28 వరకు విజయవాడ రైలు గుంటూరు వరకే
Published Sat, Sep 24 2016 1:49 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
నూనెపల్లె: విజయవాడ రైల్వే స్టేషన్లో చేపడుతున్న రూట్లింక్ ఇంటర్నల్ లాకింగ్ మరమ్మతుల కారణంగా నంద్యాల నుంచి విజయవాడ వరకు వెళ్లే రైళ్లను గుంటూరు వరకే నడుపుతున్నట్లు రైల్వే సీపీఐ జయరాంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ హుబ్లీ–విజయవాడ, యశ్వంత్పూర్–విజయవాడ రైళ్లు గుంటూరు వరకే వెళ్తాయని తెలిపారు. మరమ్మతు పనులు ఈనెల 28వ వరకు ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు మార్పును గమనించాలని కోరారు.
Advertisement
Advertisement