jobs
-
మెసేజ్ స్క్రోల్ చేస్తే జాబ్ పోయింది!
ఉద్యోగాల కోసం రోజూ పదుల సంఖ్యలో కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు.. అలా ఏడాది గడిపిన ఓ వ్యక్తి చివరకు ఓ పెద్ద కంపెనీలో అధిక వేతనంతో రిమోట్ ఉద్యోగం(వర్క్ఫ్రం హోం) సంపాదించాడు. కానీ కొన్ని నెలల్లోనే తనకున్న ఓ అలవాటు ద్వారా ఉద్యోగం ఊడింది. తన అలవాటుపై స్పందించిన సదరు ఉద్యోగి తానో మూర్ఖుడినంటూ అందుకే ఉద్యోగం పోయిందని వాపోయాడు. దీనికి సంబంధించిన వివరాలను ‘కెరియర్ అడ్వైజ్’ అనే రెడ్డిట్ హ్యాండిల్ పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.‘చదవు పూర్తయింది. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాడిని. నాకు రిమోట్ ఉద్యోగం(వర్క్ఫ్రం హోం) చేయాలని చాలా ఇష్టంగా ఉండేది. అనుకున్నట్టుగానే మంచి కంపెనీలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం వచ్చింది. రిమోట్ జాబ్ కావడంతో కొన్నిసార్లు ఆలస్యంగా మెసేజ్లు చేస్తూ, మూర్ఖుడిలా పర్సనల్ మెసేజ్లు స్క్రోల్ చేసేవాడిని. ఈ క్రమంలో ల్యాప్టాప్ 10-15 నిమిషాలపాటు స్లీప్ మోడ్లోకి వెళ్లేది. ఇలా చాలాసార్లు జరిగింది. దీని గుర్తించి మేనేజర్ అడిగినప్పుడు ఏదో టెక్నికల్ సమస్య అని అబద్ధం చెప్పాను. అది గమనించిన మా బాస్ నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎంతో నిరాశ చెందాను. కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించిన మూడు నెలల్లో రెండు ఉద్యోగాలు మారాను. ఇది నా రెజ్యూమెలో ప్రతికూలంగా మారింది. నేను మళ్లీ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నాను. కానీ నా డ్రీమ్ జాబ్ కోల్పోయిన భావన నిజంగా నన్ను బాధిస్తుంది’ అని తెలిపాడు.‘నేను తప్పు చేశానని 100 శాతం అర్థం చేసుకున్నాను. దానిని సరిచేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను డబ్బును ప్రేమించాను. కానీ ఉద్యోగంలో ఉత్సాహంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఇకపై తప్పు చేయను. నాకు ఆసక్తిగా ఉన్న విమానయానం, ఆటోమోటివ్ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను’ అని పోస్ట్ చేశాడు.ఇదీ చదవండి: రోల్స్ రాయిస్.. 2,500 మందికి లేఆఫ్స్ఈ పోస్ట్ రెడ్డిట్లో వైరల్గా మారింది. చాలా మంది అతని చర్యలు, వాటి వల్ల వచ్చిన ఫలితం రెండింటినీ పరిగణించి కామెంట్ చేశారు. ‘మీ నుంచి చాలా మంది ఖరీదైన పాఠం నేర్చుకుంటారు. మీరు కెరియర్లో ముందుకు సాగండి. మరింత మెరుగైన అవకాశాలు మీ సొంతం అవుతాయి’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. -
రూ.25 లక్షల వేతనం.. బెంగళూరులో కష్టం!: పోస్ట్ వైరల్
ఉద్యోగం చేయాలనుకునే చాలామంది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలనే ఎంచుకుంటారు. అయితే బెంగళూరులో ఉండటం కష్టం అంటూ.. రూ.25 లక్షల వేతనం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కార్పొరేట్ ఉద్యోగి 40 శాతం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం పూణే నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఓ సంవత్సరం గడిచాక, బెంగళూరుకు రావడం తప్పు అయిందని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయాలు ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్లో వైరల్ అయ్యాయి.పూణేలో రూ. 18 లక్షల వేతనం వచ్చేది. బెంగళూరులో రూ. 25 లక్షలు వస్తున్నా ఏమీ మిగలడం లేదని, కొత్త ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి తన నిరాశను వ్యక్తం చేశాడు కార్పొరేట్ ఉద్యోగి. నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుందని అన్నాడు.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తికార్పొరేట్ ఉద్యోగి మాటలు విన్న, అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ.. 40 శాతం ఇంక్రిమెంట్ బాగానే ఉంది కదా. ఏమైంది అని అడిగితే.. బెంగళూరులో జీతాలు పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంటి యజమానులు మూడు లేదా నాలుగు నెలల రెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది.పూణేలోని 15 రూపాయల వడాపావ్ మిస్ అవుతున్నా అని చెప్పాడు. కనీసం అక్కడ జీవితం, సేవింగ్స్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. కొందరు బెంగళూరును సమర్దిస్తే.. మరికొందరు బెంగళూరులో బతకడం కష్టం అని అన్నారు. -
బాబు జాబు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊస్ట్
-
కొత్త కొలువులు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలూ హుష్!
అయ్యా.. బాబూ.. నిరుద్యోగ భృతి ఇవ్వండని యువత అడుగుతుంటే.. ఉద్యోగాలొస్తుంటే భృతి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంతకు తానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. కనీవినీ ఎరుగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో మాత్రం 30 వేల మందికి వందల కోట్ల రూపాయలు ధారపోస్తోంది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. ఈ విషయాన్ని ఇదే కూటమి సర్కారే బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది. గత నవంబర్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. గత ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. అయితే తాజాగా బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఇదే కూటమి సర్కారు ప్రకటించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. అంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారని తేలింది. కూటమి సర్కారు వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించేసింది. తద్వారా వారికి ఏటా ఖర్చయ్యే రూ.1500 కోట్లను మిగుల్చుకుంది. కొత్తగా సామాన్య నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, వృత్తిపరమైన సర్వీసుల పేరుతో సూట్లు వేసుకునే.. పలుకుబడిగల వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లుగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక విధాన పత్రంలోనే స్పష్టమైంది. వృత్తిపరమైన సర్వీసుల పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 6,434 మంది ఉండగా వారికి ఏడాదికి వేతనాల కోసం రూ.177 కోట్లు చెల్లించేది. అయితే ఇప్పుడు కూటమి సర్కారులో వృత్తిపరమైన సర్వీసు పేరుతో ఏకంగా 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.747 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారే స్పష్టం చేసింది.మేనిఫెస్టోకు మంగళం!సూపర్ సిక్స్లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, పలుకుబడి గల వారికి నెలకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ కన్సల్టెంట్లుగా నియమించుకుంటోంది. సామాన్య నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయం గురించి మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా, వారికి వేతనాల కింద ఏటా రూ.1,500 కోట్లు చెల్లించిందని గత నవంబర్లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో వలంటీర్లను తొలగించేసింది. తమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉంటే వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.2,604 కోట్లు చెల్లించిందని గత నవంబర్లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 94,420కి తగ్గిపోయినట్లు తెలిపింది. వారికి వేతనాల కింద ఏటా రూ.2,329 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొంది.ఉద్యోగాల కుదింపే లక్ష్యంగత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా కూటమి సర్కారు భర్తీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గిపోయింది. అలాగే గత ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది ఉండగా, కూటమి సర్కారులో 53,122కు తగ్గిపోయింది.నాడు మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో 72,747కు తగ్గిపోయింది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గిపోయింది. పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 46,646కు పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఏలు 19,406 ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 18,435కు తగ్గిపోయింది. దీన్నిబట్టి ఉద్యోగాలను తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టమవుతోంది. -
2030 నాటికి రెట్టింపు ఉద్యోగాలు
వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్ తమ కార్యకలాపాలకు సంబంధించి కీలకంగా ఎదుగుతోందని జర్మన్ సెమీకండక్టర్ల సంస్థ ఇన్ఫినియోన్ టెక్నాలజీస్ సీఎంవో ఆండ్రియాస్ ఉర్షిజ్ తెలిపారు. తమకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58,000 మంది, భారత్లో 2,500 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. భారత్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు ఆయన వివరించారు.దేశీయంగా ఇతర భాగస్వాములతో కలిసి పని చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆండ్రియాస్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి తమ గ్రూప్ ఆదాయంలో భారత్ వాటా సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, సమీప భవిష్యత్తులో ఇక్కడ తయారీ ప్లాంటు ఆలోచనేదీ లేదని వివరించారు. మరోవైపు, కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేసే దిశగా ఎల్రక్టానిక్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ విభాగాల్లో స్టార్టప్లకు సహాయం అందించేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆండ్రియాస్ చెప్పారు.ఇదీ చదవండి: బీమా సలహా కమిటీలోకి కొత్త సభ్యులు.. ఏం చేస్తారంటే..సెమీకండక్టర్ పరిశ్రమలో ఇన్ఫినియాన్ టెక్నాలజీస్తోపాటు విభిన్న కంపెనీలు యువతకు అవకాశాలు కల్పిస్తుంది. ఈ పరిశ్రమలో ప్రధానంగా హార్డ్ వేర్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, చిప్ డిజైన్, క్వాలిటీ అస్యూరెన్స్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ఇంటెల్, మైక్రాన్, ఇన్ఫినియన్ టెక్నాలజీస్, గ్లోబల్ఫౌండ్స్.. వంటి కంపెనీలు భారత్లో చురుకుగా నియామకాలు చేపడుతున్నాయి. -
గ్రేట్ లెర్నింగ్ కెరీర్ ప్రోగ్రెషన్ రిపోర్ట్: ప్రతి ముగ్గురిలో..
ఉన్నత విద్య, వృత్తిపరమైన శిక్షణ అందించడంలో ప్రపంచ అగ్రగామి అయిన 'గ్రేట్ లెర్నింగ్' (Great Learning) తన కెరీర్ ప్రోగ్రెషన్ నివేదిక 2024-25ను విడుదల చేసింది. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ల నుంచి ఎంపిక చేసిన 1000 మంది పూర్వ విద్యార్థుల సమగ్ర సర్వే నుంచి ఈ నివేదికను సిద్ధం చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సీనియర్ నాయకులు ఇందులో ఉంటారు.నిరంతరం కృషి చేయడం ద్వారా.. కెరీర్ ఎలా పురోగతి చెందిందో.. నిపుణులు నాయకత్వ పాత్రలు, జీతం పెరుగుదల, ఉద్యోగావకాలను సాధించడం ఎలా అనే విషయాలు కూడా గ్రేట్ లెర్నింగ్ ఇందులో వెల్లడించింది. ప్రొఫెషనల్స్ కెరీర్ విషయంలో అప్స్కిల్లింగ్ పరివర్తనాత్మక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు విజయవంతంగా సక్సెస్ వైపు వెళ్తున్నారు.అప్స్కిల్లింగ్ ప్రభావంతో.. 80 శాతం మంది ప్రమోషన్లు, జీతం పెరుగుదల విషయంలో ప్రగతి సాధించారు. 74 శాతం మంది పదోన్నతి పొందారు. 69 శాతం మంది ఉన్న సంస్థలలోని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. లీడర్షిప్ పాత్రలలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో నైపుణ్యాలను సంపాదించడం వల్ల నిపుణులు నిర్వాహక, వ్యూహాత్మక నాయకత్వ పాత్రలలోకి ఎలా మారడానికి వీలు కల్పిస్తుందో ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ప్రొఫెషనల్స్ అప్స్కిల్లింగ్ తర్వాత జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంది. అయితే సుమారు 87 శాతం మంది తక్షణ జీతాల పెంపు కంటే.. కెరీర్ వృద్ధికి కావాల్సిన నైపుణ్యాల పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. -
మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్
ప్రస్తుతం ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగుల ట్రెండింగ్ కూడా మారుతోంది. కొంతమంది ఉద్యోగులు కొన్ని రోజులు జాబ్ చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవడం కోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు. దీన్నే 'మైక్రో రిటైర్మెంట్' (Micro Retirement) అంటున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా ఎవరైనా 60 ఏళ్లకు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. కొంత ఓపిక ఉన్నవాళ్లయితే.. ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. మరికొందరు.. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ పార్ట్ టైమ్ ఉద్యోగమైనా చేస్తుంటారు. అయితే ఈ విధానానికి జెన్ జెడ్ లేదా జనరేషన్ జెడ్ ఉద్యోగులు మంగళం పాడేస్తున్నారు.కెరీర్లో కొంత బ్రేక్ తీసుకుని.. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించిన తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. దీన్నే మైక్రో రిటైర్మెంట్ అంటున్నారు. ఈ విధానంలో ఉద్యోగానికి గ్యారెంటీ ఉండదు. ఒక ఉద్యోగి చాలా ఏళ్ళు పనిచేసినప్పుడు కొంత విరామం కావాలనుకుంటే.. ఒక నెల లేదా ఆరు నెలలు సెలవు తీసుకుంటాడు. దీనిని కంపెనీలు కూడా అంగీకరిస్తాయి. కానీ ఈ మైక్రో రిటైర్మెంట్ అనేది మాత్రం భిన్నం.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్! మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి ఉపయోగిస్తే.. మరికొందరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. పరుగెడుతున్న టెక్నాలజీలో తమను తాము నిరూపించుకోవడానికి.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ జెడ్ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే మైక్రో రిటర్మెంట్ తీసుకుంటున్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి కూడా కొందరు ఈ విధానం అవలంబిస్తున్నట్లు సమాచారం. -
ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్లీజ్ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్ఇన్సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్లీజ్ సర్వేలో వెల్లడైంది. -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
గంగా మాత ఆశీస్సులతో దేశ సేవ: ప్రధాని మోదీ
హర్సిల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఆఫ్–సీజన్ అనేదే ఉండకూడదని పేర్కొన్నారు. పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగా మాత ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తనను గంగా మాత దత్తత తీసుకున్నట్లు భావిస్తున్నానని, ఆ తల్లి ఆశీస్సులే తనను కాశీ(వారణాసి)కి తీసుకెళ్లాయని, దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాయని వ్యాఖ్యానించారు. అనంతరం హర్సిల్ గ్రామంలో బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్లో శీతాకాలంలో పర్యటిస్తే చక్కటి అనుభూతి లభిస్తుందని అన్నారు. దేశమంతా పొగమంచుతో కప్పబడి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ మాత్రం సూర్యకాంతిలో స్నానమాడుతూ కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల టూ రిజం విజన్ను ప్రధానమంత్రి ప్రశంసించారు. పర్యాటకులను ఆకర్శించడానికి బహుముఖ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో పర్యాటకులతో కళకళలాడే ఉత్తరాఖండ్ చలికాలంలో మాత్రం ఖాళీగా దర్శనిస్తోందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టంచేశారు. అన్ని సీజన్లలో పర్యాటకులు భారీగా తరలివచ్చేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. వింటర్ టూరిజం మనం లక్ష్యం కావాలని అన్నారు. చలికాలంలోనే అసలైన ఉత్తరాఖండ్ను అనుభూతి చెందవచ్చని పర్యాటకులకు సూచించారు. గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హర్సిల్ విలేజ్ వరకూ ట్రెక్, బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. రోప్వే ప్రాజెక్టుతో కేదార్నాథ్ ప్రయాణం 9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. వివాహాలు చేసుకొనేందుకు, సినిమాలు, షార్ట్ఫిలింల షూటింగ్లకు ఉత్తరాఖండ్లో చక్కటి వేదికలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ పేర్కొన్నారు. రేపు గుజరాత్లో మోదీ పర్యటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన గుజరాత్లో పర్యటించనున్నారు. నవసారి జిల్లాలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారు. -
మీడియా దిగ్గజం కీలక నిర్ణయం: 1100 మందిపై వేటు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వయాకామ్18.. ది వాల్ట్ డిస్నీ కో. ఇండియా యూనిట్ మధ్య కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్ విలీనం తర్వాత 'జియోస్టార్' (Jiostar) ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలగింపులు ప్రక్రియ మొదలైనట్లు.. లేఆప్స్ జూన్ వరకు కొనసాగుతాయని చెబుతున్నారు.జియోస్టార్ లేఆప్స్ ప్రభావం సుమారు 1100 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఇందులో ఎంట్రీ లెవల్ ఉద్యోగులు, సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు.అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి అనేక హై-ప్రొఫైల్ టోర్నమెంట్ల ప్రసారాన్ని నిర్వహిస్తున్నందున, మీడియా దిగ్గజం క్రీడా విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది.ఐపీఎల్ 2025 సమయంలో భారీ లాభాలను చవిచూడటమే లక్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది. లేఆప్స్ ప్రభావానికి గురైన ఉద్యోగులకు.. వారి పదవీకాలాన్ని బట్టి 6-12 నెలల జీతంతో సహా ఇతర ప్యాకేజీలను అందించనున్నట్లు సమాచారం.జియోస్టార్ నవంబర్ 2024లో రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18, స్టార్ ఇండియా మధ్య జాయింట్ వెంచర్గా ఏర్పడింది. దీంతో 8.5 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం అవతరించింది. ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను ప్రత్యర్థిగా ఉంది. -
ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ప్చ్.. జీతాలే..
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా జీతాలు మాత్రం పెరగడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మానీ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు నైపుణ్యాల కొరతే ప్రధాన కారణమని తెలిపారు. అత్యధిక జనాభాను భారత్ ప్రయోజనకరమైన అంశంగా మల్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బోధన, శిక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం వర్కర్లు–జనాభా నిష్పత్తి గత ఏడేళ్లుగా పెరుగుతోంది. అంటే జనాభా వృద్ధికి మించి ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఉద్యోగాలు పెరగడం లేదనడం తప్పు. క్యాజువల్ వర్కర్ల వాస్తవ వేతనాలూ పెరిగాయని, వారి పరిస్థితులూ మెరుగుపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రెగ్యులర్ జీతాల ఉద్యోగాలే పెద్ద సమస్యగా ఉంటోంది. ఈ కేటగిరీలో ఏడేళ్లుగా ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా వాస్తవ వేతనాలు పెరగలేదు‘ అని విర్మానీ చెప్పారు. మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఫోకస్ చేయాలి.. కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి కూడా నైపుణ్యాలు అవసరమేనని విర్మానీ చెప్పారు. ‘ఉద్యోగం, నైపుణ్యాలనేవి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. నైపుణ్యాలుంటే ఉద్యోగం దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం అన్ని అంశాల్లోనూ మెరుగుపడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని వివరించారు. -
స్కిల్ లేని పట్టభద్రులకు ఉద్యోగాలు నిల్!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఏం చదివామన్నది కాదు.. ఎలా చదివామన్నది చాలా ముఖ్యం. డిగ్రీ వస్తే చాలదు నైపుణ్యం కూడా ఉండాల్సిందే. లేకపోతే ఉద్యోగాలు రావని ఓ శాస్త్రీయ అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’ అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగా ఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి. అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం. ఉత్తరాది రాష్ట్రాలదే హవా... ⇒ దేశంలో కనీసం 50 % మంది గ్రాడ్యుయేట్లు ఉపా«ది పొందగల రాష్ట్రాలు కేవలం 4 ఉన్నాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్లో రాజస్తాన్కు టాప్10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. ⇒ నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయిమొక్కుబడిగా చదవొద్దు..సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసినా, అంతగా నైపుణ్యాలు నేర్చుకోకుండా, కొత్త కోర్సులు చేయకుండా ఇంజనీరింగ్ చదివినా వెంటనే ఏదో ఉద్యోగం వచ్చేస్తుందని ఆశిస్తే ఇబ్బందే. కమ్యూనికేషన్, ఇన్డెప్త్ డొమైన్ నాలెడ్జి, టెక్నాలజీ, మేనేజ్మెంట్ (ఫోర్ పిల్లర్స్) వంటి వాటిపై పట్టుసాధించి ఇండస్ట్రీ సర్టిఫికేషన్ పొందగలిగితే నాన్–టెక్లో ఉన్నా నైపుణ్యంతోపాటు మంచి ప్యాకేజీ పొందగలరు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీనైపుణ్యాలు ఉండాల్సిందే..నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్కూ మంచి అవకాశాలు లభిస్తాయి. – ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్స్టెప్స్ -
సమస్యను సోషల్ మీడియాలో పెట్టిన ఉద్యోగి: నెట్టింట్లో వైరల్
ఉద్యోగులకు ఏదైనా సమస్యలు వచ్చినా.. సందేహాలు వచ్చినా.. తగిన పరిష్కారం తెలుసుకోవడానికి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందించారు. నా సహోద్యోగికి ఇలాగే జరిగింది. దీనికోసం ఒక న్యాయవాదిని నియమించుకోండి. మీకు కావలసిన లెటర్స్ పొందటానికి రూ. 50వేలు ఖర్చు చేయడానికి వెనకాడవద్దని, ఒక యూజర్ పేర్కొన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి, దీనికోసం ఆఫర్ లెటర్ యూస్ చేయండి. శాలరీ హైక్ లెటర్ అవసరం లేదని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!మీరు చేరిన వెంటనే రాజీనామా చేసిన కంపెనీ నుంచి మీకు.. ఎక్స్పీరియన్స్ లెటర్ ఎందుకు అవసరం. ఈ విషయాన్ని.. ఇకపై చేరబోయే సంస్థలో చెప్పినా, మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. రిలీవింగ్ లెటర్ను ఎవరూ ఆపలేరని హెచ్ఆర్కు చెప్పండి. పీఎఫ్ పాస్బుక్లో ఈ సంస్థ నుంచి ఈపీఎఫ్ ట్రీ ఉంటే, భవిష్యత్తులో మీరు చేరే కంపెనీలలో నేపథ్య ధృవీకరణ ప్రక్రియ కోసం మీకు రిలీవింగ్ లెటర్ అవసరం అవుతుంది. -
ఇన్ఫోసిస్లో 20,000 నియామకాలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్(Infosys) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికకు అనుగుణంగా సాగుతున్నట్టు వెల్లడించింది. కొత్తగా చేరిన వారికి ఉత్తమ కార్పొరేట్ శిక్షణ ఇవ్వనున్నట్టు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ తెలిపారు.ఇదిలాఉండగా, 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించినట్టు కంపెనీ ఇటీవల వెల్లడించింది. ‘మైసూరు క్యాంపస్లో వీరికి ప్రాథమిక శిక్షణ పూర్తి అయింది. అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియలో మెరుగైన పనితీరు కనబర్చలేదు. మూడు విడతలుగా అవకాశం ఇచ్చాం. అయినా ఉత్తీర్ణులు కాలేదు. దీంతో ఉద్వాసన పలకాల్సి వచ్చింది’ అని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఉద్యోగులను ఎటువంటి ఒత్తిడికి గురి చేయలేదని మాథ్యూ వివరించారు. మదింపు ప్రక్రియలో పనితీరు కనబర్చని ఫ్రెషర్ల తొలగింపు సాధారణమే. అయితే గతంలో ఇది 10 శాతానికి లోబడి ఉండేది. ఈ నెలలో ఇది ఏకంగా 30–40 శాతం ఉన్నట్టు సమాచారం. ఇదే వివాదానికి కేంద్ర బిందువైంది. ఇదీ చదవండి: భారత్పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..అక్రమంగా, అనైతికంగా..ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) వాదన మరోలా ఉంది. మైసూరు శిక్షణ కేంద్రం నుంచి 700 మందికిపైగా ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ తొలగించిందని ఆరోపిస్తోంది. అక్రమంగా, అనైతికంగా ఉద్యోగులను తొలగించారంటూ కార్మిక శాఖకు సైతం నైట్స్ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెర్మినేషన్కు గురైన వారంతా 2022 హైరింగ్ బ్యాచ్కు చెందినవారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత 2024 సెప్టెంబర్లో జాబ్స్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ 2024లో అమలు చేసిన పరీక్షా విధానం కఠినంగా ఉంది. సిలబస్ ఎక్కువగా ఉండడం, శిక్షణ సమయం తక్కువ కావడంతో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయిందని నైట్స్ చెబుతోంది. స్వచ్ఛందంగా మానేస్తున్నట్టు ఉద్యోగులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బందితో బెదిరింపులకు దిగారని కార్మిక శాఖకు ఇచ్చిన ఫిర్యాదులో నైట్స్ వెల్లడించింది. -
నాన్-టెక్ గ్రాడ్యుయేట్ల పాలిట శాపంగా ఏఐ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ పురోగతి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఏఐలో వస్తున్న పురోగతి కొందరికి అవకాశాలు సృష్టిస్తుంటే.. ఇంకొందరి పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా భారతదేశంలోని నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు ఏఐలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకోవడం విఫలమవుతున్నారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, సరైన సాంకేతిక నైపుణ్యాలులేక వాటికి దూరంగా ఉంటున్నారని తెలియజేస్తున్నారు. నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ జీవితాలను ఏఐ ఎలా ప్రభావితం చేస్తుందో టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఉద్యోగావకాశాల సవాళ్లునాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్య మెరుగైన ఉద్యోగావకాశాలు లేకపోవడం. వారికి ఆ ఉద్యోగాలకు తగిన సాంకేతిక నైపుణ్యాలు లేవపోవడమే కారణం. దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ మార్కెట్ అవసరాలను వారు తీర్చలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు దీన్ని అందిపుచ్చుకోవడం లేదు. టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా అడాప్టబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ వంటి కీలకమైన నాన్ టెక్నికల్ స్కిల్స్ కూడా వారికి కెరియర్కు గుదిబండగా మారుతున్నాయి.ఎంప్లాయిబిలిటీ రేటు తగ్గుదలభారత్లో నాన్ టెక్ గ్రాడ్యుయేట్ల ఎంప్లాయిబిలిటీ రేటు గణనీయంగా పడిపోయిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దానికితోడు చాలా కంపెనీలు ఏఐ వాడకాన్ని పెంచుతుండడం, వాటిని ఈ గ్రాడ్యుయేట్లు అందిపుచ్చుకోలేక పోతుండడం ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ ధోరణి వారి నైపుణ్యాలను పెంచుకోవాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది.పరిష్కారం ఇలా..పరిశ్రమ డిమాండ్లు, నాన్-టెక్ గ్రాడ్యుయేట్ల సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి, మెరుగైన సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. గ్రాడ్యుయేట్లు క్రిటికల్ థింకింగ్, సృజనాత్మకత, సమర్థవంతమైన కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. నిరంతరం మారుతున్న పని వాతావరణంలో వృద్ధి చెందడానికి ఈ నైపుణ్యాలు ఎంతో తోడ్పడుతాయి.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా రూ.2,000 కోట్లతో అదానీ స్కూల్స్విద్యా సంస్థల పాత్ర కీలకంభవిష్యత్ శ్రామిక శక్తికి విద్యార్థులను సిద్ధం చేయడంలో విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్య అంతరాలను పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాలి. ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ఏకీకృతం చేయడం, అనుభవపూర్వక అభ్యసనను ప్రోత్సహించడం, విద్యార్థులను రియల్టైమ్ ప్రాజెక్టుల్లో నిమగ్నమయ్యేలా ఏర్పాటు చేయడం వంటి అంశాలను పరిగణించాలి. దీని ద్వారా విద్యా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన విభిన్న నైపుణ్యాలతో గ్రాడ్యుయేట్లను సన్నద్ధం చేసే అవకాశం ఉంటుంది. -
'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్
చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ తెచ్చుకోవాలని, ఎక్కువ ప్యాకేజ్ పొందాలని అనుకుంటారు. కానీ ఇటీవల ఒక టెకీ 'ఉద్యోగం ఇవ్వండి, ఉచితంగానే పని చేస్తా' అని అంటున్నాడు. అతని రెజ్యూమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. తాను 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, కానీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కూడా సమయం ఉద్యోగం పొందలేకపోయానని చెప్పాడు. ఉద్యోగం సంపాదించాలనే తపనతో, ఉచితంగా పనిచేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నా రెజ్యూమ్ను కాల్చండి.. కానీ దయచేసి సహాయం చేయండి. సమీపంలో ఉద్యోగం దొరికితే ఉచితంగానే చేస్తాను. ఉద్యోగం కోసం వేచి చూస్తున్నాను.. అని ఆ యూజర్ రెడ్డిట్లో రాశారు. “నేను జావా, పైథాన్, డెవ్ఆప్స్ (DevOps), క్లౌడ్ కంప్యూటింగ్,మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందాను. సీఐ/సీడీ పైప్లైన్లు, డాకర్, కుబెర్నెట్స్, ఏపీఐ డెవలప్మెంట్తో పనిచేసిన అనుభవం కూడా ఉందని.. రెజ్యూమ్లో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన.. ఈ సారి ఎంతంటే?కాలేజీలో చదువు పూర్తయిన తరువాత.. ఫుల్ టైమ్ జాబ్ పొందలేకపోయాను. ఇప్పటికే రెండు కంపెనీలలో ఒక్కో నెల ఇంటర్న్గా పనిచేశాను. ఇంటర్న్షిప్లు, ఫ్రీలాన్స్ గిగ్లు లేదా ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్లు వంటి ఏవైనా అవకాశాల గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండని టెకీ తన పోస్టులో పేర్కొన్నాడు.నేను ప్రొడక్ట్ ఇంజనీర్ ఇంటర్న్, టెక్నికల్ ఇంటర్న్గా ఇంటర్న్షిప్లు చేస్తున్నప్పుడు.. వెబ్ క్రాలర్లు, ఏపీఐ టెస్టింగ్, ఎంఎల్ సిస్టమ్లపై పనిచేశాను. ఐఈఈఈలో రీసర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేశాను. డీప్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ప్రాజెక్టులను నిర్మించాను" అని టెకీ చెప్పారు.Burn my resume but please help. Desperate & Ready to Work for Free Remotely – 23' Grad Looking for a Job ASAPbyu/employed-un inIndianWorkplace -
విజయవంతంగా బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ పట్టభద్రుల కోసం ప్రారంభించిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్) కోర్సుకు మంచి స్పందన లభిస్తోంది. మొదటి, రెండో విడత బ్యాచ్ల శిక్షణ ఇప్పటికే పూర్తికాగా, మూడో విడత కోర్సుల శిక్షణ కోసం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. వీరిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై వరకు బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తారు. ఆ తరువాత బీఎఫ్ఎస్ఐకు సంబంధించి హైదరాబాద్లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఏటా 10 వేల మందికి శిక్షణ ఇస్తారు. వీరిలో 5 వేల మంది ఇంజనీరింగ్, మరో 5 వేల మంది డిగ్రీ పట్టభద్రులుంటారు. రానున్న మూడేళ్లలో 30 వేల మంది తెలంగాణ యువతకు ఈ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.గతేడాది సెప్టెంబర్లో ‘బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్’ కోర్సు ప్రారంభమైంది. ఖర్చును ఎక్విప్, బీఎఫ్ఎస్ఐ కన్సార్షియం భరిస్తుంది. విద్యార్థుల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పట్టభద్రులు స్కిల్స్ యూనివర్సిటీ వెబ్సైట్ yisu.in ను సందర్శించాలని కోరారు. -
ఏటా లక్ష మందికి విదేశాల్లో ఉపాధి
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఏటా లక్ష మందికి అంతర్జాతీయంగా సంరక్షణ కార్యకలాపాల్లో ఉపాధి కల్పించనున్నట్లు జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సీఈవో 'వేద్ మణి తివారీ' ప్రకటించారు. మరో రెండేళ్ల తర్వాత నుంచి నియామకాలు మొదలవుతాయన్నారు. వృద్ధ జనాభా పెరుగుతున్న దేశాల్లో వారి సంరక్షణ సేవల్లో నియమించనున్నట్టు చెప్పారు.దేశంలో నిరుద్యోగం గురించి ప్రస్తావించగా.. అధికారిక లెక్కల ప్రకారం ఇది 6.5 శాతంగా ఉందని, అమెరికాలోనూ 4.5 శాతం మంది నిరుద్యోగులు ఉన్నట్టు గుర్తు చేశారు. గడిచిన ఏడాది కాలంలో భారత్ నుంచి 20,000 మంది నిర్మాణ రంగ కార్మికులు ఇజ్రాయెల్కు వెళ్లారని చెప్పారు. దేశవ్యాప్తంగా 100 నైపుణ్య మదింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తివారీ తెలిపారు.‘‘ఇజ్రాయెల్ లేదా జపాన్ లేదా జర్మనీ వెళ్లాలనుకునే వారు ఈ కేంద్రాల వద్ద హాజరు కావాలి. అక్కడ నైపుణ్యాలను పరీక్షించి సరి్టఫికెట్ ఇస్తారు. అప్పుడు వర్క్వీసా కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు’’అని వివరించారు. ఎన్ఎస్డీసీ 4 కోట్ల మందికి శిక్షణ ఇవ్వగా, మూడు నెలల్లోనే 94 లక్షల మందికి ఉపాధి లభించినట్టు తివారీ వెల్లడించారు.అత్యాధునిక నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 50 భవిష్యత్ నైపుణ్య కల్పన కేంద్రాలను, 10 ఎన్ఎస్డీసీ ఇంటర్నేషనల్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పరిశ్రమల అనుసంధానతతో కూడిన శిక్షణా కార్యక్రమాలు 300కు మించగా, 13 ప్రముఖ టెక్నాలజీలు వీటి పరిధిలో ఉన్నట్టు చెప్పారు. ఏటా 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. -
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
మరోమారు లేఆఫ్స్: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం
దిగ్గజ టెక్ కంపెనీలన్నీ లాభాల బాటలో దూసుకెళ్తున్న వేళ.. 'అమెజాన్' (Amazon) మరోమారు లేఆఫ్స్ ప్రకటించనుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు.. సంస్థ తన కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రభావం ఎంతమంది ఉద్యోగులపై పడుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించడంలో భాగంగానే.. ఈ లేఆప్స్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అమెజాన్ చెబుతోంది. ఉద్యోగుల తొలగింపు కొంత కష్టమైన ప్రక్రియే.. కానీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి, సంస్థ పనితీరును మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ నిర్మాణమే తీసుకోవాల్సి వచ్చిందని.. సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ బాధ్యతను పర్యవేక్షిస్తున్న 'డ్రూ హెర్డెనర్' (Drew Herdener) పేర్కొన్నారు.యాండీ జెస్సీ 2021లో ఆమెజాన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. కంపెనీని పునర్నిర్మించడానికి లేదా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి కావలసిన ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే పలువురు ఉద్యోగులను సైతం తొలగించారు. ఇప్పుడు మరోమారు ఈ లేఆప్స్ వార్త తెరమీదకు వచ్చింది.2022లో కంపెనీ వివిధ విభాగాల్లో 27,000 మందిని తొలగించడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా రద్దు చేసింది. ఉద్యోగులందరూ.. ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ విధానం తొలగించాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఆఫీస్ బాట పట్టారు.అమెజాన్ పెట్టుబడి రూ.60 వేలకోట్లుతెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించేందుకు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సిద్ధమైంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ‘అమెజాన్ వెబ్ సర్విసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ’ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదీ చదవండి: బంగారం.. మరింత పెరిగే అవకాశం! -
చెప్పారంటే.. చేయరంతే!
సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ కేలండర్ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్ మాత్రమే కాదు.. నారా చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటమి ప్రభుత్వంలో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్–2, మే నెలలో గ్రూప్–1 మెయిన్స్కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్లో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్ 30న ‘ఎక్స్’లో పోస్టు చేసిన లోకేశ్ మభ్య పెట్టడమే సర్కారు విధానంరాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్ జాబ్ కేలండర్–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.యువత సంక్షేమం పేరుతో జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం గత ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారమే భర్తీవైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క నోటిఫికేషన్ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లవ్లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్: ప్రముఖ కంపెనీ ఆఫర్
ఉద్యోగం ఇచ్చేవాళ్లు విద్యార్హత చూస్తారు.. లేదా స్కిల్స్ చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం దీనికి భిన్నమైన రూల్స్ పెట్టింది. లవ్లో కనీస ఒకసారైనా బ్రేకప్ అయి ఉండాలని కూడా ఒక కండిషన్ పెట్టింది. ఇంతకీ ఆ జాబ్ ఏంటి? దానికి కావాల్సిన మరిన్ని అర్హతలు ఏమిటనేవి ఇక్కడ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్షిప్లు, మూడు డేట్లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది. ఇలాంటి వారు ఆ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది.కొత్త డేటింగ్ నిబంధనల సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. కనీసం 2-3 డేటింగ్ యాప్లను ప్రయత్నించి ఉండాలి. ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్ఫిషింగ్కు తావులేదని స్పష్టం చేసింది. అవసరమైన అన్ని లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు.. ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.ఇదీ చదవండి: పనిగంటలపై 78 శాతం మంది అభిప్రాయమిదే..ఇప్పుడు జాబ్ ఆఫర్ చేసిన బెంగళూరు కంపెనీలో ఉద్యోగం చేయడానికి ప్రత్యేకంగా ఎంబీఏ, ఎంసీఏ వంటివి అవసరం లేదు. ఉద్యోగానుభవం అంతకంటే అవసరం లేదు. ప్రేమ పిపాసులై, ప్రేమ భాషలో నిష్ణాతులైన వారు ఎవ్వరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అయితే జీతం గురించి ఎలాంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉద్యోగానికి అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించిన పూర్వాపరాలను కంపెనీ పరిశీలిస్తుంది.Hiring Alert! We are looking for a Chief Dating Officer. Are you the go-to friend for dating advice? We’re hiring someone who lives and breathes dating culture. The self-proclaimed matchmaker who can decode “ghosting,” “breadcrumbing,” and every new dating buzzword in the… pic.twitter.com/yqyJJiCVJy— Nimisha Chanda (@NimishaChanda) January 29, 2025 -
స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం నియామకాలు ప్రారంభించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్(సీపీఎస్ఈ)లోని స్వతంత్ర డైరెక్టర్ పోస్టుల్లో డిసెంబర్ 2024 నాటికి 86% ఖాళీగా ఉన్నాయి. ఇది అక్టోబర్లో ఉన్న 59% కంటే అధికంగా పెరిగింది.వీరు ఏం చేస్తారంటే..కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను నిర్వహించడంలో, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. చట్టబద్ధమైన ఆడిట్ విధానాన్ని పర్యవేక్షించే కమిటీల్లో వీరు ముఖ్యమైన బాధ్యత వహిస్తారు. కంపెనీల ఉనికి, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అత్యున్నత ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తారు.ప్రస్తుత ఖాళీల పరిస్థితిసీపీఎస్ఈ బోర్డుల్లో సుమారు 750 ఇండిపెండెంట్ లేదా నాన్ అఫీషియల్ డైరెక్టర్ పోస్టుల్లో 2024 డిసెంబర్ చివరి నాటికి 648 ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో ఖాళీలు ఉండడంతో కార్పొరేట్ పాలనపై ఆందోళనలు రేకిస్తున్నాయి. ఈ ఖాళీల పర్వం ఇలాగే కొనసాగితే సంస్థల పనితీరుపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ స్పందన..ఈ ఆందోళనకర పరిస్థితికి ప్రతిస్పందనగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం తక్షణ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా 64 లిస్టెడ్ సీపీఎస్ఈల బోర్డుల్లోని 200 ఖాళీలపై దృష్టి సారించింది. నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి డిపార్ట్మెంట్స్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీఓపీటీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగాలతో పాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరస్పరం చర్చలు జరుపుతుంది.ఇదీ చదవండి: వినియోగ సంక్షోభానికి కారణాలు.. బడ్జెట్పై ఆశలుఖాళీల సమస్యను పరిష్కరించడానికి అధికారులు అనేక చర్యలను పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించి పోస్టులను భర్తీ చేసేలా చూడాలనే ప్రతిపాదనలున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్లలో కనీసం మూడింట ఒక వంతు మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. నిర్ణీత పరిమాణానికి మించి అన్ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలకు కనీసం ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు అవసరం. వీరు కార్పొరేట్ గవర్నెన్స్ కస్టోడియన్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ ఖాళీల భర్తీకి అత్యంత ప్రాధాన్యం ఉంది. -
ఎక్కువమంది కోరుకున్న జాబ్.. 25 దేశాల్లో బెస్ట్ కెరీర్ ఇదే..
మంచి ఉద్యోగం అన్నది ప్రతిఒక్కరి కల. ప్రతి రంగంలోనూ ఎక్కువమందికి ఆసక్తిగా ఉన్న ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఏ ఉద్యోగాలను ఎక్కువ మంది కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి రెమిటీ (Remitly) అనే సంస్థ 186 దేశాల నుండి గూగుల్ (Google) శోధనలను విశ్లేషించి ఒక అధ్యయనం చేసింది. 2024లో "(ఉద్యోగం) ఎలా అవ్వాలి" (how to become) అని వ్యక్తులు ఎన్నిసార్లు సెర్చ్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన కెరీర్లను ఈ అధ్యయనం వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది శోధించిన ఉద్యోగం పైలట్ (pilot). దీని కోసం 4,32,000 కంటే ఎక్కువ శోధనలు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్, ఈజిప్ట్,స్లోవేకియాతో సహా 25 దేశాల్లో ఇది అత్యుత్తమ కెరీర్ ఎంపిక. తర్వాత 3,93,000 శోధనలతో లాయర్ వృత్తి రెండవ స్థానంలో నిలిచింది. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ఆసక్తిలో బాగా పెరుగుదల కనిపించింది. ఇతర ఉన్నత ఉద్యోగాలలో పోలీసు అధికారి (2,72,000 శోధనలు), ఫార్మసిస్ట్ (2,72,630), నర్సు (2,48,720) ఉన్నాయి. గత రెండేళ్లలో పోలీసు వృత్తిపై ఆసక్తి 440 శాతం పెరిగింది.డిజిటల్ కెరీర్ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కలలు కన్న సోషల్ మీడియా కెరీర్ యూట్యూబర్. యూట్యూబర్గా మారడం ఎలా అని 1,71,000 శోధనలు వచ్చాయి. యూకే, సింగపూర్, ఇండోనేషియాతో సహా 13 దేశాలలో అత్యధికంగా శోధించిన ఉద్యోగం ఇదే. అయితే 2022 నుండి ఈ కెరీర్పై ఆసక్తి 11% తగ్గింది. ఇతర డిజిటల్ కెరీర్ల విషయానికి వస్తే.. కంటెంట్ క్రియేటర్ 52,000 శోధనలను, సోషల్ మీడియా మేనేజర్ 36,000 శోధనలను పొందాయి. టెక్ ఫీల్డ్ కూడా ఆసక్తిని ఆకర్షిస్తోంది. కోడింగ్ 48,000 శోధనలతో అధిక ర్యాంక్ను పొందింది.డిమాండ్లో హెల్త్కేర్, పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలుహెల్త్కేర్ అనేది ఎక్కువమంది కోరుకునే కెరీర్ మార్గాలలో ఒకటి. 272,000 శోధనలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించి హెల్త్కేర్ జాబ్ ఫార్మసిస్ట్. ఇది ముఖ్యంగా జపాన్లో జనాదరణ పొందింది. ఇతర టాప్ హెల్త్కేర్ కెరీర్లలో ఫిజికల్ థెరపిస్ట్ (2,44,000 శోధనలు), టీచర్ (1,75,000), డైటీషియన్ (170,000) ఉన్నాయి.పబ్లిక్ సర్వీస్లో 2,72,730 శోధనలతో పోలీసు అధికారి ఉద్యోగం అగ్రస్థానంలో ఉంది. తర్వాత నర్సింగ్, మిడ్వైఫరీ, అగ్నిమాపక విభాగాలు ఉన్నాయి. డాక్టర్ కావాలనే ఆసక్తి పెరిగినప్పటికీ, నర్సింగ్, మిడ్వైఫరీ కెరీర్ల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా శోధిస్తున్నారు.క్రియేటివ్, స్పోర్ట్స్ కెరీర్లకూ ఆదరణకళలు, వినోద ప్రపంచంలో, దాదాపు 2,00,000 శోధనలతో అత్యధికంగా శోధించిన సృజనాత్మక వృత్తి నటన. ఇతర ప్రసిద్ధ ఎంపికలలో వాయిస్ యాక్టింగ్, డీజే, సింగింగ్ ఉన్నాయి. "ఫుట్బాల్ ఆటగాడిగా ఎలా మారాలి" అని 95,000 శోధనలతో స్పోర్ట్స్ కెరీర్పై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఇది కాకుండా వ్యక్తిగత శిక్షకులు, కోచ్ల వంటి ఫిట్నెస్-సంబంధిత కెరీర్లు ఆదరణ పొందాయి. -
ఇన్ఫోసిస్ గుడ్న్యూస్: కొత్తగా 17000 ఉద్యోగాలు
తెలంగాణాలో ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) మరింత విస్తరించనుంది. దీనికోసం కంపెనీ దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే పోచారం క్యాంపస్ను విస్తరించనున్నట్లు, తద్వారా 17,000 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించింది.దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీ మినిష్టర్ శ్రీధర్ బాబుతో.. ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్ భేటీ తరువాత ఈ ప్రకటన చేశారు. పోచారం క్యాంపస్ విస్తరణ ప్రణాళికలో భాగంగానే ఫేజ్ 1లో రూ. 750 కోట్ల పెట్టుబడితో.. కొత్త ఐటీ భవనాలను నిర్మించనున్నారు. ఇవి పూర్తి కావడానికి మరో రెండు - మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.తెలంగాణను ఐటీ రంగంలో అగ్రగామిగా చేయడానికి, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం సంతోషంగా ఉందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
పనిగంటల్లో మహిళను మరిచారా?
వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (ఎల్ అండ్ టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది. ‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల జోకులు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్ అండ్ టీ చైర్మన్ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంటి పని మాటేమిటి?నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది. ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఒకసారి చూడాలి. మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం. ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్ కపూర్లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అసంఘటిత రంగం మాటేమిటి?పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు. పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు. అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..
కరోనా సమయంలో ఎంతోమంది టెకీలు జాబ్స్ కోల్పోయారు. డిసెంబర్ 2024లో కూడా దిగ్గజ కంపెనీలు సైతం లేఆప్స్ ప్రకటించాయి. కాగా ఇప్పుడు కొన్ని సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో టీసీఎస్ చేరింది. ఇప్పుడు తాజాగా విప్రో కూడా నేనున్నానంటూ.. ముందుకు వచ్చింది.దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) 2025-26 (FY26) ఆర్థిక సంవత్సరంలో 10,000-12,000 మంది ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'సౌరభ్ గోవిల్' (Saurabh Govil) తన Q3FY25 ఆదాయ నివేదికను కంపెనీ విడుదల చేసిన తర్వాత, విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విప్రో తెలిపింది. అక్టోబర్ - డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో దాదాపు 7,000 మంది ఇప్పటికే ఆన్బోర్డ్లో ఉన్నారు. కాగా FY25 చివరి త్రైమాసికంలో మరో 2,500-3,000 మంది చేరే అవకాశం ఉంది. కాగా 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,655గా ఉన్నట్లు సమాచారం.విప్రో, టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను నియమించుకోవాలనే ప్రకటన చేసిన తరువాత, విప్రో కూడా ప్రకటించింది. ఈ వరుసలో ఇన్ఫోసిస్ కూడా చేసింది. FY26లో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే లెక్కకు మించిన ఫ్రెషన్స్ ఐటీ కంపెనల్లో ఉద్యోగాలు పొందనున్నట్లు స్పష్టమవుతోంది. -
కెరీర్ క్యాట్ఫిషింగ్.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్..!
తమ అలవాట్లు, సంప్రదాయ విరుద్ధ ధోరణులతో కార్పొరేట్ ప్రపంచంలో జెన్ జెడ్ వార్తల్లో నిలుస్తోంది. ‘కెరీర్ క్యాట్ఫిషింగ్’ అనే కొత్త ట్రెండ్తో హల్చల్ చేస్తోంది. యువత ఉద్యోగ ఆఫర్లను అంగీకరిస్తారు.. కానీ వారి యజమానులకు తెలియజేయకుండా వారి మొదటి రోజున ఆఫీసులో కనిపించకుండా పోతారు. సదరు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో యజమానికి తెలియకోవడాన్ని ‘కెరీర్ క్యాట్ఫిషింగ్’ అంటారు.ఆన్లైన్ రెజ్యూమ్ ప్లాట్ఫామ్ ‘సివిజెనియస్’ నివేదిక ప్రకారం జెన్ జెడ్ ఉద్యోగులు జాబ్ ఆఫర్లను స్వీకరిస్తున్నప్పటికీ యజమానులకు తెలియజేయకుండా మొదటి రోజు హాజరు కావడంలో విఫలమవుతున్నారు. 27 ఏళ్లలోపు ఉద్యోగుల్లో ధిక్కారణ ధోరణి పెరుగుతుందని నివేదిక తెలియజేసింది.నెలల తరబడి ఉద్యోగాల వేట, సుదీర్ఘమైన అప్లికేషన్లు, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు కావడం.. దీనికి సంబంధించి ఫ్రస్టేషన్స్ జెన్ జెడ్లో కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఇరవై సంవత్సరాల రాస్పిన్కు 32 లక్షల(సంవత్సరానికి) జాబ్ ఆఫర్ వచ్చినా ఆఫర్ను తిరస్కరించడం సోషల్మీడియాలో సెన్సేషన్గా మారింది. ‘ఈ జీతంతో నేను ఎలా బతకగలను? ఈ జీతంతో ఫుల్టైమ్ ఉద్యోగమా!’ అని ఆశ్చర్యపోతుంది ఆమె.ఇదీ చదవండి: ఐస్క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఈ ధిక్కారం ఒక తరం మార్పును నొక్కి చెబుతుంది. ఉద్యోగం లేదా జీవితం వారి అంచనాలకు అందని పరిస్థితి ఉన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించే ధోరణి పెరగుతుంది. నచ్చని, అంచనాలకు తగని విధంగా ఉద్యోగం ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండడానికే యువతలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. -
కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులు
భారతదేశంలో 82 శాతం మంది నిపుణులు 2025లో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారని లింక్డ్ఇన్(LinkedIn) ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించింది. ఉద్యోగం(new job) సంపాదించడం గతంలో కంటే ప్రస్తుతం మరింత సవాలుగా మారినట్లు తెలియజేసింది. గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నట్లు లింక్డ్ఇన్ తెలిపింది.లింక్డ్ఇన్ తెలిపిన వివరాల ప్రకారం..2024లో జాబ్ మార్కెట్ మందకొడిగా ఉంది. దాంతో ఉద్యోగం మారాలనుకున్న చాలా మంది తాము చేస్తున్న కంపెనీల్లోనే కొనసాగుతున్నారు.గతేడాది నుంచి కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నవారు, ఇప్పటికే ఉద్యోగం మారాలనుకుంటున్నవారు అధికమయ్యారు.2025లో 82 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంకఠినమైన జాబ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఉద్యోగార్థుల్లో కొలువు సంపాదిస్తామనే ఆశావాదం పెరుగుతోంది.58% మంది జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందని, 2025లో కొత్త అవకాశాలు వస్తాయని నమ్ముతున్నారు.గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నారు.ఉద్యోగులను అన్వేషించడంలో హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.అర్హత కలిగిన ప్రతిభావంతులను(professionals) కనుగొనడం మరింత సవాలుగా మారిందని 69% మంది తెలిపారు. దీంతో 2025లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. -
టీసీఎస్లో 40000 ఉద్యోగాలు!: వీరికే ఛాన్స్..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ తెలిపారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదు. వారికి తగిన విద్యార్హత కూడా ఉండాలని ఆయన వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు.ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుంది. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ అన్నారు.2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గితే.. కంపెనీ వృద్ధి తగ్గినట్లు కాదు. ఉద్యోగుల నియామక ప్రక్రియ అనేది వార్షిక ప్రణాళికలను అనుసరించి జరుగుతాయి. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ఉద్యోగుల భర్తీకి సంబంధించిన బ్యాలెన్స్ జరుగుతుంది. కాబట్టి 2025లో కంపెనీ వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని లక్కడ్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.➤E0 (ఎంట్రీ లెవెల్): లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్లు), వాటితో ముడిపడిన అప్లికేషన్లపై ప్రాథమిక అవగాహన ఉండే వారు ఈ విభాగంలోకి వస్తారు.➤E1: ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా, ఎల్ఎల్ఎమ్ ఏపీఐలతో పని చేయగల సామర్థ్యం ఉన్న వారు ఈ విభాగంలోకి వస్తారు.➤E2: TCS GenAI సాధనాలను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు ఈ విభాగంలో ఉంటారు.➤E3, దానికంటే పైన: ఏఐలో నైపుణ్యం, అవగాహన కలిగిన వారు, దాని అప్లికేషన్లలను అన్ని విభాగాల్లో ఉపయోగించేవారు ఈ విభాగంలోకి వస్తారు.టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది. -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
కొత్త ఏడాది కొత్త కొలువులు
ఉద్యోగం చేయాలని గట్టిగా అనుకున్నా... పని ఒత్తిడి వల్ల ఇల్లు దాటలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది మహిళలు. ఇలాంటి వారికి కొత్త సంవత్సరం(New Year)లో వర్క్–ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు(Work from Home) స్వాగతం పలుకుతున్నాయి. ఇంటి పని, ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఇల్లు దాటకుండానే చేసే ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. మచ్చుకు కొన్ని...వర్చువల్ అసిస్టెంట్విఏ (వర్చువల్ అసిస్టెంట్(Virtual Assistant) ఉద్యోగాలకు కొత్త సంవత్సరంలో మరిన్ని అవకాశాలు పెరగబోతున్నాయి.ఇ–మెయిల్స్, అపాయింట్మెంట్స్, బుకింగ్స్, ట్రావెల్ అండ్ పబ్లిక్ రిలేషన్ అకౌంట్లు...మొదలైన క్లరికల్, సెక్రటేరియల్ విధులను నిర్వహించే ఉద్యోగం వర్చువల్ అసిస్టెంట్. బాగా ఆర్గనైజ్డ్గా ఉండి వర్చువల్ పనులను సంబంధించి సులభంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం ఉన్న మహిళలకు ఈ ఉద్యోగం సరిౖయెనది.సోషల్ మీడియా మేనేజర్వివిధ వ్యాపారాలకు ఇప్పుడు సోషల్ మీడియా తప్పనిసరి అవసరం కావడంతో ‘సోషల్ మీడియా మేనేజర్’ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సంబంధించి పోస్ట్’ ప్లానింగ్ చేయడం, పోస్ట్కు సంబంధించిన కంటెంట్ జనరేట్ చేయడం, ఫాలోవర్స్తో ఎంగేజై ఉండడం... మొదలైనవి సోషల్ మీడియా మేనేజర్ పనులలో ఉన్నాయి. కొత్త ట్రెండ్స్ను ఫాలో అయ్యే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మహిళలు ఈ ఉద్యోగాన్ని సులభంగా చేయవచ్చు.ఆన్లైన్ ఈవెంట్ ప్లానర్వెబినార్స్, కాన్ఫరెన్స్లు, ఆన్లైన్ వర్కషాప్లు... మొదలైన ఆన్లైన్ ఈవెంట్స్ నిర్వహించే ఉద్యోగం ఆన్లైన్ ఈవెంట్ ప్లానర్. ఆర్గనైజేషనల్, కమ్యునికేషన్, క్రియేటివ్ స్కిల్స్కు సంబంధించిన ఉద్యోగం ఇది.ఈవెంట్స్ కో ఆర్డినేట్ చేయడం, వెండర్ అండ్ స్పీకర్ మేనేజ్మెంట్, టెక్నికల్ కోఆర్డినేషన్.. మొదలైనవి ఆన్లైన్ ఈవెంట్ ప్లానర్ బాధ్యతల్లో ఉంటాయి.ఆన్లైన్ ట్యుటోరింగ్కరోనా కాలంలో ఆన్లైన్ ట్యుటోరింగ్(Online Tutoring) అనేది ఉపాధి మార్గంగా బలపడింది. భాషా ప్రావీణ్యం నుంచి గణితం, సైన్స్లాంటి సబ్జెక్ట్లలో ప్రతిభ వరకు ఆన్లైన్ ట్యుటోరింగ్ మీకు ఉపయోగపడుతుంది. వేదాంతు, బైజు, ట్యుటోర్మీ... మొదలైన ఎన్నో ఆన్లైన్ ట్యుటోరింగ్ మోడల్స్ ఉన్నాయి. జాతీయంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఇంటి నుంచే ఉద్యోగం చేయవచ్చు.కస్టమర్ సపోర్ట్ రిప్రెజెంటివ్కస్టమర్ సర్వీస్ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఇంటినుంచి ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు ఈ ఉద్యోగాలు అనుకూలం. కస్టమర్ల సందేహాలకు ఫోన్, ఇ–మెయిల్, చాట్... మొదలైన వాటి ద్వారా సమాధానం ఇవ్వడంలాంటి పనులు ఉంటాయి. ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పే సామర్థ్యం మీలో ఉంటే ఈ ఉద్యోగం మీకోసమే. (చదవండి: పిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టండి ఇలా..!) -
భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొంతమందికి ఉపాధి లభిస్తుంటే, ఇంకొందరు తమ కొలువులు కోల్పోయేందుకు కారణం అవుతుంది. కృత్రిమ మేధ(AI) వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగ మార్కెట్(Job Market)పై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. గతంలో వివిధ రంగాల్లో భిన్న విభాగాల్లో పని చేసేందుకు మానవవనరుల అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. రానున్న పదేళ్లలో ఇప్పుడు చేస్తున్న చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా కింది విభాగాలకు ముప్పు వాటిల్లబోతున్నట్లు చెబుతున్నారు.క్యాషియర్లు: సెల్ఫ్ చెక్ అవుట్ కియోస్క్లు, ఆన్లైన్ షాపింగ్(Online Shopping) వల్ల క్యాషియర్ల అవసరం తగ్గిపోతోంది.ట్రావెల్ ఏజెంట్లు: ఎక్స్ పీడియా వంటి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్(YouTube), వెబ్ కంటెట్.. వంటి విభిన్న మార్గాలు ఉండడంతో ట్రావెల్ ఏజెంట్ల అవసరం తగ్గిపోతోంది.లైబ్రరీ క్లర్కులు: డిజిటల్ వనరులు, ఈ-బుక్స్(E-Books) అధికమవుతున్నాయి. దాంతో ఫిజికల్ లైబ్రరీ మేనేజ్మెంట్ అవసరం తక్కువగా ఉంది.పోస్టల్ సర్వీస్ వర్కర్స్: ఈ-మెయిల్, డిజిటల్ కమ్యూనికేషన్(Digital Communication) కారణంగా ఫిజికల్ మెయిల్ తగ్గడం పోస్టల్ వర్కర్ల అవసరాన్ని తగ్గిస్తోంది.డేటా ఎంట్రీ క్లర్క్లు: మాన్యువల్గా డేటా ఎంట్రీ చేసే క్లర్క్ల స్థానంలో ఏఐ, ఆటోమేషన్ డేటా ప్రాసెసింగ్ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో వీరి అవసరం ఉండకపోవచ్చు.ఫ్యాక్టరీ వర్కర్స్: తయారీ రంగంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్త మోడళ్లను రూపొందించడానికి వీలుగా రోబోటిక్స్ను వాడుతున్నారు. గతంలో ఈ పనంతా ఫిజికల్గా ఉద్యోగులు చేసేవారు.బ్యాంక్ టెల్లర్స్: గతంలో బ్యాంకింగ్ సమస్యలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే కాల్ సెంటర్కు కాల్ చేసిన కనుక్కునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బ్యాంకింగ్ సిస్టమ్లో వచ్చిన మార్పులు, చాట్బాట్లు, మొబైల్ యాప్స్ వల్ల సంప్రదాయ బ్యాంకు టెల్లర్ల అవసరం తగ్గిపోతోంది.ట్యాక్సీ డ్రైవర్లు: సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికే భారీగా తగ్గిపోయారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో.. వంటి రైడ్ హెయిలింగ్ సర్వీసులు ట్యాక్సీ(Taxi) సేవలను అందిస్తున్నాయి. దాంతో సంప్రదాయ డ్రైవర్లకు ఉపాధి కరవైంది.ఫాస్ట్ ఫుడ్ కుక్స్: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఆటోమేషన్ పెరుగుతోంది. మాన్యువల్గా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అవసరమైన పదార్థాలతో రుచికరంగా ఫాస్ట్ఫుడ్ తయారు చేసే సిస్టమ్ను అభివృద్ధి చేశారు.మెషిన్కు అలసట, సెలవులు ఉండవు!మానవుల కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో ఏఐ ఆధారిత రోబోట్స్, చాట్బాట్స్.. పనులను నిర్వహించగలవు. ఫిజికల్గా ఉద్యోగులు షిఫ్ట్ల వారీగా పని చేస్తుంటారు. మెషిన్కు అలాంటివి ఉండవు. ఉద్యోగులకు అలవెన్స్లు, జీతాలు, సెలవులు, వీక్ఆఫ్లు.. వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోబోట్స్కు అలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో ఉత్పాదకత పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇది డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కోతకు కారణమవుతుంది.అసలు ఏఐ వల్ల కొలువులే దొరకవా..?ఏఐ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో అడ్వాన్స్డ్ స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఒకవేళ చేస్తున్న ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురైతే తిరిగి అంతకంటే ఉన్నతమైన కొలువులు ఎలా సాధించవచ్చో దృష్టి కేంద్రీకరించి స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుఇప్పుడేం చేయాలి..కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా నిర్వహించడానికి శ్రామిక శక్తికి తగినంత శిక్షణ ఇవ్వకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కృత్రిమ మేధ ఆధారిత పాత్రలకు కార్మికులను సిద్ధం చేయడానికి శిక్షణ, అప్ స్కిల్ కార్యక్రమాల అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆర్థిక, ఆర్థికేతర మార్గాల ద్వారా ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు. -
వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్లో 4000 ఉద్యోగాలు..
న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సపోర్ట్, సర్వీసుల సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (Vertex Global Services) తాజాగా భారత్లో గణనీయంగా నియామకాలు (Jobs) చేపట్టనుంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే 3–5 ఏళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 4,000 మంది పైగా లాంగ్వేజ్ నిపుణులను నియమించుకోనున్నట్లు (recruit) సంస్థ వెల్లడించింది.చిన్న నగరాల్లో ఉద్యోగాల లభ్యతకు సంబంధించిన సవాళ్లను యువత అధిగమించడంలో తోడ్పాటు అందించే దిశగా రిక్రూట్మెంట్ తలపెట్టినట్లుగా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో గగన్ ఆరోరా తెలిపారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ తదితర అంతర్జాతీయ భాషలతో పాటు కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర ప్రాంతీయ భాషల్లోనూ సర్వీసులను అందిస్తున్నట్లు వివరించారు.వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ భారత్తో పాటు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, నైజీరియా, నేపాల్, ఫిలిప్పీన్స్, యూఏఈలలో కార్యకలాపాలను కలిగి ఉంది. బిజినెస్ వర్టికల్స్లో వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్, వెర్టెక్స్ నెక్స్ట్, ఐఎల్సీ సొల్యూషన్స్, వెర్టెక్స్ లెర్నింగ్, వెర్టెక్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. -
అసంఘటిత రంగంలో ఉపాధి వెల్లువ
న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలోని సంస్థల్లో (అన్ఇన్కార్పొరేటెడ్/వ్యక్తుల ఆధ్వర్యంలోని) ఉపాధి అవకాశాల పరంగా మెరుగైన పరిస్థితులున్నట్టు ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 2024 సెప్టెంబర్తో ముగిసిన ఏడాది కాలంలో 10 శాతం మేర ఉద్యోగాలు పెరగ్గా, సంస్థల సంఖ్య 12 శాతం వృద్ధితో 7.34 కోట్లకు చేరినట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు విభాగం (ఎంవోఎస్పీఐ) ప్రకటించింది. వ్యవసాయేతర అసంఘటిత రంగ సంస్థలపై ఈ సర్వే (ఏఎస్యూఎస్ఈ) జరిగింది.2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ కాలంలో ఈ సంస్థలకు సంబంధించి జోడించిన స్థూల అదనపు విలువ (జీవీఏ) 16.52 శాతంగా ఉన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. 2024 సెప్టెంబర్ నాటికి అసంఘటిత రంగంలో ఉద్యోగాల సంఖ్య 12.05 కోట్లకు చేరగా, 2023 సెప్టెంబర్ నాటికి 10.96 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఏడాది కాలంలో కోటికి పైగా ఉపాధి అవకాశాలు సమకూరినట్టు వెల్లడించింది.ఇతర సేవల విభాగంలో అత్యధికంగా 18 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా.. ఆ తర్వాత తయారీ విభాగంలో 10 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగింది. మహిళల ఆధ్వర్యంలోని సంస్థల సంఖ్య 22.9 శాతం నుంచి 26.2 శాతానికి పెరిగింది. వ్యాపార నిర్వహణలో మహిళల పాత్ర పెరగడాన్ని ఇది సూచిస్తోంది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 4,98,024 సంస్థల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వేతనాల్లోనూ వృద్ధి.. ఇంటర్నెట్ వినియోగిస్తున్న సంస్థలు 21.1 శాతం నుంచి 26.7 శాతానికి పెరిగాయి. డిజిటల్ టెక్నాలజీలవైపు సంస్థలు మళ్లుతుండడం దీని వెనుక నేపథ్యంగా ఉంది. 2023–24లో అసంఘటిత రంగంలో నియమితులైన ఉద్యోగికి వేతన చెల్లింపులు సగటున 13 శాతం పెరిగాయి. అత్యధికంగా తయారీ రంగంలో కార్మికుల వేతనాల్లో 16 శాతం వృద్ధి కనిపించింది. సగటు కార్మికుడి నుంచి జీవీఏ రూ.1,41,769 నుంచి రూ.1,49,742కు పెరిగింది. -
‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణ
‘గూగులీనెస్’ అనే పదాన్ని చాలా కాలంగా గూగుల్ ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు. మళ్లీ గూగుల్లో లేఆఫ్స్ ఉంటాయని ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ పదం మరోసారి వైరల్గా మారింది. ఉద్యోగులు గూగుల్ సంస్కృతి, విలువలకు సరిపోతారా లేదా అని తనిఖీ చేయడంలో ఈ పదం ఉపయోగపడుతుందని సంస్థలో ఉన్నతాధికారులు నమ్ముతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన కంపెనీ వైడ్ ఫోరమ్ సమావేశంలో ఈ పదానికి సంబంధించి మరింత స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆరు కీలక అంశాలపై గూగులీనెస్ ఆధారపడి ఉంటుందని చెప్పారు.మిషన్ ఫస్ట్: గూగుల్ మిషన్కు, ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ప్రాజెక్ట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఆయా ప్రాజెక్ట్ల్లో భారీ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. ఫ్యూచర్ విజన్ కోసం పని చేయాలి.అందరికీ ఉపయోగపడే వాటిపై దృష్టి: ప్రజల జీవితాలను నిజంగా మెరుగుపరిచే ఉత్పత్తులను సృష్టించాలి. అందరికీ ఉపయోగపడే వాటిపై ఉద్యోగులు దృష్టి సారించాలి.ధైర్యంగా, బాధ్యతాయుతంగా ఉండడం: ఏ పని చేస్తున్నప్పుడైనాసరే మీరు చేస్తున్నది బలంగా నమ్మి ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వచ్చే ఫలితాలకు సైతం బాధ్యత తీసుకునేటప్పుడు సాహసోపేతమైన ఆలోచనలను ప్రోత్సహించవచ్చు.వనరులను సద్వినియోగం చేసుకోవడం: మనం చేయాలనుకుంటున్న పనులకు అన్ని సందర్భాల్లోనూ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చాలా వనరులు అవసరం అవ్వొచ్చు. కానీ పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని మెరుగైనా ఫలితాలు రాబట్టేలా పని చేయాలి.వేగంగా.. సరదాగా..: చేసేపనిని నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలి. దాంతోపాటు భారంగా కాకుండా, సరదాగా పని చేయాలి.టీమ్ గూగుల్: టీమ్ వర్క్ చాలా ముఖ్యం. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..10 శాతం మందికి లేఆఫ్స్..కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది. గూగుల్ రానున్న రోజుల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. -
అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్లో జాబ్: జీతం తెలిస్తే..
జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల అవసరం. అప్పుడే సక్సెస్ సాధించవచ్చు. దీనికి బీహార్కు చెందిన 'పుష్పేంద్ర కుమార్' ప్రయాణమే నిదర్శనం. ఇంతకీ ఇతనెవరు? ఏం సాధించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బీహార్లోని జాముయి జిల్లా ఝఝా బ్లాక్లోని బుధిఖండ్ గ్రామానికి చెందిన హరిఓమ్ శరణ్ పెద్ద కుమారుడు పుష్పేంద్ర కుమార్.. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాడు.ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పుష్పేంద్ర.. గూగుల్ కంపెనీలో చేయాలని కల కన్నాడు. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్పూర్లో చదువుతున్న ఇతడు తన కోర్సు పూర్తి చేయడానికి ముందే గూగుల్లో డేటా సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. కొడుకు కల నెరవేరినందుకు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.స్నేహితుల స్ఫూర్తితో..పుష్పేంద్ర తన ప్రాథమిక విద్యను జార్ఖండ్లోని జసిదిహ్లో పూర్తి చేశాడు. 2018లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత స్నేహితుల ప్రేరణతోనే ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (IIT-JEE)కి హాజరయ్యాడు. మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా.. పట్టు వదలకుండా మళ్ళీ సన్నద్దమయ్యాడు. దీంతో రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.రూ.39 లక్షల ప్యాకేజీగూగుల్లో డేటా సైంటిస్ట్గా ఎంపికైన పుష్పేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉద్యోగానికి ఎంపికైన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. మొదట భారతదేశంలోని గూగుల్లో పని చేస్తానని, అక్కడ అతనికి రూ.39 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో కంపెనీ తనను విదేశాలకు పంపితే, తన ప్యాకేజీ భారత్లో పొందే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. -
ఐటీ ఫ్రెషర్లకు గుడ్న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకువారానికి ఐదు రోజులుకరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది. -
కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?
వచ్చే ఏడాదిలో నియామకాలు జోరుగా సాగనున్నాయి. 9 శాతం మేర నియామకాలు పెరగనున్నట్టు జాబ్ ప్లాట్ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ) వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ, రిటైల్, టెలికం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం మీద 10 శాతం మేర ఉపాధి అవకాశాల్లో వృద్ధి ఉంటుందని, రానున్న రోజుల్లో ఈ ధోరణి వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.కొత్త టెక్నాలజీలు, మారుతున్న వ్యాపార సంస్థల ప్రాధాన్యతలు 2025లో ఉద్యోగ మార్కెట్ తీరును నిర్ణయించనున్నట్టు ఫౌండిట్ పేర్కొంది. ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అప్లికేషన్స్, అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సిస్టమ్లు.. తయారీ, హెల్త్కేర్, ఐటీ రంగాల్లో మార్పును తీసుకురానున్నట్టు వివరించింది. 2023 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు ఫౌండిట్ ప్లాట్ఫామ్పై డేటా విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. రిటైల్ మీడియా నెట్వర్క్లు, ఏఐ ఆధారిత విశ్లేషణ టూల్స్తో ఈ–కామర్స్, హెచ్ఆర్, డిజిటల్ సేవల్లో నిపుణుల అవసరాల తీరును మారుతుందని పేర్కొంది. డిజిటల్ మార్కెటింగ్, యాడ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అనలైటిక్స్లో నిపుణులను సంస్థలు నియమించుకుంటాయని తెలిపింది. ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?ఈ ఏడాదీ నియామకాల్లో జోరు..2023తో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది అన్ని రంగాల్లో, అన్ని పట్టణాల్లో జాబ్ మార్కెట్ బలమైన వృద్ధిని చూసినట్టు ఫౌండిట్ తెలిపింది. తయారీలో 30 శాతం, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో 29 శాతం, రియల్ ఎస్టేట్లో 21 శాతం చొప్పున నియామకాలు పుంజుకున్నట్టు పేర్కొంది. అధికంగా కోయింబత్తూర్లో 27 శాతం, జైపూర్లోనూ 22 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు తెలిపింది. చురుకైన పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటలైజేషన్కు మళ్లడం, పట్టణీకర సానుకూలించినట్టు వివరించింది. -
2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీ
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పెంపుకు కావాల్సిన కీలక నిర్ణయాలు, ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధి కూడా తప్పనిసరి. కాబట్టి యువతకు ఉద్యోగాలు చాలా అవసరం. ఉద్యోగ కల్పనకు ఫుడ్ డెలివరీ సంస్థలు కీలకమని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' అన్నారు.జొమాటో నిర్వహించిన 'సస్టైనబిలిటీ అండ్ ఇన్క్లూజివిటీ - రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎకానమీ' సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో 77 లక్షల మంది డెలివరీ కార్మికులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.దేశంలో ఏకంగా 2.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం చాలా పెద్ద విషయమే. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోను.. మంత్రి అభినందించారు.ఉద్యోగాల కల్పినలో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్లు పరిమిత సమయంలో వస్తువులను డెలివరీ చేయవలసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక.. భారతదేశంలో గంటకు 45 ప్రమాదాలు, 20 మరణాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఇందులో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 80,000 కాగా.. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించినవారి సంఖ్య 55,000 కావడం గమనార్హం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల 10,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన శిక్షణ అందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని.. జొమాటో సుమారు 50వేలమంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నందుకు అభినందనలు తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే భర్త మోసాలు
రంపచోడవరం: అధికారం లేనప్పుడే ఉద్యోగాల పేరుతో గిరిజన యువతను మోసం చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త మఠం విజయ భాస్కర్ అధికారంలోకి వచ్చిన తరువాత మరింతగా రెచ్చిపోతున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రంపచోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే, రంపచోడవరం ఎమ్మెల్యే తీరుపై అంతకు పదిరెట్లు వ్యతిరేకత ఏజెన్సీ ప్రజల నుంచి వ్యక్తమవుతోందని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్పై ప్రసారం చేసిన కథనాన్ని ప్రదర్శించారు. బహుశా టీడీపీకి నష్టం జరుగుతుందనే ఇలా ప్రసారం చేసుంటారని ఆమె చెప్పారు. అధికారం లేనప్పుడే విజయభాస్కర్పై ఎనిమిది పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎన్నికల ముందు రాజవొమ్మంగికి చెందిన టీడీపీ నేతలు వీరి చేతిలో ఎలా మోసపోయారో బహిరంగంగానే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే భర్త ప్రవర్తనతో అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా 2023లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయభాస్కర్ డబ్బులు తీసుకున్న ఫోన్పే స్క్రీన్ షాట్లను మీడియాకు చూపించారు. బాధితులు మాట్లాడిన వాయిస్లను వినిపించారు. విజయభాస్కర్పై గుండాట, పేకాట కేసులు ఉన్నాయని తెలిపారు. 2022లో అనంతగిరిలో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తుండగా ఇద్దరు అమ్మాయిలను పట్టుకున్నారని, ఆ కేసులో భాస్కర్ ఏ–1 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళకు చెందిన సొమ్ము నేరుగా అతని అకౌంట్కు పంపించుకోవడం విజయభాస్కర్ అక్రమాలకు పరాకాష్ట అన్నారు. తిమ్మాపురంలో ఇసుక తవ్వుకునేందుకు కాలువకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఎమ్మెల్యే, ఆమె భర్తకు సంబంధం లేదా? అని ప్రశ్నించారు. రంగురాళ్ల క్వారీలను తిరిగి తవ్వేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్శాఖలో బదిలీల కోసం రేట్లు ఫిక్స్ చేశారనే ఆరోపణలూ ఉన్నాయన్నారు. విజయభాస్కర్ మాట వినని అధికారులను గంజాయి కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
జీవన గమనం.. పట్నం పయనం!
పల్లెలు మెల్లిమెల్లిగా ఖాళీ అవుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలే గ్రామాలు వదిలి వెళ్తుండటంతో జనం లేక కళతప్పుతున్నాయి. మారిన జీవన గమనంలో వివిధ అవసరాల నిమిత్తం పల్లెజనం పట్నం బాట పడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నదాంట్లోనే సర్దుకుపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల మొగ్గు పట్టణాల వైపే కనిపిస్తోంది. పట్టణాల్లో స్థిరపడేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే జిల్లాలోని పట్టణాల్లో జన సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పల్లెల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. రూ.15 వేలు అంతకంటే తక్కువ వేతనం ఉన్న ప్రైవేటు ఉద్యోగులు సైతం పట్టణాల్లో స్థిరపడుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే తమ పిల్లలను పట్టణాల్లో చదివించేందుకు ఎక్కువమంది తల్లిదండ్రులు వస్తున్నట్లు తేలింది. పదేళ్లలోనే లక్షన్నర మంది.. అనంతపురం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి పరిధిలో 6.27 లక్షల మంది మాత్రమే నివసించేవారు. తాజా అంచనాల ప్రకారం ఈ సంఖ్య సుమారు 7.72 లక్షలకు చేరింది. ఒక్క అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 80 వేలకు పైగా జనాభా పెరిగినట్టు తేలింది. తాడిపత్రి, గుంతకల్లు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెల్లో ఉపాధి కరువై.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది పట్టణాలకు వలస వస్తున్నట్టు తేలింది. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కూలి పనులకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. మరికొంతమంది పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూనే పిల్లల చదువుల కోసం పట్టణాలకు వస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి లాంటి పట్టణాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. ప్రభుత్వాలు జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించలేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. సమస్యలెన్నో.. మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుకూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువై అనర్థాలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న మున్సిపాలిటీల్లో నిధులు సమకూరకపోవడంతో వ్యర్థాల నిర్వహణ చాలా అధ్వానంగా తయారైంది. ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ఇవ్వడం సాధ్యపడటం లేదు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1.88 లక్షల గృహాలుండగా ఇంకా 80 వేల గృహాలకు నీటి కొళాయి కనెక్షన్ అందించాల్సి ఉంది. రోడ్లు, నీటి కొళాయిలు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేక పట్టణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనరులు చాలడం లేదు ప్రజలు పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు రావడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు, పిల్లల చదువులే. దీంతో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టు మున్సిపాలిటీల్లో వసతులు సమకూర్చాలంటే ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులు సరిపోవడం లేదు. మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. –నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అనంతపురంజీవనం కష్టంగా మారిందినా భార్యతో కలిసి రెండున్నరేళ్ల క్రితం కళ్యాణదుర్గం వచ్చా. ప్రస్తుతం పట్టణంలోని శంకరప్ప తోట కాలనీలో నివాసముంటున్నాం. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పట్టణంలో ఇంటి బాడుగలు అధికమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం కరెంటు చార్జీలను సైతం పెంచేసింది. మా లాంటి వారు జీవించాలంటే కష్టంగా ఉంది. – మోహన్, శెట్టూరు పల్లెల్లో పనులు లేవు..మా స్వగ్రామం గుమ్మఘట్ట మండలం కలుగోడు. మొదట్లో గ్రామంలోనే ఉండేవాళ్లం. అక్కడ పనులేవీ దొరక్క పదేళ్ల కిత్రం రాయదుర్గం పట్టణానికి వలస వచ్చాం. నా భార్య టైలరింగ్ పనులు చేస్తుంది. నేను హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. నాలాగే చాలామంది పల్లెలు వదిలి పట్టణాల్లో జీవనం సాగిస్తున్నారు. – షమీవుల్లా, రాయదుర్గంటీ కొట్టుతో జీవనం మాది కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామం. నా చిన్నప్పుడే ఊరు వదిలి బళ్లారిలోని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరా. ఆదాయం సరిపోక రాయదుర్గం వచ్చి టీ కొట్టు ప్రారంభించా. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటున్నారు. పల్లెల నుంచి పట్నం చేరే వారి సంఖ్య క్రమంగా ఎక్కువైంది. అనేక కారణాలతో ప్రజలు గ్రామాలను వీడుతున్నారు. – రంగప్ప, రాయదుర్గం -
మోదీకిదే నా సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని.. దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని... ఢిల్లీ నడిబజార్లో క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా, కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ’’కేసీఆర్, బీఆర్ఎస్ వారు మాట్లాడిన ప్రెస్మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈటల రాజేందర్, కిషన్రెడ్డి అవే నకలు కొడుతున్నారు. కిషన్రెడ్డి, ఈటల మారాలి. ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు. అటే పోతారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఏది పడితే, ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. మీరు కేసీఆర్లా తయారుకాకండి. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపండి. మోదీకి సవాల్ చేస్తున్నా.. ఢిల్లీ నడిబజార్లో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. లేకపోతే నా లెక్క అప్పజెబుతా. మీ నాయకులు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించండి. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మేం తొలి ఏడాదే 25.50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్లు వారి ఖాతాల్లో వేశాం. మోదీ, కేసీఆర్ మీరు ఎప్పుడైనా చేశారా? సవాల్ విసురుతున్నా. మోదీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా ఒక్క ఏడాదిలోనే ఇలా రుణమాఫీ చేస్తే.. నేను మా మంత్రులతో సహా వచ్చి క్షమాపణ చెబుతాం. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోండి.. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉంటే చలాయిస్తాం, ఓడిపోతే ఫామ్హౌస్లో పడుకుంటామంటే ఎలా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? మేం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా? రెండుసార్లు మీరు గెలిచారు. మేం ఓడిపోయాం.. అయినా జానారెడ్డిలాంటి పెద్దలు ప్రజల్లో ఉండి, అసెంబ్లీలో పాలకపక్షానికి సూచనలు, సలహాలు ఇస్తూ, తప్పిదాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదాను తొలగించినా మొక్కవోని ధైర్యంలో భట్టి విక్రమార్క కొట్లాడారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించారా? అసెంబ్లీకి వచ్చారా? ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పదేళ్లు సీఎంగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించారా? ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంచడం పట్ల తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? గాలి బ్యాచ్ని ఊరి మీదకు వదిలారు.. ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజలపక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్ను తయారు చేసి ఊరి మీదికి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా విన్నారా? ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్–4, గ్రూప్–1 పరీక్షలు పెట్టవద్దన్నప్పుడు, డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది? కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే.. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుతో మాకు అప్పగించారు. అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.65 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోంది. నాడు ‘ఔటర్’ రోడ్డు.. ఇప్పుడు ‘రీజనల్’ రోడ్డు నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రీజనల్ రింగు రోడ్డు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. 50వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా కొత్త నగరాన్ని నిర్మించుకుని, పెట్టుబడులు తెచ్చి.. నిరుద్యోగులకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. మూసీ కాలుష్యంతో మనుషులు జీవించలేని పరిస్థితి నల్లగొండ ప్రాంతానికి రాబోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అందుకే మూసీలో గోదావరి జలాలను పారించేందుకు, పారిశ్రామిక కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రక్షాళన చేపట్టాం. అడ్డం వచ్చే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్సార్ కాదా? ‘‘వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖర్రెడ్డి చెప్పినప్పుడు.. కొందరు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్నారు.ఆ మాటలు తప్పు అని నిరూపించి రైతులకు ఉచిత కరెంటును ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ, వారి రూ.1,200 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తూ, వేల మంది రైతులపై విద్యుత్ చౌర్యం కేసులను ఎత్తివేస్తూ.. ఒక్క సంతకంతో హామీలు అమలు చేశారు. మేం ఆయనను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీని అమల్లోకి తెస్తే... కేసీఆర్ వచ్చి నిరీ్వర్యం చేశారు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. మేం వరి సాగు చేయాలని చెప్పడమేకాదు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.’’ తెలంగాణను దేశానికే రోల్మోడల్గా చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్లగొండ: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్గా నిలబెడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుసాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పెట్టిందే తప్ప నిర్వహణను పట్టించుకోలేదని.. తాము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. గత సర్కారు యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టిందే తప్ప పర్యావరణ అనుమతులు తీసుకోలేకపోయిందని.. తాము అనుమతులు తెప్పించి, నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని తెలిపారు. నల్లగొండ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం: ఉత్తమ్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే బీఆర్ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని.. వారికి ఏ కష్టం వచి్చనా అండగా ఉంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ.. ఇక ఆర్ఆర్ ప్రాజెక్టు: కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఇక నుంచి ఆర్ఆర్ (రాజశేఖర్రెడ్డి, రేవంత్రెడ్డి) ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. నాడు వైఎస్సార్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్ ఆ ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేర కూలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. -
ఉద్యోగమని నమ్మించి చేపలు పట్టిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి యువకుల్ని తీసుకువెళ్లి.. వారితో కృష్ణా నదిలో చేపలు పట్టిస్తూ బందీలుగా మార్చుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకుని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ఆరిఫ్ అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఆరిఫ్కు గుంటూరు నాజ్ సెంటర్కు చెందిన మొహిద్దీన్ పరిచయమయ్యాడు. వినుకొండలో చేపల అక్వేరియంలో ఉద్యోగం ఉందని.. వారానికి రూ.15 వేలు ఇస్తారని ఆరిఫ్ను మొహిద్దీన్ నమ్మించాడు. ఆ ఉద్యోగం కావాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. దీంతో ఆరిఫ్ తన బైక్ తాకట్టు పెట్టి రూ.10 వేలు ఇచ్చాడు. గత నెల 23న మొహిద్దీన్ కలిసి వ్యాన్లో బయలుదేరగా, గుంటూరులో మరో ఇద్దరిని, నరసరావుపేటలో మరో ముగ్గురిని ఎక్కించిన తర్వాత వ్యాన్లో ఖాళీలేదని, తాను వెనుక వస్తానని మొహిద్దీన్ మధ్యలో దిగిపోయాడు. రాత్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ కృష్ణా నదిలో పడవ ఎక్కించి సంగమేశ్వర వద్ద దింపారు. ఇక్కడకెందుకు తీసుకొచ్చారని అడగ్గా.. ఇక్కడ చేపలు పట్టాలని చెప్పి ఆరిఫ్ వద్ద ముఠా సభ్యులు ఫోన్ లాగేసుకున్నారు. ఎవరైనా వెళ్లిపోవడానికి ప్రయ త్నిస్తే ముఠా సభ్యులు చితకబాదుతుండటంతో ఆరిఫ్ బిక్కుబిక్కుమంటూ గడిపాడు. తన సెల్ఫోన్ను ఎలాగో దక్కించుకున్న ఆరిఫ్ ఇంకో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రోజంతా కొండల్లో నుంచి నడిచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ కట్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై నల్లపాడు పోలీసుల సహాయంతో లొకేషన్ కనుక్కుని అక్కడికి వెళ్లారు. స్థానికులను విచారించగా.. ఇక్కడకు పనుల కోసం వచ్చిన వారిలో చాలామంది గల్లంతయ్యారని చెప్పడంతో ఆందోళన చెందారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే గుంటూరులో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలన్నారు. దీంతో ఆరిఫ్ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో మార్కాపురం రాగా.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరిఫ్ ఇంటికి ఫోన్ చేసి కర్నూలు బస్టాండ్లో ఉన్నానని చెప్పడంతో వారు మార్కాపురం బస్ ఎక్కి రావాలని సూచించారు. అతను వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మంగళవారం గుంటూరు చేరుకున్నారు. ముఠా వలలో చిక్కి పదుల సంఖ్యలో యువకులు అక్కడ ఉన్నారని, పోలీసులు వారిని కాపాడాలని ఆరిఫ్ ‘సాక్షి’కి తెలిపాడు. -
టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నిక ల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఉద్యోగాల కు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జా బితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఎలక్ట్రికల్ కే టగిరీలో 50 పోస్టులు, మెకానికల్ కేటగిరీలో 97 పోస్టులకు టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపి క చేసింది. ఈ జాబితాలు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్నికో లస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రతి ఏటా ధనవంతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలోని కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సాంఘ్వీ, కుమార మంగళం బిర్లా మొదలైనవారు ఉన్నాయి. వీరిలో కొందరు వారసత్వంగా ధనవంతులైనప్పటికీ.. కొందరు మాత్రం కష్టపడి చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎదిగారు. ఈ కథనంలో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం.ధీరూబాయ్ అంబానీ (Dhirubhai Ambani)రిలయన్స్ సంస్థ ఏర్పడటానికి కారణమైన ధీరూబాయ్ అంబానీ.. తన తొలినాళ్లలో కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన సంపాదన రూ. 300 మాత్రమే. కొంతకాలం పెట్రోల్ బంకులో పనిచేసి.. స్వదేశానికి వచ్చి చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే ఇప్పుడు ఇంతపెద్ద రియలన్స్ ఇండస్ట్రీస్గా మారింది.సుధామూర్తి (Sudha Murthy)ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి చదువు పూర్తయిన తరువాత.. టాటా మోటార్స్ (TELCO)లో ఉద్యోగం చేశారు. ఆ కంపెనీ మొదటి మహిళా ఇంజినీర్ సుధామూర్తి కావడం గమనార్హం. ఈ రోజు ఇంజినీరింగ్ రంగంలో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారంటే.. అది సుధామూర్తి కారణంగానే.రతన్ టాటా (Ratan Tata)దివంగత రతన్ టాటా.. ప్రారంభంలో టాటా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ 'ఐబీఎమ్' నుంచి మంచి శాలరీ ప్యాకేజీతో వచ్చిన జాబ్ వదులుకున్నారు. టాటా స్టీల్ కంపెనీలోనే పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సంస్థా చైర్మన్ స్థాయికి ఎదిగారు.కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar Shaw)బయోకాన్ వ్యవస్థాపకురాలైన.. కిరణ్ మజుందార్-షా ప్రారంభంలో ఆస్ట్రేలియాలో బ్రూవర్గా తన వృత్తిని ప్రారంభించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె బ్రూయింగ్ పరిశ్రమలో లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆ తరువాత క్రమంగా వ్యాపార సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగారు.ఇంద్రా నూయి (Indra Nooyi)పెప్సికో మాజీ సీఈఓ అయిన.. ఇంద్రా నూయి 18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ టెక్స్టైల్ సంస్థలో వ్యాపార సలహాదారుగా తన వృత్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఈమె వేలకోట్ల సామ్రాజ్యానికి అథినేత్రిగా నిలిచారు.గౌతమ్ అదానీ (Gautam Adani)ఈ రోజు భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా ఉన్న గౌతమ్ అదానీ.. డైమండ్ సార్టర్గా తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఈ రంగంలో కొంత అనుభవం తెచ్చుకున్న తరువాత ముంబైలోని జవేరీ బజార్లోనే సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. నేడు వివిధ రంగాల్లో ఎదుగుతూ.. కుబేరుడిగా నిలిచారు. -
ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో (2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు) ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఈ కాలంలో సిబ్బందిని పెంచుకోనున్నట్టు 59 శాతం సంస్థలు తెలిపాయి. దీంతో ద్వితీయ ఆరు నెలల్లో 7.1 శాతం మేర సిబ్బంది పెరగనున్నట్టు టీమ్లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ రిపోర్ట్’ వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలోనే సిబ్బంది సంఖ్యను కొనసాగించనున్నట్టు టీమ్లీజ్ సర్వేలో 22 శాతం కంపెనీలు తెలిపాయి. 23 రంగాల్లోని 1,307 కంపెనీల అభిప్రాయాలను టీమ్లీజ్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. లాజిస్టిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), ఈవీ సదుపాయాలు, వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్, ఈ–కామర్స్ రంగాల నుంచే ప్రధానంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు రానున్నాయని, ఇవి మౌలిక వసతులు, ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా వ్యయం చేస్తున్నట్టు టీమ్లీజ్ నివేదిక తెలిపింది. రంగాల వారీగా..లాజిస్టిక్స్ రంగంలో 14 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఉద్యోగులను పెంచుకోనున్నట్టు 69 శాతం లాజిస్టిక్స్ కంపెనీలు వెల్లడించాయి. ఆ తర్వాత అధికంగా ఈవీ, ఈవీ ఇన్ఫ్రా కంపెనీలు 12 శాతం మేర సిబ్బందిని పెంచుకోనున్నాయి. వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ కంపెనీల్లో 10.5 శాతం మేర, ఈ–కామర్స్ రంగంలో 9 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఆటోమోటివ్ రంగంలో 8.5 శాతం, రిటైల్ రంగంలో 8.2 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా ఏర్పడనున్నాయి.ఇదీ చదవండి: 30 లక్షల యూనిట్లు ఎగుమతి!ప్రాంతాల వారీగా..కోయింబత్తూర్, గురుగ్రామ్ ఉపాధి కల్పన కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్లీజ్ నివేదిక తెలిపింది. అత్యధికంగా బెంగళూరు 53.1 శాతం, ముంబై 50.2 శాతం, హైదరాబాద్ 48.2 శాతంతో ఉపాధి కల్పన పరంగా ముందున్నాయి. ఉపాధి కోరుకుంటున్న వారికి చిన్న పట్టణాలు ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్లీజ్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్నాలజీ, ఆర్అండ్డీలో అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు తెలిపింది. జాతీయ పారిశ్రామిక నడవాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి కల్పించనుండడం, సెమీకండక్టర్ పాలసీ ద్వారా 2025 నాటికి 80,000 ఉద్యోగాల కల్పన తదితర కీలక విధానాలను ప్రస్తావించింది. -
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.భారతీయ విఫణిలో.. ప్రారంభం నుంచి అనేక విమర్శలకు గురవుతూ వస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటికి కూడా విక్రయానంత సేవలు అందించడంలో అంతంత మాత్రంగానే ఉందని.. చాలామంది కస్టమర్లు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ తీసుకున్న కఠినమైన నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఓలా ఎలక్ట్రిక్ లేఆఫ్స్ ప్రక్రియ జులై నుంచి కొనసాగుతున్నట్లు, ఇందులో భాగంగానే దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగులతో కంపెనీ లాభాలను గడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
రఘువంశీ ఏరోస్పేస్ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు.రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని ఆయన తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు. డిఆర్ డిఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని ఆయన వివరించారు.ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్ ఇ జెడ్ లో టాటా, భారత్ ఫోర్జ్, ఆదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడీ వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డిఆర్ డిఓ క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సిఐఐ ఛైర్మన్ డా.సాయి ప్రసాద్, టిజిఐఐసి ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పిఏ ప్రవీణ్, టిజిఐఐసి సిఒఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!
దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.84.38 లక్షల కోట్లు)కు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది. భారత్లో జీసీసీలపై రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా, 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.‘భారతీయ జీసీసీలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీసీసీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుంది’ అని పేర్కొంది. ఇదీ చదవండి: మీటింగ్కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓనివేదిక ప్రకారం.. 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్అండ్డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి. తూర్పు యూరప్తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జీసీసీ దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. -
ఈ పాటికి సీఎంగా వైఎస్ జగన్ ఉండి ఉంటే..
సాక్షి,అమరావతి: చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘సూపర్సిక్స్ ఒక మోసం. సూపర్ సెవెన్ ఒక మోసం. నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం. రోజూ డైవర్షన్ టాపిక్స్. వీటన్నింటినీ ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టారు. 49 మందిని అరెస్టు చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటికి సీఎంగా తాను ఉండి ఉంటే.. ప్రజలకు పథకాలన్నీ వచ్చి ఉండేవని వివరించారు.ఏప్రిల్లో వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు.మే లో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, మత్స్యకారులకు డీజిల్పై సబ్సిడీ.జూన్లో బడులు తెరవగానే జగనన్న అమ్మ ఒడి.జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపునేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపు.ఆగస్టులో విద్యాదీవెనలో మరో త్రైమాసిక చెల్లింపు. వాహనమిత్ర.సెప్టెంబరులో వైఎస్సార్ చేయూత.అక్టోబరులో వైయస్సార్ రైతు భరోసా రెండో విడత.నవంబరులో జగనన్న విద్యాదీవెన. రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు.. బాబు రాకతో అవన్నీ క్లోజ్.డిసెంబరులో చూస్తే.. ఈబీసీ నేస్తం. లా నేస్తం. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపులు.జనవరిలో వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు, వైయస్సార్ పెన్షన్ కానుక.ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు.మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు.పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి, అన్నీ పక్కాగా అమలు చేశాంవివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్ల నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇచ్చాం.మరి చంద్రబాబు ఈ బడ్జెట్లో చూపారా?ఇదే చంద్రబాబు సూపర్సిక్స్లో ఏమన్నాడు? యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. అంటే రూ.7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా?వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు:👉అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2 గాంధీ జయంతికి ముందే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం.👉2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించి, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేశాం. అదే కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీస్లో అక్షరాలా 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.👉లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్షా 2 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపుగా 80,400 కోట్ల ఇన్వెస్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఎంఎస్ఎంఈలు 2019–24 మధ్య గ్రౌండ్ అయినవి 3.94 లక్షలు అయ్యాయి. ఒట్టి ఎంఎస్ఎంఈల ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.👉గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6.31 లక్షల ఉద్యోగాలకు తోడు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో ఇచ్చిన 1.02 లక్షల ఉద్యోగాలకు తోడు ఎంఎస్ఎంఈలలో ఇచ్చి 23 లక్షల ఉద్యోగాలు.. ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వగలిగాం.బాబు వచ్చే.. జాబు పోయేమరి చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుపై పడేశారు. ఉద్యోగాలు కట్. 15 వేల మంది ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేశారు104, 108 ఎంప్లాయీస్కు 2 నెలల జీతం రాకపోతే గొడవ చేస్తే మొన్న ఇచ్చారు. ఆపరేటర్కు అయితే అది కూడా ఇవ్వలేదు. ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్లు ఫిర్యాదులు. టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని కంప్లయింట్స్. ఇవన్నీ ఆరు నెలల చంద్రబాబు పాలనలో చూస్తున్న విచిత్రాలు’ అని చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. -
నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరుల అవసరాలు పెరుగుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని కొన్ని సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2028 నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 45.7 కోట్లకు చేరుతుందని సర్వీస్నౌ పరిశోధన సంస్థ అంచనా వేసింది. అందులో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈమేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని అంశాలు పంచుకుంది.దేశంలో 2023 నాటికి మొత్తం శ్రామికశక్తి 42.3 కోట్లుగా ఉంది.2028 నాటికి అది 45.7కోట్లుకు చేరుతుంది.వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు సృష్టించబడుతాయి.ఉపాధి వృద్ధికి చాలామంది రిటైల్ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.వివిధ విభాగాల్లో సుమారు 69.6 లక్షల మంది సిబ్బంది రిటైల్ రంగంలో పనిచేసేందుకు అవసరం అవుతారు.తయారీ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు, విద్యా రంగంలో 8.4 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణలో 8 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత కొలువులకు ఆదరణ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో 1,09,700 మంది సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్లు కావాల్సి ఉంది.48,800 మంది సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజినీర్లు 48,500 మంది అవసరం.వెబ్ డెవలపర్లు, డేటా అనలిస్ట్లు, సాఫ్ట్వేర్ టెస్టర్లకు గిరాకీ ఉంది. ఈ విభాగంలో వరుసగా 48,500, 47,800, 45,300 మందికి కొలువులు లభించనున్నాయి.అదనంగా డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్లు వంటి హోదాల్లో 42,700 నుంచి 43,300 మందికి అవకాశాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. వచ్చే నెలలోనే పట్టాలపైకి..అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉపాధికి కొదువలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీలకు అవసరమయ్యే సరైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్లో చేరిన సమయం నుంచే పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుని ఆ దిశగా స్కిల్స్ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు. -
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
భారత్లో ఎస్ఏపీ అపార పెట్టుబడులు
న్యూఢిల్లీ: జర్మనీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఎస్ఏపీ భారత్లో అపారమైన పెట్టుబడులతో పాటు భారీగా ఉద్యోగాలను కలి్పంచే ప్రణాళికల్లో ఉందని కంపెనీ సీఈఓ క్రిస్టియన్ క్లీన్ చెప్పారు. తమకు అత్యంత వేగవంతమైన వృద్ధిని అందించడంతో పాటు భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా కూడా భారత్ నిలుస్తుందన్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు బెంగళూరు పర్యటనలో భాగంగా ఆయన విషయాలను వెల్లడించారు. ‘భారత్ టాప్–10 మార్కెట్లలో ఒకటి. ఈ ర్యాంక్ అంతకంతకూ ఎగబాకుతోంది. ఈ నేపథ్యంలో ఆర్అండ్డీ కార్యకలాపాలపై భారీగా వెచ్చించనున్నాం. జర్మనీ తర్వాత ఇక్కడే కంపెనీకి అత్యధిక సిబ్బంది ఉన్నారు. ఇతర ఎస్ఏపీ ల్యాబ్లతో పోలిస్తే అసాధారణ రీతిలో నియమాకాలను చేపట్టనున్నాం. అతి త్వరలోనే అతిపెద్ద హబ్గా భారత్ ఆవిర్భవిస్తుంది. ఏఐ భారీ అవకాశాలను అందించనుంది. భారత్లోని ఏఐ నిపుణుల పనితీరు అద్భుతం’ అని క్లీన్ చెప్పారు. కాగా, భారత్లోని ఎస్ఏపీ ఆర్అండ్డీ సెంటర్లలో 15,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో 15,000 కొలువులు కల్పించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
బెంగళూరులో మరో ఆఫీస్: 300 మంది ఉద్యోగులకు అవకాశం
కరోనా సమయంలో భారీ నష్టాలను చవి చూసిన దిగ్గజ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఐటీ కంపెనీ 'యూఎస్టీ' తన కార్యకలాపాలను విస్తరించడంతో భాగంగా.. బెంగళూరులో రెండవ ఆఫీస్ ప్రారంభించింది. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న యూఎస్టీ కొత్త కార్యలయం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంది.కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగానే.. ఈ కొత్త ఆఫీస్ ప్రారంభించినట్లు సమాచారం. యూఎస్టీ తన కొచ్చి ప్రధాన కేంద్రంలో వచ్చే ఐదేళ్ల నాటికి సుమారు 6,000 మందికి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా కేరళలోని తిరువనంతపురం కేంద్రంలో సుమారు 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2012లో తన కార్యకలాపాలను ప్రారంభించిన యూఎస్టీ.. బెంగళూరులో ప్రస్తుతం 6000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ సెమీకండక్టర్, హెల్త్కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, హైటెక్, రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశం అంతటా 20000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 30000 కంటే ఎక్కువ ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. -
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
20 ఏళ్ల యువతకు ఏఐ గాడ్ఫాదర్ సలహా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్ఫాదర్’గా పరిగణించబడే ఫ్రెంచ్-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్ యాప్ డెవలప్మెంట్ వైపు తమ కెరియర్ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్లైఫ్’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్ ఏఐ సైంటిస్ట్గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) ల్యాబ్ను ఏర్పాటు చేసిందని లెకున్ గుర్తు చేశారు. ఇది లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల(ఎల్ఎల్ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్డేట్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్ఏఐ చాట్జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి. -
ఆఫీస్లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?
‘‘అది నా పని కాదు’’.. అనే మాటను ఆఫీసులలో తరచు వింటుంటాం. తప్పేం లేదు. ఏ పని చేయటానికైతే ఉద్యోగంలో చేరామో ఆ పనే కదా చేయాలి! అయితే కొన్నిసార్లు మనకు మించిన పనినో, మనం చేస్తున్న పని కన్నా తక్కువ స్థాయి పనినో అత్యవసరంగా చేయవలసి వస్తుంది. అంటే.. పనే మనల్ని వెతుక్కుంటూ రావటం అన్నమాట. (మొదట్లో పని కోసం మనం వెతుక్కుంటూ వచ్చినట్లుగా). అప్పుడేం చేయాలి? ఏదైనా చెయ్యొచ్చు. మించిన పనైతే ‘‘బాబోయ్.. నా వల్ల అవుతుందా!’’ అని తప్పించుకోవచ్చు. తక్కువస్థాయి పనైతే ‘‘అది నా పని కాదు’’ అని ముఖం తిప్పేసుకోనూ వచ్చు. ఈ రెండూ కాకుండా... ‘‘ఎస్, ఐ కెన్’ అని ఏ పనికైనా ఉత్సాహంగా చేయందించవచ్చు. సినిమాల్లోకి రాకముందు పరిణీతి చోప్రా కూడా ఒక సాధారణ ఉద్యోగే. రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, రాణి ముఖర్జీ వంటి సినీ సెలబ్రిటీలకు పీఆర్గా పని చేశారు. వారి షెడ్యూళ్లు చూసుకోవటం, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయటం ఆమె పని. అయితే ఆ పనులు మాత్రమే చూసుకోలేదు పరిణీతి. అవసరం అయినప్పుడు, బాయ్స్ అందుబాటులో లేనప్పుడు అనుష్క శర్మ, రాణి ముఖర్జీ, దీపికా పడుకోన్, నీల్ నితిన్ ముఖేశ్లకు కాఫీలు కూడా అందించారట! ‘‘తప్పేముంది? మనం చేయగలిగిన పనే కదా!’’ అంటారు పరిణీతి.అక్టోబర్ 22 పరిణీతి పుట్టిన రోజు. ఆ సందర్భంగా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో.. తన తొలినాళ్ల ఉద్యోగ బాధ్యతల్ని, అదనంగా వచ్చి పడిన పనులను తనెంత ఇష్టంగా నిర్వహించిందీ గుర్తు చేసుకున్నారు పరిణీతి. ‘‘అవసరమైనప్పుడు పనిలో స్థాయీ భేదాలు చూసుకోనక్కర్లేదని నా ఉద్దేశం..’’ అంటారు ప్రస్తుతం స్టార్ నటిగా వెలిగిపోతున్న పరిణీతి. -
ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
కొత్త ఎక్స్ప్రెస్వేలు, పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు పెంచితే.. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. తద్వారా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) పేర్కొన్నారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) నిర్వహించిన సదస్సులో గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు.ఆర్థికాభివృద్ధికి ఆతిథ్య రంగం ఎంతో కీలకమని నితిన్ గడ్కరీ సూచించారు. వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని మంత్రి హాస్పిటాలిటీ రంగానికి తమ బలమైన మద్దతును వ్యక్తం ప్రకటించారు. ఇది విస్తారమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నవాటితో పాటు మరో 18 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయి. ఇది పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ప్రజలు పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాత్రమే.. ఆధునిక నగరాలు, ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి సుముఖత చూపిస్తున్నారని ఆయన అన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ
బంజారాహిల్స్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.26 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరి స్రవంతినగర్లో నివసించే ఆరెవరపు వాసు టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో అక్కడే పనిచేస్తున్న చల్లా శ్రీరామ్ కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసుకు పరిచయం అయ్యాడు. తనకు పెద్ద పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎం కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2– 2.5 లక్షల వరకు 17 మంది దగ్గర రూ.26 లక్షలు వసూలు చేసి చల్లా శ్రీరామ్కిరణ్కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా వీరంతా ఆయా కంపెనీల్లో జాయిన్ కావడానికి వెళ్లినప్పుడు అవి బోగస్ ఆఫర్ లెటర్లు అని తేలింది. లబోదిబోమంటూ బాధితులు చల్లా శ్రీరామ్కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిని సంప్రదించారు. అయితే మరో కంపెనీలో జాబ్లు ఇప్పిస్తానని, తనను నమ్మాలని చెప్పాడు. నెలలు గడుస్తున్నా వీరికి జాబ్లు ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశాడని బాధితుడు వాసు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాక్డోర్ జాబ్స్ పేరుతో ఉద్దేశపూర్వకంగా తమ వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన శ్రీరామ్కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరి పైనా ఐపీసీ సెక్షన్ 406, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్&టీ టెక్నాలజీలో 2000 ఫ్రెషర్ జాబ్స్
ముంబై: ఇంజనీరింగ్ సర్వీసుల ఐటీ కంపెనీ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలె–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 320 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్లు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 8 శాతం ఎగసి రూ. 2,573 కోట్లను తాకింది.యూరోపియన్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్, సస్టెయినబిలిటీ సొల్యూషన్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు తోడ్పాటునిచ్చింది. వాటాదారులకు షేరుకి రూ. 17 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్కాగా.. ఈ ఏడాది 2,000 మంది ఫ్రెషర్స్కు ఉద్యోగాలు ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ చద్దా పేర్కొన్నారు. ఈ కాలంలో 121 మందిని చేర్చుకోవడంతో సిబ్బంది సంఖ్య 23,698కు చేరింది.అమ్మకాలు, టెక్నాలజీలపై అధిక వ్యయాలతో నిర్వహణ లాభ మార్జిన్లు 17.1 శాతం నుంచి 15.1 శాతానికి బలహీనపడ్డాయి. 8–10 శాతం వృద్ధి ప్రస్తుత ఏడాది ఎల్అండ్టీ టెక్నాలజీ ఆదాయంలో 8–10 శాతం వృద్ధి నమోదుకానున్నట్లు అమిత్ చద్దా పేర్కొన్నారు. వార్షికంగా 2 బిలియన్ డాలర్ల ఆదాయ మార్క్ను అందుకోగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇకపై మార్జిన్లు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడాది చివరికల్లా ఆదాయంలో 16 శాతం పురోగతిని అందుకోగలమని అంచనా వేశారు. ప్రస్తుత సమీక్షాకాలంలో 2 కోట్ల డాలర్ల విలువైన 2 డీల్స్తోపాటు కోటి డాలర్ల విలువైన 4 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. -
ఉద్యోగానికి ఓకే
సమోయెడ్ జాతికి చెందిన ఓకే అనే రెండేళ్ల శునకం మొన్నటి దాకా ఓ కెఫెలో ఉద్యోగం చేసింది. తాజాగా మరో చోట ఇంటర్వ్యూకెళ్లి, ఎంపికైంది. త్వరలోనే కొత్త ఉద్యోగంలో చేరబోతోంది. డటౌ అనే తెల్ల పిల్లి కూడా తక్కువేం కాదు. అది నెలకు ఐదు క్యాన్ల ఆహారాన్ని సంపాదించుకుంటోంది. అదీ అన్ని పన్నులూ పోను..! ఇది కాకుండా.. ఆరోగ్యంగా, అందంగా, బుద్ధిగా ఉండే పిల్లులకి రోజూ స్నాక్స్ ఇస్తాం. యజమాని స్నేహితులకి 30 శాతం డిస్కౌంట్ ఇస్తాం అంటూ ఓ కెఫె నిర్వాహకుడు ఆఫర్ ఇచ్చారు. మరోచోట కెఫె నిర్వాహకుడు తమకు కావాల్సిన అర్హతలుండే పిల్లులు, కుక్కల కోసం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు..! చైనాలో కొత్త ట్రెండిది. చైనీయుల్లో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవాలనే ఉబలాటం ఇటీవల అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశంలో పిల్లల కన్నా పెంపుడు జంతువులే (పెట్స్) ఎక్కువుంటాయని ఓ సర్వేలో తేలింది. అయితే, తట్టుకోలేని జీవన వ్యయం.. బిజీబిజీగా మారిన జీవితంతో పెంపుడు జీవుల్ని కెఫెల్లో ఉద్యోగాలకు కుదుర్చుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లిన సమయాల్లో ఇవి కెఫెల్లో ఉంటాయి. తిరిగి రాగానే తమతోపాటే ఉంటాయి. దీంతోపాటు, కెఫెల్లో పార్ట్టైం, ఫుల్టైం ఉద్యోగాలతో ఎంతో కొంత ఆదాయం కూడా ఉంటోంది. దీంతోపాటు, చైనాలో మొదటిసారిగా గ్వాంగ్ఝౌలో 2011లో క్యాట్ కెఫె ప్రారంభించారు. ఇలాంటి కెఫెల సంఖ్య ఏటా 200 శాతం పెరుగుదల నమోదవుతోంది. 2023 లెక్కల ప్రకారం చైనాలో 4 వేల పైచిలుకు పిల్లులకు సంబంధించిన కంపెనీలు నడుస్తున్నాయి. పిల్లులు, కుక్కలతో గడపడం ఇష్టపడే కస్టమర్లు ఈ తరహా కెఫెలకు వస్తుంటారు. వీరి నుంచి సుమారు రూ.350 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తుంటారు. తమ మధ్య తిరుగాడుతూ ఉండే పిల్లులు, కుక్కలతో వీరు సరదాగా ఆడుకుంటారు.‘తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిన మాదిరిగానే ‘ఓకే’ను నేను కూడా కెఫెలో పార్ట్టైం జాబ్కి పంపిస్తున్నా’అని ఆ శునకం యజమాని 27 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి జ్యూ తెలిపారు. కొత్త జీవితానికి అది అలవాటు పడుతుందన్నారు. ‘జాబ్కెళ్లేటప్పుడు ఉదయం నాతోపాటే ఓకే కూడా కెఫెకు వస్తుంది. వచ్చే టప్పుడు తిరిగి సాయంత్రం ఇంటికి తెస్తాను. నేను, నా భర్త వీకెండ్స్లో బయటికి వెళ్లినప్పుడు ఓకేను కెఫె నిర్వాహకులే చూసుకుంటారు. పైపెచ్చు, పగలంతా మేం జాబ్లకెళితే ఓకే బద్ధకంగా నిద్రతోనే గడిపేస్తుది. ఆ సమయంలో దాని కోసం ప్రత్యేకంగా ఏసీ ఆన్ చేసి ఉంచడం తప్పనిసరి. ఫుజౌ నగరంలో అసలే నిర్వహణ ఖర్చులెక్కువ. ఓకే కూడా జాబ్ చేస్తే దాని ఖర్చులు అంది సంపాదించుకుంటుంది కదా’అని చెప్పుకొచ్చారు జ్యూ. ఓకేను ఇటీవలే ఓ కెఫె యజమాని గంటపాటు పరిశీలించారు. కస్టమర్లతోపాటు తోటి కుక్కలతో మసలుకునే తీరును గమనించి, ఓకే చెప్పారని జ్యూ తెలిపారు. ‘ఓకే స్టార్ ఆఫ్ ది కెఫె’అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. జిన్జిన్ అనే బీజింగ్కు చెందిన టీచర్కు టీఝాంగ్ బ్యుయెర్ అనే పిల్లి ఉంది. తనకున్న రెండు పిలుల్ని పోషించేందుకు నెలకు 500 యువాన్ల(సుమారు రూ.6 వేలు) వరకు ఖర్చువుతోందని ఆమె అంటున్నారు. ఆహారం తింటూ రోజంతా బద్ధకంగా ఇంట్లోనే ఉంటోంది. అందుకే, ఆహారం, స్నాక్స్ ఖర్చుల కోసం బ్యుయెర్ను కూడా కెఫెల్లో పనికి పంపించేందుకు సిద్ధం చేస్తున్నానన్నారు. ‘అక్కడైతే అటూఇటూ తిరుగుతుంటే తిన్నది అరుగుతుంది. పైపెచ్చు హుషారుగా కూడా ఉంటుంది’అన్నారు జిన్జిన్. ఇప్పుడు చైనాలో కెఫె యజమానులు తమకు కావాల్సిన పిల్లులు, కుక్కల కోసం సోషల్ మీడియాలో యాడ్లు ఇస్తున్నారు. క్యాట్ కెఫెలో పనిచేస్తే ఎంత శాలరీ ఇస్తారు?అని ఒకరు ప్రశ్నించగా, ఓ కెఫె యజమాని ఇచి్చన సమాధానం వైరల్గా మారింది. ‘మా క్యాట్ కెఫెలో పనికి పంపుతామంటూ చాలా మంది యజమానులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇక శాలరీ విషయానికొస్తే మేం చెప్పే దొక్కటే. మా పాత ఉద్యోగులు కొందరికి ఇచ్చినంత!’అని తెలిపారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
సమయం లేదు.. డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు..పరుగులు (ఫొటోలు)
-
జాబ్ లేదా? ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు!
టాటా గ్రూప్ వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ను తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ తయారీ విభాగాల్లో ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ అనే అంశంపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యానికి తయారీ రంగం కీలకంగా మారుతుంది. ఈ రంగంలో రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు కల్పించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తలంచిన వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోలేము. తయారీ రంగం వృద్ధి దిశగా టాటా గ్రూప్ సంస్థలు వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ రంగాల్లో విభిన్న పరికరాలను తయారు చేసేలా టాటా గ్రూప్ చర్యలు చేపడుతోంది. అందుకోసం రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలుటాటా గ్రూప్ అస్సాంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ రంగం వృద్ధి చెందితే దేశ దిగుమతులు తగ్గుతాయి. అందుకు అనుగుణంగా ఎగుమతులు అధికమవుతాయి. ఫలితంగా రూపాయి విలువ పెరుగుతుంది. దాంతోపాటు ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుంది. దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దానికి బదులుగా ఉత్పాదకతను పెంచి ఎగుమతులను మెరుగుపరిస్తే ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగార్థులు కంపెనీలు ఆశించే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
దూరదర్శన్లో కాపీ ఎడిటర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: ఆకాశవాణి-దూరదర్శన్ కేంద్రంలో కాంట్రాక్టు,పూర్తికాలపు ప్రాతిపదికన కాపీ ఎడిటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఆహ్వానించారు. ఆసక్తిగలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ప్రసార భారతి వెబ్సైట్ https://applications.prasarbharati.org ద్వారా నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.కాపీ ఎడిటర్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వయసు..జీత,భత్యాలు వంటి అదనపు సమాచారం కోసం ప్రసార భారతి వెబ్సైట్లోని ‘వేకెన్సీ’ https://prasarbharati.gov.in/pbvacancies/ విభాగంలో ఉన్న నోటిఫికేషనులో చూడొచ్చని ప్రసార భారతి తెలిపింది. -
ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్కుమార్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి కూడా ప్రచారం చేసుకోకపోవడం వల్లే నష్టపోయామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో వినోద్కుమార్ గురువారం(అక్టోబర్10) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన చరిత్ర రేవంత్రెడ్డిది. మార్కెటింగ్లో మాత్రం ఆయనను మించినవాడు లేడు. మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చరిత్ర నాకుంది. నాకెవవరూ ఉద్యోగం ఇవ్వలేదు. నేను స్వయంగా అడ్వకేట్ను. నేను తెలంగాణ వాదిని. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని రేవంత్రెడ్డి గతంలో చెప్పాడు. ఎన్నికల హామీ మేరకు డిసెంబర్ నాటికి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం లక్షా 60వేల ఉద్యోగాలు నింపలేదని భట్టి చెప్పగలరా? ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించే బాధ్యతను ఎమ్మెల్సీ కోదండరాం తీసుకోవాలి.జేఏసీని నడిపిన అనుభవం ఉన్న కోదండరాం.. సీఎం రేవంత్కు ఉద్యోగాలపై సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రాజకీయ సభల మాదిరి నిర్వహిస్తున్నారు.ఉద్యోగాల నియామకం ఎలా జరుగుతుందో కూడా మంత్రులు భట్టి, పొన్నంకు తెలియదు.బీఆర్ఎస్ హాయాంలో ఒక లక్షా 61వేల 572మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కేసీఆర్ సీఎంగా ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారు.కేసీఆర్ హాయాంలో నింపిన ఉద్యోగాల సమాచారం.. మంత్రులకే తెలియకపోవడం దౌర్భాగ్యం’అని వినోద్కుమార్ అన్నారు.కేసీఆర్ హయాంలో ‘2014 నుంచి 2023’ వరకు జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇవే..ఇదీ చదవండి: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా -
మీపై ఇంకా చర్చ ఎందుకు: కేటీఆర్కు పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్:రాహుల్ గాంధీపై సెటైర్స్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.పదేండ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం(అక్టోబర్9) ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు.‘మేం చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం.విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు.విదేశీ విద్యానిధి గత ప్రభుత్వంలో 150 మందికి ఇచ్చారు.మేం 500 మందికి ఇవ్వబోతున్నాం.అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదు.ప్రజలు ఓడించాక ఇంకా పదేళ్ల పాలన పై చర్చ ఎందుకు’అని పొన్నం అన్నారు. కాగా, యువతకు 2 లక్షల ఉద్యోగాలిచ్చిన రాహుల్గాంధీకి హైదరాబాద్ అశోక్నగర్కు స్వాగతమని ఎక్స్లో కేటీఆర్ చేసిన పోస్టుకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి: రాజకీయ లబ్ధి కోసం మా పరువు తీశారు -
రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగాలు.. క్యూ కట్టిన 3 వేల మంది విద్యార్థులు
త్వరలో మా రెస్టారెంట్ ప్రారంభం కానుంది. అందులో పనిచేసేందుకు వెయిటర్లు, సర్వర్లు కావలెను అంటూ ఓ ప్రకటన. అంతే ఉద్యోగాల గురించి తెలుసుకున్న సుమారు మూడు వేల మంది విద్యార్థులు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేందుకు రెస్టారెంట్ క్యూ కట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కెనడాలో నిరుద్యోగం పెరిగిపోయింది. బ్రాంప్టన్లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వెలుపల విద్యార్థులు క్యూకట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. బ్రాంప్టన్లో ప్రారంభమైన కొత్త రెస్టారెంట్లో పనిచేసేందుకు వెయిటర్, సర్వెంట్ ఉద్యోగాల కోసం కెనడా నుండి 3,000 మంది విద్యార్థులు (ఎక్కువగా భారతీయులు) వరుసలో ఉన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని ఉద్దేశిస్తూ.. ట్రూడో.. కెనడాలో భారీ నిరుద్యోగం’ అనే క్యాప్షన్ను జోడించి విద్యార్థుల గురించి పలు అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే అనేక కలలతో భారత్ నుంచి కెనడాకు వచ్చే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదనేది స్పష్టత లేకపోయినప్పటికీ కొంతమంది వినియోగదారులు ఆర్థిక అనిశ్చితి మధ్య విదేశాలకు వెళ్లే సమయం గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. మాంద్యం కారణంగా విదేశాలకు వెళ్లడానికి ఇది సరైన సమయం కాదని అర్థం చేసుకోవాలి అని ఒక నెటిజన్ అంటుంటే.. మరికొందరు విద్యార్థులను సమర్థించారు.రెస్టారెంట్లలో పార్ట్టైమ్ పని చేయడం చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులకు సర్వ సాధారణం అని అంటున్నారు. విద్యార్థులు ఇంకా చదువుతున్నట్లయితే, రెస్టారెంట్లో పనిచేయడం బహుశా తమను తాము పోషించుకోవడానికి పార్ట్టైమ్ ఉద్యోగం కావచ్చు. దానిని నిరుద్యోగం అని అనకూడదని మరొకరు అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో విద్యార్థులు అలాంటి ఉద్యోగాలు చేసుకునే సంస్కృతి ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను కూడా ఎత్తిచూపారు. కెనడాలో పెద్దగా కలలు కనే ఈ విద్యార్థులకు ప్రారంభం చాలా కష్టంగా ఉండవచ్చు. చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, చివరికి విజయం సాధించి, ఇంటికి తిరిగి వచ్చిన వారితో పోలిస్తే సుసంపన్నమైన జీవితాన్ని గడపడం మేం చూశాం’ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. Scary scenes from Canada as 3000 students (mostly Indian) line up for waiter & servant job after an advertisement by a new restaurant opening in Brampton.Massive unemployment in Trudeau's Canada? Students leaving India for Canada with rosy dreams need serious introspection! pic.twitter.com/fd7Sm3jlfI— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024 -
జాబులు పోవాలంటే బాబే కదా రావాలి: విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి: జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? అని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కుపరిపశ్రమలో ఉద్యోగాలు తొలగించడంపై విజయసాయిరెడ్డి శుక్రవారం(అక్టోబర్ 4) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. విశాఖ స్టీల్లో తొలి విడతగా 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘జాబ్ పోవాలి అంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? సంపద సృష్టి, బాబు వస్తే జాబు.. అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ? ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబూ ....చంద్రబాబూ ?’అని విజయసాయిరెడ్డి తన ట్వీట్లో ప్రశ్నించారు. ఇదీ చదవండి: వంచించిన చంద్రబాబు.. దగాపడ్డ రైతన్న -
ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. తగినన్ని ఉద్యోగాలు సృష్టించడం లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఉపాధి కల్పనకు కార్మిక ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.దిగువ స్థాయిలో వినియోగం పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్వ స్థాయి నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. దేశంలో నిరుద్యోగం పోవాలంటే.. ఉపాధి కల్పన తప్పకుండా జరగాలి. తయారీ రంగాలను తప్పకుండా ప్రోత్సహించాలని రాజన్ పేర్కొన్నారు.ఏడు శాతం వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టిస్తోందా? అనే ప్రశ్నకు, రఘురామ్ రాజన్ సమాధానమిస్తూ.. ఎక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ శ్రమతో కూడిన పరిశ్రమలు పెరగడం లేదని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను గమనిస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.ఈ ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన అప్రెంటిస్షిప్ పథకాలను స్వాగతిస్తున్నామని రాజన్ అన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎన్రోల్మెంట్ ఆధారంగా ప్రభుత్వం మూడు ఉపాధి ఆధారిత పథకాలను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.ఇదీ చదవండి: వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..వియత్నాం, బంగ్లాదేశ్లను ఉదాహరణలుగా చెబుతూ.. వస్త్రాలు, తోలు పరిశ్రమలో వృద్ధి సాధిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. భారత్ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మూలధన వ్యయానికి సంబంధించినంతవరకు ప్రైవేట్ రంగం ఇంకా ఎందుకు వెనుకబడి ఉందని అడిగిన ప్రశ్నకు రాజన్, ఇది ఒక చిన్న మిస్టరీ అని అన్నారు.యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గించడం వల్ల సెంట్రల్ బ్యాంకులు సముచితంగా భావించే వేగంతో ముందుకు సాగడానికి మరింత అవకాశం లభించిందని అన్నారు. -
పాక్ సంక్షోభం: లక్షల ఉద్యోగాల కోత.. మంత్రిత్వశాఖల రద్దు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది. దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు 1.5 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది.పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి రుణం తీసుకున్న అనంతరం దేశంలో ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రపంచానికి దేశ పరిస్థితిని చూపించేందుకు పాకిస్తాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి ఏడు బిలియన్ యూఎస్ డాలర్ల రుణం తీసుకుంది.అమెరికా నుంచి తిరిగి వచ్చిన పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ మీడియాతో మాట్లాడుతూ ఐఎంఎఫ్తో రుణ ఒప్పందం ఖరారయ్యిదని, ఇందుకోసం తాము కొన్ని విధానాలు అమలు చేయాల్సివుంటుందన్నారు. అలాగే జీ 20లో చేరాలంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేయాల్సివస్తుందన్నారు. మంత్రిత్వ శాఖల పరిధిలో రైట్ సైజింగ్ పనులు జరుగుతున్నాయని, ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం త్వరలో అమలులోకి వస్తుందని, రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేస్తామని మంత్రి తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖలలో 1,50,000 పోస్టులు రద్దు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.పెరుగుతున్న పన్నుల రాబడి గురించి ఆయన మాట్లాడుతూ గత ఏడాది మూడు లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు జత చేరరని, ఈ ఏడాది ఇప్పటివరకు 7,32,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.6 మిలియన్ల నుండి 3.2 మిలియన్లకు చేరుకుందన్నారు.ఇది కూడా చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి -
ఎన్సీఎస్ పోర్టల్లో అమెజాన్ జాబ్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగావకాశాల వివరాలు ఇక నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్లో దర్శనమీయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో అమెజాన్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు అమెజాన్ చేపడుతున్న నియామకాల వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు.మోడల్ కెరీర్ సెంటర్స్ వద్ద జాబ్ ఫెయిర్స్ సైతం కంపెనీ నిర్వహించనుంది. ఇందుకు మంత్రిత్వ శాఖ సాయం చేయనుంది. ఇలా ఒప్పందం చేసుకున్న తొలి ఈ–కామర్స్ కంపెనీ తామేనని అమెజాన్ తెలిపింది. ఎస్సీఎస్ పోర్టల్లో ప్రస్తుతం 60 లక్షల పైచిలుకు ఉద్యోగార్థులు, 33.5 లక్షల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రతిభను పెంపొందించడంలో అమెజాన్ నిబద్ధత దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండావియా అన్నారు. -
ఏపీ నిట్లో 125 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబరు 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యా శాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాకల్టీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–10కు సంబంధించి 48 పోస్టులను భర్తీ కానున్నాయి. వీటిలో అన్ రిజర్వ్డ్ కోటాలో 20, ఓబీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్ కింద 5 కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–11కు సంబంధించి భర్తీ చేయనున్న 20 పోస్టుల్లో అన్ రిజర్వ్డ్కు 9, ఓబీసీకి 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్కు 2 పోస్టులు కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్–13 ఏ2 కేటగిరీకి సంబంధించి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అన్ రిజర్వ్డ్కు 12, ఓబీసీకి 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్కు 3 పోస్టులను కేటాయించారు. ప్రొఫెసర్ 14ఏ గ్రేడ్కు సంబంధించి 7 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అన్ రిజర్వుడ్కు 4, ఓబీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి పోస్టులను రిజర్వు చేశారు. బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎంఎంఈ, స్కూల్ ఆఫ్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యా«థ్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ విభాగాల్లో కొత్తగా తీసుకొనే ఫ్యాకల్టీలను నియమించనున్నారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం
సాక్షి, అమరావతి: ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ, పరిశ్రమలు, సెర్ప్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూర్చాలని సూచించారు.నైపుణ్యాలను పెంచడం ద్వారా పెద్దఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని, హైబ్రిడ్ విధానంలో ఇంటినుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో శిక్షణ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు ఉపాధి చూపించాలని కోరారని, వారికి ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసే అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పని చేయాలని కోరారు. క్రీడా హబ్లుగా తిరుపతి, అమరావతి, విశాఖ మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను కోరారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షిస్తూ.. గతంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసేందుకు రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం తెలిపారు.గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు క్రీడా మైదానాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. తిరుపతి, అమరావతి, విశాఖ నగరాలను క్రీడా హబ్లుగా మార్చాల్సిన అవసరం ఉందని, ఆ మూడు ప్రాంతాల్లో అన్ని క్రీడల నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మాణం చేపడతామని చెప్పారు. 2027లో జాతీయ క్రీడా పోటీలను మన రాష్ట్రంలో నిర్వహించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయం, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. -
యువతకు నైపుణ్యమే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసి పరిశ్రమలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించామని వివరించారు. పరిశ్రమల డిమాండ్కు తగినట్టుగా అభ్యర్థులను తయారు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. బుధవారం జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ‘బీఎఫ్ఎస్ఐ స్కిల్ డెవలప్మెంట్’కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. బీఎఫ్ఎస్ఐ వెబ్సైట్ను ప్రారంభించి, కోర్సులతో కూడిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రతి విద్యా సంవత్సరం సగటున లక్ష మంది ఇంజనీర్లు, రెండు లక్షల మంది డిగ్రీ కోర్సులు పూర్తి చేసి పట్టా పొందుతున్నారు. గత పదేళ్లలో ముప్పై లక్షల మంది గ్రాడ్యుయేట్లుగా అర్హత సాధించినప్పటికీ.. మెజార్టీ పిల్లలు ఇప్పటికీ ఉద్యోగాలు సాధించలేదు. ఇందుకు కారణం వారికి పరిజ్ఞానం ఉన్నా సరైన నైపుణ్యం లేకపోవడమే. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఈ అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. మా ప్రభుత్వం ఈ అంశంపై చొరవ తీసుకుని వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది..’’అని రేవంత్ చెప్పారు. డిమాండ్కు తగినట్టుగా.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి వాటి భర్తీకి చర్యలు వేగవంతం చేశామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసినంత మాత్రాన నిరుద్యోగం తొలగిపోదు. ప్రైవేటు మార్కెట్లో డిమాండ్కు తగినట్లుగా అభ్యర్థులను తీర్చిదిద్దే బాధ్యతను స్కిల్ యూనివర్సిటీకి అప్పగించాం. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలను ఈ వర్సిటీ పాలకమండలిలో భాగస్వామ్యం చేశాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో దాదాపు 5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రంగంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థుల తయారీ కోసం బీఎఫ్ఎస్ఐని సంప్రదించాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించేలా కోర్సును ప్రారంభించాం..’’అని తెలిపారు. పదివేల మంది అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను సీఎస్ఆర్ కింద పారిశ్రామికవేత్తలే సమకూర్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. డ్రగ్ పెడ్లర్లుగా మారడం ఆందోళనకరం రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరగడం ఆందోళనకరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్లలో ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని ఆరోపించారు. ‘‘కొందరు ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన పట్టభద్రులు డ్రగ్ పెడ్లర్లుగా మారడం బాధాకరం. డ్రగ్స్ను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులు, పట్టుబడుతున్నవారి సమాచారాన్ని వింటున్నప్పుడు ఎక్కువగా యువత ఉండటం కలిచివేస్తోంది..’’అని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చడంతోపాటు ఐటీకి డెస్టినీగా అభివృద్ధి చేస్తామని.. వచ్చే ఏడాది కాలంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచబ్యాంకు చైర్మన్ అజయ్బంగా, శంతను నారాయణన్, సత్య నాదెళ్ల, అజీమ్ ప్రేమ్జీ వంటి ప్రముఖులతో డిసెంబర్లో ప్రత్యేక సదస్సును హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజిద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజీ విద్య కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాకల్టీ లేకుంటే కాలేజీల అనుమతులు రద్దు కొన్ని వృత్తి విద్యా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ఇకపై పూర్తిస్థాయి ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలను నిర్వహిస్తే అనుమతులు రద్దు చేసేందుకు వెనుకాడం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా అప్గ్రేడ్ చేశాం. వాటి ఆధునీకరణ కోసం టాటా సంస్థ ముందుకు రావడం శుభపరిణామం. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి పక్కాగా ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా బీఎఫ్ఎస్ఐ కోర్సులు అమలు చేస్తున్న 38 కాలేజీల్లో శిక్షణ పొందిన వారికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’’అని పేర్కొన్నారు. కోర్సు ముగిసిన వెంటనే ఆరు నెలల ఇంటర్న్షిప్: మంత్రి శ్రీధర్బాబు బీఎఫ్ఎస్ఐ కోర్సు ముగిసిన వెంటనే అభ్యర్థులకు ఆరు నెలలపాటు వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఇంటర్న్షిప్లో చూపిన నైపుణ్యానికి అనుగుణంగా వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ఇంటర్న్షిప్ సమయంలో ఒక్కో అభ్యర్ధికి కనిష్టంగా రూ.25 వేల వరకు వేతనం అందుతుందన్నారు. బీఎఫ్ఎస్ఐ కోర్సు నేర్చుకోవాలంటే బహిరంగ మార్కెట్లో వేల రూపాయలను ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇక్విప్ సంస్థ సహకారంతో పదివేల మంది అభ్యర్థులకు ఉచితంగా కోర్సును అందిస్తోందని చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఆ సంస్థ రూ.2.5 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. పదేళ్లపాటు ఎలాంటి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చని గత పాలకులు.. ఇప్పుడు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. -
ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్
మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' స్పందించారు.ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఎక్స్లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు. -
2026కల్లా నక్సలిజం అంతం
న్యూఢిల్లీ/షహీబ్గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు. జార్ఖండ్లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్లోని గిరి«ద్లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు. -
ఎనిమిది నెలల్లో 3.5 కోట్ల దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ఎనిమిది నెలల్లో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయని ఆన్లైన్ జాబ్సెర్చ్ ప్లాట్ఫామ్ ‘అప్నా.కో’ నివేదిక తెలిపింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ కారణంగా ఈ ఏడాది ఉద్యోగ దరఖాస్తులు పెరిగినట్లు సంస్థ పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు 31 వరకు సూక్ష్య, చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయి. వివిధ రంగాల్లోని సేల్స్, మార్కెటింగ్ మేనేజర్లు, అకౌంటింగ్ టెక్నీషియన్లు, టెలికాలర్స్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్లు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ వంటి స్థానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంబీ), ఎంఎస్ఎంఈల్లో దాదాపు 11 కోట్లమంది పని చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు ఈ రంగాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్ఈ సందర్భంగా అప్నా.కో సీఈఓ నిర్మిత్ పారిఖ్ మాట్లాడుతూ..‘ఎనిమిది నెలల్లో వచ్చిన ఉద్యోగ దరఖాస్తుల్లో 55 శాతానికి పైగా జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, లఖ్నవూ, కొచ్చి, భువనేశ్వర్ వంటి టైర్-2, టైర్-3 నగరాలవే కావడం విశేషం. ఈ నగరాల్లో వ్యాపారాలు విస్తరిస్తుండటంతో డిమాండ్కు తగ్గట్టుగా ఉద్యోగుల అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 3.5 కోట్ల దరఖాస్తుల్లో 1.4 కోట్ల మహిళల దరఖాస్తులే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటి సంఖ్య 30 శాతం పెరిగింది. ఫైనాన్స్, అకౌంట్స్, మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్.. వంటి ఉద్యోగాలకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు. -
ఉద్యోగాలకు డిగ్రీ తప్పనిసరేం కాదు : కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉద్యోగాలు, విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అద్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు.ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో ప్రసంగిస్తూ.. ‘నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఫెడరల్ ఉద్యోగాల కోసం అవసరంలేని డిగ్రీ అర్హతను తొలగిస్తాను. ఇది నాలుగు సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పెంచడానికి దోహదపడుతుంది. ’ అని తెలిపారు.కళాశాల డిగ్రీ కంటే అప్రెంటిస్షిప్, సాంకేంతిక కార్యక్రమాలు వంటివి విజయానికి గల మార్గాల విలువను అమెరికా గుర్తించాలని అన్నారు. వ్యక్తి నైపుణ్యాలను సూచించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. అదే విధంగా ప్రైవేట్ రంగం కూడా ఇదే విధాన్ని పాటించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.అయితే కమలా హారిస్ ప్రసంగానికి. నిరసనకారుల ఆందోళన వల్ల అంతరాయం ఏర్పడింది. గాజాలో 10 వేల మంది మరణానికి కారణమైన ఇజ్రాయెల్ యుద్ధానికి యూఎస్ మద్దత తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కు ఆయుధాల రవాణాపై ఆంక్షలు విధించాలని, యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో హారిస్ మాట్లాడుతూ..తమ ఆందోళనలను గౌరవిస్తానని చెప్పారు. కాల్పుల విరమణ, బందీల రక్షణ ఒప్పందానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పుతిన్పై ప్రశ్న.. రిపోర్టర్పై బైడెన్ ఆగ్రహంఇదిలా ఉండగా హారిస్ ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లకు అత్యధికంగా ఓటు వేసిన కార్యకర్తలు, ముస్లింలు, అరబ్బులతో సహా పాలస్తీనా అనుకూల అమెరికన్లు ఉన్నారు. వీరు ఈసారి తమ ఆలోచనను మార్చుకుంటే.. అది హారిస్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.అయితే 2023లో యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్ యువతలో 62% కంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి లేరు. 2020లో ఐదుగురు ఓటర్లలో ముగ్గురు కళాశాల డిగ్రీ కూడా చేయలేదు. ఇందుకు కారణం విద్యకు అధిక ఖర్చు అవ్వడమేనని తేలింది.కాగా అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరులో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడబోతున్నారు. వీరిరువురు ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. -
మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం
విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్, నెదర్లాండ్స్ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ వెబ్సైట్ ఇండీడ్ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్, నెదర్గాండ్స్ను ఎంచుకుంటున్నారు. యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో.. ఈ కామర్స్ సంస్థలు భారీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో మీషో చేరింది. ఇప్పుడు తాగాజా అమెజాన్ అడుగుపెట్టింది.అమెజాన్ ఇండియా 1.1 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో మహిళలు, వికలాంగుల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.దేశంలోని అన్ని ప్రాంతాల కస్టమర్ల అవసరాలను సకాలంలో తీర్చడానికి అమెజాన్ ఈ ఉద్యోగాలను సృష్టించింది. పండుగ సీజన్లో.. భారతదేశం అంతటా 1 లక్షకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న అమెజాన్ చర్య ప్రశంసనీయమైన కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' పేర్కొన్నారు.ప్రాజెక్ట్ ఆశ్రయ్అమెజాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశ్రయ్ వంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా నగరాల్లో డెలివరీ అసోసియేట్ల కోసం ప్రత్యేక విశ్రాంతి పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. ఇవి ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంఅమెజాన్ సుశ్రుత అనే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా ట్రక్ డ్రైవర్లకు ముందస్తుగా గుర్తించడం, రోగనిర్ధారణ చేయడం, ఎంచుకున్న ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ఆన్సైట్ వైద్య సదుపాయాల వంటి వివిధ సౌకర్యాలను అందజేస్తుంది. -
మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల పట్ల బలమైన ధోరణితో ఉన్నట్టు మ్యాన్పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే క్యూ4, 2024’ నివేదిక వెల్లడించింది. 37 శాతం భారత కంపెనీలు వచ్చే మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) నికరంగా తమ సిబ్బందిని పెంచుకోనున్నట్టు ఈ సర్వేలో తెలిపాయి. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం అధికం. క్రితం ఏడాది అక్టోబర్ - డిసెంబర్తో పోల్చి చూస్తే తటస్థంగా ఉంది.వివిధ రంగాల్లోని 3,150 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా మ్యాన్పవర్ గ్రూప్ తెలుసుకుంది. భారత్ తర్వాత కోస్టారికాలో అత్యధికంగా 36 శాతం కంపెనీలు, ఆ తర్వాత యూఎస్లో 34 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి. సిబ్బందిని తగ్గించుకునే కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నికర నియామకాల గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.‘‘నియామకాల ఉద్దేశ్యం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల ధోరణిని తెలియజేస్తోంది. విదేశీ విధానాలు, పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి తోడు మనకున్న అధిక యువ జనాభా సానుకూలతలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని పెంచుతాయి’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. రంగాల వారీగా..మ్యానపవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. దాదాపు అన్ని రంగాల్లోనూ నియామకాల పట్ల సానుకూలత వ్యక్తమైంది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వచ్చే మూడు నెలల్లో 47 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉంటే, ఐటీలో 46 శాతం, ఇండ్రస్టియల్స్, మెటీరియల్స్రంగాల్లో 36 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో 35 శాతం కంపెనీలు సిబ్బందిని పెంచుకోవాలని అనుకుంటున్నాయి. అతి తక్కువగా కమ్యూనికేషన్ సర్వీసెస్ రంగాలో 28 శాతం కంపెనీలే వచ్చే మూడు నెలల్లోనియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి.ఇదీ చదవండి: 6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా ఉత్తరాదిలో ఉద్యోగాల డిమాండ్ 41 శాతంగా ఉంటే, పశ్చిమాదిన 39 శాతంగా ఉంది. అధిక దేశీయ వినియోగం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పథకాలు, ఔట్సోర్స్ సేవల డిమాండ్ పెంచడం, తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నట్టు గులాటి తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. భారత్ నిరుద్యోగాన్ని తగ్గించి, కొత్త తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయొచ్చని గులాటీ వివరించారు. -
యూఎస్ కంపెనీ కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో మొదలైన భయం
ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC) యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 1,800 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 2009 తరువాత కంపెనీ ఇంత పెద్ద లేఆఫ్స్కు సిద్దమవ్వడం ఇదే మొదటిసారి. ఈ లేఆప్స్ ప్రభావం అసోసియేట్స్, మేనేజింగ్ డైరెక్టర్లు, బిజినెస్ సర్వీసులు, ఆడిట్, పన్ను విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై పడే అవకాశం ఉంది.కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువమంది అమెరికా బయట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగానే సంస్థ ఈ లేఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా కంపెనీ భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులను తొలగించాల్సి వస్తున్నట్లు సంస్థ ఒక మెమోలో వెల్లడించింది.కరోనా సమయంలో అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను దొలఁగించినప్పటికీ.. ప్రైస్వాటర్హౌస్కూపర్స్ మాత్రం లేఆప్స్ ప్రకటించలేదు. కానీ కరోనా మొత్తం తగ్గుముఖం పట్టిన తరువాత దాదాపు రెండువేల మందిని ఇంటికి పంపే యోచన చేస్తోంది. ఈ విషయం తెలిసిన ఉద్యోగులలో ఇప్పటికే భయం మొదలైంది. అయితే ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించారనేది త్వరలోనే తెలుస్తుంది. -
‘ఏఐ’తో ఉద్యోగాలు పోవు: రాహుల్గాంధీ
టెక్సాస్: కృత్రిమ మేధ(ఏఐ)తో నిరుద్యోగం ఏర్పడుతుందన్న వాదనను ప్రతిపక్షనేత రాహుల్గాంధీ కొట్టి పారేశారు. ఏఐతో పాతవి పోయి కొత్త తరహా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు. అంతిమంగా ఏఐతో మంచే జరుగుతుందన్నారు. ఆదివారం(సెప్టెంబర్8) అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయమై మాట్లాడారు.‘క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చినపుడు ఇలానే ఉద్యోగాలు పోతాయన్నారు. ఏమైంది. కొత్త ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఏం నష్టం జరగలేదు. అయితే ఏఐతో భారత్లో ప్రధానంగా ఐటీ రంగం సమస్య ఎదుర్కోబోతోంది. అదే సమయంలో స్కూటర్లు తయారు చేసే బజాజ్ కంపెనీకి ఏఐతో సమస్యేమీ లేదు. ఏఐ ఒక్కో రంగాన్ని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఉద్యోగాలు పోయేలా చేస్తుంది. కొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మనం సరిగ్గా వాడుకుంటే ఏఐ కొత్త అవకాశాలను కల్పిస్తుంది’అని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. కాగా, 2024 లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, మేధావులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఇదీ చదవండి: రాహుల్గాంధీ పప్పు కాదు: శామ్ పిట్రోడా -
బ్యాంకుల్లో అప్రెంటిస్లుగా గ్రాడ్యుయేట్లు
ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా కీలక ప్రకటన చేశారు.అప్రెంటిస్లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్షిప్లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్పై కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది. -
8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీ తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు ఉద్యోగులను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 'మీషో' (Meesho) కంపెనీ ఏకంగా 8.5 లక్షల ఉద్యుగులను నియమించుకోవడానికి సన్నద్ధమవుతోంది.పండుగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మీషో సిద్ధమైంది. ఉద్యోగ నియామకాల్లో 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, టైర్ 4 నగరాల్లో ఉండనున్నట్లు సమాచారం.ఈ కామర్స్ దిగ్గజం మీషో డెలివెరీ, ఈకామ్ ఎక్స్ప్రెస్, షాడోఫాక్స్, ఎక్స్ప్రెస్బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం కూడా ఉద్యోగ నియమాలకు పెంచడంలో సహాయపడింది. ఉద్యోగులలో పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, రిటర్న్లను నిర్వహించడానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.ఇదీ చదవండి: ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?ఉద్యోగ నియమాలకు కారణంఅమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. పండుగ సీజన్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మీషో ఈ చర్యలు తీసుకుంటోంది. -
పండగ సీజన్పై ఫోకస్.. లక్ష ఉద్యోగాలకు అవకాశం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ పండుగ సీజన్పై మరింతగా కసరత్తు చేస్తోంది. రాబోయే బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 సేల్ కోసం పెద్ద ఎత్తున నియామకాలు జరపనుంది. కొత్తగా 1 లక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్హౌస్ అసోసియేట్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లు, కిరాణా పార్ట్నర్లు, డెలివరీ డ్రైవర్లు మొదలైన సిబ్బందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.పండుగ సీజన్ కోసం కొత్త వర్కర్లకు అవసరమైన శిక్షణనివ్వనున్నట్లు వివరించింది. ఇప్పటికే తొమ్మిది నగరాల్లో 11 కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్సీ) ప్రారంభించినట్లు, దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 83కి చేరినట్లు ఫ్లిప్కార్ట్ వివరించింది. సామాజిక–ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న లక్ష్యంతో ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా ఒకవైపు తమ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు మరోవైపు ఆర్థిక వృద్ధికి దోహదపడాలని, స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్కార్ట్ వివరించింది. తమ సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు నిరాటంకంగా సాగేలా, పెరుగుతున్న డిమాండ్ ప్రకారం నిల్వల నిర్వహణ, ప్రోడక్టుల లభ్యత మొదలైన అంశాలను మెరుగుపర్చుకునేందుకు వినూత్నమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలు సాధారణంగా ఆయా సీజన్లకు పరిమితమైనవిగా ఉంటాయి. -
తగ్గుతున్న ఉద్యోగాలు.. అందరి చూపు అటువైపే!
నిరుద్యోగం అనేది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక సమస్యగా ఉంది. యూరప్ దేశమైన ఎస్టోనియాలో నిరుద్యోగం రేటు 2024 రెండో త్రైమాసికంలో 7.6 శాతం పెరిగిందని స్టాటిస్టిక్స్ ఎస్టోనియా సంస్థ 'టీ వాసిల్జెవా' (Tea Vassiljeva) వెల్లడించారు.టీ వాసిల్జెవా గణాంకాల ప్రకారం, 2023 రెండో త్రైమాసికంతో పోలిస్తే 2024 రెండో త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య 7,600 పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ భాగం యువత ఉన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. రెండవ త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య కొంత ఎక్కువే అని వాసిల్జెవా పేర్కొన్నారు.పెరిగిన స్వయం ఉపాధిఎస్టోనియాలో ఉద్యోగం రాలేదని ఎదురు చూడకుండా.. చాలామంది స్వయం ఉపాధివైపు అడుగులు వేశారు. దీంతో స్వయం ఉపాధి పెరిగింది, ఉపాధిలో ఉన్నవారి సంఖ్య వృద్ధి చెందింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉపాధిలో ఉన్న వ్యక్తుల నిష్పత్తి 10.6 శాతానికి చేరింది.రాబోయే రోజుల్లో (మూడో త్రైమాసికం) స్వయం ఉపాధి మరింత పెరిగే అవకాశం ఉందని వాసిల్జెవా వెల్లడించింది. ఇందులో 15 నుంచి 74 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారు. వీరందరూ ఉద్యోగం కోసం వేచి చూడక సొంత పని ప్రారంభిస్తున్నారు. ఇది వారి ఆర్థిక వృద్ధికి దోహదపడుతోంది.ఇదీ చదవండి: మార్చి నాటికి భారత్లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారం, ఎస్టోనియాలో శాశ్వత నివాసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా ఉండేవారు లేదా ఉక్రేనియన్ శరణార్ధుల సంఖ్య తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా ఎస్టోనియాలో స్వయం ఉపాధి పెరగటానికి ఓ కారణమనే చెప్పాలి. ఎందుకంటే తాత్కాలికంగా ఉండే ప్రజలు ఉద్యోగం లేకుంటే.. ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా నివాసం ఉండేవారు అక్కడే ఉండాలని, ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి చూసుకుంటున్నారు. ఇలా అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పెరుగుతోంది. ఇదే ఫార్ములా ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ఉపయోగించవచ్చు. ఉద్యోగం రాలేదని ఎదురు చూడక, స్వయం ఉపాధి పొందవచ్చు. -
ఉద్యోగ ఖాళీలెన్ని ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన జాబ్ కేలండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీతో పాటు విద్యుత్ సంస్థల పరిధిలో ఏఈఈ, ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి సంబంధిత నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు, సభ్యులతో గత వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వీలైనంత వేగంగా గ్రూప్–1 ఖాళీలతో పాటు ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు తేలి్చ, వివరాలు ఆర్థిక శాఖకు సమరి్పంచాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు బిజీ బిజీ సీఎస్ ఆదేశాల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని ఖాళీలు గుర్తించడంతో పాటు, వాటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఖాళీల లెక్కలు తేలి్చన తర్వాత ఆర్థిక శాఖకు సమరి్పంచాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి, ఆ మేరకు ప్రతిపాదనలను నియామక సంస్థలకు అప్పగించాలి. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచి్చన తర్వాత రెండోసారి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ రెండోసారి, కొన్నిటి భర్తీ మూడోసారి జరుగుతున్నట్లు సమాచారం. కేలండర్ ప్రకారం ప్రకటనలు తెలంగాణ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్లో స్పష్టం చేసింది. టీజీజెన్కో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను కూడా అక్టోబర్లోనే జారీ చేయాలి. ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి. జీవో 55లో గుర్తించిన 19 కేటగిరీల్లోని పోస్టులు గ్రూప్–1 పరిధిలోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ జారీ చేయాలి. జాబ్ కేలండర్లో నిర్దేశించిన నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ శాఖలను సర్కారు ఆదేశించింది. -
మార్చి నాటికి భారత్లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్
కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో 6 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు యాపిల్ పేర్కొంది.దేశంలో యాపిల్ తన కార్యకలాపాలను పెంచుకోవాలనుకునే నేపథ్యంలో 2025 నాటికి మొత్తం 2,00,000 మంది ఉద్యోగులను కలిగి ఉండాలని సంకల్పించింది. ఇందులో 70 శాతం మంది మహిళలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ ఫోక్స్కాన్, విస్ట్రాన్, పెగట్రాన్ వంటి యాపిల్ సరఫరాదారులలో 80,872 మంది ప్రత్యక్ష ఉద్యోగులు.. టాటా గ్రూప్, సాల్కాంప్, మదర్సన్, ఫాక్స్లింక్, సన్వోడా, ఏటీఎల్, జాబిల్ వంటి సరఫరాదారులు 84,000 మంది పరోక్ష ఉద్యోగులు ఉన్నట్లు సమచారం.యాపిల్ కంపెనీ 2020లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ ప్రారంభించింది. అప్పటి నుంచి యాపిల్.. దాని భాస్వాములు ఏకంగా 165000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించారు. ఈ స్కీమ్ ప్రారంభంలో 2,00,000 ఉద్యోగాలను లక్ష్యంగా చేయుకుంది. భారతదేశంలో ఉద్యోగాలను పెంచడానికి యాపిల్ తనవంతు ప్రయత్నిస్తోంది.ఎలక్ట్రానిక్స్ రంగంలోని ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం.. మూడు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. యాపిల్ కార్యకలాపాల విస్తరణ ద్వారా లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. తమిళనాడులోని హోసూర్లో టాటా గ్రూప్ కొత్త సదుపాయం కాలక్రమేణా దాదాపు 50,000 మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ అక్టోబర్లో ఐఫోన్ ఉత్పత్తిని ప్రారంభించనున్న ఈ ప్లాంట్ దశలవారీగా సామర్థ్యాన్ని పెంచుకోనుంది. యాపిల్ కార్యకలాపాలకు తమిళనాడు కీలక కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: 29న రిలయన్స్ ఏజీఎం.. అంచనాలన్నీ వీటిపైనే! యాపిల్ కంపెనీ భారతదేశంలో 2021లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. క్రమంగా దేశంలో ఉత్పత్తి పెరుగుతూ ఉంది. ఐఫోన్ తయారీ FY24లో రూ.1.20 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో రూ.85000 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీంతో యాపిల్ గ్లోబల్ సప్లై చెయిన్లో భారతదేశం కీలకమైనదిగా మారింది. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 14 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. -
అమెజాన్లో లక్ష మంది మాజీ సైనికోద్యోగులు
సైన్యం దాని అనుబంధ విభాగాల్లో పనిచేసిన లక్ష మంది మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబీకులకు తమ సంస్థలో స్థానం కల్పించినట్టు ఆన్లైన్ వేదిక అమెజాన్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. 2019లో అంతర్జాతీయంగా తాము అమెజాన్ మిలటరీ ప్రోగ్రామ్ ప్రారంభించామని, 2021 నాటికి మూడేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆ లక్ష్యాన్ని సాధించామని వివరించారు. దీని కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంట్ (డీజీఆర్), ఇండియన్ నావెల్ ప్లేస్మెంట్ ఏజెన్సీ (ఐఎన్పీఏ), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఏజెన్సీ (ఐఎఎఫ్పీఏ), ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (ఏడబ్ల్యూపీఓ) లతో కలిసి పనిచేశామని వివరించారు.ఈ సందర్భంగా తాజాగా ఈ ప్రోగ్రామ్ ద్వారా వర్క్ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ (డబ్లు్యహెచ్ఎస్) మేనేజర్గా ఎంపికైన ఎయిర్ఫోర్స్ మాజీ అధికారిణి సుప్రియ మాట్లాడుతూ సైన్యంలో తన అనుభవాలు ఈ హోదాలో రాణించేందుకు ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
శుభవార్త చెప్పిన సీఈఓ.. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సేఫ్
ఈ సంవత్సరం రెండు కొనుగోళ్ల తర్వాత, భారతదేశ రెండవ అతిపెద్ద ఐటీ సర్వీస్ కంపెనీ ఇన్ఫోసిస్ మరిన్ని సంస్థలను కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. డేటా అనలిటిక్స్, ఎస్ఏఏఎస్ వంటి రంగాల్లో కొనుగోళ్లపై కంపెనీ ఆసక్తిగా చూపుతున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు.450 మిలియన్ యూరోల ప్రైస్-ట్యాగ్తో వచ్చిన స్కేల్ మ్యాచింగ్ ఇన్-టెక్కి సంబంధించి మరిన్ని కొనుగోళ్లు జరగవచ్చా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఖచ్చితంగా సాధ్యమవుతుందని పరేఖ్ అన్నారు. భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన సెమీకండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ సెమీ టెక్నాలజీ సర్వీసెస్లో 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్ను రూ. 280 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ ఖచ్చితమైన ఒప్పందాన్ని ప్రకటించిందని వెల్లడించారు.ఏఐ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ క్లయింట్ల నుంచి బలమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఈ రంగంవైపు వేగంగా దూసుకెళ్తోంది. కంపెనీలు జెన్ఏఐ నుంచి ప్రయోజనాలను, ఫలితాలను వినియోగించుకోవాలని.. ఇది తప్పకుండా కంపెనీ పెరుగుదలకు దోహదపడుతుందని పరేఖ్ అభిప్రాయపడ్డారు.సమయం గడిచేకొద్దీ ఏఐ టెక్నాలజీ చాలా వేగవంతం అవుతుందని చెబుతూనే.. ఇది ఎంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందనేది తెలియాల్సి ఉందని పరేఖ్ అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్ఫోసిస్ క్లయింట్ల కోసం 225 జనరేటివ్ AI ప్రోగ్రామ్లపై పనిచేస్తున్నట్లు.. దీనికోసం 2,50,000 మంది ఉద్యోగులకు ఈ రంగంలో టర్నింగ్ ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు.ఏఐ ఉద్యోగులపైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు వెల్లడించారు. చెప్పినట్లుగానే చాలా లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగించబోదని.. రిక్రూటింగ్ కూడా పెరుగుతూనే ఉంటుందని పరేఖ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అయన స్పష్టం చేశారు. -
అమల్లోకి కొత్త చట్టం.. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత విసిగిస్తే బాస్పై చర్యలే
ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత కూడా పలు యాజమాన్యాలు ఉద్యోగులకు ఫోన్స్ చేసి పని పేరుతో విసిగిస్తుంటాయి. ఆ వర్క్ పెండింగ్ లో ఉంది. ఈ పని చేయండి అంటూ హుకుం జారీ చేస్తుంటాయి. కానీ ఆగస్ట్ 26 నుంచి ఆ పప్పులేం ఉడకవ్. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత పనిపేరుతో ఉద్యోగుల్ని విసిగించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమైంది.గతేడాది ఫెయిర్ వర్క్ అమెండ్మెంట్ (రైట్ టు డిస్కనెక్ట్) చట్టం ఫెయిర్ వర్క్ యాక్ట్ 2009ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సవరించింది. సవరించిన చట్టానికి ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు 26 నుండి కొత్త పని చట్టాలు అమల్లోకి రానున్నాయి.పని సంబంధిత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు ఫోన్ చేసి ఆఫీస్ పని గురించి ఆరాతీయడం, లేదంటే వారికి వర్క్ ఫ్రమ్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ తమ బాస్ అప్పగించిన పని చేయాలా? వద్దా? అని ఉద్యోగులు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.కాగా, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఉద్యోగులు.. ఆఫీస్తో సంత్సంబంధాలు కొనసాగించడకుండా ఉండేలా ఇప్పటికే పలు దేశాలు చట్టాల్ని సవరించాయి. తాజాగా వాటి సరసన ఆస్ట్రేలియా చేరింది. ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టాల్ని అమలు చేసిన దేశాల జాబితాలో ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, అర్జెంటీనా, చిలీ, లక్సెంబర్గ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యా, స్లోవేకియా, స్పెయిన్, అంటారియో,ఐర్లాండ్లు ఉన్నాయి. -
ఆ స్కిల్స్ ఏవీ?
