- దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 22వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస . నేటి సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. ఈనెల 31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది.
- నేడు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. 20 వేల మంది బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశం కానున్న ప్రధాని
- నేడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ను కలవనున్న మణిపూర్ బీజేపీ నేతల బృందం. పలు సమస్యలను రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లనున్న పార్టీ నేతలు
- హైదరాబాద్లో నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పిన్నెల్లి.
- నేడు తెలంగాణ శాసనసభలో టీఎస్ ఐపాస్ పై చర్చ. నేడు తెలంగాణ శాసనమండలిలో వ్యవసాయరంగంపై కొనసాగనున్న చర్చ
- చిత్తూరు జిల్లా తిరుమలలో పర్యటించిన లంక ప్రధాని విక్రమ సింఘె. నేటి ఉదయం శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన విక్రమ సింఘె
- అమరావతిలో నేడు రెండో రోజు కూడా కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతీరుపై సమీక్ష