పుట్లూరు (శింగనమల) : పుట్లూరులో చదువుల లక్ష్మీరెడ్డి(70) విషపు గుళికలు మింగి గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సురేశ్బాబు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక జీవితంపై విరక్తితో తనువు చాలించాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.