ఎస్ ఆర్ ఎస్ పి కి 48 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
బాల్కొండ : శ్రీరాంసాగర్ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్లోకి 48 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091అడుగులు(90 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1069.50 అడుగుల(27.56 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.