజ టోల్గేట్ వద్ద కుడివైపున పార్కింగ్ ఏర్పాటు చేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలకు హైవేకు కుడివైపున డాంగేనగర్ వద్ద, ఇతర వాహనాలకు హైవేకు ఎడమవైపున పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ప్రత్యేక పార్కింగ్ స్థలాలు... సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను టోల్ప్లాజా వద్ద, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను డాంగే నగర్, ఐజేఎంల వద్ద పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలం నుంచి సభావేదిక వద్దకు ప్రజలను చేరవేసేందుకు షటిల్ సర్వీస్ పేరుతో 40 తుఫాన్ వాహనాలను సమకూరుస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, ఇతర అధికారుల సమన్వయం కోసం 250 వాకీటాకీలను అందజేశారు. -
అంతా అక్కడికేనా! పాలన గాలికేనా?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అధికార పార్టీ సంకల్పిస్తే సభలను సక్సెస్ చేయడం ఓ లెక్కా! గుంటూరు జిల్లాలో సోమవారం జరిగే మహా సంకల్పం సభకు భారీగా తరలిరండని బాబుగారు పిలుపివ్వడంతో అటు తమ్ముళ్లు ఇటు అధికారులు నిబంధనలకు నీళ్లొదిలేశారు. దర్జాగా స్కూలు బస్సుల్లో జనాన్ని తరలించేశారు. అధికారులేమో ఏర్పాట్లలో తలమునకలై పాలన సంగతి మరచిపోయారు. పోలీసులైతే జిల్లాలో శాంతిభద్రలను గాలికొదిలేసి బందోబస్తు పేరుతో తండోపతండాలు తరలిపోయారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాష్ట్ర ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట మహాసంకల్పం పేరిట తలపెట్టిన బహిరంగసభకు జిల్లా నుంచి పెద్దఎత్తున అధికార పార్టీ శ్రేణులు తరలివెళుతున్నాయి. ఇందులో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు గానీ ప్రజలు, పార్టీ శ్రేణుల తరలింపునకు టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జరిగిన మహానాడుకు కూడా జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హైదరాబాద్కు తరలివెళ్లాయి. అప్పుడు ఎక్కడా ఎటువంటి విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు మహాసంకల్పం పేరిట చేపట్టే అధికారిక కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అధికార లాంఛనాలతో తరలివెళ్లడమే వివాదాస్పదంగా మారుతోంది. మహాసంకల్ప సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోటాపోటీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను పెద్దసంఖ్యలో తరలిస్తున్నారు. ఇందుకు మళ్లీ స్కూలు బస్సులను వినియోగిస్తున్నారు. బహిరంగ సభలకు జనాలను స్కూలు బస్సుల్లో తరలించొద్దంటూ ఇటీవలే రవాణాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ విషయమై చాలా కఠినంగా ఉంటున్నారు. రెండు నెలల కిందట సీఎం చంద్రబాబు పట్టిసీమ శంకుస్థాపన సభకు వచ్చినప్పుడు కూడా స్కూలు బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులనే వినియోగించారు. అయితే ఈ మహాసంకల్ప సభకు మళ్లీ స్కూలు బస్సులనే వినియోగిస్తున్నారు. ఒక్కో ఆర్టీసీ బస్సుకు సుమారు రూ.13వేల చొప్పున రూ.లక్షల్లో అవుతున్న ఖర్చును భరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ నేతలు కార్పొరేట్ స్కూలు బస్సులను ఎంచుకున్నారు. ప్రైవేటు యాజమాన్యాలతో ఉన్న పరిచయాల నేపథ్యంలో కేవలం డీజిల్ ఖర్చులు భరించేలా మాట్లాడుకుని ఆ బస్సులను వినియోగిస్తున్నారు. ఈ మేరకు జిల్లా నుంచి సుమారు వెయ్యి స్కూలు బస్సులు సోమవారం గుంటూరుకు తరలివెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఏలూరు నుంచే ఇంజినీరింగ్ కాలేజీల బస్సులతో సహా 150 స్కూలు బస్సులు తరలివెళుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 629 మంది పోలీసుల తరలింపు ఇక మునుపెన్నడూ లేని విధంగా జిల్లా నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు గుంటూరుకు తరలివెళ్లారు. రెండురోజుల ముందుగానే పోలీసులు అక్కడికి వెళ్లిపోవడంతో జిల్లాలో చాలా పోలీస్స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నలుగురు డీఎస్పీలు, 17మంది సీఐలు, 48 మంది ఎస్సై, 100 మంది ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు 330 మంది, హోంగార్డులు 130 మంది కలిపి మొత్తం 629 మంది ఈ నెల ఐదవ తేదీనే గుంటూరు వెళ్లారు. తిరిగి వీరంతా ఈ నెల 9న జిల్లాకు చేరుకుంటారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో రెండురోజులుగా పోలీస్ సిబ్బంది లేకపోవడంతో శాంతిభద్రతల పరంగా, వ్యక్తిగత, ఇతర సమస్యలతో వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పోలీస్స్టేషన్లు ఖాళీ అయిన పరిస్థితుల్లో ఈలోగా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పరిస్థితేమిటన్న ఆందోళన పోలీసు శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. మీ కోసం కూడా అంతేనా ప్రతి సోమవారం కలెక్టరేట్, ఆర్టీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే మీ కోసం కార్యక్రమం కూడా ఈ 8వ తేదీన నామమాత్రంగానే జరగనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు మహా సంకల్ప బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లలో తలకమునకలయ్యేందుకు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. దీంతో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించే వేదికైన మీకోసం కార్యక్రమం ఈ సోమవారం తూతూ మంత్రంగానే జరగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
నాగార్జున వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్లో జరిగిన ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలుగో సెమిస్టర్ ఫరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు చీఫ్ ఎగ్జామినర్ ఎం.సాయిబాబా తెలిపారు. ఫలితాలను www.anu.ac.in వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. జూన్ 3వ తేదీలోపు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నాన్నా... ఆత్మహత్య చేసుకుంటున్నా!
హైదరాబాద్: 'నాన్నా... నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని డైరీలో రాసి... తండ్రికి ఫోన్ చేసి చెప్పింది ఓ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్. దాంతో ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి...పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్శిటీలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఎప్పటిలాగా బుధవారం ఉదయం యూనవర్శిటీకి వచ్చిన సదరు మహిళ ప్రొఫెసర్... తాను అత్మహత్య చేసుకుంటున్నానంటూ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అంతేకాకుండా ఆ డైరీ యూనివర్శిటీ లైబ్రరీలో ఉందని చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో కంగారు పడిన వారు వెంటనే యూనివర్శిటీకి చేరుకున్నారు. అనంతరం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. యూనివర్శిటీలో ఆమె ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రయత్నించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో ఆమె సెల్ సిగ్నల్స్ను పోలీసులు ట్రేస్ చేశారు. వెంటనే అక్కడి పోలీసులను నగర పోలీసులు అప్రమత్తం చేశారు. దాంతో మహిళ ప్రొఫెసర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
ప్రేమ, పెళ్లి పేరుతో యువకుడి మోసం
ముహూర్తం సమయానికి మాయం సింగ్నగర్ స్టేషన్లో కేసు మధురానగర్ : ప్రేమించిన యువతిని ముందుగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని, తరువాత పెద్దల సమక్షంలో వివాహమాడతానని ఆమె తల్లిదండ్రులను ఓ యువకుడు నమ్మించాడు. తీరా ముహూర్తం సమయానికి మాయమయ్యాడు. దీనిపై సింగ్నగర్ పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన యువతి (21) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పైనలియర్ చదువుతోంది. వర్సిటీలో ఆమె సహచరుడైన గుండా మల్లిఖార్జునరావు గత నెల ఎనిమిదో తేదీన యువతి ఇంటికి వచ్చాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ పెళ్లి విషయంలో తమకు అభ్యంతరం లేదని ఆమె తండ్రి చెప్పారు. మీ కుటుంబసభ్యులు అంగీకరిస్తే వివాహం చేస్తానని చెప్పారు. తన కుటుంబసభ్యులతో మాట్లాడతానని చెప్పి మల్లికార్జునరావు వెళ్లిపోయాడు. కొన్నిరోజుల తరువాత తిరిగి వచ్చి తమ ఇంట్లో పెళ్లికి అంగీకరించటం లేదని చెప్పాడు. తన ప్రేమ స్వచ్ఛమెనదని, తాను కచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారు సరేనన్నారు. ఈనెల 13వ తేదీన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోండంటూ చెప్పి ఖర్చుల కోసం రూ.10 వేలు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. 13వ తేదీన ముహూర్తం సమయానికి అతడు రాలేదు. దీంతో మోసపోయామని యువతి కుటుంబీకులు భావించారు. దీనిపై యువతి తండ్రి ఫిర్యాదు మేరకు సింగ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మూడు కొత్త కోర్సులకు ప్రతిపాదనలు
కర్నూలు : పీజీలో మూడు కొత్తకోర్సుల ఏర్పాటుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల వైస్ఛాన్సలర్ ఎ.పద్మరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తిరుపతి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజి, బాపట్లలోని విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సీడ్ టెక్నాలజి, వాటర్ టెక్నాలజి కోర్సులను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నారు. ఈ విషయమై మహానందిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మీటింగ్కు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో పనిచేసే లెక్చరర్లు హాజరయ్యారు.