సాక్షి, హైదరాబాద్ : భారత్లో ఇంజనీరింగ్ విద్యను లైట్గా తీసుకున్న విద్యార్థులు..ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటెక్లో ముఖ్యమైన నైపుణ్య మెళకువలపై దృష్టి పెట్టకపోవడం అక్కడ చాలామంది స్కిల్ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ప్రాజెక్టులు, ఇంటర్న్ íÙప్లు ఇండియాలో సరిగ్గా పూర్తి చేయకపోవడంతో విదేశీ ఉద్యోగాలు చేజిక్కడం లేదు. ఇంజనీరింగ్లో సెమినార్ను లైట్గా తీసుకోవడం వల్ల విదేశాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రదర్శించలేక పోతున్నారు. ఎంఎస్ కోసం ఏటా 7.50 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. వీరిలో 1.90 లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్లేవారే. ఇందులోనూ అత్యధికంగా అమెరికాకు 90 వేలకుపైగా వెళుతున్నారు. లీప్ స్కాలర్స్ అధ్యయనం ప్రకారం అమెరికాలో వివిధ దేశాలకు చెందిన 2.25 లక్షల మంది ఏటా స్కిల్ ఉద్యోగాలు పొందుతుంటే, తెలంగాణ విద్యార్థుల వాటా 8 వేలకు మించడం లేదు. మిగతా వారంతా అన్స్కిల్డ్, పార్ట్టైం ఉద్యోగాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యాలపై దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. కలివిడితనమే కీలకంఎంఎస్ తర్వాత విదేశాల్లో ఉద్యోగం పొందాలంటే కలివిడిగా దూసుకెళ్లడం కీలకం. ఇంటర్వ్యూలు, సెమినార్లు, గ్రూప్ డిస్కషన్స్కు విదేశీ సంస్థలు ప్రాధాన్యమిస్తాయి. నాయకత్వ లక్షణం ఉంటేనే ప్రాజెక్టు ముందుకెళుతుందనే భావనతో ఉంటాయి. చాలామందిలో ఈ లోపం కనిపిస్తోందని యూఎస్లో లీడింగ్ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడు నీరజ్ పంకజ్ తెలిపారు. అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులకు స్థానిక వసతి, రవాణా, మార్కెట్లు, కరెన్సీ వంటి అంశాలపై కూడా ఆరునెలల వరకూ అవగాహన ఉండటం లేదని తెలిపారు. కేవలం కన్సల్టెన్సీలనే నమ్ముకుంటున్నారని, ఇతరులతో పరిచయాలు పెంచుకునే నైజం ఉండటం లేదన్నారు. ఇంజనీరింగ్లో ఇంటర్న్ షిప్లు, గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొంటే, సెమినార్లు తరచు చేస్తూ ఉంటే ఈ సమస్య ఉండదన్నారు. ఏకాగ్రతను దెబ్బతీసే అలవాటు మనకు, ఇతర దేశాలకు వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలుంటాయి. సంస్కృతి, భాష వంటకాల్లో కూడా అంతే. ఈ అసౌకర్యంతో చాలామంది విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తింటోంది. హోమ్సిక్ బారిన పడుతున్నారు. మనవారు సాధారణంగా టూరిస్ట్ గైడ్, టీచింగ్ అసిస్టెంట్, లైబ్రరీ మానిటర్, గిగ్ మార్కెట్లో పనిచేస్తుంటారు. ఇవన్నీ పార్ట్టైం ఉద్యోగాలే. వాస్తవానికి ఇండియాలో ఉన్నప్పుడు అసలీ రంగాలపైనే వారికి అవగాహన ఉండటం లేదని, ఇతర దేశాలకు వెళ్లి నేర్చుకోవడం కష్టంగా ఉంటోందని ఆ్రస్టేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు ఆదిత్య తెలిపారు. ఈ అసౌకర్యం వల్ల ప్రధానమైన స్కిల్ ఉద్యోగాలపై ఏకాగ్రత తగ్గుతోందన్నారు. వీసా గడువు పూర్తయ్యే నాటికి కూడా మంచి ఉద్యోగం పొందే స్కిల్ ఉండటం లేదని చెప్పారు. ఆ నిర్లక్ష్యంతోనే ఒత్తిడి ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థి ఏకకాలంలో ఎన్నో పనులు చేయాలి. క్లాసులకు హాజరవ్వాలి. అసైన్మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. ఇంకోవైపు పార్ట్టైం ఉద్యోగమూ చేయాలి. వాస్తవానికి ఇవన్నీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇంజనీరింగ్ చేసేప్పుడూ ఇవన్నీ ఉంటాయి. కానీ మనవారు పట్టించుకోవడం లేదని కెనడాలో ఉంటున్న హైదరాబాద్వాసి సాయిచరణ్ తెలిపారు. విదేశాల్లో ఇవన్నీ ఏకకాలంలో చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రణాళికాబద్ధమైన జీవన విధానం దెబ్బతింటోందన్నారు. సామాజిక అవగాహనతో ఇంజనీరింగ్ విద్య చేసేవారు ఈ ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఆవిష్కరణలు, వాటిపై జరిగే సెమినార్లలో పాల్గొంటే ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం నాణ్యమైన విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విద్యార్థులకే విదేశీ ఉద్యోగాలు తేలికగా లభిస్తున్నాయి. అక్కడే వివిధ అంశాల బోధనకు అవసరమైన వాతావరణం ఉంటుంది. ఇందులోనే పరిశోధన ఉంటుందని నమ్ముతున్నాయి. జ్ఞానాన్నీ, తార్కిక ఆలోచనా నైపుణ్యాన్నీ పెంచుకునే అవకాశాలు విద్యార్థులకు విస్తృతంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో రాణించే మెళకువలు ఇంజనీరింగ్ నుంచే అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. తరగతిగదిలో లెక్చరర్లు బోధించే సమయం, వారానికి కొన్ని గంటలపాటు పరిమితంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత నేర్చుకోవడం, అవసరమైన సమాచారాన్ని సేకరించగలగడమే విదేశీ విద్య తర్వాత రాణించడానికి మార్గం సుగమం చేస్తుంది. -
ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలు
తయారీ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. పురుషులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఈ రంగంలో ఆటోమేషన్ (మెషినరీ సాయంతో పనుల నిర్వహణ)తో మహిళల నియామకాలు పెరుగుతాయని టీమ్లీజ్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది భారత్ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో తయారీ రంగం మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఆటోమేషన్ను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు టీమ్లీజ్ నివేదిక తెలిపింది.టీమ్లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ మాట్లాడుతూ..‘దేశీయంగా చాలా కంపెనీలు దశలవారీ ఆటోమేషన్ను అమలు చేస్తున్నాయి. మహిళల నియామకాలు మొదలు పెట్టాయి. తయారీ రంగాల్లో ఆటోమేషన్ అమలు పెరుగుతున్న కొద్దీ కంపెనీలు మరింత మంది మహిళలను పనుల్లోకి తీసుకుంటున్నాయి. భారత తయారీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు 15–20 శాతంలోపే ఉంటారు. ఆటోమేషన్ను వేగంగా అమలు చేస్తున్న కంపెనీల్లో ఇప్పటికే మహిళల నియామకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికం విడిభాగాల తయారీ సంస్థలు మరింత మంది మహిళలను తీసుకునేందుకు చర్యలు చేపట్టాయి. శ్రామికశక్తిలో లింగ సమతుల్యంపై కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి’ అని అన్నారు.ఇదీ చదవండి: కార్ల ధరపై భారీ డిస్కౌంట్లుకొన్ని విభాగాల్లో మెరుగైన అవకాశాలుతయారీలో కొన్ని రంగాలు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుండడడాన్ని టీమ్లీజ్ నివేదిక ప్రస్తావించింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో కార్మికుల్లో 70–80 శాతం మహిళలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే టెక్స్టైల్స్, వస్త్రాల తయారీలోనూ సహజంగానే మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఫ్యాబ్రికేటెడ్, బేసిక్ మెటల్స్, మెషినరీ, ఎక్విప్మెంట్, మోటారు వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమల్లో కఠినమైన పని పరిస్థితుల దృష్ట్యా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని, వీటిల్లో ఆటోమేషన్ అమలు తక్కువగా ఉన్నట్టు టీమ్లీజ్ తెలిపింది. ఇక ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్లోనూ పురుషులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
ఉద్యోగాలున్నా నైపుణ్యాలేవీ..?
ఉపాధి అవకాశాలున్నా సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో ఏటా అత్యధిక మంది గ్యాడ్యుయేట్లను అందించే రాష్ట్రం ఇది. కానీ కంపెనీల అవసరాలకు తగిన నైపుణ్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం..జులై 2022 నుంచి జూన్ 2023 ఏడాదికిగాను పని చేస్తున్న, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని పరిగణించి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు(ఎల్ఎఫ్పీఆర్)ను లెక్కించారు. అందులో గరిష్ఠంగా 46 శాతంతో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. దేశంలో సగటున ఈ ఎల్ఎఫ్పీఆర్ 42.4 శాతంగా ఉంది. వర్కర్ పాపులేషన్ రేటు తమిళనాడులో 44 శాతంగా ఉంటే దేశంలో సరాసరి 41.1 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!దేశవ్యాప్తంగా మొత్తం ఫ్యాక్టరీల్లో పనిచేసే జనాభాలో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలోనే 40 శాతం ఉంది. అయితే తమిళనాడులోని కంపెనీల్లో భారీగా ఖాళీలున్నాయని, కానీ ఆయా పోస్టులకు తగిన నైపుణ్యాలు అభ్యర్థుల వద్ద లేవని సంస్థలు చెబుతున్నాయి. రోజూ కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అందుకు తగినట్లు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. -
‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’
దేశ జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) డిప్యూటీ డైరెక్టర్ గీతాగోపీనాత్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి జీ20 దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనకబడి ఉందన్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా గీతాగోపీనాత్ మాట్లాడుతూ..‘భారత్లో జనాభా వృద్ధిరేటు అధికంగా ఉంది. జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో 6 నుంచి 14.8 కోట్లు ఉద్యోగాలు సృష్టించబడాలి. ప్రస్తుతం 2024లో ఉన్నాం. చాలా తక్కువ సమయంలోనే భారీగా జాబ్స్ క్రియేట్ చేయాలి. ఉద్యోగాల కల్పనలో జీ20 దేశాల్లో భారత్ వెనకబడింది. 2010 నుంచి ఇండియా సగటున 6.6 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. అయితే ఉద్యోగకల్పన రేటు మాత్రం 2 శాతం లోపే ఉంది. కొత్త ఉద్యోగాలు పుట్టుకురావాలంటే ప్రైవేటు పెట్టుబడులు వచ్చేలా చూడాలి. భారత యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. భారత్తో పోటీ పడుతున్న ఇతర దేశాలతో పోలిస్తే స్థానికంగా దిగుమతి సుంకం అధికంగా ఉంది. దాన్ని తగ్గించాలి. కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఇటీవల ప్రవేశపెట్టిన ‘మూలధన లాభాలపై పన్ను’ తాత్కాలికంగా ఖజానాకు డబ్బు సమకూర్చవచ్చు. కానీ అది భవిష్యత్తులో క్లిష్టంగా మారే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్లను మరింత సరళీకరిస్తే అదనంగా 1.5 శాతం జీడీపీ వృద్ధికి అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..! -
ఐటీ కొలువులు.. చిగురిస్తున్న ఆశలు!
ఐటీ రంగం ఉద్యోగాల విషయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (2023–24, క్యూ1)లో వరుసగా ఏడో క్వార్టర్లోనూ టాప్–5 ఐటీ దిగ్గజాల మొత్తం సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే, గతంతో పోలిస్తే తగ్గుదల జోరుకు భారీగా అడ్డుకట్ట పడటం సానుకూలాంశం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మళ్లీ ఐటీ రంగం పెరిగిన ఉద్యోగులతో కళకళలాడే పరిస్థితి వస్తుందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా... దేశీ ఐటీ రంగంలో ఇవి టాప్–5 కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య సీక్వెన్షియల్గా (గతేడాది క్యూ4తో పోలిస్తే) 2,034 మంది తగ్గారు. అయితే, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఈ మూడు దిగ్గజాలు మాత్రం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడం విశేషం.‘గడిచిన ఐదు క్వార్టర్లలో ఉద్యోగుల తగ్గుదల జోరుకు క్రమంగా అడ్డుకట్ట పడటం సానుకూల పరిణామం’ అని హైరింగ్ కంపెనీ ఎక్స్ఫెనో బిజినెస్ హెడ్ (టెక్నాలజీ సిబ్బంది నియామకాలు) దీప్తి ఎస్ పేర్కొన్నారు. టాప్–5లో మూడు దిగ్గజ సంస్థలు క్యూ1లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడంతో నియామకాల రికవరీ ఆశలు చిగురిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ పరిశ్రమ మళ్లీ కొత్త ఉద్యోగుల చేరికలతో కళకళలాడే అవకాశం ఉందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు. హైరింగ్పై ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్... దేశీ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో గత ఏడాదిన్నరగా హైరింగ్కు ముఖం చాటేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు కూడా తెరతీశాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు వెలువడ్డాయి. టాప్–5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య ఈ జూన్ నాటికి 15,23,742కు చేరింది. మార్చి చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 15,25,776గా నమోదైంది. టీసీఎస్ సిబ్బంది 6,06,998కి చేరింది. కొత్తగా 5,452 మంది జతయ్యారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3.15 లక్షలకు చేరింది. 1,908 మంది తగ్గారు. హెచ్సీఎల్ టెక్లో దాదాపు 8,000 మంది తగ్గుదలతో మొత్తం సిబ్బంది 2.27 లక్షలకు చేరారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో స్వల్పంగా 337 మంది పెరిగి 2.34 లక్షలకు చేరింది. టెక్ మహీంద్రాకు నికరంగా 2,165 మంది జతకావడంతో మొత్తం ఉద్యోగులు 1.47 లక్షలకు పెరిగారు. అయితే, గతేడాది క్యూ1 నాటి సిబ్బంది సంఖ్యతో పోలిస్తే బిగ్–5 కంపెనీల్లో 46,325 మంది ఉద్యోగులు తగ్గారు. గడిచిన రెండేళ్లలో టాప్–5 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 3 శాతం తగ్గగా... అంతక్రితం మూడేళ్ల కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగారని దీప్తి తెలిపారు. ఐటీ హైరింగ్ విషయంలో సాధారణ స్థాయికి రావడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తాజా గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు. 2,034: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ1లో సీక్వెన్షియల్గా తగ్గుదల.15,23,742: ఈ ఏడాది జూన్ (క్యూ1) చివరి నాటికి ఈ బిగ్5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య 15,23,742. 5: గడిచిన ఐదు త్రైమాసికాలుగా సిబ్బంది తగ్గుదల క్రమంగా శాంతించడం సానుకూలాంశం. ఫ్రెషర్లకు చాన్స్.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల హైరింగ్ భారీగా పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విప్రో సైతం 10,000–12,000 మందికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని పేర్కొంది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో కూడా అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. క్యూ1లో 3,000 మంది ఫ్రెషర్లకు (న్యూ జెన్ అసోసియేట్స్) అవకాశం ఇచి్చనట్లు తెలిపింది. ఇక హెచ్సీఎల్ టెక్ కొత్తగా 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. టీసీఎస్ సైతం క్యాంపస్ హైరింగ్పై దృష్టిపెడుతోంది. మొత్తంమీద ఈ ఐటీ పరిశ్రమ ఫ్రెష్ హైరింగ్ 1,00,000–1,20,000 స్థాయిలో ఉండొచ్చని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఎక్స్ఫెనో అంచనా. గతేడాది 60,000 స్థాయితో పోలిస్తే ఇది భారీగానే లెక్క. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
397 కంపెనీలు.. 1.3 లక్షల మంది బయటకు
2023 ప్రారంభంలో భారీ ఉద్యోగుల తొలగింపులతో కుదేలైన టెక్ పరిశ్రమ.. 2024లో కూడా కోలుకోవడం లేదు. సంస్థల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 130000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయినట్లు 'లేఆఫ్స్.ఎఫ్వైఐ' (Layoffs.fyi) వెల్లడించింది.ఈ సంవత్సరం ఇప్పటి వరకు 397 కంపెనీలలో 130482 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇటీవలే సిస్కో కంపెనీ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. 2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో.. ఈ సారి ఎంతమందిని ఉద్యోగులను తొలగిస్తుందనే విషయాన్ని నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే వెల్లడించనుంది.ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కూడా ఈ ఏడాదిలోనే ఏకంగా 15000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం వర్క్ఫోర్స్లో 15 శాతానికి పైనే అని తెలుస్తోంది. డెల్ టెక్నాలజీస్ కూడా ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్లో దాదాపు 10 శాతం.మైక్రోసాఫ్ట్ గత రెండు నెలల్లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తగ్గించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించనప్పటికీ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు సోషల్ మీడియాల ద్వారా పేర్కొన్నారు. అదేవిధంగా, సాఫ్ట్వేర్ సంస్థ UKG దాని మొత్తం శ్రామిక శక్తిలో 14 శాతం లేదా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా వివిధ సంస్థలు ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు 1.3 లక్షల కంటే ఎక్కువమందిని తొలగించాయి. -
కాంగ్రెస్ పాలనలో తగ్గిన ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు ప్రమాదకరంగా క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త ఐటీ ఉద్యోగాలు 2023-24లో మూడింట ఒక వంతుకు పడిపోయాయన్నారు. ఈ మేరకు మంగళవారం(ఆగస్టు 6) కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. 2022-23లో తెలంగాణలో ఐటీ రంగంలో 1,27,594 కొత్త ఉద్యోగాల సృష్టి జరగగా 2023-24లో కేవలం 40,285 కొత్త ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వృద్ధికి ఆజ్యం పోసే కీలకమైన ఇంజన్ ఐటీ రంగమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అనేక కొత్త విధానాలు, టీఎస్ఐపాస్ సింగిల్ విండో పాలసీ చొరవ కారణంగా ఐటీ రంగం అపూర్వమైన వృద్ధిని సాధించిందన్నారు. ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రెడేషన్, లా అండ్ ఆర్డర్ ఖచ్చితమైన నిర్వహణ రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధిని కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. ఈ రెండు రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. -
గాడి తప్పిన వర్సిటీలు..! పడిపోతున్న విద్యా ప్రమాణాలు
కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నామ్కే వాస్తేగా మారిపోతున్నాయి. పరిశోధనల మాటేమోగానీ.. సాధారణ విద్యా ప్రమాణాలే నానాటికీ పడిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమికితోడు అధ్యాపకుల పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. యూనివర్సిటీల్లో చదువు గతి తప్పుతోంది. విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిఫికెట్లతో మార్కెట్లో ఉద్యోగాలు రావడం లేదని సీఎం రేవంత్ ఇటీవల స్వయంగా పేర్కొన్నారు కూడా. ఇలాంటి సమయంలో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైనా దృష్టిపెడితే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. నిధులు లేక.. పట్టించుకోక.. వందేళ్లపైన చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిదా్యలయం కూడా ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపులో వెనుకబడి ఉంది. ర్యాంకు ఏటా దిగజారుతోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిస్థితీ ఇదే. ఎన్నో సమస్యలున్నాయని ప్రతీ ప్రభుత్వం చెప్తున్నా.. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంటోంది. కొత్త వీసీలు వస్తేగానీ.. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని భావించింది. కానీ అది ముందుకు పడలేదు. నిజానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలే లేరు. ఈ ఏడాది మేలోనే వీసీల పదవీకాలం పూర్తయింది. కొత్తవారి నియామకానికి సెర్చ్ కమిటీలు వేశారు. దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ సెర్చ్ కమిటీలు ఇంతవరకు సమావేశం కాలేదు. వీసీల నియామకం జరిగితే తప్ప ఖాళీల భర్తీ కుదరదు. ఖాళీలు భర్తీ చేస్తే తప్ప బోధన గాడినపడేందుకు ఆస్కారం లేదు. చదువు చేప్పేవాళ్లెక్కడ? రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీయే. అంటే 70శాతం వరకు బోధనా సిబ్బంది లేరు. ఇలా ఉంటే విశ్వవిద్యాలయాల్లో బోధన ఎలా సాగుతుంది? పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే వర్సిటీల్లో 1,528 ఖాళీలున్నట్టు గుర్తించింది. 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నియామకాలు ఆగిపోయాయి. 2021 జనవరి నాటికి ఖాళీల సంఖ్య 1,869కు పెరిగింది. ఇందులో 248 ప్రొఫెసర్, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మరిన్ని పోస్టులూ ఖాళీ అయ్యాయి. మరోవైపు బోధనేతర సిబ్బంది ఖాళీలూ భారీగానే ఉన్నాయని.. మొత్తంగా 4,500కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. ఏ వర్సిటీ చూసినా.. అన్నీ ఖాళీలే..! కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్, పార్ట్టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలేవీ ముందుకు సాగడం లేదు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో బోధన మొక్కుబడిగా ఉందనే విమర్శలున్నాయి. ల్యాబ్లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర మౌలిక వసతులు లేవు. జేఎన్టీయూహెచ్లోనూ ఇదే దుస్థితి. నిజాం కాలేజీ, కోఠిలోని విమెన్స్ యూనివర్సిటీలోనూ చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేదు. – కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. – మహబూబ్నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ విభాగాలకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేరు. కాంట్రాక్టు లెక్చరర్లతో అరకొరగా కొనసాగిస్తున్నారు. – ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత చెప్పుకోదగ్గ వర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు. ఈ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీయే. – నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి. కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. – నిజామాబాద్లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మేథ్స్, ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్స్, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. సదుపాయాలూ సరిగా లేక.. చాలా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి సౌకర్యం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లు, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉంటోందని అంటున్నారు. పాలమూరు వర్సిటీ హాస్టళ్లలో గదుల తలుపులు, కప్బోర్డులు విరిగిపోయాయి. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఉస్మానియా వర్సిటీ భవనాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిని బాగు చేయాలంటే నిధుల కొరత వెంటాడుతోందని అధికారులు చెప్తున్నారు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులే.. విశ్వవిద్యాలయాల్లో 11 ఏళ్లుగా బోధన సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు. వారిపైనా విపరీతమైన పనిభారం ఉంటోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పరి్మనెంట్ చేయలేదు. తక్షణమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి, ఉన్నత ప్రమాణాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.పరమేశ్వర్ (తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ సంఘం నేత) -
జాబ్ కేలండర్ను శాసనసభకు సమర్పించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడే జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తు న్న జాబ్ కేలండర్ మరికొన్ని గంటల్లో వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభ వేదికగా జాబ్ కేలండర్ను ప్రకటించనుంది. ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీలవారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో జాబ్ కేలండర్ను ప్రకటించనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాబ్ కేలండర్ సహా కొత్త రేషన్కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, మూసీ నది ప్రక్షాళన, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్ కేలండర్కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఈ అంశంపై చర్చలో ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు చేసేందు కు సిద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో తెల్లరేషన్కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్నికల్లో ఇచి్చన మరో హామీ మేరకు త్వరలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల (హెల్త్ ప్రొఫెల్ కార్డులు)ను విడివిడిగా జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విధివిధానాలు రూపొందించి సత్వరమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం నెలలోగా నివేదిక ఇస్తుందని పొంగులేటి చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం, అమేర్ అలీఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ గతంలో ప్రభుత్వానికి తిప్పిపంపడం తెలిసిందే. దీంతో వారి పేర్లనే మళ్లీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టులకు సిఫారసు చేస్తూ గవర్నర్కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు ⇒ కేరళలోని వయానాడ్లో ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక, వైద్య, సహకారం అందించాలి. ⇒ షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో 600 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలంతోపాటు నిఖత్ జరీన్, సిరాజ్కు గ్రూప్–1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం. ⇒ ఇటీవల విధి నిర్వహణలో మరణించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్కు మున్సిపల్ కమిషనర్గా విధినిర్వహణలో మరణించిన అదనపు డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2007లో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 437 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదం. ⇒ ఖాయిలాపడిన నిజాం షుగర్స్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి. మంత్రి శ్రీదర్బాబు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ప్రకారం రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయాలి. ⇒ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ శివారులోని శామీర్పేట చెరువుకు తరలించి అక్కడి నుంచి ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించాలనే ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్. 10 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటికి, మిగిలిన 5 టీఎంసీలను నగర పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నింపడంతోపాటు మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీళ్లు ఉండేలా వదలాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమరి్పంచిన నివేదికపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చ నిర్వహణకు నిర్ణయం. -
Telangana: రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ను కేబినేట్ ఆమోదించిందని పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేరళలో వయనాడ్లో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడంతోపాటు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే అర్హులైన పేదలందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం.క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందిగౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్పేట చెరువు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు -
కూటమి సర్కార్ కొత్త కుట్ర పేదలపై పెత్తనం
-
1.2 కోట్ల మందికి జాబ్ గండం.. గుబులు పుట్టిస్తున్న నివేదిక!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మానవ ఉద్యోగాలను హరించేస్తోంది. రానున్న రోజుల్లో సాధారణ ఉద్యోగాలు పొందడం చాలా కష్టతరం చేయబోతోంది. ముఖ్యంగా ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే పరిశ్రమలలో పనిచేసేవారికి ముప్పు తప్పదని కెరీర్ నిపుణులు చెబుతున్నారు.బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. ఏఐ ఆగమనం కస్టమర్ సర్వీస్ రెప్స్, క్యాషియర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, ప్రొడక్షన్ వర్కర్లకు పెద్ద హెచ్చరిక. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన లేబర్ మార్కెట్, డిజిటల్ టెక్ పరిశోధకుడు జార్జియోస్ పెట్రోపౌలోస్ ప్రకారం, "మీడియం-స్కిల్డ్" కార్మికులు సాంకేతికత ద్వారా స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది.అధిక-నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా తమ ప్రస్తుత ఉద్యోగాల్లోకి ఏఐని జోడించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి సేవలకు మాత్రం నిరంతర డిమాండ్ ఉంటుంది. ప్రధాన స్రవంతిలోకి ఏఐ మరింతగా చొచ్చుకుని రావడం వల్ల రానున్న దశాబ్దాల్లో మీడియం-స్కిల్డ్ కార్మికుల్లో అధిక నిరుద్యోగం ఏర్పడుతుందని పెట్రోపౌలోస్ అంచనా వేస్తున్నారు. 20 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏఐతో నడిచే జాబ్ మార్కెట్కి మారుతుంది అంటున్నారాయన.యూఎస్ జాబ్ మార్కెట్లో ఏఐ ప్రభావం కారణంగా తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు డిమాండ్ కోల్పోతారని అంచనా వేస్తున్నారు మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్వెలిన్ ఎల్లింగ్రూడ్. ఈయన ప్రకారం.. 2030 నాటికి 1.2 కోట్ల మంది ఉద్యోగులు వేరే కెరీర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ దశాబ్దం చివరి నాటికి 6,30,000 క్యాషియర్లు, 7,10,000 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, 8,30,000 మంది సేల్స్ ఉద్యోగులు ఉపాధిని కోల్పోతారని మెకిన్సే అంచనా వేసింది. అన్ని పరిశ్రమల్లోని క్లర్క్ల సంఖ్య 1.6 కోట్లు తగ్గుతుందని ఈ సంస్థ గత ఏడాది ఒక నివేదికలో పేర్కొంది. -
మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచి్చనట్టు చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, అదేవిధంగా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో వచ్చిన ఖాళీలు కలిపి 30 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన అత్యంత కీలక అంశాల్లో ఉద్యోగాల భర్తీ ఒకటని, అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సరీ్వసెస్ అండ్ సివిల్డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్లో పాల్గొన్న 483 మంది ఫైర్ మెన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అగి్నమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో కలిసి పరేడ్ను పరిశీలించారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన వారికి ట్రోఫీలను, అదేవిధంగా అగి్నమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్లుగా నియమితులైన 157 మందికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి నియామక పత్రాలను అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. జాబ్ కేలండర్ ద్వారా ప్రతి ఖాళీ భర్తీ ‘ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందించాం. ఇప్పటికే ఇచి్చన ఉద్యోగాలతో పాటు త్వరలో భర్తీకానున్న పోస్టులు కలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసినట్టవుతుంది.రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ కేలండర్ ద్వారా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మంత్రులు, అధికారుల దృష్టికి తెండి. నిరసనలు తెలపాల్సిన పనిలేదు.. ఆందోళన చెందాల్సిన పని అంతకంటే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు మీకు అందుబాటులో ఉంటారు. సహేతుకమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు మీ రేవంత్ అన్నగా ఎప్పుడూ నిబద్ధతతో పని చేస్తా..’అని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది.. ‘ప్రభుత్వ ఉద్యోగులకు యజమాని రాష్ట్ర ప్రభుత్వం. యజమాని ప్రతి నెలా ఒకటో తారీఖున జీతం ఇవ్వకపోతే ఆ ఉద్యోగి విశ్వాసం కోల్పోతాడు. గత ఎనిమిదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితి తెచి్చంది. పదవీ విరమణ పొందిన వారికి పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక నిబద్ధతను పాటించి.. ప్రతి నెలా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఫించన్ అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా గురువారం నాటి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకు, ఉపాధికి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రైతులకు సహాయం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం..’అని సీఎం తెలిపారు. ఇది ఉద్యోగం కాదు..సమాజ సేవ ‘కఠినమైన ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకుని సమాజానికి సేవలందించేందుకు 483 మంది ముందుకు వచి్చనందుకు సంతోషంగా ఉంది. ఫైర్ సిబ్బంది అంటే కేవలం జీత భత్యాల కోసమే పని చేసేవారు కాదు. వరదలు ఇతర ఏ విపత్తు వచ్చినా ప్రాణాలు త్యాగం చేసైనా ప్రజలను కాపాడతామన్న సామాజిక బాధ్యత తీసుకోవడం..’అని రేవంత్ అన్నారు.యువకులను సుశిక్షితులుగా మార్చిన తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగులను సీఎం అభినందించారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఫైర్ డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అగ్నిమాప శాఖ డైరెక్టర్ జీవీ నారాయణరావు , ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మరో పదేళ్లలో ఈ ఉద్యోగాలు ఉండవు!.. లింక్డ్ఇన్ కో-ఫౌండర్
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కారణంగా ఇప్పటికే పలు కంపెనీల్లో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. రాబోయే పదేళ్లలో చాలా సంస్థల్లో 9 టూ 5 ఉద్యోగాలు (ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే ఉద్యోగాలు) కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్మన్ పేర్కొన్నారు.ఏఐ కారణంగా కంపెనీలు మనుషులతో చేయించుకునే పనిభారం తగ్గించుకుంటాయి. పని వేగాన్ని పెంచుకుంటాయి. వర్క్ఫోర్స్ విధానంలో గణనీయమైన మార్పులు ఏర్పడతాయి. అయితే డేటా భద్రతకు సమ్వబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రీడ్ హాఫ్మన్ వెల్లడించారు.రీడ్ హాఫ్మన్ గతంలో అంచనా వేసిన చాలా అంశాలు నిజమయ్యాయి. చాట్జీపీటీ వంటి సాధనాలు రాకముందే.. 1997లోనే సోషల్ మీడియా, షేరింగ్ ఎకానమీ, ఏఐ విప్లవం పెరుగుదలను హాఫ్మన్ ఊహించినట్లు తపారియా పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా తప్పకుండా జరుగుతాయని పేర్కొన్నారు. 1934 నాటికి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రవేశిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. -
ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పథకంలో ఈ ఏడాది మేలో 23 లక్షల మంది కొత్త ఉద్యోగులు చేరారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వీరి సంఖ్య 13.9% పెరిగింది. నెలవారీగా ఈఎస్ఐసీలో చేరే సరాసరి ఉద్యోగులు 16.4 లక్షల మందితో పోలిస్తే 39.9% వృద్ధిని నమోదు చేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది.ఈఎస్ఐసీ తాజాగా విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం..2024 ఏప్రిల్లో ఈఎస్ఐసీ పరిధిలో 18,490 మంది చేరారు. అదే మేలో మాత్రం ఆ సంఖ్య 20,110 కు చేరింది. మే నెలలో నమోదైన మొత్తం 23 లక్షల ఉద్యోగుల్లో 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 11 లక్షల మంది, మహిళలు 44 వేలు, 60 మంది ట్రాన్స్జెండర్ ఉద్యోగులు ఈఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్నారు. నెలవారీ వేతనం రూ.21,000 వరకు ఉంటే వారి జీతాల్లో 0.75% ఈఎస్ఐ కింద జమ చేస్తారు. సంస్థ యాజమాన్యం మరో 3.25% విరాళంగా అందిస్తుంది. మొత్తం 4% నగదు ఈఎస్ఐలో జమ అవుతుంది. ఇది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య, నగదు ప్రయోజనాలను అందించేందుకు ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: వీడియో స్ట్రీమింగ్ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి -
మన ముందున్న కర్తవ్యం ఇదే!.. బడ్జెట్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెన్ను ఉద్దేశించి, తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. వికసిత భారత్ను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలలో ఉద్యోగ కల్పన గురించి వెల్లడించడాన్ని అంశాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం ప్రశంసనీయం. దీనికి తగిన విధంగా ప్రైవేట్ రంగం కృషి చేయాలి. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రైవేట్ రంగం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, మన ముందున్న కర్తవ్యం ఇదే అని.. ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే.. రాబోయే రోజుల్లో విపత్తుగా మారే అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో మనదేశం ప్రపంచమే అసూయపడేలా మనదేశం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.We are the envy of the world in terms of our growth in GDP.We are the preferred destination of the world for investment because of the belief in our future.But the vital task ahead for us is to ensure that this growth is now accompanied by an explosion in job-creation.… pic.twitter.com/Z73BKJwWR1— anand mahindra (@anandmahindra) July 24, 2024 -
ఈ దశాబ్దం చివరి నాటికి 10 కోట్ల ఉద్యోగాలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి వీలు కల్పించే ఆలయ కారిడార్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత పర్యాటక రంగం బాగా పెరిగింది.2021లో ఆధ్యాత్మిక పర్యాటకుల సంఖ్య 677 మిలియన్లు. ఇది 2022 నాటికి 1439 మిలియన్లకు పెరిగింది. ఆదాయం కూడా 7.9 మిలియన్ డాలర్ల నుంచి.. 16.2 మిలియన్ డాలర్లకు పెరిగిందని పర్యాటకశాఖ వెల్లడించింది. అంతే కాకుండా ఈ రంగంలో జీవనోపాధి కూడా పెరుగుతోందని వెల్లడించారు. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో వంద మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.హై-స్పీడ్ రైళ్ల ద్వారా మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, చిన్న నగరాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కృషి చేశాయి.విదేశీ పర్యాటకుల కోసం మాల్స్, షాప్స్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలకు వడ్డీ రహిత ఋణాలు మంజూరు చేశారు. ఈ రకమైన అభివృద్ధిని ఆర్థిక ప్రోత్సాహకంగా మాత్రమే కాకుండా, మరింతగా చూడటం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు ఆధ్యాత్మిక శ్రేయస్సును కోరుతున్నారు. -
ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!.. కేంద్రం కీలక ప్రకటన
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య (సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనాను అందించింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారు. ఆర్థిక వృద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది.శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది.వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్ను, ప్రస్తుతం ఉన్న PLI (5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్స్టైల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది. -
18 లక్షల జాబ్స్.. అభ్యర్థులు కరువు!
దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని వార్తల్లో చూస్తున్నాం. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు వేల సంఖ్యలో అభ్యర్థులు వస్తుండటం గమనిస్తున్నాం. అయితే ఆర్థిక సేవల రంగంలో మాత్రం సరైన అభ్యర్థుల్లేక లక్షల్లో జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.గత ఏడాది ఆర్థిక సేవల రంగంలో దాదాపు 18 లక్షల ఉద్యోగాలు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయాయని, దీంతో ఆ రంగం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఎఫ్పీఎస్బీ ఇండియా (ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్) ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.ఆర్థిక సేవల రంగంలో దాదాపు 6,000 మందికి ఉపాధి కల్పిస్తున్న గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీ వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో దాదాపు 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎఫ్పీఎస్బీ ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పీటీఐకి తెలిపారు."గత సంవత్సరం, కేంద్ర ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ అందించిన డేటా ప్రకారం, భారత్ ఆర్థిక సేవలలో 46.86 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. వాటిలో 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. 18 లక్షల ఉద్యోగాలకు అభ్యర్థులు లేరని చూపిస్తోంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటికి తగిన సామర్థ్యం కలిగిన అభ్యర్థులు లేరు" అని మిశ్రా అన్నారు."బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఎల్లప్పుడూ శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుంది. మీరు ఆన్లైన్ జాబ్ సెర్చ్ చేస్తే, ప్రస్తుతం ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) నిపుణులకు 40 రెట్లు అధికంగా ఉద్యోగఖాళీలున్న విషయం తెలుస్తుంది”అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది సీఎఫ్పీ నిపుణులు ఉండగా భారత్లో 2,731 మంది మాత్రమే ఉన్నారు. -
నిరుద్యోగంలో రికార్డ్ బ్రేక్: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా తూర్పార బట్టారు. మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సరకుల లోడింగ్ కేంద్రం వద్ద చిరు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత క్యూ వరసల్లో నిల్చుని తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు. ‘‘ కొద్దిరోజుల క్రితం ముంబైలో మోదీ మాట్లాడు తూ మేం కోట్లాది మందికి ఉపాధి కల్పించి రికార్డ్లు బ్రేక్ చేశామని ఢంకా బజాయించారు. కానీ అదే ముంబైలో చిన్నపాటి ఉద్యోగాల కోసం వేలాదిగా యువత ఆశతో ఎగబడటం మనందరం చూశాం. ఇదే ఏడాది గుజరాత్లో 25 ఉద్యోగాల కోసం ఏకంగా లక్షలాది మంది నిరుద్యోగులు తండోపతండాలుగా తరలిరావడమూ మనందరికీ తెల్సిందే. ఇవన్నీ చూస్తుంటే రికార్డ్లు బ్రేక్ అయినట్లు తెలుస్తూనే ఉంది. కానీ ఆ రికార్డ్లు నమోదైంది ఉద్యోగాల్లో కాదు నిరుద్యోగంలో. దేశాన్ని తీవ్ర నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా మోదీ ఉత్తమాటలు చెప్పడం మానేసి ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టాలి’’ అని ప్రియాంక నిలదీశారు. -
20వేల జీతం.. జాబ్ కోసం పోటెత్తిన 25వేల మంది నిరుద్యోగులు.. తొక్కిసలాట
ముంబై : ముంబై ఎయిర్ పోర్ట్కు నిరుద్యోగులు పోటెత్తారు. 600 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు 25 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మంగళవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటకు దారితీసింది. ఎయిరిండియాకు మొత్తం 2,200 మంది ఎయిర్ లోడర్లు అవసరం. ప్రస్తుతం 600 మంది ఎయిర్పోర్ట్ లోడర్ల (హ్యాండీమ్యాన్) కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 25వేలమందికి కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. అయితే అభ్యర్ధుల్ని ఎంపిక, ఫారమ్ల ధరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. జాబ్ అప్లికేషన్ కోసం అభ్యర్ధులు ఎగబడడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయినట్లు సమాచారం. దరఖాస్తుదారులు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. జీతం రూ.25వేలుఎయిర్పోర్ట్ లోడర్ల జీతం నెలకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది.అయితే చాలా మంది ఓవర్టైమ్ అలవెన్సుల తర్వాత రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హతలు తప్పని సరి. శారీరకంగా బలంగా ఉంటే సరిపోతుంది.500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక 25వేల మంది అభ్యర్ధుల్లో ఒకరైన బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ప్రథమేశ్వర్ ఈ ఇంటర్వ్యూ కోసం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాకు నుంచి ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రథమేశ్వర్ మాట్లాడుతూ.. నేను ఎయిర్పోర్ట్ లోడర్ జాబ్కు అప్లయ్ చేయడానికి వచ్చాను. ఈ ఉద్యోగానికి రూ.22,500 మాత్రమే ఇస్తారంట అని నిట్టూర్చాడు.ఈ ఉద్యోగం వస్తే చదువు మానేస్తారా అని ప్రశ్నించగా.. ‘ఏం చేస్తాం.. ఇంత నిరుద్యోగం ఉంది.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయిన ముంబై ఎయిర్ పోర్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
8 కోట్ల ఉద్యోగాలపై ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే: ఖర్గే
ఢిల్లీ: దేశంలో గడిచిన నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘‘ ప్రధాని మోదీ నిన్న(శనివారం) ముంబైలో ఉద్యోగాల కల్పనపై అబద్దాలు చెప్పారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ( ఎన్ఆర్ఏ)పై మీరు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాను. కోట్ల మంది యువకులు ఎన్ఆర్ఏ ఒక వరం. ఒకే జనరల్ ఎగ్జామ్.. అనేక పరీక్షలను నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అభ్యర్థులు సమయం, వనరులను ఆదా చేస్తుంది. .. దీంతో పారదర్శకత కూడా పెరుగుతుంది. ఈ నాలుగు ఏళ్లలో ఎన్ఆర్ఏ ఒక్క పరీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు. దాని నిర్వహణకు కేటాయించిన మొత్తం రూ. 1517 కోట్లకు కేవలం రూ. 58 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేశారు. ఎన్ఆర్ఏ అనేది ఉద్యోగాల నియామకానికి ఏర్పాటు చేశారా?. లేదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ నిజర్వేషన్లను లాక్కోవడానికి ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేస్తున్నారా?’ ’అని మోదీపై ప్రశ్నలు సంధించారు.శనివారం ప్రధాని మోదీ ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొని రిజర్వు బ్యాంక్ రిపోర్టు ప్రకారం 2023-24లో భారత్ 4.7 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మొత్తంగా నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి ఉద్యోగాలపై అసత్యాలు ప్రచారం చేసేవారిని మాట్లాడనివ్వకుండా చేసిందని ప్రతిపక్షాలను విమర్శలు చేశారు. పెట్టుబడులు, మౌలిక వనరుల అభివృద్ధి, దేశాభివృద్దిపై అసత్యాలు ప్రచారం చేసే శత్రువులన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు. -
వైరల్ వీడియో : 10 ఉద్యోగాల కోసం ..ఇంటర్వ్యూకి 1800 మంది హాజరు
అహ్మదాబాద్ : దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి ఈ వీడియోనే నిదర్శనం అంటూ నెటిజన్లు ఓ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.ఝగాడియాలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంప్లెక్స్ కేంద్రంగా పని చేస్తున్న థెర్మాక్స్ గ్లోబల్ అనే సంస్థ అంక్లేశ్వర్లోని ఓ హోటల్లో 10 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూకి 1,800 మంది రావడం, వారి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హోటల్ రెయిలింగ్ ఊడిపోయి పలువురు కింద పడిపోయారు.नरेंद्र मोदी का गुजरात मॉडलगुजरात के भरूच में एक होटल की नौकरी के लिए बेरोजगारों की भारी भीड़ जुट गई.हालात ऐसे बने कि होटल की रेलिंग टूट गई और गुजरात मॉडल की पोल खुल गई.नरेंद्र मोदी इसी बेरोजगारी के मॉडल को पूरे देश पर थोप रहे हैं. pic.twitter.com/1GPXkqeMsk— Congress (@INCIndia) July 11, 2024 ఆ దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్ కావడంతో..బీజేపీ పాలిత గుజరాత్లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో చూడండి అంటూ కాంగ్రెస్ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇదేనా గుజరాత్ మోడల్ అంటూ ప్రశ్నించింది.గుజరాత్ నిరుద్యోగాన్ని మోదీ దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నారని ఎద్దేవా చేసింది. దీంతో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెడుతూ గుజరాత్ బీజేపీ యూనిట్ స్పందించింది. ఈ కంపెనీలో జరిగే ఇంటర్వ్యూలో అనుభవం ఉన్నవారికే. కాబట్టి అక్కడి వచ్చిన వారంతా నిరుద్యోగులు కాదని ఎక్స్ వేదికగా కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చింది. 📽️ Watch | Railing Collapses As 1,800 Aspirants Turn Up For 10 Jobs In Gujarat https://t.co/Vy4eJUjq2b pic.twitter.com/87fdRurayS— NDTV (@ndtv) July 11, 2024 -
2024 యూనియన్ బడ్జెట్: ఉద్యోగ కల్పనపై దృష్టి!
ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై.. ఆగష్టు 12 వరకు జరగనున్నాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను జులై 23న లోక్సభలో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇటీవలే వెల్లడించారు.త్వరలో ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో నిర్ణయించిన GDPలో 5.1% ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉంటుందని, దీర్ఘకాలిక ఆర్థిక విధానానికి సంబంధించిన విస్తారమైన ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ కల్పన ఉంటుందని భారతదేశ ప్రధాన ఆర్థికవేత్త శాంతను సేన్గుప్తా పేర్కొన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వేగంగా వృద్ధి వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఉద్యోగాల కల్పనలో మాత్రమే వెనుకబడింది. రాబోయే దశాబ్దంలో 7% GDP వృద్ధి కూడా ఉద్యోగ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త సమీరన్ చక్రవర్తి ఒక నోట్లో తెలిపారు. 7 శాతం వృద్ధి రేటు 80 లక్షల నుంచి 90 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. నిజానికి కావాల్సిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.ఈ ఏడాది జరిగిన జాతీయ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. మిత్రపక్షాల సహాయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. పోస్ట్ పోల్ సర్వేలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణంగానే బీజేపీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయిందని వెల్లడించాయి. అంతే కాకుండా ప్రతి పక్షం కూడా దేశంలో నిరుద్యోగ సమస్య గురించి చెబుతూనే ఉంది. కాబట్టి రాబోయే బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు అనుగుణంగా ఉండే ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఉద్యోగం రాలేదా..? మీకోసమే ఈ ఉచిత కోర్సులు..
గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారిని పక్కింటివారు, మిత్రులు, బంధువులు.. ‘చదువు అయిపోయింది కదా. ఏ ఉద్యోగం చేస్తున్నావు?’ అని సాధారణంగా అడుగుతుంటారు. సరైన స్కిల్స్ లేని వారు ‘ఇంటికి వచ్చినవాళ్లు పనిచూసుకుని వెళ్లిపోక నా గురించి ఎందుకు’ అని మనసులో అనుకొని పైకి నవ్వుతూ ‘ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా’ అని చెబుతుంటారు. సరైన నైపుణ్యాలు లేనివారు సైతం ఉద్యోగంలో స్థిరపడేలా నిపుణులు కొన్ని ఉచిత కోర్సులను సూచిస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమమేధ రంగానికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే కదా. ఏఐలో సరైన కోర్సులు ఎంచుకుని కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఏడబ్ల్యూఎస్ సర్వే ప్రకారం కింది కోర్సులు చేస్తే మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.కంపెనీలు ఏఐ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏడబ్ల్యూఎస్ సర్వే ప్రకారం.. 73 శాతం కంపెనీలు ఏఐ నిపుణులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. కానీ, దాదాపు ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రతి నలుగురిలో ముగ్గురు కంపెనీ అంచనాలను చేరుకోవడం లేదు. ఏఐ రంగంలో అపార అవకాశాలున్నాయి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, డేటా అనాలసిస్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ టూల్స్.. వంటి విభాగాల్లో నిపుణుల కొరత ఉంది.స్ప్రింగ్బోర్డ్ స్టేట్ ఆఫ్ ది వర్క్ప్లేస్ స్కిల్స్ గ్యాప్ 2024 నివేదిక ప్రకారం..చాలా కంపెనీల్లో 70 శాతం మంది ఉన్నతస్థాయి ఉద్యోగుల్లో నైపుణ్యాల కొరత ఉంది. సరైన స్కిల్స్ లేని ఉద్యోగులతోనే చాలా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో పనిచేస్తున్న మూడో వంతు ఉద్యోగులతో పరిమిత ఆవిష్కరణలు జరిపి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. దాదాపు 40 శాతం మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్లు తమ సంస్థలో నైపుణ్యాల అంతరం పెరిగిందని అంగీకరిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్ నోటీసులు!ఈ వార్త చదువుతున్న సమయంలో ప్రపంచంలో ఎక్కడోచోట కొత్త ఆవిష్కరణకు నాందిపడి ఉండవచ్చు. టెక్నాలజీ ఇంత వేగంగా వృద్ధి చెందుతున్న క్రమంలో అందుకు అనువుగా స్కిల్స్ వృద్ధి చేసుకోకపోతే ఉద్యోగం రావడం కషం. నిపుణులు సూచించే కింది ఉచిత కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకుని సరైన విధంగా కష్టపడితే ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికం.1. ఆర్ఐటీ(ఎక్స్)-రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందిస్తున్న క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్సు. ఇది ఎడెక్స్(edX)లో అందుబాటులో ఉంది.ఔ2. ఇంపీరియల్ కాలేజ్ లండన్ క్రియేటివ్ థింకింగ్ అందిస్తున్న టెక్నిక్స్ అండ్ టూల్స్ ఫర్ సక్సెస్ కోర్సు కోర్సెరాలో అందుబాటులో ఉంది.3. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ అందిస్తున్న స్ట్రాటజిక్ థింకింగ్ ఫర్ ఎవ్రీవన్ స్పెషలైజేషన్ కోర్సు. దీన్ని కోర్సెరాలో నేర్చుకోవచ్చు.4. కోర్సెరాలో ఐబీఎం అందిస్తున్న ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).5. వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్. ఇది కోర్సెరాలో ఉంది. 6. గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సు. ఇది కూడా కోర్సెరాలో నేర్చుకోవచ్చు.పైన తెలిపిన కోర్సులు కేవలం కొత్తగా ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారికే కాదు. ఉద్యోగం మారాలనుకునేవారికిసైతం ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. -
ఐఫోన్ ప్లాంట్లో వివాహితలకు ‘నో జాబ్’.. రంగంలోకి దిగిన కేంద్రం
దేశంలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్కాన్ ప్లాంటులో ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందని రాయిటర్స్ ఓ సంచలన కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.1976 నాటి సమాన వేతన చట్టాన్ని ఉటంకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య ఎటువంటి వివక్ష చేయరాదని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైన్నై సమీపంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్ బయటపెట్టిన నేపథ్యంలో తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్కాన్ యాజమాన్యాలు వెంటనే స్పందించలేదు.రాయిటర్స్ మంగళవారం ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఫాక్స్కాన్ తమిళనాడులోని చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంటులో ఉద్యోగాల కోసం వివాహిత మహిళలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని కనుగొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసిన ఫాక్స్కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, గర్భం, అధిక గైర్హాజరును ఫాక్స్కాన్ ప్లాంట్లో వివాహిత మహిళలను నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. -
ఏపీ నిట్.. ప్లేస్మెంట్స్లో హిట్
తాడేపల్లిగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నవారికి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేఆఫ్లు కొనసాగుతున్నా.. ఏపీ నిట్ విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు దక్కుతున్నాయి. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు. 2022 బ్యాచ్లో 98 శాతం, 2023లో 97 శాతం మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. ఏపీ నిట్ ప్రారంభించిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏడాదికి 300 మందికి తక్కువ కాకుండా ఉద్యోగాలు పొందడం విశేషం. త్వరలో 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆరో బ్యాచ్ బయటకు రానుంది. 258 మందికి ఉద్యోగాలుక్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఏకంగా 127 కంపెనీలు నిట్ ప్రాంగణానికి వచ్చాయి. ఆరో బ్యాచ్ విద్యార్థుల్లో ప్లేస్మెంట్స్ కోసం 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 258 మంది (65.82 శాతం)కి ఉద్యోగాలు లభించాయి. సరాసరి వేతనం రూ.7.15 లక్షలుగా ఉంది. బీటెక్ ఫైనలియర్ సీఎస్ఈ చదువుతున్న ఆదర్‡్ష, ఈసీఈ విద్యార్థి ఆకాష్కుమార్ సిన్హా అత్యధికంగా రూ.44.1 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు. వీరిని నివిధ కంపెనీ ఎంపిక చేసుకుంది. అలాగే సీఎస్ఈ విద్యార్థి సలాది వెంకట శశిభూషణ్.. పేపాల్ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో, సీఎస్ఈ బ్రాంచ్కే చెందిన స్వామి సక్సేనా జెడ్ఎస్ కేలర్లో రూ.26.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం విశేషం. కాగా డిసెంబర్ వరకు ప్లేస్మెంట్స్ ప్రక్రియ కొనసాగనుంది.480 సీట్ల భర్తీనిట్లో 2024–25 సంవత్సరానికి సంబంధించి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మొదటి రౌండ్లో 480 సీట్లకు అలాట్మెంట్లు పూర్తయ్యాయని రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. నిట్లో సీఈసీ, ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్ల్లో 90 సీట్ల చొప్పున ఉన్నాయన్నారు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్ల్లో 60 చొప్పున, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎంఎంఈ బ్రాంచ్ల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 480 సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా కేటాయించామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24లోపు ఆన్లైన్ రిపోర్టింగ్తో పాటు ఫీజు చెల్లించాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో నిట్ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం నిట్లో ప్రత్యేక కేంద్రం పనిచేస్తోందన్నారు. -
నో లెర్నింగ్.. నో అప్డేట్
సాక్షి, హైదరాబాద్: చేసే పనిలో అప్డేట్ కావాలంటే...తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి. కానీ తొంభైశాతం మంది భారత వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కమిట్మెంట్లు, బిజీ వర్క్షెడ్యూళ్లు తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టమైంది. తాము పనిచేస్తున్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు వివిధ రూపాల్లో నైపుణ్యాలు పెంచేందుకు సానుకూల దృక్పథంతోనే ఉన్నా, దీనికి సంబంధించి తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడంలో దేశంలోని దాదాపు 80 శాతందాకా వృత్తి నిపుణులు విఫలమవుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇతర రూపాల్లోని ప్రతిబంధకాలు అధిగమించి కొత్తవి నేర్చుకునే విషయంలో అత్యధికుల అనాసక్తి కనబరుస్తున్నారు. 2030 సంవత్సరం నాటికల్లా ప్రపంచస్థాయిలోనే కాకుండా భారత్లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగాలు, బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు, కంపెనీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృత్తినిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, చేసే పని పద్ధతులు, విధానాల్లో మార్పులపై అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నెట్వర్కింగ్ సంస్థ ‘లింక్డ్ ఇన్’ విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వెనుకబాటుకు కారణాలు.. వృత్తి నిపుణులు కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడంలో వెనుకబాటుకు పలు కారణాలు నివేదికలో పొందుపరిచారు. 34 శాతం మంది కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు 29 శాతం మంది చేస్తున్న పనిలో బిజీ వర్క్ షెడ్యూ ల్26 శాతం మంది నేర్చుకునేందుకు వనరులు, విధానాలు లెక్కకు మించి ఉండడంతో ఏదీ తేల్చుకోలేకపోవడంఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘లౌడ్ లెర్నింగ్’» పని ప్రదేశాల్లో లేదా ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడే మౌఖికంగా లేదా ఇతర కొత్త విషయాలను అర్థమయ్యేలా చేయగలిగితే అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. » తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తమకు ఉపయోగపడుతుందని 81 శాతం మంది చెప్పారు. » ఈ విధానంలో నిమగ్నమై కొత్త విషయాలను నేర్చుకుంటున్నవారు 64 శాతం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది.» ‘లౌడ్ లెర్నింగ్’లో భాగంగా తమ టీమ్ సభ్యుల నుంచి మెళకువలు నేర్చుకోవచ్చునని 40 శాతం మంది చెప్పగా, 35 శాతంమంది తాము నేర్చుకునే విషయాలకు సంబంధించి టీమ్ సభ్యులకు వివరించడం ద్వారా అంటున్నారు. » అనుభవజ్ఞులైన వృత్తినిపుణుల గైడెన్స్లో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా 28 శాతం మంది తమ కెరీర్లో ముందుకెళ్లేందుకు దోహదపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. » నైపుణ్యాల మెరుగుదలతో కొత్త వృత్తుల్లో అవకాశాలు లభిస్తాయని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. » తమతో పనిచేస్తున్న వృత్తినిపుణులు, ఉద్యోగుల అనుభవసారం, ఆయా అంశాలపై వారికున్న విషయ దృష్టిని గ్రహించడం ద్వారా ప్రయోజనం చేకూరుతోందంటున్న 26 శాతం మంది చెప్పారు. -
చైనా యువత వినూత్న నిరసన .. ఎందుకో తెలుసా?
బీజింగ్ : చైనా యువత నిరసన తెలపడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా పక్షుల తరహాలో being a bird దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న మతిలేని చర్యే కారణమని తెలుస్తోంది. చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి. వారానికి 6 రోజులు పనిదినాలు. అయితే ఈ వర్క్ కల్చర్ను ఉద్యోగులు,యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. పనివిధానం, లేదంటే గంటల కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్రేస్లాంటి వర్క్ కల్చర్ , 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఇక.. చైనాలోని యువత సోషల్ మీడియాలో దేశ పని సంస్కృతిపై తమ నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయి లాన్ అనే పదాన్ని ట్రెండ్ చేశారు. ఎన్బీయే బాస్కెట్ బాల్ వీడియో గేమ్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్ బాల్ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమగళాన్ని వినిపించారు. -
భారత్లో బాధపడుతున్న ఉద్యోగులు ఎందరంటే..
భారత్లో వందలో 86 మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారని ‘గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్ప్లేస్’ నివేదిక వెల్లడించింది. మిగతా 14 శాతం మంది వృత్తిపరంగా నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉన్న 34 శాతం ఉద్యోగులతో పోలిస్తే తక్కువ.గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్ప్లేస్ నివేదిక రూపొందించేందుకు ఉద్యోగులను మూడు కేటగిరీలు(అభివృద్ధి చెందుతున్న, కష్టపడుతున్న, బాధపడుతున్న ఉద్యోగులు)గా విభజించినట్లు తెలిపారు. ప్రస్తుత వృత్తిజీవితంతోపాటు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నవారిని అభివృద్ధి చెందుతున్నవారిగా పరిగణించారు. దీనికి విరుద్ధంగా వృత్తిలో ప్రతికూల వాతావరణాన్ని అనుభవిస్తున్నవారు, రోజువారీ ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలను ఎదుర్కొంటున్నవారిని ‘కష్టపడుతున్న, బాధపడుతున్న’ కేటగిరీలోకి చేర్చారు.నివేదికలోని వివరాల ప్రకారం..భారత్లో 86 శాతం మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారు. 14 శాతం మంది వృత్తిపరంగా తాము నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 34 శాతం ఉద్యోగులున్నారు. దక్షిణాసియాలో ఇలా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో 15 శాతం ఉద్యోగులున్నారు. నేపాల్ ఇది 22 శాతంగా ఉంది. శ్రీలంకలో అత్యధికంగా 62 శాతం, ఆఫ్ఘనిస్తాన్లో 58 శాతం ఉద్యోగులు రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఇది 32 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?ఇదిలాఉండగా, పనిఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉద్యోగులు మంచి వ్యాపకాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ యాజమాన్యాలు టార్గెట్లు పూర్తి చేయాలనే ధోరణిలో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులపై ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఇతర మంచి మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, వృత్తిపరంగా కొత్త కోర్సులు నేర్చుకోవడం..వంటివి పాటించాలని సూచిస్తున్నారు. -
మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.గౌతమ్ అదానీభారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.ఇంద్రా నూయీ1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు.అర్దేషిర్ గోద్రెజ్గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్ నిలిచింది. -
ఈ–కామర్స్, బీఎఫ్ఎస్ఐ, హాస్పిటాలిటీలదే జోరు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో విభిన్నరంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగైనట్టుగా వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోల్చితే మొదటి 4 నెలల్లో 31 శాతం జాబ్ పోస్టింగ్స్ పెరిగినట్టు వెల్లడైంది. ఉద్యోగ అవకాశాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా ఆర్థికరంగం తిరిగి పుంజుకోవడంతోపాటు, జాబ్ సెక్టార్ల పురోగతితో జాబ్ మార్కెట్ పుంజుకుంటున్నదని జాబ్స్ అండ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అప్నా.కో తాజా అధ్యయనం వెల్లడించింది. ⇒ ఈ–కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్విసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హాస్పిటాలిటీలదే జోరు అని అప్నా.కో నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఈ–కామర్స్ 21 శాతం, బీఎఫ్ఎస్ఐ 17 శాతం, హాస్పిటాలిటీ రంగాల్లో 13 శాతం మేర ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు తెలిపింది. ⇒ సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బ్రాండ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ డొమైన్లలో వృత్తి నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా పేర్కొంది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఈ రంగాల్లో 23 శాతం వృద్ధి నమోదైనట్టుగా, ఆయా రంగాల్లో జాబ్ పోస్టింగ్ల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముందువరుసలో నిలుస్తున్నట్టుగా తెలిపింది. ⇒ లక్నవూ, కోయంబత్తూరు, గ్వాలియర్ వంటి రెండో, మూడో శ్రేణి నగరాల్లో నూ డిజిటలైషన్ అమలు చేస్తుండడంతో ఆయా నగరాల్లోనూ జాబ్పోస్టింగ్స్ పెరుగుతున్నాయని చెప్పింది. ⇒ తమ కంపెనీకి సంబంధించినంత వరకు చూసినా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా ఉద్యోగార్థుల (ఫ్రెష్ అప్లికెంట్స్) నుంచి ‘జాబ్అప్లికేషన్లు’21 శాతం పెరిగినట్టు, వారిలో మహిళలే 18 శాతం ఉన్నట్టుగా ఈ సంస్థ తెలిపింది. గతేడాదితో పోల్చితే 2024లో జనవరి–ఏప్రిల్ల మధ్య జాబ్ అప్లికేషన్స్ 15 శాతం పెరుగుదల నమోదైనట్టు (1.7 కోట్లు పెరుగుదల) అప్నా.కో ఈ నివేదికలో పేర్కొంది. -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం
-
ఫ్రెషర్లకు పిడుగులాంటి వార్త!.. కొత్త ఉద్యోగాల్లో...?
