వడదెబ్బతో ఒకరి మృతి | ond dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఒకరి మృతి

Published Wed, May 10 2017 10:04 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

ond dies of sun stroke

నార్పల (శింగనమల) : నార్పల జంగాలకాలనీకి చెందిన ఆవుల రామాంజి(46)అనే మేకల కాపరి వడదెబ్బకు గురై  బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమీపంలోని కూతలేరు వంక పరిసరాల్లో మేకలను మేత కోసం మంగళవారం తోలుకెళ్లిన అతను రాత్రి ఇంటికి రాగానే సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement