సుద్దాల అశోక్ తేజకు సాహితీ పురస్కారం | suddala ashok teja got palleru swayamprabha literature award | Sakshi
Sakshi News home page

సుద్దాల అశోక్ తేజకు సాహితీ పురస్కారం

Sep 18 2015 8:01 PM | Updated on Aug 13 2018 7:54 PM

ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కారం లభించింది.

పరకాల(వరంగల్): ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కారం లభించింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పల్లేరు వీరస్వామి తన భార్య పేరిట ఏర్పాటు చేసిన పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కరాన్ని ఈ ఏడాది అశోక్‌తేజకు అందించారు.

వరంగల్ జిల్లా పరకాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అశోక్‌తేజకు అందించారు. ప్రతిఏటా సాహితీరంగంలో విశేష కృషి చేసిందుకుగాను ఈ అవార్డు ఇస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 9 మంది ప్రముఖులకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement