ప్రశాంతంగా పోస్టల్‌ పరీక్షలు | postal exams peacefull | Sakshi

ప్రశాంతంగా పోస్టల్‌ పరీక్షలు

Jan 30 2017 12:41 AM | Updated on Sep 26 2018 3:25 PM

జిల్లా వ్యాప్తంగా పోస్టుమెన్‌/ మెయిల్‌ గార్డు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ ఆదోని అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా పోస్టుమెన్‌/ మెయిల్‌ గార్డు పరీక్షలు  ప్రశాంతంగా జరిగాయి. యాభై శాతం మంది అభ్యర్థులే హాజరు కావడంతో కొన్ని పరీక్ష కేంద్రాలు బోసిపోయాయి. రాయలసీమ రీజియన్‌ పరిధిలోని నాలుగు జిల్లాలకు సంబంధించి పోస్టుమెన్‌/ మెయిల్‌గార్డు పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 4న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆదివారం కర్నూలు 17, ఆదోని 2, నంద్యాల 1, ఆళ్లగడ్డ 1 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12 వరకు మొదటి బ్యాచ్‌కి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండో బ్యాచ్‌కు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 5534 మంది హాజరు కాగా 5794 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం  5826 మంది హాజరు కాగా 5303 గైర్హాజరయ్యారు. పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సుబ్బారావు ఆదోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు బ్యాచ్‌ల్లో హాజరు శాతం వరుసగా 50.59, 48.85 శాతంగా నమోదైందన్నారు. ఒకే రోజున పోస్టుమెన్, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్స్‌ పరీక్షలు ఉండటంతో దరఖాస్తు చేసుకున్న సగం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేకపోయారని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement