నగరంలో గురువారం జరుగనున్న గణేష్ సామూహిక నిమజ్జనం నేపథ్యంలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి మంగళవారం వెల్లడించారు.
- ట్యాంక్బండ్ పైన 24, ఎన్టీఆర్ మార్్గలో 10 చొప్పున మొత్తం 34 క్రేన్లు ఏర్పాటు చేశారు. ప్రతి నాలుగు క్రేన్లకూ ఓ ఉన్నతాధికారి పర్యవేక్షణకుడిగా ఉంటారు.
- ప్రస్తుతం నగర వ్యాప్తంగా 12 వేల శాశ్వత సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటికి అదనంగా నిమజ్జనం మార్గంలో రెండు వేలు ఏర్పాటు చేశారు.
- హుస్సేన్సాగర్ చుట్టూ తాత్కాలిక ప్రాతిపదికన 44 సీసీ, పీటీజెడ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- ఎన్డీఆర్ఎఫ్, టూరిజం శాఖల సహకారంతో ప్రత్యేక బోట్లు, గజ ఈతగాళ్ళను సిద్ధం చేశారు.
- ఈవ్టీజర్లు, నేరగాళ్ళ కట్టడికి ప్రత్యేకంగా 100 ‘షీ–టీమ్’ బృందాలను ఏర్పాటు చేశారు.
- నిమజ్జనం, ప్రధాన ఉరేగింపుపై డేగకన్ను వేసిన పోలీసులు నిత్యం కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్నుంచి పర్యవేక్షించనున్నారు.