
'రిషితేశ్వరి కేసు నిందితులకు పెద్దల అండదండలు'
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారికి పెద్దల అండదండలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆ కేసులోని దోషులను శిక్షించి.. కఠినంగా చర్యలు తీసుకొని.. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధ్యులెంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అన్నారు.