-
డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్ఇన్ నివేదిక
డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు అధిక ఉద్యోగావకాశాలున్నట్లు లింక్డ్ఇన్ కెరీర్ స్టార్టర్ 2024 నివేదిక వెల్లడించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో కంపెనీలు పనిప్రదేశాల్లో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగాలు 15% తగ్గాయి. ఎంట్రీలెవల్ ఉద్యోగాల కోసం కంపెనీలు హైబ్రిడ్ వర్క్కల్చర్ను 52% పెంచాయి. దాంతో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు పనిచేసేందుకు వీలుగా కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుటిలిటీస్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చమురు, గ్యాస్, మైనింగ్, రియల్ ఎస్టేట్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఫెషర్లను ఎక్కువగా నియమించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ , సిస్టమ్ ఇంజినీర్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో ఫ్రెషర్లను ఎంపికచేస్తున్నారు. కమ్యూనిటీ, సోషల్ సర్వీసెస్, లీగల్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేయని వారికి విద్య, సాంకేతికత, సమాచారం, మీడియా, మానవ వనరులు, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీలేనివారు సైతం సాఫ్ట్వేర్ ఇంజినీర్, సెక్రటరీ, డిజైన్ ఇంజినీర్ వంటి ఉద్యోగాల్లో తమ కెరియర్ ప్రారంభించవచ్చు.ఇదీ చదవండి: సముద్రంలో పెళ్లివేడుకలకు బయలుదేరిన తారలులింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ అండ్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ మాట్లాడుతూ..‘కంపనీల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. విభిన్న విద్యా నేపథ్యాలు కలిగిన నిపుణులను ఎంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉద్యోగంకోసం చూస్తున్నవారు నిత్యం తమ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని చెప్పారు. -
ఫ్రెషర్లకు పిడుగులాంటి వార్త!.. కొత్త ఉద్యోగాల్లో..
2024-25లో రిక్రూట్మెంట్ కార్యకలాపాలలో కొత్త పొజిషన్లను దాఖలు చేయడంపై దృష్టి పెట్టాలని సర్వేలు చెబుతున్నాయి. కొత్త ఉగ్యగాల భర్తీ కోసం అనుభవం, ప్రతిభ ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్టాఫింగ్ సొల్యూషన్స్ అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ హైరింగ్, కాంపెన్సేషన్ & అట్రిషన్ మేనేజ్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.పరిశ్రమల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పాత్రలను సృష్టించడం ద్వారా వృద్ధి, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యం.. అని జీనియస్ కన్సల్టెంట్స్ సీఎండీ ఆర్పీ యాదవ్ పేర్కొన్నారు. నియామకాలలో 4 నుంచి 8 సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 32 శాతం అనుభవం ఉన్నవారికే కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి.1 నుంచి 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వారిని 26 శాతం, ఫ్రెషర్లను కేవలం 15 శాతం మాత్రమే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక నియమాలు 27 శాతం, 25 శాతంతో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు నియామకం, 24 శాతం గిగ్ స్టాఫ్ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. -
ఉద్యోగాలు పెరిగే రంగాలివే..జీఐ గ్రూప్ నివేదిక
రిటైల్, ఈ-కామర్స్ రంగంలో సమీప భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు రాబోతున్నాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు పెద్దమొత్తంలో అవసరమవుతారని రిపోర్ట్ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో రిటైల్ రంగంలో 8శాతం ఉద్యోగులు పెరిగారని నివేదించింది. 87శాతం 18-30 ఏళ్ల వయసు ఉన్నవారే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారని చెప్పింది.నివేదికలోని వివరాల ప్రకారం..ఈకామర్స్, రిటైల్ రంగాలు భారీగా అభివృద్ధి చెందుతున్నాయి. వస్తువులు, ఇతర సేవల డెలివరీని అందించే లాజిస్టిక్స్ రంగం దూసుకుపోతోంది. టైర్ 1 నగరాల్లోని చాలామంది కస్టమర్లు ఈకామర్స్, రిటైల్ ప్లాట్ఫామ్లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఆయా రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. 52% రిటైలర్లు ఈ ఏడాది ఫ్రెషర్లను నియమించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 42% ఈ-కామర్స్ కంపెనీలు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం చూస్తున్నాయి. 30% రిటైలర్లు మహిళా అభ్యర్థులను ఎంచుకుంటున్నారు. 2024 ప్రారంభంలో లాజిస్టిక్స్ రంగలో 10.2% ఉద్యోగాలు పెరిగాయి.ఇదీ చదవండి: స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థజీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా మాట్లాడుతూ..‘భారత్ ఆర్థిక వృద్ధిలో రిటైల్, ఈకామర్స్ రంగాల వాటా పెరిగింది. ఏటా భారత్ వర్క్ఫోర్స్లో చేరే దాదాపు 20 మిలియన్ల యువతలో అధికంగా రిటైల్, ఈకామర్స్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. సప్లై చైన్ కార్యకలాపాలను నిర్వహించడంలో అర్హత కలిగిన అనుభవజ్ఞులకు డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలు నిర్దిష్ట ఉద్యోగస్థానాల కోసం మహిళలనే నియమించుకుంటున్నాయి. రిటైల్ రంగంలో రాణించాలంటే మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా అవసరం. ఈ-కామర్స్ వ్యాపారం డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ వంటి అంశాలపై ఆధారపడుతోంది. వీటిపై నైపుణ్యాలు కలిగిఉన్నవారికి సులువుగా కొలువు దొరుకుతోంది’ అని చెప్పారు. -
అమెరికాలో తగ్గిన నిరుద్యోగం
వాషింగ్టన్: అమెరికాలో గతవారం నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. లేబర్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం.. మే 18తో ముగిసిన వారానికి స్టేట్ అన్ఎంప్లాయిమెంట్ బెన్ఫిట్స్ కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య 8,000 తగ్గి 215,000కి చేరింది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం తాజా వారంలో 220,000మంది నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారని రాయిటర్స్ కథనం వెల్లడించింది. మార్చి 2022 నుండి ఫెడరల్ రిజర్వ్ నుండి 525 బేసిస్ పాయింట్ల విలువైన వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో లేబర్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతున్నట్లు తేలింది. -
మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా మంచి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.. సాంకేతికతలలో ఉద్యోగులకు నైపుణ్యం లేకుండా పోవడమే అని తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఎవరైతే.. నైపుణ్యం పెంచుకుంటారో వారికే భవిష్యత్తు ఉంటుందని స్టేట్ ఆఫ్ అప్స్కిల్లింగ్ కన్స్యూమర్ సర్వే ద్వారా తెలిసింది.2023తో పోలిస్తే.. 2024లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిసింది. కెరీర్లో ముందుకు వెళ్ళటానికి ఇది చాలా అవసరమని ఉద్యోగులకు అర్థమవుతోంది. 97 శాతం మంది మెరుగైన కెరీర్ అవకాశాల కోసం నైపుణ్యం ఒక ముఖ్యమైన అంశం అని భావిస్తున్నారు.డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి వాటిలో నైపుణ్యం సంపాదిస్తున్నారు.ఎప్పటికప్పుడు మారుతున్న ల్యాండ్స్కేప్లో.. ఎదగాలంటే డేటా సైన్స్, ఏఐ, సైబర్సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యం అవసరమని సింప్లిలేర్న్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కాబ్బటి ఉద్యోగులు తమ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను తప్పకుండా పెంపొందించుకోవాలి.లింక్డ్ఇన్ ప్రకారం ప్రస్తుత కార్పోరేట్ లైఫ్లో టాప్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపింది. మంచి కమ్యూనికేషన్తో పాటు కస్టమర్ సర్వీస్ గురించి అవగాహన ఉన్నవాళ్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని తెలిపింది. అలాగే టీంను నడిపించే నాయకత్వ లక్షణాలు/అనుభవం, కీలకమైన ప్రాజెక్టులను నిర్వహించిన సామర్థ్యం, వేర్వేరు టాప్ పొజిషన్లలో చేసిన నైపుణ్యం ఉన్నవారికి ఢోకా లేదని తెలిపింది.నెంబర్లను విశ్లేషించి వ్యూహాలను మార్చుకునే అనలిటిక్స్ స్కిల్, ఎలాంటి బృందంతోనైనా పని చేసే కలుపుగోలు మనస్తత్వం, దేన్నయినా విక్రయించే టాలెంట్, సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే ట్రబుల్ షూటింగ్ పరిజ్ఞానం అలాగే లోతైన పరిశోధన అభ్యర్థులను అగ్రస్థానంలో ఉంచుతుందని తెలిపింది. (Image Source : LinkedIn Learning) -
2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. -
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రక్షణ కవచం
‘సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి’ –వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన చట్టం ‘ఎంఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం–2006’. తయారీదారు దగ్గర కొనని వ్యాపారస్తుని ఈ చట్టం ఎలాంటి ఇబ్బందీ పెట్టదు. తయారీదారు వద్ద కొనుగోలు చేసినవాళ్లే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత 15 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో 40 శాతం మేర పాలు పంచుకోవడం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల విశిష్ఠత.పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా విస్తరించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక అసమానతలను తొలగించేందుకు తోడ్పడుతున్నాయి. పెట్టుబడుల కొరతను ఈ తరహా పరిశ్రమలు అధిగమించడానికి కేవలం వ్యక్తిగత హామీలతో బ్యాంకులు ఋణం అందిస్తున్నాయి. అందుకే ఇవి మనుగడ సాగిస్తున్నాయి. పీఎమ్ఈజీపీ, సీజీటీఎమ్సీ కింద ఇచ్చే రుణాలతో పాటు ముద్రా ఋణాలూ ఇటువంటి పరిశ్రమల స్థాపనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఒక వ్యక్తి కాని, వ్యాపార సంస్థ కాని (కొనుగోలుదారు) వస్తువులు లేక సేవలు సూక్ష్మ, చిన్న పరిశ్రమలను నడిపేవారి (అమ్మకందారు) నుంచి పొందినట్లయితే... వారు అమ్మకందారుకు నగదు ఠంచనుగా చెల్లించాలనేది ఈ చట్టం చెప్తుంది. అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందం గడువు 45 రోజులు మాత్రమే ఉండాలి. దాని కోసం అమ్మకందారు ‘ఉద్యమ్ ఆధార్’లో నమోదు పొందిన తయారీదారుడు కావాల్సిన అవసరం లాంటి కొన్ని పరిమితులు నిర్దేశించడం ఈ చట్టంలోని ఒక సుగుణం. అలా ఒప్పంద పత్రం లేకపోతే ‘నియమించిన గడువు’ అనే అంశం పరిగణనలోకి వస్తుంది. వస్తువులను లేదా సేవలను అంగీకరించిన రోజు నుంచి 15 రోజుల లోపల నగదు చెల్లించాల్సి రావడమే ‘నియమించిన రోజు’గా చట్టం చెబుతోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల తయారీదారుకు కొనుగోలుదారుకు మధ్య ఒప్పంద పత్రం రాతపూర్వకంగా ఉండాల్సి ఉంటుంది. అలా కానప్పుడు కొనుగోలుదారుడు 15 రోజుల్లోపల నగదు చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడు భారతదేశంలో ఏ ప్రాంతంలోని వారైనా ఈ చట్టం వర్తిస్తుంది. ఒప్పుదల పత్రంలో గడువు ఎక్కువ రోజులు రాసుకొన్నప్పటికీ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం –2006 సెక్షన్ 15 ప్రకారం విధించిన గడువు కేవలం 45 రోజులే. ఇది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలుచేసిన వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పెట్టుబడి ఒక కోటి రూపాయలు లోపల ఉండి రూ. 5 కోట్ల అమ్మకాలు సాగిస్తే దానిని సూక్ష్మ తరహా పరిశ్రమగా పరిగణిస్తారు. అదే పెట్టుబడి 10 కోట్ల రూపాయల లోపల ఉండి అమ్మకం రూ. 50 కోట్ల లోపల ఉంటే చిన్న తరహ పరిశ్రమగా పరిగణిస్తారు. తయారీ లేకుండా కేవలం అమ్మకం (ట్రేడింగ్) జరిపే వ్యాపారులకు ఈ చట్టం వర్తించదు. కొన్న వస్తువులకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టప్రకారం వస్తువులు లేక సేవలు పొందిన ఏ వ్యక్తి అయినా సెక్షన్ 15లో చెప్పిన విధంగా చెల్లింపు జరపని కారణంగా అమ్మకందారునికి ‘వడ్డీ’ చెల్లించాలి. అదీ చక్రవడ్డీ! వడ్డీ రేటు రిజర్వు బ్యాంకు, తన కింది బ్యాంకులకు సూచించిన రేటుకు మూడురెట్లుగా నిర్దేశించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మూలధన లభ్యత పెరిగి అవి సజీవంగా మనుగడ సాగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కొనుగోలుకు చెల్లింపులు జరపడంలో ఆలస్యానికి కట్టే వడ్డీని ఆదాయపు పన్ను లెక్కలో ఖర్చుల క్రింద పరిగణించకపోవడం మరో విశేషం. అయితే బకాయిలు చెల్లించిన సంవత్సరంలో ఖర్చు కింద చూపే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఈ చట్టం భారతదేశ కొనుగోలుదారులకే కాకుండా విదేశీ కొనుగోలు దారులకు సైతం వర్తిస్తుంది. ఇక్కడ వివాదాల్ని పరిష్కరించడానికీ, చట్టాలు అమలు చేయడానికి దేశ దౌత్యవేత్తల కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 43బీ(హెచ్)కు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టం సెక్షన్ 15ను కలిపి చదివితేనే మనకు ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ప్రతి సంస్థ చట్టాలకు లోబడి ఆస్తి, అప్పుల పట్టీని తయారుచేసి లెక్కలు తనిఖీ చేయించాల్సి ఉంటుంది. అయితే, ఏ సంస్థ అయితే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లించలేదో, వాటి బకాయిలను చెల్లించాల్సిన వడ్డీని బహిర్గతం చేయాలి. కంపెనీ అయితే కంపెనీ చట్టాలకు లోబడీ, ఇతరత్రా అయితే ఆ చట్టాలను అనుసరించీ!2006 చట్టంగా వచ్చినప్పటికీ, అమలు చేయడంలో చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభ మయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంతో ముడిపెట్టడం వల్ల చట్టం విలువ పెరిగి దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత తరుణంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల మనుగడకు ఈ చట్టం ఒక రక్షణ కవచంగా నిలుస్తున్నదనేది కాదనలేని నిజం.చిన్ని శ్రావణ్ కుమార్ వ్యాసకర్త చార్టర్డ్ అకౌంటెంట్ -
యూకే పోస్టు–స్టడీ వీసాలు రద్దు!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్లైన్ 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్గేమ్స్, ట్రేడింగ్తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది. -
ఈ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు
కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఫలితంగా భారీగా తొలగింపులు జరిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్ వ్యాపారంలో డిమాండ్ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికలకు, గణనీయమైన నియామకాలకు దారితీసింది.రానున్న 18 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలుహోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలలో వృద్ధిని పొందేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాయి. టీమ్స్లీజ్ సర్వీసెస్ అంచనాల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగం రాబోయే 12-18 నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకమిక్ టైమ్స్ నివేదించింది.దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుదలను సూచిస్తున్న అంచనాలతో, హోటల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫార్చ్యూన్ హోటల్స్ ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళికల ద్వారా నియామకంలో 8-10 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇక లెమన్ ట్రీ తమ ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు మద్దతుగా వేలాది మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.డిమాండ్ వీరికే..ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్ రిలేషన్స్ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది డిమాండ్లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్కు డిమాండ్లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు మ్యాన్పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు ప్రత్యేకించి పరిశ్రమలో విస్తృత ఆధారిత పునరుద్ధరణను సూచిస్తున్నాయి.ఇక్రా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ 7-9 శాతం స్థిరమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇది ఈ రంగం స్థితిస్థాపకత, పునరుద్ధరణ పథాన్ని నొక్కి చెబుతోంది. సాంప్రదాయ హోటల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్లు కూడా హైరింగ్లో స్పీడ్ పెంచనున్నాయి. -
మరో 600 జాబ్స్కి గండం!
Tesla Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.టెస్లా సోమవారం ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది. -
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
ఓ వ్యక్తి చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావడం అనేది ప్రస్తుత కాలంలో అసాధ్యమైపోతోంది. దీంతో కొందరు సొంతంగా బిజినెస్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దీని కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఇటీవల వింగిఫై వ్యవస్థాపకుడు ఒక తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి వింగిఫైలో తనకు ఉద్యోగం కావాలని. ''ఉద్యోగం కోసం నేను 500 డాలర్లు (రూ. 41000 కంటే ఎక్కువ) చెల్లిస్తాను. వారం రోజుల్లో నా పనితనాన్ని నిరూపించుకుంటాను. ఆలా నిరూపించుకోని సమయంలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ టీమ్ సమయాన్ని వృధా చేయకూడదని చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.ఈ పోస్టును వింగిఫై ఛైర్మన్ పరాస్ చోప్రా షేర్ చేసిన తరువాత నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగార్ధుల పరిస్థితి ఇది అని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది సరైన మార్గం కాదని పేర్కొన్నారు. అయితే చోప్రా మాత్రం ఇది అందరి దృష్టిని ఆకర్శించింది అని అన్నారు.This is how you get attention!(Obviously won’t take money but very impressed with the pitch) pic.twitter.com/mlJIL0154u— Paras Chopra (@paraschopra) May 3, 2024 -
2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
ఢిల్లీ: దేశంలో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రెండు దశల్లో పూర్తయింది. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 19న మొదలైన ఎలక్షన్స్ జూన్ 1తో ముగియనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. 7 దశల్లో జరుగుతున్న ఎన్నికలు ఎంతోమందికి తాత్కాలికంగా ఉద్యోగాలు కల్పిస్తామని నిపుణులు పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో సుమారు 9 లక్షల మంది తాత్కాలికంగా ఉపాధిని పొందనున్నట్లు వర్క్ఇండియా సీఈఓ, కో-ఫౌండర్ నీలేష్ డంగర్వాల్ పేర్కొన్నారు. ఇందులో పోలింగ్ బూత్ అధికారులు, క్లర్క్స్, సెక్యూరిటీ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వంటి ఉద్యోగాలు ఉంటాయి.ఎలక్షన్ సమయంలో అందుబాటులోకి వచ్చే ఈ తాత్కాలిక ఉద్యోగాలు జాబ్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయా అనే ప్రశ్నకు.. టీమ్లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తీక్ నారాయణ్ సమాధానమిచ్చారు. లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాలపై ఈ తాత్కాలిక ఉద్యోగాల ప్రభావం కొంత ఉంటుందని ఆయన అన్నారు.జీనియస్ కన్సల్టెంట్స్ CMD RP యాదవ్ మాట్లాడుతూ.. 1,00,000 మందికి పైగా తాత్కాలిక కార్మికులు కూడా ఎలక్షన్స్ సమయంలో అవసరమని పేర్కొన్నారు. ఫుడ్ క్యాటరింగ్, వాహనాల నిర్వహణ, షెడ్యూల్లు, పోస్టర్లు, మైక్రోఫోన్ల వంటి ప్రచార సామగ్రిని నిర్వహించడం.. సమావేశ నిర్మాణంలో సహాయం చేయడం వంటి వాటిలో వీరు కీలక పాత్ర పోషిస్తారు.ఎలక్ట్రీషియన్లు, క్లీనర్లు, సోషల్ మీడియా క్యాంపెయినర్లు, ఈవెంట్ మేనేజర్లు, కంటెంట్ రైటర్లు, కంటెంట్ క్రియేటర్లు వంటి ఉద్యోగాలకు 2024 లోక్సభ ఎన్నికల సమయంలో చాలా డిమాండ్ ఉందని కూడా యాదవ్ పేర్కొన్నారు. వీరి జీతాలు రూ. 15000 నుంచి రూ. 40000 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. -
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు. డెహ్రడూన్కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్ సైనీ ఉద్యోగులకు అప్రైజల్ సీజన్పై అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అక్షయ్ సైనీ ఏం చెప్పారంటేమీరు ఎక్కువ జీతం కావాలంటేమీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్ అప్రైజల్స్ ఓ జోక్గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్ డిజిట్ శాలరీ హైక్ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్లో తెలిపారు. HARD TRUTH : Switching jobs is the only way to reach high salaries.In most Indian companies, the internal appraisals is a joke. Even above average engineers hardly get a double digit hike %If you're underpaid, don't overthink, just Switch! 🤷♂️— Akshay Saini (@akshaymarch7) May 2, 2024తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తేమరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్వేర్ ఇంజనీర్గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయికాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్, డిజిగ్నేషన్ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్ సైనీ పేర్కొన్నారు.అక్షయ్ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. -
విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త?
మీరు విదేశాల్లో ఉంటున్నారా? ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్కమ్ కోసం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. స్థానిక చట్టాలు, సంస్థల గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వీడియోలు తీశారా? ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఉన్న ఫళంగా పెట్టెబేడా సర్ధుకుని స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. ఇదేదో బయపెట్టే ప్రయత్నం కాదు. విదేశాల్లో ఉంటున్నవారి సంరక్షణ కోసం కాస్త అవగాహన కల్పించే ఉద్దేశమేనని గుర్తించాలని విజ్ఞప్తి. వివరాల్లోకి వెళితే.. భారత్కు చెందిన మేహుల్ ప్రజాపతి కెనడాలో ఉంటూ స్థానిక ప్రముఖ టీడీ బ్యాంక్లో డేటా సైంటిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మరోవైపు కెనడా దేశం గురించి, అక్కడి సదుపాయాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా వివరిస్తుంటాడు. అంతవరకు బాగానే ఉన్నా..కెనడాలో డబ్బు ఆదా చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు గురించి వివరించాడు. ఫలితంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో జాబ్ లేక స్వదేశానికి తిరిగే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. this guy has a job as a bank data scientist for @TD_Canada, a position that averages $98,000 per year, and proudly uploaded this video showing how much “free food” he gets from charity food banks.you don’t hate them enough. pic.twitter.com/mUIGQnlYu6— pagliacci the hated 🌝 (@Slatzism) April 20, 2024 ఇంతకీ ఏం జరిగింది?మెహుల్ ప్రజాపతి టీడీ బ్యాంక్లో డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. అతని జీతం ఏడాది రూ.81లక్షలు. అవి సరిపోకపోవడంతో డబ్బుల్ని ఆదా చేసేందుకు కెనడాలో విద్యార్ధులకు ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంక్లు ఉంటాయి. ఆ ఫుడ్ బ్యాంక్ల నుంచి విద్యార్ధులు ఆహారాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆహారాన్ని మెహుల్ ప్రజాపతి ప్రతినెల తెచ్చుకుంటున్నట్లు, తద్వారా నెలా ఆహారం, కిరాణా సామాగ్రి ఖర్చు పూర్తిగా తగ్గిపోతుందని వివరించాడు. అంతేకాదు ఓ వీడియోలో తాను వారానికి సరిపడ బోజనాన్ని ఉచితంగా తెచ్చుకున్నానని, వాటిల్లో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, సాస్లు, పాస్తా, క్యాన్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయని ఆ వీడియోలో చూపించాడు. update: the food bank bandit was fired https://t.co/RFLqvVGJb1 pic.twitter.com/CDdrfrmbqI— pagliacci the hated 🌝 (@Slatzism) April 22, 2024 విధుల నుంచి తొలగిస్తూ దీంతో టీడీ బ్యాంక్ మెహుల్ ప్రజాపతిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, చర్చిల ద్వారా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ల నుండి మెహుల్ ఎలా తెచ్చుకుంటాడు. కెనడాలో ఉంటూ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని ఎలా తీసుకుంటారు. ఏడాది సుమారు 80లక్షల జీతం తీసుకుంటున్న మీరు ఫుడ్ బ్యాంక్ల నుంచి ఆహారం తీసుకోవడం సరైంది కాదని వార్నింగ్ ఇచ్చింది. అతడిని విధుల నుంచి తొలగించింది. సంబంధిత మెయిల్స్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
చైనాకు యాపిల్ షాక్.. 5 లక్షల జాబ్స్ మనకే..!
ప్రీమియం ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ యాపిల్ చైనాకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమ చైనా ఆధారిత సప్లయి చైన్లో సగభాగాన్ని భారత్కు తరలించి వచ్చే మూడు సంవత్సరాలలో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. స్థానిక విలువ జోడింపుపై దృష్టి సారించిన యాపిల్.. దేశీయ విలువ జోడింపును 11-12 శాతం నుంచి 15-18 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్గా, ఆర్అండ్డీ హబ్గా ఎదుగుతున్న భారత్ ప్రాముఖ్యతకు అనుగుణంగా యాపిల్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, దేశంలో స్థానిక విలువ జోడింపు 14 శాతంగా ఉంది. ఇది చైనాకు చెందిన 41 శాతం కంటే చాలా తక్కువ. యాపిల్ గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది. తయారీ, రిటైల్ రెండింటిపైనా దృష్టి సారించింది. దేశంలో మొదట్లో పాత ఐఫోన్ మోడల్లు అసెంబుల్ చేయగా, ఇప్పుడు ఐఫోన్ 15 మోడళ్లను కూడా తయారు చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో 14 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ కంపెనీ ఫాక్స్కాన్, పెగాట్రాన్ అనే రెండు ప్రధాన తయారీ భాగస్వాములను కలిగి ఉంది. వీటి ద్వారా వరుసగా 67 శాతం, 17 శాతం ఐఫోన్లు అసెంబుల్ అవుతున్నాయి. అదనంగా కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్ను నిర్వహిస్తున్న టాట్ గ్రూప్ 6 శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అసెంబుల్ చేస్తున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ అవుతోంది. -
‘మూన్లైటింగ్’తో కోట్లు సంపాదిస్తున్న ఐటీ ఉద్యోగి.. మీరూ చేస్తారా?
కొంత కాలం క్రితం ఐటీ రంగంలో మూన్లైటింగ్ తీవ్ర చర్చంనీయంశమైంది. ఒకే సమయంలో లేదా విధులు ముగిసిన తరువాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ తరుణంలో తాను ఒకే సారి రెండు ఉద్యోగాలు చేసి ఏడాదికి రూ.1.4 కోట్లు సంపాదించినట్లు ఓ ఐటీ ఉద్యోగి తెలిపాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ఐటీ ఉద్యోగి ఆడమ్ ఎడ్యుకేషన్ లోన్ కింద రూ.98లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం అతను ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఫలితం శూన్యం.పేరుకే రెండు ఉద్యోగాలు చేస్తున్నాడనే మాటగాని కొండలా పేరుకుపోయినా అప్పుల్ని తీర్చేందుకు ఇది సరిపోదని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏడాదికి కోటి సంపాదన అంతే 2022లో రిమోట్ జాబ్ కోసం అన్వేషించాడు. చివరికి తాను కోరుకున్నట్లుగా భారీ వేతనంతో రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అలా 2023 జనవరి నుంచి రెండు ఉద్యోగాలు చేయగా వచ్చిన మొత్తం ఏడాదికి రూ.70లక్షలుగా కాగా..అదే ఏడాది చివరి నాటికి ఆడమ్ సంపాదించిన మొత్తం రూ.కోటికి పెరిగింది. సంపాదన పెరగడంతో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాడు. డబ్బులు బాగా సంపాదించాలనే ఈ సందర్భంగా రెండు ఉద్యోగాలు చేరేందుకు తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలేంటో చెప్పాడు. అందులో ఒకటి సంపాదన రెట్టింపు చేసుకోవడం, రెండోది రెండేళ్లలో తాను ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం. ఇందుకోసం తన లింక్డిన్ ప్రొఫైల్లో ఉద్యోగాల కోసం అన్వేషించగా.. రెండు వారాల్లో రెండు ఉద్యోగాలు పొందాడు. స్వల్ప కాలంలో తన ఎడ్యుకేషన్లోన్ మెల్లమెల్లగా తిరిగి చెల్లించడంతో పాటు నాలుగు నెలల అత్యవసర సేవింగ్స్ను కూడబెట్టుకున్నాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పిన టెక్కీ వారానికి 30 నుంచి 60 గంటల మధ్య పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ టిప్స్ మీకోసమే అదే సమయంలో మూన్లైటింగ్ చేయాలని ఉద్యోగులకు పలు టిప్స్ చెప్పాడు. వాటిల్లో ప్రధానంగా .. ఒకే సమయంలో రెండు ఆఫీసుల్లో మీటింగ్స్ లేకుండా చూసుకోవడం, రెండవది.. ఆఫీస్ వర్క్ మొత్తం ఒకేసారి మీదేసుకుని చేసుకోకుండా భాగాలు, భాగాలుగా విభజించి పని సులభం అవుతుందని అన్నాడు. దీంతో పాటు ఆఫీస్లో ఇచ్చే పబ్లిక్ హాలిడేస్, వీకాఫ్స్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉద్యోగం.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం చేసేవారిలో చాలామంది ఒకే సంస్థలో ఏళ్లతరబడి జాబ్ చేస్తుంటారు. మరికొందరు సంవత్సరానికి ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంటారు. ఇంతకీ ఒకే కంపెనీలో సంవత్సరాలు తరబడి జాబ్ చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్పై Apna.co ఒక ఆన్లైన్ సర్వే చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పదివేల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించింది. వేతనం అనేది ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ, 54 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగడం కంటే కెరీర్లో పురోగతి సాధించడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. అంటే ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలలోనే వృత్తిపరమైన వృద్ధిని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 37 శాతం మంది ఉద్యోగులు వర్క్ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 44 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న కంపెనీలోని వర్క్ కల్చర్కు అలవాటు పడినట్లు సమాచారం. కొందరు లీడర్షిప్ రోల్స్ కోసం లేదా కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరిలో సుమారు 54 శాతం మంది ఉన్నారు. 40 శాతం ఉద్యోగులు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ యాక్టివిటీస్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, 36 శాతం మంది సీనియర్ లీడర్షిప్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. చేస్తున్న పనిలోనే స్కిల్ పెంచుకోవడానికి చూస్తున్న వారు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అది మాత్రమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగులను సంతృప్తి పరిస్తే (జీతాలు పెంచడం, ప్రోత్సాహాలు అందించడం) ఎక్కువ కాలం ఒకే సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడతారని సర్వేలు తేలింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలామందిలో ఉన్న కంపెనీలలోనే జాబ్ చేస్తూ.. ఉన్నత స్థాననానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పని విషయంలో స్వేచ్ఛ మాత్రమే కాకుండా.. వర్క్ కల్చర్, కమ్యూనికేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తెలిసినట్లు Apna.co సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'నిర్మిత్ పారిఖ్' వెల్లడించారు.