- ∙వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
- ∙రానున్న వేసవి కోసం సరఫరా
ప్రాణం నిలిపే ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీళ్లపాలు
Published Fri, Jan 27 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
కాకినాడ వైద్యం :
వేసవిలో వడదెబ్బబారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఓరల్ రీహైడ్రేష¯ŒS సాల్ట్స్ (ఓఆర్ఎస్) ప్యాకెట్లు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యాలయానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేసింది. శిథిలావçస్థకు చేరిన ఫైలేరియా భవనంలోని ఓ పాడుబడ్డ గదిలో çసుమారు 200 బాక్స్లలో ఉన్న ఐదు వేల పేకెట్లను పడేశారు. ఈ గదిపై ఉన్న బాత్రూమ్ నుంచి నీరు కిందకి లీకవ్వడంతో ఆ ప్యాకెట్లన్నీ తడసి ముద్దయ్యాయి. ప్రాణాన్ని నిలిపే ఈ ప్యాకెట్లు పాడవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.
Advertisement
Advertisement