ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృత్యువాత | one person dead in road accident | Sakshi

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృత్యువాత

Jan 1 2016 7:39 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

సంబేపల్లి: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలకేంద్రం సమీపంలో కర్నూలు- చిత్తూరు రహదారిపై శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని తిరుపతి నుంచి రాయచోటి వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి తల తెగిపోయింది. దీంతో మృతున్ని గుర్తించటం కష్టంగా మారింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement